/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నేడు సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. Miryala Kiran Kumar
నేడు సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ..

నేడు సింగరేణి ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ.. ఎన్నికలను వాయిదా వేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత నిర్వహించాలని ప్రభుత్వం విజ్ఞప్తి..

నల్లగొండ:కేంద్ర ప్రభుత్వం మెడికల్ సేల్స్ రిప్రజెంటిటీస్ హక్కుల రక్షణ కోసం 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కచ్చితంగా అమలుచేయాలి: సిఐటియు

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలి

1976 సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ పటిష్టంగా అమలు చేయాలి 

మందుల ధరలు తగ్గించాలి

   కేంద్ర ప్రభుత్వం మెడికల్ సేల్స్ రిప్రజెంటిటీస్ హక్కుల రక్షణ కోసం 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ కచ్చితంగా అమలు జరిగే విధంగా చర్యలు చేపట్టాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు

   బుధవారం మెడికల్ సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ అఖిలభారత పిలుపుమేరకు ఒక రోజు సమ్మె సందర్భంగా పెదగడియారం సెంటర్లో ధర్నా నిర్వహించడం జరిగింది. తెలంగాణ మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటీటివ్ యూనియన్ (సీఐటీయూ )నల్గొండ బ్రాంచ్ అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్ అధ్యక్షతన జరిగిన సభకు ధర్నా కు హాజరై వీరారెడ్డి మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను రద్దు చేస్తూ కార్పొరేట్లకు అనుకూలంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. 44 చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మికులను కట్టు బానిసలుగా మార్చడానికి కుట్రా చేస్తుందని ఆరోపించారు. 1976 సేల్స్ ప్రమోషన్ యాక్ట్ మెడికల్ రిప్స్ కి కచ్చితంగా అమలు జరపాలని డిమాండ్ చేశారు. మెడికల్ రిప్రజెంటిటీవ్ లకు పనివేళలు, ఉద్యోగ భద్రత కనీస వేతనాలు ఇతర సంక్షేమ పథకాలు వర్తించే విధంగా చట్టబద్ధ పని విధానాలను రూపొందించాలని డిమాండ్ చేశారు. జిపిఎస్ విధానం తీసుకొచ్చి మెడికల్ రిప్రజెంటిటీస్ వ్యక్తిగత గోప్యత ను హరించడం సరికాదని అన్నారు. డాక్టర్స్ ని కలవడానికి ప్రభుత్వ హాస్పిటల్స్ వెళ్లడం నిషేధించడం సరికాదని అన్నారు ప్రజలందరికీ నిత్యవసర వస్తువుగా మారిన మందుల ధరలు పెంచడం వాటిపై జిఎస్టి విధించడం తో సామాన్యులు మందులు కొనలేక ఇబ్బందులు పడుతున్న విధానాన్ని ప్రభుత్వం అర్థం చేసుకోని మందులపై జిఎస్టి వేత్తివేసి సామాన్యులకు మందుల ధరలు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.

      డ్రగ్గిస్ట్ అండ్ కెమిష్టి జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి పరమాత్మ, హోల్ సేల్ వింగ్ కన్వీనర్ వళ్ళందాస్ శ్రీనివాస్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాపోలు లక్ష్మీ నారాయణ హాజరై మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీటివ్ యూనియన్ చేసే పోరాటాలు న్యాయసమతమైన అని మీ పోరాటాలకు సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. కార్మికుల సమస్యలతో పాటు ప్రజల డిమాండ్ ను పెట్టి పోరాడడం అభినందనీయమని అన్నారు.

        సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి సలీం, జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, బిఎస్ఎన్ఎల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి పరిపూర్ణాచారి, మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి పోలే సత్యనారాయణ , టీ ఎం ఎస్ ఆర్ యు రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ కోటా సుధాకర్ పాల్గొని ధర్నా ఉద్దేశించి మాట్లాడుతూ మెడికల్ రిప్రజెంటీటివ్స్ చేసే పోరాటాలకు తమ సంఘాల మద్దతు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని లేనియెడల ప్రజా పోరాటాలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

  ధర్నా అనంతరం పెద్ద గడియారం నుండి యన్ జి కాలేజ్, రామగిరి, ప్రకాశం బజార్, డాక్టర్స్ కాలనీ, ప్రభుత్వా హాస్పిటల్, బస్టాండ్ మీదుగా సిఐటియు కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది

     ఈ ధర్నా కార్యక్రమంలో టీఎంఎస్ ఆర్ యు నల్గొండ జిల్లా బ్రాంచ్ అధ్యక్షులు చెరుపల్లి నిరంజన్ ప్రధాన కార్యదర్శి రావుల రవికుమార్ కోశాధికారి పోలా రమేష్, ఉపాధ్యక్షులు సిహెచ్ మహేష్ గౌడ్ సిహెచ్ అనిల్ కుమార్ ఉప కార్యదర్శిలు సోమస్వామి పోలిశెట్టి జీవన్ కుమార్, కార్యవర్గ సభ్యులు మరియు 150 మంది కార్మికులు పాల్గొన్నారు.

ఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ను ప్రకటించిన కేంద్రం...

ఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ను ప్రకటించిన కేంద్రం.. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును చిరాగ్ చంద్రశేఖర్ శెట్టితో పాటు రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ కు ప్రకటించిన కేంద్రం.. 26 మందికి అర్జున అవార్డ్స్.. క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు.

అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లు...

అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లు.. ప్రతి లోక్‌సభ నియోజక వర్గం నుండి ఒక ట్రైన్.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక ట్రైన్ లో భక్తులను పంపించాలని బీజేపీ నిర్ణయం.. కసరత్తు చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. త్వరలో ఖరారు కానున్న షెడ్యూల్

హైదరాబాద్‌; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి: హరీష్ రావు

హైదరాబాద్‌; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు.. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారితో తయారు చేయించారు.. సీఎం గురువు దగ్గర పనిచేసిన మాదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయి.. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదు.. అప్పులు పెరిగాయంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.

 అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనడం అబద్ధం.. గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పే తప్పుడు ప్రయత్నం ఇది.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు రావు.. రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు ఇచ్చాం.. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇవి శ్వేతపత్రాలా? హామీలు ఎగ్గొట్టేందుకు వేస్తున్న ఎత్తుగడలా?. -హరీశ్‌రావు

తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, శ్రీవారి వైకుంఠ దర్శనం ఎప్పటినుండి అంటే...

తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 23న వేకువజామున నుంచి భక్తులకు శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సామాన్యులు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాటు పూర్తిచేసింది. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు.

చైనాలో భారీ భూకంపం....

చైనా భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 95 మంది మృతి చెందారు. 200 మందికిపైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్స్‌, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది.

అమరావతి: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు..

అమరావతి: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు.. నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పు, ఇతర అంశాలపైనా చర్చ.. విజయవాడపైనా సీఎం ఫోకస్.. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నేతల్లో టెన్షన్.. ఎవరికి స్థాన చలనం ఉంటుందోనని ఆందోళన.. మరికొంత మంది ఇంఛార్జ్ ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు..

రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్‌..

భారత్‌లో మరోసారి కరోనా కలకలం

24 గంటల్లో 335 కొత్త కరోనా కేసులు, ఐదుగురు మృతి

1,701కి చేరిన కరోనా యాక్టివ్ కేసులు

కేరళలో నలుగురు మృతి, యూపీలో ఒకరు మృతి

కరోనాపై కర్నాటక సర్కార్‌ కీలక నిర్ణయం

60 ఏళ్లు పైబడిన వారికి మాస్క్‌లు మస్ట్‌

ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌కు ఆదేశం

కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాల్లో అలర్ట్‌

రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్‌

కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచన

కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని కేంద్రం ఆదేశం

RTPCR కిట్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్న కేంద్రం

భారత్‌ సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్‌ గుర్తింపు

చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత

చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలని ఏర్పాటు చేయాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతిపత్రం

చర్ల మండలంలో సుమారు 50 వేల మంది జనాభాకు రెండు మీసేవ కేంద్రాలు నడిపిస్తున్నారని దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చర్ల మండలంలో మీసేవ కేంద్రాలను పెంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల మండల తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ మాట్లాడుతూ 50వేల జనాభా గలిగిన చర్ల మండలంలో రెండే మీసేవ కేంద్రాలు ఉండటంతో విద్యార్థుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ అప్డేట్ చేయించుకోవడం సర్టిఫికెట్లు అప్లై చేయడం, ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడం ఏదైనా మీ సేవలోనే చేయించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకి 500 నుండి 1000 మంది వరకు లైనులు కట్టి పనులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. కావున మండల తాహాసిల్దారు గారు మాట్లాడుతూ మీసేవ కేంద్రాలను పొడిగించెందుకు ఇట్టి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. విద్యార్థులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఈ మండల అధికారులకు ఉన్నదని తెలియజేస్తున్నాం కావున స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కోరుతున్నాం. లేనియెడల జిల్లా కలెక్టర్ గారిని కలవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ రాజేందర్ రాజు సమ్మక్క రాజమ్మ నాగలక్ష్మి బాయ్ అమ్మ రుక్మిణి రవణ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.