/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. Miryala Kiran Kumar
వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం..

CM Revanth Reddy: వీరికి రూ.5లక్షలు లబ్ధి చేకూరేలా తెలంగాణ ప్రభుత్వం కొత్త పథకం.. పూర్తి వివరాలు..

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తొలి రోజు నుంచే తాము హామీ ఇచ్చిన పథకాలను అమలు చేసే దిశగా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేసిన తొలి రోజే రెండు గ్యారెంటీల అమలుపై సంతకాలు చేశారు. మరిన్ని పథకాలు ప్రజలకు అందించేందుకు వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షలు నిర్వహించారు. ఈక్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలోని ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్టుల కోసం రూ.5 లక్షల కవరేజీతో సామాజిక భద్రతా పథకం అమలు చేసింది. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్రమాద బీమా ప్రీమియం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. దీంతో తెలంగాణ రాష్ట్రంలోని ఓలా, ఉబర్‌, గిగా డ్రైవర్లతోపాటు ఆటో డ్రైవర్లు, హోంగార్డులు, వర్కింగ్ జర్నలిస్ట్‌లు, క్యాబ్‌ డ్రైవర్లు, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఆటో డ్రైవర్లు లబ్ధి పొందనున్నారు.

తెలంగాణలో పదో తరగతి పరీక్షలషెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల..

తెలంగాణలో పదో తరగతి పరీక్షలషెడ్యూల్‌ను విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. మార్చి 18 నుంచి ఏప్రిల్‌ 2వ తేదీవరకు పరీక్షలను నిర్వహిస్తున్నట్లు బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యూకేషన్‌ డైరెక్టర్‌ తెలిపారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు జరుగుతాయని వెల్లడించారు.

నూతన సంవత్సర వేడుకలను ఉద్దేశించి నలగొండ పోలీస్ శాఖ తరపున ప్రజలకు విజ్ఞప్తి..

 నల్గొండ పోలీసు శాఖ తరపున ప్రజలందరికీ 2024 నూతన సంవత్సర హార్దిక శుభాకాంక్షలు. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకొని, ప్రజల రక్షణ కొరకు, నల్గొండ పోలీసుల ఆధ్వర్యంలో అదనపు సిబ్బందితో ప్రత్యేక భద్రత ఏర్పాట్లు చేయడం జరుగుతున్నది.

నూతన సంవత్సర వేడుకల గురించి ఎవరికి ప్రత్యేకమైన కార్యక్రమాలకు లేదా ఈవెంట్లకు పోలీస్ శాఖ ఎటువంటి అనుమతులు జారీ చేయలేదు. ఎవరైనా చట్ట నిబంధనలు ఉల్లంఘించి నూతన సంవత్సర వేడుకల పేరుతో ఏదైనా మ్యూజికల్ లేదా ఎంటర్టైన్మెంట్ లేదా ఈవెంట్ కార్యక్రమాలను ప్రత్యేకంగా నిర్వహిస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయి. అంతే కాకుండా ఎవరైనా ఇటువంటి కార్యక్రమాల పేరుతో, టికెట్లు/ ఎంట్రీ ఫీజుల రూపంలో ప్రజల నుండి డబ్బులు వసూలు చేస్తే వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.

నూతన సంవత్సర వేడుకల గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ ప్రజలందరికీ ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నది. నూతన సంవత్సరం మొదటి రోజు ఏ కుటుంబం విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రతలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము.

 ముఖ్యంగా తల్లిదండ్రులు తమ యుక్త వయసు పిల్లలకు, మరీ ముఖ్యంగా మైనర్ పిల్లలకు, బైక్స్/ కార్లను ఇచ్చినచో, వారు అట్టి వాహనాలను నిర్లక్ష్యంగా లేక మద్యం, మత్తు పదార్థాలు సేవించి నడపడం వలన ప్రమాదాలు జరిగి, దాని వలన వారికి గానీ లేక వారివల్ల ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కావున ఈ విషయంలో తల్లితండ్రులు అప్రమత్తతో ఉండాలని విజ్ఞప్తి. ఈ సందర్బంగా "డ్రంకెన్ డ్రైవింగ్ " కేసులు నమోదు చేసేందుకు, అతివేగం/ప్రమాదకరంగా వాహనాలు నడిపేవారు మరియు త్రిబుల్ రైడింగ్ నడిపే వారి కొరకు ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది.

కావున 31వ తేదీ అర్ధరాత్రి ఒంటిగంట తరువాత ఎవరైనా రోడ్లపై అనవసరంగా సంచరిస్తూ ఉండే వారిపై న్యూసెన్స్ కేసు బుక్ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోబడుతాయి. దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి తమ తమ వేడుకలను అర్ధరాత్రి ఒంటిగంటలోపు  పూర్తిచేసుకుని తమతమ ఇళ్లకు వెళ్లాలని విజ్ఞప్తి. 

అంతేకాకుండా నూతన సంవత్సర వేడుకల పేరుతో ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా రోడ్లపై న్యూసెన్స్ చేసినా, లేక ఈవ్ టీజింగ్ లాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే వారిని అరెస్ట్ చేసి జైలుకు పంపడం జరుగుతుంది

పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ పోలీసు వారితో సహకరించి పూర్తి శాంతియుత మరియు ఆహ్లాదకరమైన వాతావరణం లో నూతన సంవత్సర వేడుకలు సంతోషంగా జరుపుకోవాలని విజ్ఞప్తి. 

   ఈ నూతన సంవత్సర వేడుకలు ఎవరింట్లో కూడా విషాదాన్ని నింపకూడదని కోరుకుంటూ, అందుకొరకు ప్రజలందరూ మా సూచనలు పాటించి అన్ని చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నాను: డి ఎస్ పి నల్లగొండ.

    

పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి,వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి..

పవర్లూమ్ కార్మికులకు ఇంటి స్థలం ఇచ్చి ,ఇండ్లు నిర్మించి ఇవ్వాలి

వర్కర్ టు ఓనర్ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలి

   రాష్ట్రంలో పవర్లూమ్ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రత్యేక కోటా ద్వారా 120 గజాల ఇంటి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి దండంపెల్లి సత్తయ్య లు తెలిపారు

   శనివారం తెలంగాణ పవర్ లుం వర్కర్స్ యూనియన్ (సిఐటియు ) పద్మనగర్ ఏరియా కమిటీ సమావేశం పద్మనగర్ మార్కండేయ గుడి దగ్గర జరిగింది.ఈ సందర్భంగా సత్తయ్య రాష్ట్రవ్యాప్తంగా పవర్లూమ్ కార్మికులు లక్ష మంది పైగా ఆధారపడి జీవిస్తున్నారు. వీరిలో ఎక్కువమంది సొంత ఇల్లు లేక అద్దె ఇండ్లలో ఉంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది యజమానులు వేసిన షెడ్లలో నివాసం ఉంటూ రోజుకు 14 గంటలు పని చేస్తున్నారు. చేసిన కష్టానికి తగిన ఫలితం రాక కుటుంబాలను పోషించుకోవడం కష్టంగా మారింది. అప్పుల బాధలతో అనేక ఇబ్బందులు పడుతున్న పవర్లూమ్ కార్మికులకు ప్రభుత్వం ఆదుకోవడానికి చర్యలు చేపట్టాలని కోరారు. గత ప్రభుత్వం కార్మికుడిని యజమాని చేయాలని వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రకటించి సిరిసిల్లకే పరిమితం చేసిందని, ఆ పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖలకు ఉపయోగపడే వస్త్రాలన్నింటిని రాష్ట్రంలో కార్మికుల చేత చేయించి ఉపాధి అవకాశాలు పెంచడానికి ప్రయత్నం చేయాలని కోరారు. టెక్స్టైల్ అఫరల్ పార్క్ నిర్మాణం వెంటనే పూర్తిచేసి ఉపాధి కల్పించాలని, పవర్లూమ్ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వమే గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ ఎస్ ఐ పి ఎఫ్ ప్రమాద బీమా సౌకర్యం పెన్షన్స్ సౌకర్యం కల్పించాలని కోరారు. త్రిఫ్ట్ పథకాన్ని చేనేత కార్మికుల తరహాలో పవర్లూమ్ కార్మికులకు కూడా డబుల్ డబ్బులు ఇవ్వాలని కోరారు.

   పద్మనగర్ ఏరియా అధ్యక్షుడు గంజి నాగరాజు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి పసునూరి యోగానందం పద్మనగర్ ఏరియా కార్యదర్శి సూరపల్లి భద్రయ్య కోశాధికారి వై ఆంజనేయులు, షేక్ జానీ సురేష్ ,గంజి చంద్రయ్య, వెంకన్న, భిక్షపతి, తదితరులు పాల్గొన్నారు

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ..

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై ఈడీ విచారణ

HCAలో జరిగిన రూ.20 కోట్ల నిధుల గోల్ మాల్ పై ఈడీ దర్యాప్తు

మాజీ క్రికెటర్లు అయూబ్, శివలాల్ యాదవ్ ను విచారించిన ఈడీ

HCA మాజీ అధ్యక్షుడు ఎమ్మెల్యే జి. వినోద్ కు ఈడీ నోటీసులు

హైదరాబాద్‌: నేడు టీఎస్ఆర్టీసీకి చెందిన 80 కొత్త బస్సులు ప్రారంభం...

హైదరాబాద్‌: నేడు టీఎస్ఆర్టీసీకి చెందిన 80 కొత్త బస్సులను ప్రారంభించనున్న రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.. ఆర్టీసీ ప్రయాణికులకు నేటి నుంచి అందుబాటులోకి రానున్న 80 కొత్త బస్సులు

జనవరి 3 నుండి పార్లమెంట్ నియోజకవర్గాల భారీగా బిఆర్ఎస్ పార్టీ సమావేశాలు..

జనవరి మూడో తేదీ నుంచి బిఅర్ఎస్ పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలు

లోక్ సభ ఎన్నికలకు గులాబీ పార్టీ సన్నద్దం

వచ్చే నెల మూడు నుంచి సన్నాహక సమావేశాలు

తెలంగాణ భవన్ వేదికగా ముఖ్యనేతలతో వరుస భేటీలు

పార్లమెంట్ ఎన్నికల కోసం భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో సమయత్తమవుతుంది. ఇందులో భాగంగా జనవరి మూడో తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించనున్నది. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ గారి ఆదేశాల మేరకు తెలంగాణ భవన్ వేదికగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు, పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, మాజీ మంత్రులు హరీష్ రావు, కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి తదితర ముఖ్యనాయకులు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. రెండు విడతల్లో ఈ సమావేశాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా జనవరి 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు తెలంగాణ భవన్ లో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు కొనసాగుతాయి. సంక్రాంతి పండుగ నేపథ్యంలో... మధ్యలో మూడురోజుల విరామమిచ్చి, మిగిలిన నియోజకవర్గాల సన్నాహక సమావేశాలను సంక్రాంతి తరువాత పార్టీ కొనసాగించనున్నది.

మొదట జనవరి 3న ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంతో ఈ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది.

తేదీలవారీగా పార్లమెంట్ నియోజకవర్గం సన్నాహాక సమావేశాల వివరాలు ఇలా ఉన్నాయి...

• 3న ఆదిలాబాద్

• 4న కరీంనగర్

• 5న చేవెళ్ల

• 6న పెద్దపల్లి

• 7న నిజామాబాద్

• 8న జహీరాబాద్

• 9న ఖమ్మం

• 10న వరంగల్,

• 11న మహబూబాబాద్

• 12న భువనగిరి 

సంక్రాంతి అనంతరం.. 

• 16న నల్గొండ

• 17న నాగర్ కర్నూలు

• 18న మహబూబ్ నగర్

• 19న మెదక్

• 20న మల్కాజ్ గిరి

• 21 సికింద్రాబాద్ మరియు హైదరాబాద్ 

ఈ సమావేశాలకు ఆయా పార్లమెంట్ పరిధిలోని ముఖ్యులందరినీ ఆహ్వానించనున్నారు. ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల యంపిలు, నియోజకవర్గం పరిధిలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎంఎల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, మేయర్లు, మాజీ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, మాజీ చైర్మన్లు, వివిధ కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, జిల్లాపార్టీ అద్యక్షులు మొదలుకొని పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్యనేతలు సమావేశాలకు హాజరవుతారు.

తెలంగాణ భవన్ లో జరిగే ఈ సమావేశాల్లో వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. మీటింగ్ కు హాజరయ్యే ముఖ్యనేతల అభిప్రాయాలు తీసుకుని పటిష్టమైన కార్యాచరణను రూపొందించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం స్వల్ప ఓట్ల శాతం తేడాతోనే అనేక సీట్లు చేజారిన నేపథ్యంలో.. వాటిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జరగబోతున్న ఈ సమీక్షల అనంతరం ప్రజాక్షేత్రంలో ప్రచారపర్వాన్ని బలంగా నిర్వహించేందుకు కూడా పార్టీ యంత్రాంగం కసరత్తు చేస్తోంది.

తిరుమల: 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం..

తిరుమల: 8వ రోజుకు చేరుకున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి అర్దరాత్రితో ముగియనున్న వైకుంఠ ద్వార దర్శనం.. ఎల్లుండి వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు రద్దు చేసిన టీటీడీ.

ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్...

ఏపీకి సంబంధించిన పొలిటికల్ బ్రేకింగ్ న్యూస్ ఇది. పొత్తులపై క్లారిటీ వచ్చేసింది. 2024 ఎన్నికల్లో 2014 సీనే రిపీట్‌ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఏపీలో పొత్తులపై సంక్రాంతికల్లా బీజేపీ నిర్ణయం తీసుకోనుంది. టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి వెళ్లాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ బాధ్యతలను ముగ్గురు బీజేపీ జాతీయ నేతలకు అప్పగించింది హైకమాండ్. టీడీపీతో పొత్తుపై BJPలో అభిప్రాయ సేకరణ పూర్తైనట్లు తెలిసింది. టీడీపీ-జనసేనతో కలిసి వెళ్లాలని ఏపీ బీజేపీ మెజార్టీ నేతల సూచించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. పొత్తు వల్ల 3 పార్టీలకు జరిగే లాభనష్టాలపై ఇప్పటికే నివేదిక కూడా రెడీ అయిందట. ఈ రిపోర్ట్‌ను మోదీ ఆఫీసుకు కూడా అందజేశారట. పార్లమెంటరీ బోర్డులో చర్చించాక పొత్తులపై తుది నిర్ణయం వెల్లడి కానుంది.

హైదరాబాద్: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్: ఫిలింనగర్ లో మరోసారి డ్రగ్స్ పట్టివేత.. పబ్ పార్కింగ్ ఏరియాలో డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి అరెస్టు.. 20 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న టాస్క్ ఫోర్స్ .. పబ్ కు వచ్చే కొంత మందికి డ్రగ్స్ అమ్మినట్లుగా గుర్తింపు.. డ్రగ్స్ కొనుగోలు చేసిన వారిని పట్టుకునేందుకు రంగంలో దిగిన నాలుగు బృందాలు.