/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ Yadagiri Goud
తిరుమలలో పెరుగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :జులై 22

తిరుమలలో నేడు శనివారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూ కాంప్లెక్స్ లోని కంపార్టు మెంట్లన్నీ నిండి క్యూ లైన్లు వెలుపలికి వచ్చాయి.

దీంతో స్వామివారి సర్వదర్శనానికి ఏకంగా 24 గంటల సమయం పడుతోంది. శుక్రవారం శ్రీవారిని 71,721 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.88 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 32,078 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

SB NEWS

CM Kcr: భారీ వర్షాలపై మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు సహా, వివిధ అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు.

మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, జగదీశ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారిసహా వివిధశాఖల ఉన్నతాధికారులు సమీక్షలో పాల్గొన్నారు..

గత కొన్ని రోజలుగా రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం సమీక్షించారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లోని గోదావరి పరివాహక ప్రాంతాల్లో

భారీ వర్షాలు కురుస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితిపై అధికారులతో సీఎం చర్చించారు. ఇప్పటికే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌తో ఫోన్‌లో మాట్లాడిన సీఎం..

భద్రాచలం వద్ద పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వరద పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ధాన్యం ఉత్పత్తి మేరకు ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమల ఏర్పాటుపై కూడా సీఎం చర్చించారు..

మంత్రి పువ్వాడకు ఫోన్ చేసిన సీఎం కేసీఆర్

ఖమ్మం జిల్లా:జులై 21

భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి ఆయా పరిస్థితులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్ కు ఫోన్ చేసి పరిస్థితిని వాకబు చేశారు.

వరద ప్రవాహం ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, అర్థ రాత్రిళ్లు సైతం పరిస్థితి ని సమీక్షించాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

ఉన్న రక్షణ, సహాయక సౌకర్యాలు వినియోగించి ఎక్కడ కూడా ప్రాణ నష్టం, అస్థి నష్టం జరుగకుండా తగు చర్యలు తీసుకోవాలని సూచించారు.

జిల్లా వ్యాప్తంగా ముమ్మరంగా కొనసాగుతున్న మంపు గ్రామాలు, సహాయక చర్యలను సీఎం కేసీఆర్‌కి మంత్రి పువ్వాడ వివరించారు. దుమ్ముగూడెం వద్ద వరద ప్రవాహం తీవ్ర స్ధాయిలో ఉన్నప్పటికీ,

ఎక్కడా ఎలాంటి ఇబ్బంది కలగలేదని, జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉందని, ఇప్పటికే చాలా మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, వారందరికీ ఆహారం, త్రాగునీరు, ఇతర వసతులు కల్పించామని వివరించారు...

మావోయిస్టు అగ్రనేత ఆర్కే సతీమణి శిరీష ను అదుపులోకి తీసుకున్న NIA

ప్రకాశం జిల్లా:జులై 21

మావోయిస్టు అగ్రనేత, దివంగత ఆర్కే సతీమణి శిరీషను ఎన్ఐఏ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులో శిరీష తన నివాసంలో ఉండగా ఎన్ఐఏ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

అక్కడ నుంచి ఆమెను అరెస్ట్ చేసి తరలించారు. ఇటీవలే శిరీష ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే సోదాలు జరిగే సమయంలో శిరీష ఇంట్లో లేరు.

అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె చికిత్స నిమిత్తం విజయవాడకు వెళ్లి వచ్చే లోపు ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారని శిరీష అప్పట్లో మీడియాకు తెలియజేశారు.

భర్త, కుమారుడిని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో ఉండగా విచారణ సోదాలు అంటూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మావోయిస్టులకు నగదు పంపించినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని శిరీష అప్పట్లో తెలిపారు...

SB NEWS

పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ పైహత్య : ప్రయత్నమా ❓️

కోల్‌కతా:జులై 21

పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ నివాసంలోకి ఒక వ్యక్తి గన్‌ తో చొరబడేందుకు ప్రయత్నించాడు. అలెర్ట్‌ అయిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.

మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తి వద్ద తుపాకీ, కత్తితోపాటు కొన్ని ఏజెన్సీలకు చెందిన ఐడీ కార్డులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు

పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో శుక్రవారం ఈ సంఘటన జరిగింది. నల్లకోటు, టై ధరించిన ఒక వ్యక్తి పోలీస్‌ అని స్టిక్కర్‌ ఉన్న కారులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాళీఘాట్ నివాసం వద్దకు చేరుకున్నాడు.

గన్‌, కత్తి కలిగిన అతడు భద్రతా లేన్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించాడు. నిలువరించిన పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఓ పోలీసు అధికారి తెలిపాడు...

చొప్పదండి రణభేరి సభ ను విజయవంతం చేయండి ….ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్

బహుజన్ సమాజ్ పార్టీ చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో జరిగే బహుజన రణభేరి సభ ను విజయవంతం చేయాలని బిఎస్పీ రాష్ట్ర అద్యక్షులు డా ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

ఈ సందర్భంగా పెద్దపల్లి లో బహుజన రాజ్యాదికార యాత్ర లో బాగంగా విచ్చేసిన ఆయన చొప్పదండి అసెంబ్లీ కమిటీ ఆద్వర్యంలో జరిగే బహుజన రణభేరి సభ వాల్ పోస్టర్ పెద్దపెల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ...ఈ రణభేరి సభ కు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు..

తెలంగాణ లో బహుజనులందరికి సమానమైన వాటా రావాలంటే బిఎస్పీ వెంబడి నడవాలని ఆయన కోరారు. రాష్ట్రంలో అన్ని సమస్య లకు పరిష్కారం బిఎస్పీ అదికారంలోకి రావడమే అని ఆయన అన్నారు.బహుజన రాజ్యం లో ‍అందరికి సమానమైన హక్కులు కల్పించబడుతాయని ఆయన పేర్కొన్నారు..

ఈ కార్యక్రమం లో జిల్లా ఇంచార్జి మేకల రవీందర్ .కరీంనగర్ జిల్లా అద్యక్షులు నల్లాల శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి అక్కి బాలకిషన్,జిల్లా కార్యదర్శులు చొప్పదండి అసెంబ్లీ ఇంచార్జ్ లు కొంకటి శేఖర్, మంద రవిందర్, జిల్లా కోశాదికారి కాంపెల్లి రాజు,జిల్లా సంగటన మంత్రి నాగుల మహేష్,

చొప్పదండి అసెంబ్లీ అద్యక్షులు నల్లాల రాజెందర్, ఉపాద్యక్షులు యండి షమీమ్, ప్రధాన కార్యదర్శి భూత్కురి కాంత, కోశాదికారి పిట్ట మనోహర్,.సీనియర్ నాయకులూ ఆరెపల్లి వినోద్ .చొప్పదండి మండల అద్యక్షులు ఇరుగురాల రమేష్, .రామడుగు మండల అధ్యక్షులు కాశీపాక తిరుపతి, .గంగాధర మండల అధ్యక్షులు పోత్తురి సురేష్ .మండల ప్రధాన కార్యదర్శి గజ్జెల సతీష్ మండల కొశధికారి గట్టేముక్కాలా రాజు వెదిర సెక్టార్ అధ్యక్షులు సంతోష్ .చొప్పదండి పట్టాణ ప్రధాన కార్యదర్శి రోహిత్ నవీన్ మహెందర్ తదితరులు పాల్గొన్నారు......

మ‌ణిపూర్ ఘటనపై ద‌ద్ద‌రిల్లిన పార్ల‌మెంట్

న్యూఢిల్లీ :జులై 21

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా జరుగుతున్నాయి. రెండో రోజు కూడా మణిపూర్ అంశం పై ప్రతిపక్షాల నినాదాలతో ఉభయ సభలు దద్దరిల్లాయి. మణిపూర్ లో ఇద్దరు మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనతోపాటు.. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై చర్చించాలంటూ విపక్షాలు పట్టుబడటంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో లోక్ సభ సోమవారానికి వాయిదా పడింది.

ఉదయం 11 గంటలు లోక్ సభ ప్రారంభం కాగానే మణిపూర్ అంశంపై చర్చించాలంటూ విపక్షాలు డిమాండ్ చేశాయి. వెల్ లోకి దూసుకెళ్లి నిరసనకు దిగారు.

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో ఈ అంశంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సభలో ప్రకటన చేస్తారని స్పీకర్ ఓం బిర్లా ఎంత చెప్పినా విపక్షాలు వినిపించుకోలేదు. ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశాయి. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

ఈ నేపథ్యంలో లోక్ సభ ను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు. తిరిగి లోక్ సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్ష సభ్యులు శాంతిచకపోవడంతో సభను సోమవారానికి వాయిదా వేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.

ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో గిరిజన మహిళల్ని నగ్నంగా ఊరేగించిన ఘటనను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నిజంగానే తీవ్రంగా పరిగణించి ఉంటే.. తొలుత ఆయన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ ను బర్తరఫ్ చేసి ఉండేవారని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు.

పార్లమెంట్ వెలుపల ఆగ్రహం వ్యక్తం చేయడం సరిపోదని.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోని పరిస్థితులతో పోల్చి తప్పుడు ఆరోపణలు చేయడానికి బదులుగా మణిపూర్ సీఎంను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు....

పార్టీలో పని చేసే కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుంది

జగిత్యాల జిల్లా :జులై 21

బీఆర్‌ఎస్‌ పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు కార్యకర్తలే పార్టీకి కీలకంగా పనిచేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.

జగిత్యాల జిల్లా ఎండపెల్లి మండలంలోని చర్లపల్లి గ్రామానికి చెందిన దాదాపు 60 మంది కాంగ్రెస్ బీజేపీ పార్టీ లకు చెందిన నాయకులు, కార్యకర్తలు మంత్రి సమక్షంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ సందర్భంగా వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

మంత్రి మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం 9 ఏళ్లలో అమలు చేసిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి వివిధ పార్టీలకు చెందిన వారు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని అన్నారు.

పార్టీలో పనిచేసే కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలలో చర్చ జరుపాలని సూచించారు...

ప్రభుత్వ ఉద్యోగులకు త్వరలో సెకండ్ PRC..?

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్నది.

ఇందులో భాగంగా ఉద్యోగుల నుంచి ఇటీవల వచ్చిన డిమాండ్లకు అనుగుణంగా వేతన సవరణ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. త్వరలోనే ఉద్యోగుల, ఉపాధ్యాయుల సంఘాల ప్రతినిధులతో ముఖ్యమంత్రి సమావేశం కావాలనుకుంటున్నట్లు సచివాలయ వర్గాల సమాచారం.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఫస్ట్ పీఆర్సీని 2018 జూలైలో ఏర్పాటు చేశారు. అది ఇచ్చిన సిఫారసులను పరిగణనలోకి తీసుకుని 30% ఫిట్‌మెంట్ ప్రకటించింది. ఆ కమిషన్ గడువు ఈ ఏడాది జూన్ చివరితో ముగిసింది.

దీంతో కొత్త పీఆర్సీ జూలై 1వ తేదీ నుంచి కొత్తగా అమల్లోకి రావాల్సి ఉన్నది.

గడువు సమీపిస్తున్నా కొత్త పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడంతో ఉద్యోగుల్లో అసహనం నెలకొన్నది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించడంతో తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొన్నది.

షెడ్యూలు ప్రకారం జూలై నుంచే కొత్త పీఆర్సీ రావాల్సి ఉండడంతో అసెంబ్లీ ఎన్నికల్లో పొలిటికల్‌ మైలేజ్ పొందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నెల చివరిలోగానే ఎంప్లాయీస్ యూనియన్ల ప్రతినిధులతో మాట్లాడి అవసరాన్ని బట్టి ఆ తర్వాత ఐఆర్ ఇంటెరిమ్ రిలీఫ్ పైనా ప్రకటన చేసే అవకాశం ఉంది....

Kavitha: అర్వింద్‌.. 24 గంటల సమయం ఇస్తున్నా: ఎమ్మెల్సీ కవిత సవాల్

హైదరాబాద్‌: భాజపా ఎంపీ ధర్మపురి అర్వింద్‌(Dharmapuri Arvind)కు 24 గంటల సమయం ఇస్తున్నానని.. తనపై చేసిన అవినీతి ఆరోపణలను నిరూపించాలని భారాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) సవాల్‌ విసిరారు..

నిరూపించకపోతే ఆయన ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు..

''ఎంపీగా ఉన్నప్పుడు 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చాను. తాను ఎంపీగా ఉన్న సమయంలోనే స్పైస్‌ బోర్డు తెచ్చినా.. అర్వింద్‌ తెచ్చానని చెబుతున్నారు.

ఇప్పుడు నా భర్తపై ఆరోపణలు చేస్తున్నారు. ఆయన పేరు తీసుకురావాల్సిన అవసరం ఏముంది? నేను, నాన్న, అన్న, రాజకీయాల్లో ఉన్నాం అని సహించాం. నా భర్త పేరు వాడటం సరైన పద్ధతి కాదు'' అని కవిత అన్నారు..

SB NEWS