/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు Yadagiri Goud
హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టురట్టు

హైదరాబాద్‌లో మరో వ్యభిచార ముఠా గుట్టు రట్టుయింది. గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాపై సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు దాడులు చేపట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

వివరాల్లోకి వెళితే.. స్పా ముసుగులో వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇద్దరిని సైబరాబాద్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు.

మాదాపూర్ మెగాహిల్స్‌లోని ఓ స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు అందిన సమాచారంతో అధికారులు దాడి చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఓ విటుడ్ని అరెస్ట్ చేశారు. విశాఖ, రాజమండ్రి, కూకట్ పల్లి ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువతులను నరక కూపం నుంచి రక్షించారు....

SB NEWS

SB NEWS

దేశం నుదిటిన మణిపూర్ నెత్తుటి తిలకం?

మణిపూర్‌లోని కాంగ్‌కోక్వీ జిల్లా బిఫైనోమ్‌ గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వీడియోలు బహిర్గతమైన తర్వాత కూడా కేంద్రం దీన్ని ఓ సాదా సీదా చర్యగానే పేర్కొంది. పైగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రే దీనిపై చర్యలు తీసుకోవాలంటూ సాక్షాత్తు ప్రధా ని పేర్కొనడం మరిన్ని విమర్శలకు దారి తీస్తోంది. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం నియమించిన గవర్నర్‌ అనుసూయ ఉ యికే దీనిపై తీవ్రంగానే విరు చుకుపడ్డారు. నిందితుల్ని వెంటనే అదు పులోకి తీసుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

వాస్తవానికి గతరెండు మాసాల్లో మణిపూర్‌ జాతుల ఘర్ష ణతో అట్టుడుకి పోతోంది. మెజార్టీ వర్గమైన మైతీని గిరిజనుల్లో చేర్చే అంశాన్ని పరిశీలించాలంటూ ఆ రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడంతో ఈ ఏడాది మే 3న ఒక్కసారిగా జాతుల మధ్య ఘర్షణ తలెత్తింది. హిందువులైన మెజార్టీ మైతీయిలకు గిరిజనులైన మైనార్టీ కుకి, నాగ, మరికొన్ని జాతులకు మధ్య బీకర ఘర్షణలు చెలరేగాయి. గిరిజనులకు చెందిన చర్చిల్ని మైతీయిలు కూల్చేశారు. వారి గ్రామాల్ని దగ్ధం చేశారు. కొందరు మైతీయులైతే భద్రతా బలగాల వద్దనున్న ఆయు ధాల్ని దొంగిలించి మారణహోమానికి పాల్పడ్డారు.

హైకోర్టు సూచించిన ఒక రోజు తర్వాత బిఫైనోమ్‌ గ్రామంపై మైతేయిలు దాడి చేశారు.

గ్రామంలోని ఇళ్ళన్నింటిని తగుల బెట్టారు. భయంతో పారిపోతున్న కుకీల్ని పట్టుకుని కొట్టి చంపేశారు. ఈ మారణకాండకు భయపడ్డ ఓ కుటుంబం అడవిలోకి పారిపో వడంతో పోలీసులు వారిని రక్షించి స్టేషన్‌కు తీసుకెళ్తుం డగా తిరిగి మైతీలు దాడి చేశారు. 20, 40, 50ఏళ్ళున్న ముగ్గురు మహి ళల్ని తమ వెంట తీసుకెళ్ళారు. వీరిలో ఇద్దర్ని నగ్నంగా మార్చారు. హైవేపై ఊరే గించారు. అనంతరం 20ఏళ్ళ యువ తిపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె ఎదురుగానే ఆమె తండ్రితో పాటు సోదరుడ్ని చంపేశారు.

ఈ సంఘటనల్ని కేవలం జాతుల మధ్య ఘర్షణగానే చూపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించింది. కేంద్రం కూ డా దీనికి వంత పాడింది. పైగా దాడుల వెనుక విదేశీ హస్త ముందంటూ నమ్మించే ప్రయత్నం జరిగింది. బంగ్లాదేశ్‌, చైనా ల నుంచొచ్చిన ఉగ్రవాదులే మైతీల ముసుగులో ఈ దారు ణాలకు ఒడిగట్టినట్లు ఇంత కాలం ప్రపంచాన్ని నమ్మించింది. గత రెండు మాసాలుగా జరుగుతున్న దాడుల్లో అధికారిక లెక్కల ప్రకారం 140మంది చనిపోయారు. 50వేల మంది ఇళ్ళు కోల్పోయారు. వందలకొద్దీ చర్చిలు నేలమట్ట మయ్యాయి.

వేల సంఖ్యలో ఇళ్ళు దగ్ధమై పోయాయి. అయినా ఈ చిన్ని రాష్ట్రంలోని వివాదాలపై కేంద్రం చిన్న చూపే చూసింది. కనీసం అదనపు బలగాల్ని మోహరించి జాతుల మధ్య ఘర్షణల్ని అణిచేసే ప్రయత్నం చేయలేదు. ఇది పరోక్షంగా ఇక్కడ మెజార్టీ మైతీ వర్గాల మద్దతు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు ప్రాకులాడుతున్నాయన్న అంశాన్ని స్పష్టం చేసింది. ఇలాంటి ఘటనలే బీజేపీయేతర పార్టీల పాలనలో గల రాష్ట్రా ల్లో జరిగుంటే ఎప్పుడో ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం రద్దు చేసుండేది. గవర్నర్‌ పాలన విధించుండేది. సైన్యాన్ని బరిలో దింపుండేది. ఘర్షణల్ని కఠినంగా అణిచేసుండేది. కానీ బీజేపీకి మణిపూర్‌లో మైతీ తెగల ఓట్లు అవసరం. ఈ కారణంగానే కేంద్రం ఈ విషయంలో మీన మేషాలు లెక్కించింది. రాష్ట్ర ప్రభుత్వ అసమర్ధతకు మద్దతుగా నిల్చిందన్న విమర్శల్ని ఎదుర్కొంటోంది.....

హైదరాబాద్లో తమిళ సినిమా షూటింగ్లపై వివాదం

హైదరాబాదులో తమిళ సినిమా షూటింగ్ ల ఫై వివాదం నెలకొంది. ఇకపై షూటింగులన్నీ తమిళనీడులోనే చేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా (ఫిపా)లో తీర్మానం చేశారు.

ఇతర ప్రాంతాల్లో షూటింగ్ చేస్తే తమ అనుమతి తప్పనిసరి తీసుకోవాల్సి ఉంటుందని అసోసియేషన్ తేల్చి చెప్పింది. అంతే కాకుండా షూటింగ్ల కోసం తమిళ సినీ కార్మికులనే తీసుకోవాలని ఫెప్సీ నిర్ణయించింది.

కాగా, ఏపీ మంత్రి రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం ప్రారంభించారు.

ఏపీ,తెలంగాణలో తమిళ చిత్రాల షూటింగ్ లు జరుగుతున్నాయని అలా చేయవద్దని ఉద్యమం లేవదీశారు. తమిళ సినీ కార్మికులకు పనులు ఉండడం లేదని, అగ్ర హీరోలు అందరూ హైదరాబాద్, విశాఖలో షూటింగులు చేస్తున్నారని సెల్వా అంటున్నారు. ఈ అంశంపై రజనీకాంత్, విజయ్ స్పందించాలని తమిళ సినిమాల షూటింగులు చెన్నైలోనే చేయడానికి అంగీకరించారని.. కానీ అజిత్ ఇంకా స్పందించాల్సి ఉంది అంటున్నారు.

కొంకాలంగా తమిళ భారీ చిత్రాల షూటింగులు ఎక్కువగా హైదరాబాద్, విశాఖలోనే జరుగుతున్నాయి. ఇది ఫేప్సీ పేరుతో ఓసినీ కార్మిక సంఘాన్ని నడుపుతున్న ఆర్ కె సెల్వమణికి నచ్చలేదు. తన సంఘంలోని సభ్యులకు పనులు ఉండడం లేదని ఆయన వివాదం ప్రారంభించారు. తాము సినిమా షూటింగులు చేయడానికి పనికిరామా?.. అంటూ ఆయన సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు.

ఏపీలో సెల్వమణి భార్య రోజా మంత్రిగా ఉన్నారు. నిజానికి దర్శకుడు అయిన ఆర్కే సెల్వమణికి షూటింగులో లొకేషన్లు ఎలా సెలెక్ట్ చేసుకుంటారో తెలుసు.. కథను బట్టి షూటింగ్ చేసుకుంటారు.. కానీ లేనిపోని వివాదం రేపి తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దని రచ్చ చేస్తున్నారని కొంతమంది మండిపడుతున్నారు....

ఇష్టం లేకుండా ముద్దు పెట్టాడని నాలికను కొరికేసిన భార్య

కర్నూలు జిల్లా:జులై 22

అవును వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పెళ్లయిన కొత్తలో వారి అన్యోన్య దాంపత్యం సాఫీగా సాగింది

ఏం జరిగిందో ఏమోగానీ రెండేళ్లుగా వారి మధ్య కలతలు మొదలయ్యాయి.. ఒకరంటే ఒకరికి పడదు.. నిత్యం గొడవలు.. శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు. భార్యపై దాడి చేశాడు. అంతటితో ఆగాడా? అసలే పీకల్లోతు కోపంలో ఉన్న ఆమెను ముద్దుపెట్టబోయాడు. అంతే.. కసుక్కున భార్య అతని నాలుకను కొరికేసింది.

అసలు విషయం ఏమిటంటే..కర్నూలు జిల్లాకు చెందిన తారాచంద్ నాయక్‌.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం ఎల్లంగుట్ట తండాకు చెందిన పుష్పవతిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. పెళ్లయిన కొన్నాళ్ల పాటు ఇద్దరూ బాగానే అన్యోన్యంగా ఉన్నారు. రెండేళ్ల నుంచి వీరిద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. ఇక ఈ మధ్య గొడవలు మరింత పెరిగాయి. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రం కూడా వారిద్దరూ గొడవపడ్డారు.

ఒకరు ఒకరి మీద దాడి చేసుకున్నారు

కొద్దిసేపటి తర్వాత మనోడు వెళ్లి లిప్ కిస్ కోసం ట్రై చేశాడు, అప్పటికే పీక ల్లోతు కోపంతో ఉన్న ఆమె వెంటనే భర్త నాలుకను కొరికేసింది. దీంతో అల్లాడిపోయిన తారాచంద్.. హుటాహుటిన గుత్తి హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం వెళ్లాడు. తారాచంద్‌ను పరీక్షించిన వైద్యులు మెరుగైన మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం హాస్పిటల్‌కు సిఫార్సు చేశారు.

ఇక ఈ విషయమై భార్యాభర్తల వర్షన్ వేరుగా ఉంది. తనపై తారాచంద్ దాడి చేశాడని.. ఆపై తనకు ఇష్టం లేకుండా బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి వచ్చాడని అందుకే నాలుక కొరికానని పుష్పవతి జొన్నగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇక తారాచంద్ మీడియాతో మాట్లాడుతూ.. తన భార్యకు వేరొక వ్యక్తితో అఫైర్ ఉందని అయినా కూడా తాను సర్దుకుపోతున్నానని తెలిపాడు. తన భార్యతో తనకు ముప్పు ఉందని చెప్పాడు. తన పిల్లలూ.. తాను ఎలా బతకాలో తెలియడం లేదని వాపోయాడు...

Passports: నేడు పాస్‌పోర్టు సేవలు యథాతథం

హైదరాబాద్‌: వర్షాల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినా.. పాస్‌పోర్టు స్పెషల్‌ డ్రైవ్‌ శనివారం యథాతథంగా కొనసాగుతుందని పాస్‌పోర్టు ప్రాంతీయ అధికారి దాసరి బాలయ్య వెల్లడించారు..

శనివారం 3,700 మంది పాస్‌పోర్టు సేవలకు దరఖాస్తు చేసుకున్నారని.. వీరంతా ఎంపిక చేసుకున్న మేరకు రాష్ట్రంలోని ప్రాంతీయ పాస్‌పోర్టు సేవాకేంద్రాలు, 14 తపాలా కార్యాలయాల్లోని పాస్‌పోర్టు కేంద్రాలకు వెళ్లి సేవలు వినియోగించుకోవచ్చని తెలిపారు..

SB NEWS

SB NEWS

SB NEWS

తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :జులై 22

తిరుమలలో నేడు శనివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 32,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

SB NEWS

CM Kcr: భారీ వర్షాలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు సహా, వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిసహా వివిధశాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు..

గత కొన్ని రోజలుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో

భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం..

భద్రాచలం వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుపై కూడా సీఎం చర్చించారు..

మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

ఖమ్మం జిల్లా:జులై 21

భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు.

వరద ప్రవాహం ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితి ని సమీక్షించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఉన్న రక్షణ, సహాయక సౌకర్యాలు వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం, అస్థి నష్టం జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌కి మంత్రి పువ్వాడ వివరించారు. దుమ్ముగూడెం వద్ద వరద ప్రవాహం తీవ్ర స్ధాయిలో ఉన్నప్పటికీ,

ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారందరికీ ఆహారం, త్రాగునీరు, ఇతర వసతులు కల్పించామని వివరించారు...

మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష ను అదుపులోకి తీసుకున్న NIA

ప్రకాశం జిల్లా:జులై 21

మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో శిరీష తన నివాసంలో ఉండగా ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అక్కడ నుంచి ఆమెను అరెస్ట్ చేసి తరలించారు. ఇటీవలే శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే సోదాలు జరిగే సమయంలో శిరీష ఇంట్లో లేరు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లి వచ్చే లోపు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారని శిరీష అప్పట్లో మీడియాకు తెలియజేశారు.

భర్త, కుమారుడిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండగా విచారణ సోదాలు అంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని శిరీష అప్పట్లో తెలిపారు...

SB NEWS

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ పైహత్య : ప్రయత్నమా ❓️

కోల్‌కతా:జులై 21

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి గన్‌ తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్‌ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.

మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్‌ అని స్టిక్కర్‌ ఉన్న కారులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం వద్దకు చేరుకున్నాడు.

గన్‌, కత్తి కలిగిన అతడు భద్రతా లేన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నిలువరించిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపాడు...