/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz ఆకాశం మెరిసింది చేను సేలక మురిసింది Yadagiri Goud
ఆకాశం మెరిసింది చేను సేలక మురిసింది

చాలారోజులుగా చినుకు రాక కోసం ఎదురుచూసిన రాష్ట్రం.. ఇప్పుడు వానజల్లులో తడిసి ముద్దవుతున్నది. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కమ్మేసింది.

72 గంటలుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల ఆనందం అంతా ఇంతా కాదు. సాగు పనులు ఊపందుకోగా, వరినాట్లు జోరుగా సాగుతున్నాయి.

ఓవైపు ప్రాజెక్టుల్లోకి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండటం.. మరోవైపు రానున్న 5 రోజులు మరిన్ని వర్షాలు ఉంటాయని వాతావరణశాఖ హెచ్చరిస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

వర్ష తీవ్రతపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్నారు. యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు.

ప్రభుత్వ ఆదేశాలతో అన్ని శాఖలు అప్రమత్తమయ్యాయి. విపత్తు నిర్వహణ బృందాలను రంగంలోకి దింపిన ప్రభుత్వం.. ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా వివిధ శాఖల పరిధిలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది....

పోలీసులే ఆ ముఠాకు అప్పగించారు! : మణిపూర్‌ బాధిత మహిళల వెల్లడి

మణిపూర్ :జులై 21

రెండు మాసాలుగా హింసాకాండ, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో బుధవారం రాత్రి వెలుగు చూసిన ఒక వీడియోపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగిలాయి. రాజకీయ పార్టీలు, నేతలే కాకుండా సుప్రీం కోర్టు కూడా తీవ్రంగా స్పందించింది.

కొంతమంది అల్లరి మూక కుకీ తెగకు చెందిన 20, 40 ఏళ్ల వయసులో ఉన్న ఇద్దరు మహిళలను బి ఫైనమ్‌ గ్రామ సమీపంలో నగ్నంగా రోడ్డుపై నడిపించుకుంటూ సమీపంలోని పొలాల వద్దకు తీసుకెళ్లడం ఆ వీడియోలో కనిపిస్తోంది. వారిలో కొంతమంది ఆ ఇద్దరి శరీర భాగాలు అసభ్యంగా తడుముతూ బలవంతంగా నెట్టుకుంటూ తీసుకెళుతున్నారు.

మే 4న ఈ ఘటన జరగగా, మే 18 న దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. పోలీసులే తమను ఆ దుండగులకు అప్పగించారని మణిపూర్‌ బాధిత మహిళల్లో ఒకరు ప్రముఖ ఛానల్ కు ఫోన్‌లో తెలిపారు. మా గ్రామంపై దాడి చేసిన అల్లరి మూకతోనే పోలీసులు కూడా వునాురు. మమ్మల్ని ఇంటికి సమీపం నుంచి తీసుకెళ్లిన పోలీసులు కొంత దూరం వెళ్లిన తర్వాత రోడ్డుపై ఆ అల్లరి మూక దగ్గర వదిలేసి వెళ్లిపోయారు. పోలీసులే మమ్మల్ని వారికి అప్పగించారు.

తమిద్దరిలో చిన్నదైన మహిళపై పట్టపగలే దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని మరో మహిళ తెలిపింది. కాంగ్‌పోక్పి జిల్లాలోని తమ గ్రామంపై దాడి జరగడంతో తామందరం ఆశ్రయం కోసం సమీపంలోని అడవుల్లోకి పారిపోయామని చెప్పారు.

పోలీసులు తమను పోలీసు స్టేషన్‌కుతీసుకువస్తుండగా, స్టేషన్‌కురెండు కిలోమీటర్ల దూరంలో అల్లరి మూక అటకాయించి మమ్మల్ని లాక్కెళ్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తంగా అయిదుగురు ఆ గ్రూపులో వున్నారని చెప్పారు. యువ మహిళ తండ్రి, సోదరుడినికూడా ఈ మూక చంపేసినట్లు ఆమె తెలిపారు. ఆ గ్రూపులో కొద్దిమందిని గుర్తు పట్టగలనని బాధిత మహిళ తెలిపారు. వారిలో ఒకరు తన సోదరుడి స్నేహితుడిగా తెలుసునని చెప్పారు.

తమని ఇలా నడిపించుకుంటూ తీసుకెళ్లిన ఘటనకు సంబంధించి వీడియో వుందన్న విషయం కూడా తమకు తెలియదని బాధిత మహిళ తెలిపారు. తాజాగా ఈ వీడియో వైరల్‌ అవడంతో దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు రగులుతున్నాయి.

ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఇద్దరు అరెస్టు

ఈ ఘటనపై గురువారం దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు తలెత్తిన నేపథ్యంలో తక్షణమే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఘటన జరిగిన రెండు మాసాల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఇద్దరిని అరెస్టు చేశారు. మిగిలిన వారిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు....

గోదావరి నదికి పెరుగుతున్న వరద ఉధృతి..

భద్రాచలం: మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గోదావరికి వరద ఉధృతి పెరుగుతోంది. నేడు భద్రాచలం వద్ద నీటిమట్టం 43.9 అడుగులకు చేరుకోగా..

పోలవరం వద్ద 11.97 మీటర్లకు చేరుకుంది. ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 8.48 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కాబట్టి నేడు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. వరద ఉధృతిని ఎప్పటికప్పుడు విపత్తుల సంస్థ పర్యవేక్షిస్తోంది.

గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ ఎండీ సూచిస్తున్నారు. సహాయక చర్యల్లో అధికారులకు సహకరించాలని కోరుతున్నారు.

తూర్పుగోదావరి గంటగంటకూ గోదావరి వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం10.80 అడుగులకు చేరుకుంది.

175 గేట్లను అధికారులు ఇప్పటికే ఎత్తివేశారు. 8.50 లక్షల క్యూసెక్కుల వరద నీటిని దిగువకు విడుదల చేశారు. విలీన మండలాల్లో శబరి నది పొంగి ప్రవహిస్తోంది. మరోవైపు వాగులన్నీ పొంగి ప్రవహిస్తున్నాయి.

Earthquake: జైపుర్‌లో భూకంపం.. ఉలిక్కిపడిన ప్రజలు..

జైపుర్‌: రాజస్థాన్‌ రాజధాని జైపుర్‌ (Jaipur)లో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం (Earthquake) సంభవించింది. దీంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు..

ఉదయం 4 గంటల ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. రిక్టర్‌స్కేలుపై దీని తీవ్రత 4.4గా నమోదైనట్లు నేషనల్‌ సిస్మాలజీ సెంటర్‌ తెలిపింది.

10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. గాఢనిద్రలో ఉన్నప్పుడు భూమి ఒక్కసారిగా కంపించడంతో ప్రజలంతా ఏం జరుగుతుందో తెలియక భయాందోళనకు గురయ్యారు..

కొంతమంది వీధుల్లోకి పరుగులు తీశారు. అయితే, ప్రస్తుతానికి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని తెలుస్తోంది..

రామడుగులో అత్యధికం వర్ష పాతం నమోదు

కరీంనగర్ జిల్లా:జులై 21

రామడుగు మండలంలో శుక్రవారం ఉదయం రాష్ట్రం లొనే అత్యధిక వర్ష పాఠం నమోదయింది. రామడుగులో 21. 35 సెంటి మీటర్ల వర్షపాతం నమోదుకగా గంగాధర లో 14. 38 సెంటి మీటర్లు గా నమోదయింది. భారీ వర్షంతో అధికారులు అప్రమత్తమైనారు..

SB MEWS

SB NEWS

SB NEWS

"SB NEWS*

తెలంగాణలో 51 మంది డీఎస్పీలకు పోస్టింగ్స్

హైదరాబాద్:జులై 21

తెలంగాణ పోలీసు శాఖ లో 51 మంది డీఎస్పీలు గా నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ అంజనీ కుమార్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

పోస్టింగ్‌లు పొందిన డీఎస్పీలు

1)మహంకాళి ఏసీపీగా రవీందర్

2)వనస్థలిపురం ఏసీపీగా భీమ్రెడ్డి

3)గోషామహల్ ఏసీపీగా వెంకట్రెడ్డి

4)సిరిసిల్ల డీఎస్పీగా ఉదయ్‌రెడ్డి

5)మాదాపూర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా రణ్‌వీర్‌రెడ్డి

6)రాజేంద్రనగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా మురళీకృష్ణ

7)భువనగిరి ట్రాఫిక్‌ ఏసీపీగా ప్రభాకర్‌రెడ్డి

8)కామారెడ్డి డీఎస్పీగా ప్రకాష్‌

9)బాలానగర్‌ ట్రాఫిక్‌ ఏసీపీగా రమేష్‌

10)బేగంపేట ఏసీపీగా రామలింగరాజు

11)పేట్‌బషీరాబాద్‌ ఏసీపీగా రఘునందన్‌రావు

12)అబిడ్స్‌ ఏసీపీగా ఆకుల చంద్రశేఖర్‌

13)ఉస్మానియా యూనివర్సిటీ ఏసీపీగా సదయ్య

14)చాంద్రాయణగుట్ట ఏసీపీగా అంజయ్య

15)మహేశ్వరం ఏసీపీగా బుర్ర శ్రీనివాస్

16)సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఏసీపీగా మురళీధరప్రసాద్

మొత్తం 51 మంది డీఎస్పీలను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. చాన్నాళ్లుగా పోస్టింగుల కోసం వీరు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు విడుదల కావడంతో పోలీసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు...

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది

తిరుపతి :జులై 21

తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ బాగా పెరిగింది. వీకెండ్ కావడంతో భక్తులతో క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ నిండి క్యూలైన్లు వెలుపలికి వచ్చాయి.

ఇక గురువారం నాడు స్వామి వారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పట్టింది గురువారం నాడు 63,628 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. స్వామివారికి 33,548 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

SB NEWS

SB NEWS

9 ఏండ్లలో యువతకు 30 లక్షల ఉద్యోగాలు లభించాయి... : ఎమ్మెల్సీ కవిత

తెలంగాణ ప్రభుత్వం అవలంబిస్తున్న పారదర్శక విధానాల వల్ల గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్రానికి 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు వచ్చాయని, దానితో 30 లక్షల మంది యువతకు ఉద్యోగాలు లభించాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.

రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ గా గురువారం నియమితులైన మఠం భిక్షపతి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో కవిత పాల్గొన్నారు. కార్పొరేషన్ చైర్మన్ గా నియమితుడైన భిక్షపతికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ..కష్టపడి పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయనడానికి భిక్షపతి నిదర్శనమని తెలిపారు. గ్రామ స్థాయిలో కార్యకర్తగా పనిచేసిన భిక్షపతిని గుర్తించి సీఎం కేసీఆర్ రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ పదవి ఇవ్వడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆంథోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ను భారీ మెజారిటీతో గెలిపించడానికి భిక్షపతి చేయుత, పదవి ఉపయోగపడుతుందని తాను విశ్వసిస్తున్నానని చెప్పారు.

రాష్ట్రం ఏర్పడిన తర్వాత పరిశ్రమల రంగంలో దూసుకెళ్తున్నామని, దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉన్నామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నా కూడా ప్రైవేటు రంగంలో లక్షలాది ఉద్యోగాల కల్పన చేస్తున్నామని వివరించారు. పరిశ్రమల శాఖ పారదర్శకమైన విధానం వల్ల దేశం ఎక్కడా లేని విధంగా గత 9 ఏళ్లలో 47 బిలియన్ కోట్ల పెట్టుబడులు తెలంగాణకు వచ్చాయని, దాని వల్ల 30 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు వచ్చాయని పేర్కొన్నారు.

ఉత్పత్తులను ఎగుమతులు చేసుకోడానికి పారిశ్రామికవేత్తలకు ఈ కార్పొరేషన్ వెన్నుదన్నుగా పనిచేస్తుందని అన్నారు. కరోనా కన్నా ముందు రూ. 30 కోట్ల ఆదాయం ఉన్న కార్పొరేషన్ ప్రస్తుతం రూ. 130 కోట్ల లాభాల్లో ఉందని, ఈ మొత్తం రూ. 1500 కోట్లకు చేరుకుంటుందన్న నమ్మకం తనకు ఉందని చెప్పారు. తెలంగాణ ప్రజలు బాగుండాలనే సిద్ధాంతంతో పనిచేసే విధానం తమదని, ఈ కార్పొరేషన్ ను మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాలని భిక్షపతికి కవిత సూచించారు...

తీరనున్న అంజన్న భక్తుల కష్టాలు

జగిత్యాల జిల్లా:జులై 20

కొండగట్టు ఆంజనేయ స్వామి భక్తుల కోనేరు కష్టాలు తీరనున్నాయి. అధిక భారంతో భగీరథ నీటిని కోనేరులో నింపడానికి ఆలయ అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు.

మురుగు నీటిలో స్నానం ఆచరిస్తూ భక్తుల ఇక్కట్లు చెప్పనక్కర్లేదు. ఇందుకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలంటూ భక్తుల కోరిక ఆలయ అధికారుల విన్నపం సంతులోని లొద్ది లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా స్థానిక ఎమ్మెల్యే శ్రీకారం చుట్టారు.

దీనికి సంబంధించిన శంకుస్థాపన మరియు భూమి పూజ గురువారం రోజున రాష్ట్ర ప్రణాళిక వైస్ ప్రెసిడెంట్ వినోద్ కుమార్, శాసనమండలి సభ్యుడు ఎల్.రమణ, సంక్షేమ శాఖ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, జడ్పీ చైర్ పర్సన్ పాల్గొన్నారు.

గురువారం రోజున మల్యాల మండలం కొండగట్టు ఆలయానికి నీటి సౌకర్యం కోసం ఎత్తిపోతల పథకం పనులకు భూమి పూజ నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొండగట్టు ఆలయ అభివృద్దికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటించిన కార్యక్రమంలో భాగంగా రూ.13.43 కోట్లతో ముగ్దూంపేట గ్రామ సమీపంలోని ఇందిరమ్మ ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి నీటిని గుట్టపైకి ఎత్తిపోసే పనులను ప్రారంభించారు. రానున్న 2, 3 నెలల్లో పనులు పూర్తి చేసి భక్తులకు శాశ్వత పరిష్కారం కల్పించనున్నామని తెలిపారు....

ప్రభుత్వ కార్యాలయాలకు సెలవులు ప్రకటించిన తెలంగాణ సర్కార్

భారీ వర్షాలతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ గురువారం నిర్ణయం తీసుకుంది..

రేపు ఎల్లుండి అన్ని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది. ప్రైవేటు సంస్థలకు సైతం సెలవు ప్రకటించేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు...

SB NEWS

SB NEWS

SB NEWS