/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పోలీస్ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలి..క‌మిష‌న‌ర్ శ్వేత పిలుపు Yadagiri Goud
పోలీస్ సిబ్బంది అప్ర‌మ‌త్తంగా ఉండాలి..క‌మిష‌న‌ర్ శ్వేత పిలుపు

సిద్దిపేట జిల్లా :జులై 20

జిల్లాలో గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజల అప్రమత్తంగా ఉండాలని పోలీస్ కమిషనర్ శ్వేత కోరారు.

పోలీస్ అధికారులు సిబ్బంది అందుబాటులో ఉండేలా అప్రమత్తం చేయడం జరిగిందన్నారు. వాగుల, చెరులు, నిండుకుండలా నిండి ప్రవహిస్తున్నాయి మరియు ప్రాజెక్టుల దగ్గరికి ఎవరు వెళ్ళవదనీ ప్రజలకు సూచించారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న చెరువులు, కుంటల నీటి ప్రవాహం గురించి అన్ని జాగ్రత్త చర్యలు తీసుకొని ప్రత్యక్షంగా వెళ్లి పర్యవేక్షించాలని, సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులను గురువారం సమావేశపరిచి సమన్వయంతో కలిసి పనిచేయాలని ఆమె కోరారు..

జిల్లాలో ఎక్కడైనా వరద ఉధృతో రోడ్లు తెగిపోయిన, ఉదృతంగా ప్రవహించేనా అక్కడికి ఆ గ్రామ ప్రజలు వెళ్లవద్దని, రెండు దిక్కులా ప్లాస్టిక్ కోన్స్, రోడ్స్ టాపర్స్ , తాడు మరే ఇతర పరికరాలు అడ్డంపెట్టి సంబంధిత గ్రామల సర్పంచులకు ప్రజలకు తెలియజేయాలని సూచించారు. గ్రామాల సర్పంచులతో ఎప్పటికప్పుడు వరద ఉధృతి గురించి అడిగి తెలుసుకోవాలని సూచించారు.

ఎట్టి పరిస్థితుల్లో పోలీస్ అధికారులు సిబ్బంది హెడ్క్వార్టర్ వదిలి వెళ్లవద్దని తెలిపారు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు...

కిషన్‌రెడ్డి, రఘునందన్‌ అరెస్ట్

బాట సింగారంకు బయలుదేరిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.

ఈరోజు ఉదయం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చిన కిషన్‌రెడ్డి శంషాబాద్‌ఎయిర్‌ పోర్టు నుంచి ఎమ్మెల్యే రఘునందన్ రావుతో కలిసి బాటసింగారంకు బయలుదేరారు.

బాట సింగారంలో డబుల్ బెడ్రూం ఇళ్ళను పరిశీలించేందుకు కేంద్రమంత్రి అక్కడకు పయనమయ్యారు. అయితే కేంద్రమంత్రి అయిన కిషన్‌రెడ్డిని అడ్డుకుంటారా?లేదా? అన్న అనుమానాలను పటా పంచలు చేస్తూ.. ఎయిర్‌ పోర్టు పరిధి దాటగానే వాహనాలను అడ్డుపెట్టి మరీ కేంద్రమంత్రి కాన్వాయ్‌ను పోలీసులు ఆపేశారు.

దీంతో పోలీసులతో కిషన్ రెడ్డి, రఘునందనరావు వాగ్వివాదానికి దిగారు. అధికారిక కార్యక్రమం కాదు కాబట్టి.. కేంద్రమంత్రిని అడ్డుకున్నామని పోలీసులు చెబుతున్నారు.

పోలీసుల తీరుపై బీజేపీ శ్రేణులు, నాయకులు భగ్గుమంటున్నారు. చివరకు బలవంతంగా కిషన్‌రెడ్డి, రఘునందన్‌రావును పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ ఘటనతో శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది...

గిడ్డంగుల సంస్థ చైర్ ప‌ర్స‌న్ గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన.. రజనీ

ప్రముఖ ఉద్యమ గాయకుడు,దివంగ‌త నేత సాయిచంద్‌ సతీమణి రజనీ గిడ్డంగుల సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

గురువారం గిడ్డంగుల కార్యాలయంలోని ఛాంబర్‌లో బాధ్యతలు స్వీకరించగా, మంత్రులు హరీశ్‌ రావు, నిరంజన్‌ రెడ్డి, నిజామాబాద్‌ ఎమ్మెల్సీ కవిత, రాష్ట్ర ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌,

చైర్మన్లు ఆంజనేయులు గౌడ్‌, ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎమ్మెల్యే భగత్‌తోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, భారత్‌ రాష్ట్ర సమితి నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ రజనీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తమ కుటుంబానికి అండగా నిలిచారన్నారు. తనపై నమ్మకముంచి బాధ్యతలు అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

తమ కుటుంబం ముఖ్యమంత్రి కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో పాటు భారత్‌ రాష్ట్ర సమితికి ఎప్పుడు మా కుటుంబం రుణపడి ఉంటుందన్నారు...

బిజెపి పాలిత మణిపూర్లో మహిళల నగ్న ఊరేగింపు ఘటనపై సుప్రీంకోర్టు ఆగ్రహం..

ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోకుంటే తామే తీసుకుంటామని హెచ్చరిక

మణిపూర్ వీడియో తమను తీవ్రంగా కలచివేసిందన్న సీజేఐ

ఘటనపై సుమోటాగా విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం

మణిపూర్‌లో ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి లైంగిక దాడులకు గురిచేస్తున్న భయానక వీడియో ఘటనపై సుప్రీంకోర్టు గురువారం సుమోటోగా విచారణ చేపట్టింది.

నేరస్తులపై చట్ట ప్రకారం తీసుకున్న చర్యలను కోర్టుకు తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.

భారత అటార్నీ జనరల్‌ ఆర్‌ వెంకటరమణి, సొలిసిటర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా తుషార్‌ మెహతా విచారణకు హాజరు కావాలని ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ సూచించారు. 

ఈ ఉదయం కోర్టు సమావేశమైనప్పుడు, ఏజీ, ఎస్జీ లను ఉద్దేశించి మాట్లాడిన ప్రధాన న్యాయమూర్తి ‘ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోల గురించి తెలిసి మేం చాలా బాధపడ్డాం.

దీనిపై తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. కలహాల ప్రాంతంలో లింగ హింసను ప్రేరేపించడానికి మహిళలను సాధనంగా ఉపయోగించడం తీవ్ర కలత కలిగిస్తోంది.

ఇది అత్యంత ఘోరమైన మానవ హక్కుల ఉల్లంఘన’ అని పేర్కొన్నారు. 

 

ఈ వీడియో మే 4వ తేదీ నాటిదని కోర్టుకు తెలుసన్న సీజేఐ దాని వల్ల తమ అభిప్రాయంలో ఎలాంటి తేడా ఉండదన్నారు.

‘దీనిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వానికి మేం కొంత సమయం ఇస్తాం, లేకుంటే మేమే చర్యలు తీసుకుంటాము’ అని సీజేఐ హెచ్చరించారు.

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక!

Bhadrachalam: భద్రాచలం వద్ద ఉద్ధృతంగా గోదావరి.. ఈ సాయంత్రానికి మొదటి ప్రమాద హెచ్చరిక!

భద్రాచలం: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఇవాళ ఉదయం 11 గంటలకు నీటిమట్టం 41.3 అడుగులు దాటి ప్రవహిస్తోంది.

నీటిమట్టం 43 అడుగులకు చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయనున్నారు..

భారీగా కురిసిన వర్షానికి రామాలయం పరిసరాల్లోకి వర్షపు నీరు చేరడంతో భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు.

మరోవైపు అన్నదాన సత్రం వద్దకు వరద నీరు చేరడంతో అన్నదాన కార్యక్రమాన్ని నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది..

నిజంనిప్పులాంటిది

శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్ రూమ్

శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత..
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉద్రిక్తత.. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డిని అడ్డుకున్న పోలీసులు వర్షంలో రోడ్డుపై బైఠాయించిన కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు డబుల్ బెడ్ రూమ్ పరిశీలనకు వెళుతుంటే ఔటర్ రింగురోడ్డు వద్ద కాన్వాయ్‌ని అడ్డుకున్న పోలీసులు. పోలీసులకు బిజెపి కార్యకర్తలకు మధ్య వాగ్వాదం. కేసీఆర్ జైళ్లు సిద్ధం చేసుకోండి. మేమంతా సిద్ధం అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు.
నిర్బంధ అరెస్టులు మాకు కొత్తేమి కాదు: ఈటల రాజేందర్

నిర్బంధించినంత మాత్రాన తమ పోరాటం ఆగదని, తమకు అరెస్టులు, నిర్బంధాలు కొత్త కాదని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు.

బాటసింగారంలో డబుల్ బెడ్ రూం ఇళ్ళను పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ నేతలను అరెస్టులు, హౌస్ అరెస్టులు చేయడాన్ని గురువారం ఈటల రాజేందర్ తీవ్రంగా ఖండించారు.

ప్రతిసారీ అధికార పార్టీకి ఇది ఒక అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతిపక్షాలకు ఉందన్నారు. ప్రజాసమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చే బాధ్యత ప్రతిపక్షాలుగా తమపై ఉందన్నారు.

కానీ కేసీఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని ఈటల మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్ తన తీరు మార్చుకోవాలని, లేదంటే బీఆర్ఎస్‌ను ప్రజలు మార్చడం ఖాయమని హెచ్చరించారు.

డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తా అని చెప్పి మోసం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ది చెప్తారని హెచ్చరించారు. అరెస్ట్ చేసిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అందరినీ వెంటనే బేషరుతుగా విడుదల చేయాలని ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు....

భైంసాలో యువకుడిపై గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి

నిర్మల్ జిల్లా:జులై 20

బైంసా పట్టణంలో కత్తిపోట్ల కలకలం చెలరేగింది. బుధవారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగినట్టు తెలిసింది

పట్టణంలోని గోపాల్ నగర్ కాలనీకి చెందిన తోట శంకర్ (30) అనే వ్యక్తిపై అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగుడు కత్తితో దాడికి పాల్పడ్డాడు. అర్ధరాత్రి వేళ సదరు వ్యక్తి బైక్ పై గోపాల్ నగర్ కాలనీకి వచ్చి తోట శంకర్ ను బయటకు పిలిచినట్లుగా సమాచారం.

నిద్ర నుంచి మేల్కొని ఇంటి తలుపు తీసుకొని బయటకు వచ్చిన యువకునిపై సదరు వ్యక్తి కత్తితో విచక్షణరహితంగా దాడికి పాల్పడ్డట్లుగా తెలిసింది.

ఇక.. బాదితుడు అరుపులు కేకలు వేయడంతో సమీపంలో ఉన్నవారు బయటికి వచ్చేసరికి దీంతో దాడికి పాల్పడ్డ వ్యక్తి తాను తీసుకవచ్చిన బైక్ ను అక్కడే వదిలి పారిపోయినట్లుగా తెలుస్తోంది.

గాయాలపాలైన తోట శంకర్ ను కాలనీకి వాసులు హుట హూటిన స్థానిక ఏరియా అసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ ఆసుపత్రి కి తరలించినట్లుగా తెలిసింది. ఈ సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి బైకు ను స్వాధీన పరచుకున్నారు. నిందితుడు ఎవరన్న దానిపై ఆరా తీస్తున్నారు....

Pawan Kalyan: జేపీ నడ్డాతో పవన్‌ కల్యాణ్‌ భేటీ..

దిల్లీ: భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ భేటీ అయ్యారు.

నేడు నడ్డాను కలిశారు. వీరిద్దరి భేటీ సుమారు గంటకు పైగా కొనసాగింది.

ఏపీలో తాజా రాజకీయ పరిస్థితులు, భాజపా రాష్ట్ర సారథి మార్పు తర్వాతి పరిణామాలు, ఎన్నికలకు సమాయత్తం తదితర అంశాలపై నడ్డా, పవన్‌ చర్చించినట్లు సమాచారం.

రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులను కూడా నడ్డా దృష్టికి పవన్‌ తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

SB NEWS

Manipur : మణిపూర్‌లో మహిళల ఊరేగింపు.. ఏ నాగరికతకైనా ఇది సిగ్గుచేటు అని మోదీ ఆగ్రహం..

న్యూఢిల్లీ : మణిపూర్‌లో ఇద్దరు మహిళలను దారుణంగా, నగ్నంగా ఊరేగించిన సంఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) గురువారం ఘాటుగా స్పందించారు..

ఈ అమానుష సంఘటన తనను తీవ్రంగా కలచివేసిందని, బాధించిందని చెప్పారు. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటుకు రావడానికి ముందు తన మనసు బాధ, ఆగ్రహంతో నిండిపోయాయని చెప్పారు.

ఏ నాగరికతకైనా ఈ సంఘటన సిగ్గుచేటు అని స్పష్టం చేశారు. ఇది దేశానికి అవమానకరమని చెప్పారు. నేరాలపై, మరీ ముఖ్యంగా మహిళలపై జరిగే నేరాలపై కఠిన చర్యలు తీసుకోవడానికి వీలుగా చట్టాలను బలోపేతం చేయాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను కోరారు.

ఇటువంటి సంఘటనలు రాజస్థాన్‌లో జరిగినా, ఛత్తీస్‌గఢ్ లేదా మణిపూర్‌లో జరిగినా నిందితులు దేశంలో ఏ మూలలో ఉన్నా, శిక్ష నుంచి తప్పించుకోకూడదన్నారు.

ఏ నిందితుడినీ వదిలిపెట్టేది లేదని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానని చెప్పారు. మణిపూర్ బిడ్డలకు జరిగిన అన్యాయానికి కారకులైనవారిని క్షమించేది లేదని స్పష్టం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా మోదీ గురువారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ ఈ భరోసా ఇచ్చారు..