/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు.. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 17:08

వాతావరణ శాఖ మరో హెచ్చరిక.. మరో మూడు రోజుల్లో మరో ముప్పు..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాల వర్షాలు కురుస్తున్నాయి. శని, ఆదివారాల్లో కురిసిన భారీ వర్షాలు సోమవారం నాటికి తగ్గుముఖం పట్టినా ముసురు మాత్రం ఎడతెరిపి లేకుండా పోతోంది. సోమవారం రాత్రి 9 గంటల వరకు నగరంలోని నాగోల్‌లో అత్యధికంగా 1.33 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీరం దాటిన వాయుగుండం 12 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల మరో మూడు రోజులు గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు తెలిపారు. కాగా.. నేటి నుంచి వచ్చే 4 రోజుల వరకు రాష్ట్రవ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. హైదరాబాద్‌లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. దీంతో తెలంగాణకు ఐఎండీ ఎల్లో అలర్ట్ ప్రకటించింది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయితే ఈరోజు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అలాగే ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం..

మరోవైపు ఏపీ, తెలంగాణలకు భారత వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. మరో మూడు రోజుల్లో మరో ముప్పు వుందని వాతావరణ శాఖ హెచ్చరింది. అంటే సెప్టెంబర్ 5 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ ఉపరితల ద్రోణి రాజస్థాన్‌లోని జైసల్మేర్ నుంచి తెలంగాణ మీదుగా కొనసాగుతుందని అధికారులు వివరించారు. కోస్తాంధ్ర కోస్తాకు అతి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఏపీ, తెలంగాణల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 17:03

బీఆర్ఎస్ మాజీ మంత్రులపై దాడి..

తెలంగాణలో నాలుగు రోజులుగా భారీ వర్షాలు పడుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వానలతో ఖమ్మం జిల్లాలోని మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో పలు కాలనీలు జలమయం అయ్యాయి. కాలనీల్లోని ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బాధితులను ప్రభుత్వం అండగా నిలిచి సహాయ కార్యక్రమాలు చేపట్టింది. అయితే ఈరోజు(మంగళవారం) బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఖమ్మం జిల్లాలోని ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.

అయితే ఈ పర్యటనలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాహనంపై కొంతమంది వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో బీఆర్ఎస్ నేతలకు గాయాలు అయ్యాయి. ఒకరికి కాలు విరగడంతో ఆస్పత్రికి తరలించారు. దాడి జరిగిన మంచి కంటి నగర్‌లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఖమ్మంలో బీఆర్ఎస్ నేతలపై దాడిని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈరోజు కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు.

బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్‌రావు, పువ్వాడ అజయ్ కుమార్, సబితా ఇంద్రారెడ్డి వాహనాలపై దాడి చేయటం కాంగ్రెస్ అసహనానికి నిదర్శనమని మండిపడ్డారు. ప్రజలకు సాయం చేయటం చేతగాక.. సాయం చేస్తున్న నేతలను చూసి ఓర్వలేకే ఈ దాడికి తెగబడ్డారని విమర్శలు చేశారు. ప్రభుత్వం ప్రజలను నిర్లక్ష్యం చేస్తే వారికి తాము అండగా ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. ప్రజలకు సేవ చేయటం చేతకాదు...సేవ చేసే వాళ్లపై మాత్రం దాడి చేయటం? సిగ్గు చేటు అని అన్నారు.

ఈ దాడికి ముఖ్యమంత్రితో సహా కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి దాడులు ఎన్ని చేసినా సరే...ప్రజల వద్దకు బీఆర్ఎస్ శ్రేణులను వెళ్లకుండా ఆపలేరని హెచ్చరించారు. కాంగ్రెస్ చేతగాని, దద్దమ్మ పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి సరైన సమయంలో బుద్ధి చెప్పటం ఖాయమని కేటీఆర్ వార్నిగ్ ఇచ్చారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 11:44

విజయవాడ వాసులకు బిగ్ రిలీఫ్.. నెమ్మదిగా శాంతిస్తున్న కృష్ణమ్మ

విజయవాడలో కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తుంది. ప్రకాశం బ్యారేజీకి సోమవారం ఇన్‌ఫ్లో 11 లక్షల క్యూసెక్కులు ఉండగా.. మంగళవారానికి అది 9 లక్షల క్కూసెక్కులకు తగ్గింది. అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. సాయంత్రానికి వరద ఇంకాస్త తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఇటు విజయవాడ నగరంలోనూ వరద నీరు క్రమంగా తగ్గుతోంది. మంగళవారం సాయంత్రానికి చాలాచోట్ల సాధారణ పరిస్థితికి రావొచ్చని అధికారులు భావిస్తున్నారు.

విజయవాడ సింగ్ నగర్‌లో వరద కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయి. ప్రజలు ఇప్పుడిప్పుడే తమ ఇళ్ల నుంచి బయటకు వస్తున్నారు. నిత్యావసరాలు, మంచి నీరు తీసుకెళ్తున్నారు. నాలుగు అడుగుల లోతు నీటిలో కాలనీల నుంచి బయటకు వస్తున్నారు. వరద తగ్గని ప్రదేశాల్లో హెలీకాప్టర్లు, డ్రోన్ల ద్వారా ఆహారం, నీరు, ఇతర నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి. ఈ నేపథ్యంలో.. పలువురు సినీ ప్రముఖులు విరాళాలు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.50 లక్షల చొప్పున జూనియర్ ఎన్టీఆర్‌ విరాళం ప్రకటించారు. ప్రముఖ నిర్మాత అశ్వనీదత్ ఆంధ్రప్రదేశ్ సీఎం రిలీఫ్ ఫండ్ కు తన వంతుగా రూ. 25 లక్షలు విరాళం అందజేశారు. రెండు తెలుగు రాష్ట్రాలకు రూ.5 లక్షల చొప్పున విశ్వక్‌సేన్‌ విరాళం ఇచ్చారు.

విజయవాడ వరద బాధితులకు సింహచలం నుంచి పులిహోర ప్రసాదం తీసుకొస్తున్నారు. 20 వేల పులిహోర ప్యాకెట్లు విజయవాడకు పంపేందుకు ఏర్పాట్లు చేశారు. రైలులో 10 వేల ప్యాకెట్లను ఆలయ అధికారులు పంపారు. మధ్యాహ్నం మరో 10 వేల పులిహోర ప్యాకెట్లు పంపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే విజయవాడకు 10 వేల పులిహోర ప్యాకెట్లు చేరాయి.విజయవాడ -హైదరాబాద్‌ హైవేపై వాహనాల రాకపోకలు క్రమంగా ప్రారంభం అవుతున్నాయి. సోమవారం రాత్రి వరకూ మాచర్ల మీదుగా వెళ్లిన బస్సులు.. ఇప్పుడు నందిగామ మీదుగా ప్రయాణం చేస్తున్నాయి. వంతెన గండి పడటంతో సింగిల్ రూట్‌లో వెళుతున్నాయి. సర్వీసుల పునరుద్ధరణతో హైదరాబాదు ప్రయాణానికి ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. అయితే.. డ్రైవర్లు జాగ్రత్త వహించాలని పోలీసులు సూచిస్తున్నారు.విజయవాడలో వరద ముంపులో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. బెజవాడ ఇందిరాగాంధీ స్టేడియం నుంచి వందకు పైగా ట్రాక్టర్లను ముంపు ప్రాంతాలకు తరలిస్తున్నారు. భారీ క్రేన్లు కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం ముంపు ప్రాంతాల్లోకి బోట్లు, ట్రాక్టర్లు, క్రేన్లు మాత్రమే వెళ్లే అవకాశం ఉంది. అందుకే అధికారులు వీటిని సిద్ధం చేసి.. ముంపు ప్రాంతాలకు పంపిస్తున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 11:18

రెండేళ్లలో మరో 6 ప్లాంట్లు

హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేసే అరబిందో ఫార్మా జెనరిక్స్‌ రంగంలో దూసుకుపోతోంది. ఫార్మా రంగంలో అత్యంత కీలకమైన యాక్టివ్‌ ఫార్మా ఇన్‌గ్రిడియెంట్స్‌ (ఏపీఐ) తయారీ కోసం 1986లో ఏర్పాటైన ఈ కంపెనీ.. ఇతర ఫార్మా కంపెనీల కొనుగోళ్లు, కొత్త ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ప్రస్తుతం భారత ఫార్మా రంగంలో మేటి సంస్థగా ఎదిగింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో 350 కోట్ల డాలర్ల (సుమారు రూ.29,300 కోట్లు) టర్నోవర్‌ నమోదు చేసింది.

కంపెనీ ప్రస్తుతం 29 ఉత్పత్తి యూనిట్లతో ఏటా 5,000 కోట్లకు పైగా ఫార్ములేషన్లు, 19,000 టన్నుల ఏపీఐల ఉత్పత్తి సామర్ధ్యం కలిగి ఉంది. వీటికి తోడుగా వచ్చే రెండేళ్లలో మరో ఆరు కొత్త ఉత్పత్తి యూనిట్లు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. మార్కెట్‌ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వీలుగా ప్రత్యేక ఔషధాలపై దృష్టి పెట్టింది. దీనికి తోడు అమెరికాతో సహా ప్రఽధాన మార్కెట్లపై ప్రత్యేక దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఇండోనేషియాలో ఫైజర్‌/వయాట్రిస్‌ కంపెనీల నుంచి 17 బ్రాండ్లను కొనుగోలు చేసి, అక్కడి మార్కెట్‌పై పట్టు సాధించేందుకు కృషి చేస్తోంది. ఇప్పటికే 14 బయోసిమిలర్‌ ఔషధాల అభివృద్ధి వివిధ దశల్లో ఉంది. ఇవిగాక మరో 14 పెప్టైడ్‌ ఏపీఐల కోసం డీఎంఎఫ్‌లను అమెరికాలో ఫైల్‌ చేసింది. కాగా ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) కింద రూ.2,500 కోట్ల పెట్టుబడితో పెన్సిలిన్‌-జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది.

అరబిందో ఫార్మా ఈ మధ్యనే బయోలాజిక్స్‌ ఔషధాల కాంట్రాక్టు తయారీలోకి ప్రవేశించింది. ఇందుకోసం ‘థెరానియమ్‌ బయోలాజిక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌’ పేరుతో ప్రత్యేక అనుబంధ కంపెనీని ఏర్పాటు చేసింది. బయోలాజిక్స్‌ కోసం త్వరలో రూ.1,000 కోట్లతో ఏటా రెండున్నర నుంచి మూడు కోట్ల వయల్స్‌ ఉత్పత్తి సామర్ధ్యంతో ప్రత్యేక యూనిట్‌ ఏర్పాటు చేయనుంది.

ఈ ప్లాంట్‌ నుంచి కాంట్రాక్టు పద్దతిలో బయోసిమిలర్స్‌ సరఫరా చేసేందుకు ఎంఎస్‌డీ కంపెనీతో మాస్టర్‌ సర్వీస్‌ ఒప్పందం (ఎంఎస్‌ఏ) కుదుర్చుకుంది. ఈ పెట్టుబడులు తమ అభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళతాయని అరబిందో ఫార్మా వైస్‌ చైర్మన్‌, ఎండీ కే నిత్యానంద రెడ్డి తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 11:12

హైదరాబాద్‌ విమానాశ్రయంలో ప్రైవేట్‌ విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్‌

హైదరాబాద్‌, శంషాబాద్‌లో జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఆర్‌జీఐఏ).. ప్రైవేట్‌ విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆర్‌జీఐఏ టెర్మినల్‌ పక్కన 11,234 చదరపు

హైదరాబాద్‌, శంషాబాద్‌లో జీఎంఆర్‌ గ్రూప్‌ నిర్వహణలోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఆర్‌జీఐఏ).. ప్రైవేట్‌ విమానాల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను అందుబాటులోకి తెచ్చింది.

ఆర్‌జీఐఏ టెర్మినల్‌ పక్కన 11,234 చదరపు అడుగల విస్తీర్ణంలో అత్యాధునిక సదుపాయాలతో ఈ టెర్మినల్‌ ఏర్పాటు చేసినట్టు ఆర్‌జీఐఏ తెలిపింది. ప్రైవేట్‌ ఎంట్రెన్స్‌, కార్ల పార్కింగ్‌ కూడా ఈ టెర్మినల్‌లో అందుబాటులో ఉంటాయి. వ్యక్తిగత లేదా వ్యాపార అవసరాల కోసం ప్రైవేట్‌ విమానాలు, చార్టర్డ్‌ విమానాల్లో వచ్చే కుబేరులు, వ్యాపార ప్రముఖుల విమానాలు ఈ టెర్మినల్‌ ద్వారా రాకపోకలు సాగించవచ్చు.

హైదరాబాద్‌ ఇప్పటికే ఫార్మా, ఐటీ రంగాల్లో బాగా అభివృద్ధి చెందింది. ఇటీవల అనేక బహుళ జాతి కంపెనీలు ఇక్కడ తమ గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్స్‌ ఏర్పాటు చేస్తున్నాయి. ఈ రంగాలకు చెందిన ప్రముఖుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక టెర్మినల్‌ ఏర్పాటు చేసినట్టు జీఎంఆర్‌ హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ సీఈఓ ప్రదీప్‌ ఫణిక్కర్‌ తెలిపారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 10:57

మహీంద్రా సీబీజీ యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌

మహీంద్రా ట్రాక్టర్స్‌.. కంప్రెస్డ్‌ బయోగ్యా్‌సతో (సీబీజీ) పని చేసే యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరించింది.

మహీంద్రా ట్రాక్టర్స్‌.. కంప్రెస్డ్‌ బయోగ్యా్‌సతో (సీబీజీ) పని చేసే యువో టెక్‌ ప్లస్‌ ట్రాక్టర్‌ను కేంద్ర రోడ్డు రవాణా, హైవే శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ సమక్షంలో ఆవిష్కరించింది.

సీబీజీతో పని చేసే ఈ ట్రాక్టర్‌ కాలుష్యం, కర్బన వ్యర్థాలను గణనీయంగా తగ్గించగలుగుతుందని కంపెనీ తెలిపింది.

సీఎన్‌జీ అయితే శిలాజ ఇంధనాల నుంచి తయారవుతుందని, దానికి భిన్నంగా సీబీజీ పూర్తిగా హరిత, పునరుత్పాదక ఇంధనాల నుంచి తయారవుతుందని కంపెనీ పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 10:54

12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలే నిద్రపోతున్న వ్యక్తి.. ఎందుకో తెలుసా?

మనిషి చక్కటి ఆరోగ్యంతో ఉండాలంటే రోజుకు సగటున 6-8 గంటల నిద్రపోవడం చాలా ముఖ్యం. తగిన నిద్ర లేకపోతే మానసిక ప్రవర్తనపై ప్రభావం చూపుతుందని, దైనందిన జీవితాన్ని దెబ్బతీస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. స్థిరంగా 6-8 గంటలు నిద్రపోవడం ఆరోగ్యాన్ని పదిల పరుస్తుందని నిపుణులు సైతం నిర్ధారిస్తున్నారు.

అయితే జపాన్‌కు చెందిన ఓ వ్యక్తి గత 12 ఏళ్లుగా రోజుకు 30 నిమిషాలు మాత్రమే నిద్రపోతున్నాడు. నమ్మశక్యంగా లేకపోయిన ఇది నిజం. డైసుకే హోరి అనే వ్యక్తి తన జీవితాన్ని రెట్టింపు చేసుకునేందుకు రోజుకు అరగంట నిద్రను కొనసాగిస్తున్నాడు. పశ్చిమ జపాన్‌లోని హ్యోగోకు చెందిన 40 ఏళ్ల ఆ వ్యక్తి.. 30 నిమిషాలే నిద్రపోయినప్పటికీ తన శరీరం, మెదడును తక్కువ నిద్రతో సాధారణంగా పనిచేసేలా ట్రైనింగ్ ఇచ్చానని, ఈ విధంగా రోజూ ప్రాక్టీస్ చేయడంతో తన పని సామర్థ్యం గణనీయంగా మెరుగుపడిందని డైసుకే హోరి వెల్లడించాడు.

తినడానికి ఒక గంట ముందు వ్యాయామం లేదా కాఫీ తాగితే నిద్ర మత్తును దూరం చేసుకోవచ్చునని డైసుకే చెప్పినట్టు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ పేర్కొంది. మనిషి ఏకాగ్రతతో ఉండాలంటే ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యమైన నిద్రపోవడం చాలా ముఖ్యమని డైసుకే చెప్పాడు. ‘‘పనిలో స్థిరమైన ఏకాగ్రత అవసరమయ్యే వ్యక్తులు ఎక్కువ సేపు నిద్రపోవడం కంటే నాణ్యత కలిగిన నిద్రతో ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఉదాహరణకు తీసుకుంటే వైద్యులు, అగ్నిమాపక సిబ్బంది తక్కువ సమయం విశ్రాంతి తీసుకుంటుంటారు. కానీ అధిక సామర్థ్యాన్ని కలిగి ఉంటారు’’ అని డైసుకే చెప్పాడు.

డైసుకే హోరి చెప్పే విషయాలను మరింతగా తెలుసుకునేందుకు జపాన్‌కు చెందిన యోమియురి టీవీ ‘విల్ యు గో విత్ మీ’ అనే రియాలిటీ షో అతడిని 3 రోజుల పాటు అనుసరించింది. హోరీ కేవలం 26 నిమిషాలే నిద్రపోయి మంచి ఎనర్జీతో మేల్కొంటున్నాడని, అల్పాహారం చేసి పనిలో నిమగ్నం అవుతున్నాడని, జిమ్‌కి కూడా వెళ్లిన సందర్భాన్ని ఈ రియాలిటీ షో వెల్లడించింది. 

కాగా డైసుకే హోరీ ఒక వ్యవస్థాపకుడిగా కూడా ఉన్నాడు. తన ప్రత్యేకమైన నిద్ర అలవాటుతో 2016లో ‘జపాన్ షార్ట్ స్లీపర్స్ ట్రైనింగ్ అసోసియేషన్‌’ను స్థాపించాడు. నిద్ర, ఆరోగ్యంపై అతడు పాఠాలు బోధిస్తున్నాడు. అల్ట్రా-షార్ట్ స్లీపర్‌లుగా మారేందుకు ఇప్పటివరకు 2,100 మంది విద్యార్థులకు ట్రైనింగ్ ఇచ్చాడు.తక్కువ నిద్రకు సంబంధించి ఆసక్తికర విషయాలకు వస్తే.. వియత్నాం దేశానికి చెందిన థాయ్ ఎన్‌గోక్ అనే 80 ఏళ్ల తాను 60 ఏళ్లకు పైగా నిద్రపోలేదని కథాలు చెబుతున్నాయి. 1962లో జ్వరం వచ్చిన తర్వాత అతడు నిద్రపోయే సామర్థ్యాన్ని కోల్పోయినట్టు అతడు చెబుతున్నాడు. చికిత్సలు తీసుకున్నా, నిద్ర మాత్రలు వాడినప్పటికీ నిద్రలేమి మారలేదని అతడు వివరించాడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 03 2024, 10:48

ఎస్‌బీఐలో మరో తెలుగు తేజం

దేశీయ బ్యాంకిం గ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)లో కీలక పదవికి మరో తెలుగు తేజం ఎంపియ్యారు. ఆంధ్రప్రదేశ్‌, బాపట్లకు చెందిన రామ మోహన రావు అమర.. బ్యాం క్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఆర్థిక సంస్థల

దేశీయ బ్యాంకిం గ్‌ దిగ్గజం భారతీయ స్టేట్‌ బ్యాంక్‌ (ఎస్‌బీఐ)లో కీలక పదవికి మరో తెలుగు తేజం ఎంపియ్యారు. ఆంధ్రప్రదేశ్‌, బాపట్లకు చెందిన రామ మోహన రావు అమర.. బ్యాం క్‌ కొత్త మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ)గా ఎంపికయ్యారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎ్‌సబీ), ఆర్థిక సంస్థల కీలక పదవులకు అభ్యర్ధులను ఎంపిక చేసే ‘ది ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇనిస్టిట్యూషన్స్‌ బ్యూరో (ఎఫ్‌ఎ్‌సఐబీ) మొత్తం తొమ్మిది మంది అభ్యర్థులను ఇంటర్వ్యూ చేసి రామ మోహన రావు పేరును ఎంపిక చేసింది. ఈ సిఫారసును కేంద్ర క్యాబినెట్‌ ఆమోదించాల్సి ఉంటుంది.

ఇప్పటి వరకు ఎస్‌బీఐ ఎండీగా ఉన్న మరో తెలుగు తేజం సీ శ్రీనివాసులు శెట్టి ఇటీవలే ఎస్‌బీఐ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన స్థానంలో రామ మోహన రావు బ్యాంక్‌ ఎండీగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇంజనీరింగ్‌ పట్టభద్రుడైన రావు 1991లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఎస్‌బీఐలో చేరారు.

తన 32 సంవత్సరాల సర్వీసులో దేశ, విదేశాల్లోని ఎస్‌బీఐ శాఖల్లో ఆయన అనేక కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం ఈయన ఎస్‌బీఐ డిప్యూటీ ఎండీగా ఉన్నారు. భారత బ్యాంకింగ్‌ రంగంలో రారాజుగా భావించే ఎస్‌బీఐ చరిత్రలో రెండు కీలక పదవులకు ఇరువురు తెలుగు వారు ఒకేసారి ఎంపిక కావడం ఇదే మొదటిసారి.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 02 2024, 16:21

వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటన.. అధికారుల తీరుపై తీవ్ర అసహనం..

భారీ వర్షాలు, వరదలు.. కృష్ణా నదిలో వరద ఉధృతితో.. విజయవాడ, ఎన్టీఆర్‌ జిల్లా, గుంటూరు జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి.. ఇక, వరుసగా వర్షాలు, వరదలపై సమీక్షలు నిర్వహిస్తూ.. ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తూ వస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అవకాశం దొరికినప్పుడల్లా.. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్తున్నారు.. ఈ రోజు రెండు గంటలపాటు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు సీఎం చంద్రబాబు..

రామలింగేశ్వర నగర్, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్ ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగగా.. సహాయక చర్యలను పరిశీలించారు.. ఆహారం అందుతుందా..? లేదా..? అనే అంశంపై ఆరా తీశారు.. రెండు గంటల పర్యటన అనంతరం ఎన్టీఆర్ జిల్లా కలక్టరేట్ కు చేరుకున్న చంద్రబాబు… కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.. ఈ సమావేశంలో మంత్రులు నారా లోకేష్, అనిత, అచ్చెన్నాయుడు, కొలుసు పార్థసారథి, కొండపల్లి శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

రెండు గంటల పాటు క్షేత్ర స్థాయి పర్యటన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు.. సహాయక చర్యల్లో అధికారుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.. అధికారులకు లెఫ్ట్ అండ్ రైట్ వాయించారు.. తానే స్వయంగా రంగంలోకి దిగినా అధికారుల మొద్దు నిద్ర వీడకుంటే ఎలా అంటూ అధికారులకు క్లాస్ తీసుకున్నారు ఏపీ సీఎం.. గత ప్రభుత్వం జాఢ్యాన్ని వదిలించుకోకుంటే సహించేదే లేదంటూ సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు.. బాధితులకు సహాయ చర్యల విషయంలో ఇప్పటికీ కొందరు అధికారులు అలసత్వాన్ని వీడడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల పని తీరు ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేలా ఉండాలని.. కానీ, చెడ్డపేరు తెచ్చేలా ఉంటే మాత్రం ఊరుకునేది లేదంటా వార్నింగ్‌ ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Sep 02 2024, 16:19

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య

శ్రీశైలం ప్రాజెక్టు గేట్లలో సాంకేతిక సమస్య ఎదురైంది. ఎగువ నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో నీటిని కిందికి వదిలేందుకు అధికారులు ప్రయత్నించారు. గేట్లు ఎత్తుతుండగా నీటి ఒత్తిడి కారణంగా 2, 3 నెంబర్ గేట్ల ప్యానెల్ లోని బ్రేక్ కాయిల్స్ కాలిపోయాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టారు. బ్రేక్ కాయిల్స్ మార్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎగువన జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది.

ప్రాజెక్టుకు ఇన్ ఫ్లో 3.26 లక్షల క్యూసెక్కులుగా ఉందని అధికారులు చెప్పారు. దీంతో కుడి, ఎడమ జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువన నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు.

ప్రాజెక్టు నుంచి 3.80 లక్షల క్యూసెక్కుల వరద నీటిని సాగర్ కు వదులుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టు నీటి నిల్వ 214.8870 టీఎంసీలకు చేరిందని, పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 215.8070 టీఎంసీలు అని పేర్కొన్నారు.