/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, శ్రీవారి వైకుంఠ దర్శనం ఎప్పటినుండి అంటే... Miryala Kiran Kumar
తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, శ్రీవారి వైకుంఠ దర్శనం ఎప్పటినుండి అంటే...

తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 23న వేకువజామున నుంచి భక్తులకు శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సామాన్యులు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాటు పూర్తిచేసింది. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు.

చైనాలో భారీ భూకంపం....

చైనా భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 95 మంది మృతి చెందారు. 200 మందికిపైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్స్‌, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది.

అమరావతి: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు..

అమరావతి: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు.. నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పు, ఇతర అంశాలపైనా చర్చ.. విజయవాడపైనా సీఎం ఫోకస్.. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నేతల్లో టెన్షన్.. ఎవరికి స్థాన చలనం ఉంటుందోనని ఆందోళన.. మరికొంత మంది ఇంఛార్జ్ ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు..

రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్‌..

భారత్‌లో మరోసారి కరోనా కలకలం

24 గంటల్లో 335 కొత్త కరోనా కేసులు, ఐదుగురు మృతి

1,701కి చేరిన కరోనా యాక్టివ్ కేసులు

కేరళలో నలుగురు మృతి, యూపీలో ఒకరు మృతి

కరోనాపై కర్నాటక సర్కార్‌ కీలక నిర్ణయం

60 ఏళ్లు పైబడిన వారికి మాస్క్‌లు మస్ట్‌

ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌కు ఆదేశం

కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాల్లో అలర్ట్‌

రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్‌

కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచన

కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని కేంద్రం ఆదేశం

RTPCR కిట్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్న కేంద్రం

భారత్‌ సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్‌ గుర్తింపు

చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత

చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలని ఏర్పాటు చేయాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతిపత్రం

చర్ల మండలంలో సుమారు 50 వేల మంది జనాభాకు రెండు మీసేవ కేంద్రాలు నడిపిస్తున్నారని దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చర్ల మండలంలో మీసేవ కేంద్రాలను పెంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల మండల తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ మాట్లాడుతూ 50వేల జనాభా గలిగిన చర్ల మండలంలో రెండే మీసేవ కేంద్రాలు ఉండటంతో విద్యార్థుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ అప్డేట్ చేయించుకోవడం సర్టిఫికెట్లు అప్లై చేయడం, ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడం ఏదైనా మీ సేవలోనే చేయించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకి 500 నుండి 1000 మంది వరకు లైనులు కట్టి పనులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. కావున మండల తాహాసిల్దారు గారు మాట్లాడుతూ మీసేవ కేంద్రాలను పొడిగించెందుకు ఇట్టి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. విద్యార్థులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఈ మండల అధికారులకు ఉన్నదని తెలియజేస్తున్నాం కావున స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కోరుతున్నాం. లేనియెడల జిల్లా కలెక్టర్ గారిని కలవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ రాజేందర్ రాజు సమ్మక్క రాజమ్మ నాగలక్ష్మి బాయ్ అమ్మ రుక్మిణి రవణ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్: తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్: తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్.. అర్ధరాత్రి మహిళను తార్నాకలో వదిలి పెడతానంటూ తీసుకెళ్లిన మధు అనే వ్యక్తి.. మహిళను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టిన దుండగులు.. నలుగురు స్నేహితులతో కలిసి మహిళపై మధు అనే వ్యక్తి అత్యాచారం.. నిందితులు ప్రశాంత్, మధుసూదన్, రోహిత్ తరుణ్ అరెస్ట్..

తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..

తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,845 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు..

అమరావతి: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..

అమరావతి: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిసన్లు.. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు..

ఏపీ: నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ...

ఏపీ: నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ.. ఇక నుంచి ఆరోగ్య శ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం.. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాయలంలో లాంఛనంగా ప్రారంభం.. కార్డులో క్యూఆర్ కోడ్, లబ్దిదారుడి ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్యం వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ..

నేడు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ...

నేడు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ.. నేటి ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఎఫైర్స్ కమిటీ మీటింగ్.. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ ఠాక్రేతో పాటు ముఖ్యనేతలంతా హాజరు.. ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ టికెట్లు, లోక్ సభ ఎన్నికలపై సమావేశం.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలి రాజకీయ భేటీ.