/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz చర్ల: అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి.. Miryala Kiran Kumar
చర్ల: అర్హులైన వారందరికీ పెన్షన్ ఇవ్వాలి..

అర్హులైన వారందరికీ పెన్షన్స్ ఇవ్వాలనీ చర్ల ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ గారికి న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించడం జరిగింది 

అర్హులైన వారందరికీ పెన్షన్స్ ఇవ్వాలని కోరుతూ సిపిఐ ఎం ఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ ఇంకా చర్ల మండలంలో 50%శాతం పెన్షన్స్ రావలసిన వాళ్ళు ఉన్నారని అధికారులు

సర్వేచేసి పెన్షన్ల్ ఇవ్వాలని కోరారు గత పరిపాలనలో ఎన్నిసార్లు వికలాంగుల పెన్షన్లు ఆసరా పింఛన్లు వృద్ధాప్య పింఛన్లు అప్లై చేసుకున్నా పెన్షన్ లు రాలేదని అనేక కారణాలతో తిరస్కరించారని ఈ ప్రభుత్వంలోనైనా అర్హులైన వారికి పెన్షన్ల సౌకర్యం కల్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నాం ఈ కొత్త ప్రభుత్వం కాంగ్రెస్  ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం .

పెన్షన్ల్ కోసం అనేకసార్లు అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగిన ఫలితం లేకుండా పోయింది. పెన్షన్ వస్తే వారికి ఎంతో కొంత న్యాయం జరుగుతుందని అనుకున్నము. దానితో వారి జీవనంలో ఎంతో కొంత మార్పు వస్తుందని వారు తెలియజేశారు. అర్హులైన వారికి పెన్షన్ వచ్చేలా సర్వేచేసి పత్రాలు పరిశీలించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని చదరన్ క్యాంపులో కెళ్ళి సర్టిఫికెట్ తెచ్చుకున్న ఫలితం లేకుండా పోయింది పెండింగ్లో ఉన్న పెన్షన్ ఇప్పించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా కోరుతున్నాం. సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఎంపీడీవో రవీంద్ర ప్రసాద్ గారికి కు ఇవ్వటం జరిగింది వారు మాట్లాడుతూ సానుకూలంగా స్పందిస్తూ పరిశీలించి ఉన్నతాధికారులకు తెలియజేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పి వై ఎల్ మండల నాయకులు చిరిగిడి నరేష్ మండల నాయకులు కణితి భాను ప్రకాష్ ఇరప సమ్మక్క బియ్యం లక్ష్మి అక్కల దేవి వెంకటేశ్వర్లు స్వరూప మనోజ్ గంగుల వెంకటి జయమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

చర్ల:తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత

తుఫాను తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలనీ , సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ చర్ల . డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది:

గత నాలుగు రోజులుగా కురుస్తున్న మీచాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,కౌలుదారులకి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ చర్ల డిప్యూటీ తాసిల్దార్ భరణి బాబు గారికి రైతులతో వినతి పత్రం సమర్పించడం జరిగింది అనంతరం సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ 

ఈ తుఫాను వలన రాత్రింబవళ్లు కష్టపడి, అధిక వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెట్టిన పంటలు తుఫానుతో నేలమట్టం కావడంతో రైతులందరూ కన్నీటి పర్వతంలో మునుతున్నారనీ ."దేశానికీ రైతే రాజని, రైతే వెన్నుముక" అని ప్రగల్బాల్ పలికే ప్రభుత్వాలు ఇప్పటివరకు కనీసం వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే కూడా చేయలేదని వారన్నారు.మీ చాంగ్ తుఫాను వలన పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న కూరగాయల పంటలు వేలాది ఎకరాలు నేలమట్టం అయ్యాయని, పనికిరాకుండా అయిపోయాయని రైతు చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని అన్నారు.మరోపక్క వేల రూపాయలు పెట్టి పంట పొలాలను కౌలుకు తీసుకుంటే ఈ తుఫాను కారణంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వారన్నారు.కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని,పంట నష్టపోయిన రైతుకు ఎకరంకు వరి మొక్కజొన్నకు 25000,

పత్తికి 30,000 మిర్చికి 50,000 నష్టపరిహారంగా చెల్లించాలని, కూరగాయలకు ఏకరంకు 10,000 తక్షణమే అధికారులతో సర్వేలు చేయించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నూతన ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ . ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు సిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్  సమ్మక్క కురుసం సమ్మక్క కనకమ్మ సపక నాగలక్ష్మి జ్యోతి రవణ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

13 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.28 కోట్లు

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియామకం..

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియామకం.. నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ఉన్న చక్రవర్తిని సీఎం చీఫ్ ఆఫీసర్ గా నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు

ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత..

ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. కొమురం భీం జిల్లాలో 10.5 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. ఆదిలాబాద్ జిల్లాలో 11.2 డిగ్రీలు.. నిర్మల్ జిల్లాలో 12.8గా, మంచిర్యాల జిల్లాలో 13.2గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్‌: ప్రజాదర్బార్‌ పేరు మార్పు...

హైదరాబాద్‌: ప్రజాదర్బార్‌ పేరు మార్పు

ప్రజాదర్బార్‌ను ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం

ఇకపై ప్రతి మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహణ

ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు ప్రజావాణి.

ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై నేడు తీర్పు..

ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు.. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,091 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,246 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు

అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం..

అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.

మార్నింగ్ ముచ్చట్లు...

మార్నింగ్ ముచ్చట్లు..

తెలంగాణలో 54 కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలు రద్దు

తెలంగాణ సచివాలయంలో మంత్రులకు చాంబర్ల కేటాయింపు

అమరావతిలో ఈ నెల 17న రాజధాని రైతుల బహిరంగ సభ

ఈనెల 27న టీఎస్‌ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు

కేరళ: శబరిమలలో దర్శన సమయం గంట పెంపు

ఢిల్లీలో ఈనెల 19న ఇండియా కూటమి నాలుగో సమావేశం

ఉచితాలు ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయి-ధన్‌ఖడ్‌

అమెరికాలో మరోసారి కాల్పులు, ముగ్గురు మృతి

రేపు భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్