/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా Yadagiri Goud
Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా

Rahul Gandhi: సుప్రీంకోర్టులో రాహుల్ గాంధీ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. పరువు నష్టం కేసులో గుజరాత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంను ఆశ్రయించారు రాహుల్ గాంధీ..

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు గుజరాత్ ప్రభుత్వానికి, ప్రతివాదులకు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై రెండు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. రాహుల్‌కు విధించిన జైలు శిక్షపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు..

SB NEWS

SB NEWS

SB NEWS

భద్రాచలం చేరుకున్న పువ్వాడ

భద్రాచలం:జులై 21

వరదల నేపథ్యంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం భద్రాచలం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఐటీసీ గెస్ట్ హౌస్ లో మంత్రి పువ్వాడను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు.

వరదల ప్రత్యేక అధికారులు కృష్ణ ఆదిత్య, గౌతం పోట్రు, కృష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ పోప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ వినీత్, ఏఎస్పీ అరితోష్ పంకజ్ తదితరులున్నారు.

మరికాసేపట్లో గోదావరి కరకట్టపై వరద ఉధృతిని భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేగ కాంతారావుతో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.

కాగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో భద్రాచలంలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో స్వయంగా పరిశీలించాలని ముఖ్యమంత్రి కేసీఅర్ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి ఆదేశాలు ఇచ్చారు.

దీంతో ఇవాళ 11గంటల నుండి వరద ఉదృతి తగ్గే వరకు భద్రాచలంలోనే ఉండి మంత్రి పువ్వాడ గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించనున్నారు...

సరూర్‌నగర్‌ చెరువు గేట్ల ఎత్తివేతకు రంగం సిద్ధం

సరూర్‌నగర్ చెరువులోకి ఎగువ ప్రాంతం నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యాయి. సరూర్ నగర్ చెరువులో గేట్లు ఎత్తివేతకు అధికారులు సిద్ధమవుతున్నారు.

అంతకు ముందే గేట్ల వద్ద ఉన్న చెత్తను జీహెచ్‌ఎంసీ సిబ్బంది తొలగించే పనిలో పడ్డారు. గేట్లు ఎత్తివేసిన తరువాత పైపులలో వరద నీరు వెళ్ళేటప్పుడు చెత్త అడ్డంకిగా లేకుండా సిబ్బంది తొలగిస్తోంది.

ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ డీఈ పవన్ కుమార్ ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతం నుంచి సరూర్‌నగర్ చెరువులో నీరు ఎక్కువగా వచ్చి చేరుతోందన్నారు.

గేట్లు ఎత్తివేతవేయడానికి ముందు చెత్తను తొలగిస్తున్నామని తెలిపారు. మొత్తం ఏడు గేట్లలో నాలుగు గేట్లను తెరువనున్నట్లు చెప్పారు. జిల్లాలగూడ, మీర్‌ పేట్, భైరామల్‌గూడ చెరువులతో పాటు పలు కాలనీలో నుంచి నీరు చెరువులోకి వచ్చి చేరుతున్నాయన్నారు.

దీంతో ముందు జాగ్రత్తగా మూడు గేట్లను ఎత్తామన్నారు. ఇక్కడి నుంచి మూసిలోకి నీరు వెళ్తుందని చెప్పారు.

రాత్రి చెరువుపై భాగంలో ఉన్న కాలనీలలో నీరు భారీగా వచ్చిచేరిందని పవన్ కుమార్ తెలిపారు...

ఆకాశం మెరిసింది చేను సేలక మురిసింది

చాలారోజులుగా చినుకు రాక కోసం ఎదురుచూసిన రాష్ట్రం.. ఇప్పుడు వానజల్లులో తడిసి ముద్దవుతున్నది. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కమ్మేసింది.

72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల ఆనందం అంతా ఇంతా కాదు. సాగు పనులు ఊపందుకోగా, వరినాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఓవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటం.. మరోవైపు రానున్న 5 రోజులు మరిన్ని వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

వర్ష తీవ్రతపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాలతో అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల పరిధిలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది....

పోలీసులే ఆ ముఠాకు అప్పగించారు! : మణిపూర్‌ బాధిత మహిళల వెల్లడి

మణిపూర్ :జులై 21

రెండు మాసాలుగా హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బుధవారం రాత్రి వెలుగు చూసిన ఒక వీడియోపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగిలాయి. రాజకీయ పార్టీలు, నేతలే కాకుండా సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించింది.

కొంతమంది అల్లరి మూక కుకీ తెగకు చెందిన 20, 40 ఏళ్ల వయసులో ఉన్న ఇద్దరు మహిళలను బి ఫైనమ్‌ గ్రామ సమీపంలో నగ్నంగా రోడ్డుపై నడిపించుకుంటూ సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. వారిలో కొంతమంది ఆ ఇద్దరి శరీర భాగాలు అసభ్యంగా తడుముతూ బలవంతంగా నెట్టుకుంటూ తీసుకెళుతున్నారు.

మే 4న ఈ ఘటన జరగగా, మే 18 న దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులే తమను ఆ దుండగులకు అప్పగించారని మణిపూర్‌ బాధిత మహిళల్లో ఒకరు ప్రముఖ ఛానల్ కు ఫోన్‌లో తెలిపారు. మా గ్రామంపై దాడి చేసిన అల్లరి మూకతోనే పోలీసులు కూడా వునాురు. మమ్మల్ని ఇంటికి సమీపం నుంచి తీసుకెళ్లిన పోలీసులు కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డుపై ఆ అల్లరి మూక దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులే మమ్మల్ని వారికి అప్పగించారు.

తమిద్దరిలో చిన్నదైన మహిళపై పట్టపగలే దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మరో మహిళ తెలిపింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని తమ గ్రామంపై దాడి జరగడంతో తామందరం ఆశ్రయం కోసం సమీపంలోని అడవుల్లోకి పారిపోయామని చెప్పారు.

పోలీసులు తమను పోలీసు స్టేషన్‌కుతీసుకువస్తుండగా, స్టేషన్‌కురెండు కిలోమీటర్ల దూరంలో అల్లరి మూక అటకాయించి మమ్మల్ని లాక్కెళ్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా అయిదుగురు ఆ గ్రూపులో వున్నారని చెప్పారు. యువ మహిళ తండ్రి, సోదరుడినికూడా ఈ మూక చంపేసినట్లు ఆమె తెలిపారు. ఆ గ్రూపులో కొద్దిమందిని గుర్తు పట్టగలనని బాధిత మహిళ తెలిపారు. వారిలో ఒకరు తన సోదరుడి స్నేహితుడిగా తెలుసునని చెప్పారు.

తమని ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి వీడియో వుందన్న విషయం కూడా తమకు తెలియదని బాధిత మహిళ తెలిపారు. తాజాగా ఈ వీడియో వైరల్‌ అవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఇద్దరు అరెస్టు

ఈ ఘటనపై గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఘటన జరిగిన రెండు మాసాల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు....

గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి..

భద్రాచలం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా..

పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ సూచిస్తున్నారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.

తూర్పుగోదావరి గంటగంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం10.80 అడుగులకు చేరుకుంది.

175 గేట్లను అధికారులు ఇప్పటికే ఎత్తివేశారు. 8.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. విలీన మండలాల్లో శబరి నది పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.

Earthquake: జైపుర్‌లో భూకంపం.. ఉలిక్కిపడిన ప్రజలు..

జైపుర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ (Jaipur)లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..

ఉదయం 4 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు..

కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది..

రామడుగులో అత్యధికం వర్ష పాతం నమోదు

కరీంనగర్ జిల్లా:జులై 21

రామడుగు మండలంలో శుక్రవారం ఉదయం రాష్ట్రం లొనే అత్యధిక వర్ష పాఠం నమోదయింది. రామడుగులో 21. 35 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకగా గంగాధర లో 14. 38 సెంటి మీటర్లు గా నమోదయింది. భారీ వర్షంతో అధికారులు అప్రమత్తమైనారు..

SB MEWS

SB NEWS

SB NEWS

"SB NEWS*

తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్

హైదరాబాద్:జులై 21

తెలంగాణ పోలీసు శాఖ లో 51 మంది డీఎస్పీలు గా నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీలు

1)మహంకాళి ఏసీపీగా రవీందర్

2)వనస్థలిపురం ఏసీపీగా భీమ్రెడ్డి

3)గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి

4)సిరిసిల్ల డీఎస్పీగా ఉదయ్‌రెడ్డి

5)మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి

6)రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా మురళీకృష్ణ

7)భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీగా ప్రభాకర్‌రెడ్డి

8)కామారెడ్డి డీఎస్పీగా ప్రకాష్‌

9)బాలానగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా రమేష్‌

10)బేగంపేట ఏసీపీగా రామలింగరాజు

11)పేట్‌బషీరాబాద్‌ ఏసీపీగా రఘునందన్‌రావు

12)అబిడ్స్‌ ఏసీపీగా ఆకుల చంద్రశేఖర్‌

13)ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా సదయ్య

14)చాంద్రాయణగుట్ట ఏసీపీగా అంజయ్య

15)మహేశ్వరం ఏసీపీగా బుర్ర శ్రీనివాస్

16)సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా మురళీధరప్రసాద్

మొత్తం 51 మంది డీఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. చాన్నాళ్లుగా పోస్టింగుల కోసం వీరు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు...

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది

తిరుపతి :జులై 21

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

ఇక గురువారం నాడు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది గురువారం నాడు 63,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

SB NEWS