/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz వలిగొండ లోని ప్రభుత్వ హాస్టల్స్ ను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించాలి: సిపిఎం డిమాండ్ Vijay.S
వలిగొండ లోని ప్రభుత్వ హాస్టల్స్ ను అధికారులు, ప్రజాప్రతినిధులు సందర్శించాలి: సిపిఎం డిమాండ్


వలిగొండ మండలంలో కొనసాగుతున్న సంక్షేమ హాస్టల్స్, కస్తూర్బా గాంధీ పాఠశాల, మోడల్ స్కూల్ హాస్టల్ లను ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు ,వెంటనే సందర్శించి.. విద్యార్థులకు ఉన్న సమస్యలను పరిష్కారం చేయాలని... సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి డిమాండ్ చేశారు.

    ప్రభుత్వ హాస్టల్స్ లో విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థులను పట్టించుకోకపోవడం వల్ల వార్డెన్ల యొక్క నిర్లక్ష్యం మూలంగా.. భువనగిరిలో ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చిందని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు. ఈరోజు పత్రిక ప్రకటన ద్వారా అధికారులను డిమాండ్ చేశారు. ప్రభుత్వం వెంటనే ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా వివిధ రకాల సంక్షేమ హాస్టల్స్ మరియు కస్తూర్బా గాంధీ పాఠశాలలు మోడల్ స్కూల్లో భాగమై ఉన్న హాస్టలల్లో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వారికి అన్ని రకాలుగా అవగాహన కల్పించే విధంగా తక్షణ చర్యలు జిల్లా ,మండల స్థాయి అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు ,హాస్టల్లను సందర్శించి వారికున్న సమస్యల్ని వెంటనే పరిష్కారం చేయాలని సిపిఎం డిమాండ్ చేస్తుందన్నారు.

  అనేక సంవత్సరాలుగా హాస్టల్లో సౌకర్యాలు లేవని ఎన్నిసార్లు ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు చేసిన గత ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని ,నూతనంగా ఏర్పడిన ప్రభుత్వమైన సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం కొనసాగిస్తున్న విద్యార్థుల సంక్షేమం కోసం ఆలోచించి, తగిన కనీస సౌకర్యాలు కల్పించాలని, వారికి అన్ని రకాల అవగాహన తరగతులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ను సందర్శించిన ఎమ్మెల్సీ కవిత


భువనగిరి పట్టణంలోని ఎస్సీ వసతి గృహాన్ని మంగళవారం ఎమ్మెల్సీ కవిత సందర్శించారు. ఇటీవల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే.. వసతి గృహాన్ని పరిశీలించి విద్యార్థినిల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినిల సూసైడ్ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలన్నారు.అయితే పూర్తిస్థాయిలోనే ప్రభుత్వం ఆదుకుంటుందని కూడా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి బాధిత కుటుంబాలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే.. మృతదేహాల పోస్టుమార్టం నివేదిక వచ్చిన అనంతరం పూర్తిస్థాయిలో విచారణ మొదలుపెట్టనున్నట్లు సమాచారం..

అదమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు


యాదాద్రి భువనగిరి జిల్లా

వలిగొండ మండల పరిధిలోని దోనురు ప్రతాప రెడ్డి గార్డెన్ లో, అధమా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వారి ....అధ్వర్యంలో రైతులకు అవగాహన సదస్సు సోమవారం రోజున ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అదమా కంపెనీ నేషనల్ సేల్స్ మేనేజర్ పాపునాయుడు హాజరైనారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ...యాసంగి వరి సేద్యంలో రైతులు ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో మొగిపురుగు,అగ్గి తెగులు,సమస్యలకు బోరెగాన్ 50 ఎస్పీ,బ్లాజిల్ క్లాస్టోడియ మందులను వాడాలని సూచించారు.అనంతరం రంగ ప్రవీణ్,తవుటం నరహరిలు పాపు నాయుడిని ఘనంగ సన్మానించారు.ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ సతీష్ కుమార్,సేల్స్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ నర్సింహ రెడ్డి, ఏజిఎం మార్కెటింగ్ శివప్రకాష్, డిస్టిబ్యుటర్లు రంగా చంద్రశేఖర్, డీలర్స్ నరేంద్ర కమిషన్, రఘురామ, ఇస్మాయిల్, శ్రీనివాస ట్రేడర్, మండల పరిధిలోని రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన భువనగిరి పార్లమెంట్ బిజెపి పూర్వ అభ్యర్థి పివి శ్యాంసుందర్ రావు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం సుంకిశాల గ్రామానికి చెందిన నాళ్ళ రంగయ్య తల్లి ,నాళ్ళ అండమ్మ నిన్న సాయంత్రం అనారోగ్యంతో స్వర్గస్తులైనారు. విషయం తెలుసుకున్న భువనగిరి పార్లమెంట్ బిజెపి పూర్వ అభ్యర్థి శ్రీ పి.వి శ్యామ్ సుందర్ రావు .... వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 10,000 రూపాయలు ఆర్థిక సాయం బీజేపీ గ్రామ శాఖ అద్యక్షులు మంగ జగన్ చేతుల మీదుగా అందజేశారు . ఈ కార్యక్రమంలో వలిగొండ పట్టణ ఉప సర్పంచ్ మైసోల్ల మచ్చగిరి , డోగిపర్థీ సంతోష్, మారోజు అనిల్ కుమార్, గుమ్మి సాయి రెడ్డి, మురళి, మోహన్ రెడ్డి, మంగ బాలయ్య, మహేష్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

హాజీపూర్ లో గిగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రమాద బీమా పత్రాల అందజేత


గిగా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని ప్రారంభించిన నాగినేనిపల్లి ఎంపీటీసీ ఫకీరు రాజేందర్ రెడ్డి, బొమ్మలరామారం మండలం హాజీపూర్ గ్రామంలో... గిగా ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రమాద బీమా కార్యక్రమాన్ని నాగినేనిపల్లి ఎంపీటీసీ పకీరు రాజేందర్ రెడ్డి , అర్హులకు బీమా పత్రాలని అందజేశారు. ఈ సందర్భంగా ...వారు మాట్లాడుతూ చిన్నచిన్న వస్తువులకు బీమా చేయించుకునే మనం 150 రూపాయలతో, బీమా చేయించుకుంటే మన ప్రాణానికి ఆపదలో ఉన్నప్పుడు.. ఈ ప్రమాద బీమా ఉపయోగపడుతుందని, అలాగే ప్రతి వ్యక్తికి అవసరమని ,అలాగే గ్రామంలో ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాజీ ఎంపీ బీజేపీ సీనియర్ నాయకులు బూర నర్సయ్య ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

వెలువర్తిలో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం వెలువర్తి గ్రామానికి చెందిన పసల సతీష్ వయసు 24 ,ఆత్మహత్య చేసుకున్నాడు .సతీష్ కుమార్ మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగవద్దని కుటుంబ సభ్యులు మందలించడంతో.. ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, ఈనెల 4న ఆదివారం పొలానికి వెళ్తున్న అని చెప్పి.. ఇంటి నుంచి వెళ్లి ,తిరిగి రాకపోవడంతో రాత్రి వరకు ఫోన్ చేసినా స్పందించలేదు. సోమవారం ఉదయం 6 గంటలకు పొలం కి పొలానికి వెళ్లి చూడగా బాదం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు . మృతునికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మృతుడి భార్య పసల భాగ్యరేఖ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వలిగొండ ఏఎస్ఐ శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.

భువనగిరి లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసిన బిఆర్ఎస్ శ్రేణులు


భువనగిరి పట్టణంలో ప్రిన్స్ కార్నర్ వద్ద తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకి బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై చేస్తున్నారని అన్నారు. పాలన చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం కేసిఆర్ పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలో నాడు తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా రాష్ట్రం నిలిస్తే.. కాంగ్రెస్ పాలనలో.. రెండు నెలలు గడవక ముందే , ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని అన్నారు . సీఎం రేవంత్ రెడ్డి గౌరవ ప్రదమైన హోదాలో ఉండి, గల్లి లీడర్ గా మాట్లాడటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ,పార్టీ జిల్లా అధ్యక్షులు కంచర్ల రామకృష్ణారెడ్డి ,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి ఎస్సీ హాస్టల్ ఘటనలో ఎంక్వయిరీ చేసి ,బాధ్యులను కఠినంగా శిక్షించాలి : జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి


భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్లో ఇద్దరు విద్యార్థినిలు ఆత్మహత్య చేసుకోవడంతో .. సోమవారం భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి , పార్టీ నేతలతో కలిసి వసతి గృహాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు డివిజనల్ అధికారి వసంత కుమారుని ఘటన జరిగిన తీరుపై ,వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా... వారు మాట్లాడుతూ విద్యార్థినుల ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని అన్నారు. పోస్టుమార్టం రాకమందు, పోస్టుమార్టం వచ్చిన తర్వాత క్షుణ్ణంగా ఎంక్వైరీ చేసి , బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఎస్సీ హాస్టల్ వార్డెన్ ను తక్షణమే సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంచెర్ల రామకృష్ణ రెడ్డి ,జడ్పిటిసి బీరు మల్లయ్య ,మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: జిల్లా లో బైక్ తో సహా పూర్తిగా కాలిన మృతదేహం


యాదాద్రి భువనగిరి జిల్లాలో బైక్ తో సహా కాలిన మృతదేహం  కలకలం రేపింది .భువనగిరి మండలంలోని అనంతారం గ్రామ శివారులో ఫ్లై ఓవర్ దగ్గర బైక్ తో సహా పూర్తిగా కాలిన మృతదేహాన్ని , స్థానికులు సోమవారం గుర్తించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు బైక్ నెంబర్ ఆధారంగా మృతుడు వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తిగా ప్రాథమికంగా నిర్ధారించారు . క్లూస్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు . పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

వలిగొండ: నర్సింగ్ ఆఫీసర్ గా సీలోజు సంధ్య నియామకం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణ కేంద్రంలోని సీలోజు కలమ్మ శ్రీరాములు ల ద్వితీయ కుమార్తె సీలోజు సంధ్య కు గత నెలలో విడుదల చేసిన ఫలితాలలో నర్సింగ్ ఆఫీసర్ గా ఎంపిక కావడం జరిగినది. ఈ ఎంపిక పత్రాలను జనవరి 31 2024 మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సమక్షంలో ఎల్బీ స్టేడియంలో 7000 మంది నర్సింగ్ ఉద్యోగాలకు, ఎంపిక అయిన వారికి ఎంపిక పత్రాలను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆధ్వర్యంలో ...నియామక పత్రాలను అందజేశారు. ఈ నియామకంలో వలిగొండ మండల కేంద్రానికి చెందిన సీలోజు కలమ్మ శ్రీరాములు ల రెండో కూతురైన సీలోజు సంధ్య నర్సింగ్ ఆఫీసర్ గా ఎంపిక కావడం వల్ల తల్లిదండ్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వలిగొండ మండల కేంద్రంలోని ఉజ్వల విద్యాసంస్థలలో 1వ తరగతి నుండి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం వరకు చదివి చదువులో మొదటి స్థానంలోనే నిలిచేది గ్రామీణ ప్రాంతమైన వలిగొండలో చదివిన అనంతరం బిఎస్సి నర్సింగ్ చదువు కోసం హైదరాబాదులోని జయ నర్సింగ్ కళాశాలలో చదివి ,ఉత్తీర్ణులై 2012 నుండి 2015 వరకు యశోద హాస్పిటల్ హైదరాబాదులో స్టాఫ్ నర్స్ గా పని చేసినది. అనంతరం 2015 -18 వరకు అపోలో హాస్పిటల్ లో పనిచేసి అనంతరం నర్సింగ్ ఆఫీసర్ గా ఎన్ ఎచ్ఎం కాంట్రాక్టు పద్ధతిన ఉద్యోగం పొంది రామన్నపేట ఆసుపత్రిలో ఇప్పటివరకు పనిచేస్తూ ఉన్నది. నర్సింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం పొందిన సీలోజు సంధ్య మాట్లాడుతూ పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తానని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ఆరోగ్యశాఖ ఉద్యోగం పొందిన సీలోజు సంధ్య గత పది సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న నర్సింగ్ ఆఫీసర్ గా ఉద్యోగం రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి అదేవిధంగా ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కు ధన్యవాదములు తెలిపారు. సీలోజు శ్రీరాములు కళమ్మ లకు ముగ్గురు సంతానం ముగ్గురు అమ్మాయిలే మొదటి అమ్మాయి డిగ్రీ చదివినది రెండో అమ్మాయి బీఎస్సీ నర్సింగ్ చదివి ఇప్పటివరకు కాంట్రాక్టు నర్సింగ్ ఆఫీసర్ గా పని చేసినది గత జనవరిలో ప్రకటించిన నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలలో నర్సింగ్ ఆఫీసర్ పొందినది. మూడో అమ్మాయి డిగ్రీ చదివి ఎండోమెంట్ ఆఫీసులో ఉద్యోగం చేస్తున్నది. మీరు ముగ్గురు అక్కచెల్లెళ్లు వీరు ముగ్గురు అమ్మాయిలు అయినా తల్లిదండ్రులకు ఇద్దరమ్మాయిలు ప్రభుత్వ ఉద్యోగం సంపాదించి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకురావడం వారికి ఆనందానికి అవధులు లేవు. సీలోజు కలమ్మ శ్రీరాములు గతంలో కలమ్మ వలిగొండ గ్రామపంచాయతీ ఉపసర్పంచిగా సేవలందించినది. అదేవిధంగా సీలోజు శ్రీరాములు గతంలో భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులుగా మండల పార్టీ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. అమ్మాయిలు అయినా అబ్బాయిల తో సమానమై వారు గ్రామీణ ప్రాంతంలో విద్యను అభ్యసించి వారి తల్లిదండ్రులకు గ్రామానికి మండలానికి ఆదర్శంగా నిలిచారు. మంచిగా చదివి ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు పుట్టిన ఊరు పేరు చదివిన చదువుకు సార్ధకత ఉంటుందని వారు అన్నారు. మా అమ్మాయిల లాగే అందరూ మంచిగా చదివి ఉద్యోగం సంపాదిస్తే తల్లిదండ్రులకు సంతోషం కలుగుతుందని వారు అన్నారు