/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz మళ్లీ పెరిగిన బంగారం ధర.. Raghu ram reddy
తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 29 2024, 08:57

మళ్లీ పెరిగిన బంగారం ధర..

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి.

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. గత కొన్నిరోజులుగా బంగారం ధర తగ్గిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని ప్రధాన నగరాల్లో గురువారం రోజు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. పెళ్లిళ్ల సీజన్ ఉండటంతో బంగారం ధరలకు రెక్కలొస్తున్నాయి. బంగారం ధరల వివరాలు తెలుసుకుందాం.. పదండి.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.70 వేల మార్క్ దాటింది. 10 గ్రాముల ధర రూ.73,260కి చేరింది. విజయవాడ, విశాఖపట్టణంలో కూడా హైదరాబాద్ మాదిరిగా బంగారం ధరలు ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,310గా ఉంది. మేలిమి బంగారం ధర రూ. 73,410గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.67,160గా ఉంది. మేలిమి బంగారం ధర రూ.73,260గా ఉంది.

వెండి ధర మాత్రం కాస్త తగ్గింది. కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్ కతా, పుణెలో కిలో వెండి ధర రూ.88,400గా ఉంది. చెన్నై, కేరళ, హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.93,400గా ఉంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 29 2024, 08:53

తిరుమల శ్రీవారికి భారీ విరాళం.. హైదరాబాద్ ఆర్ఎస్ బ్రదర్స్ కళ్లు చెదిరే మొత్తంలో చెక్కులు

తిరుమల శ్రీవారికి హైదరాబాద్ ప్రముఖ వ్యాపార సంస్థ భారీగా విరాళం అందించారు. టీటీడీకి ఏకంగా రూ.3.70 కోట్ల భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాద రావు, మాలతి లక్ష్మీకుమారి ఈ విరాళపు చెక్కులను శ్రీవారి ఆలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు. అంతకముందు దాతలు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

తిరుమల శ్రీవారికి మరో భారీ విరాళం అందింది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ఈ భారీ విరాళాన్ని అందజేశారు. టీటీడీలోని వివిధ ట్రస్టులకు రూ.3.70 కోట్ల భారీ విరాళాన్ని.. ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ ఎండీలు పొట్టి వెంకటేశ్వర్లు, రాజమౌళి, ప్రసాదరావు, మాలతి లక్ష్మీ కుమారిలు శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో సీహెచ్‌ వెంకయ్యచౌదరికి విరాళం చెక్కులను అందజేశారు. టీటీడీ ట్రస్టుల ద్వారా హిందూ ధర్మ పరిరక్షణ, విద్య, వైద్యానికి చేస్తున్న సేవలకు చేయూతగా విరాళాన్ని అందించినట్లు దాతలు తెలిపారు.

తిరుప‌తి శ్రీ గోవింద‌రాజస్వామివారి ఆల‌యంలో సెప్టెంబరు నెల‌లో ప‌లు విశేష ఉత్స‌వాలు జ‌రుగనున్నాయి. ⁠సెప్టెంబరు 6, 20, 27వ తేదీల్లో శుక్రవారాల్లో సాయంత్రం 6 గంటలకు శ్రీ ఆండాళ్‌ అమ్మవారిని ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఊరేగింపు నిర్వహిస్తారు. సెప్టెంబరు 04న ఉత్తర నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు ఉభయనాంచారులతో కలిసి శ్రీ గోవిందరాజస్వామివారు భక్తులకు ద‌ర్వ‌నం ఇవ్వ‌నున్నారు. సెప్టెంబరు 13న శ్రీ గోవింద రాజస్వామివారి అలయంలో పత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. సెప్టెంబరు 14 నుంచి 16వ తేదీ వరకు పత్రోత్సవాలు.. సెప్టెంబరు 18న శ్రీ గోవింద రాజస్వామివారి గరుడ సేవ ఉంటుంది. సెప్టెంబరు 23న రోహిణి నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు రుక్మిణి, సత్యభామ సమేత శ్రీపార్థసారధిస్వామివారు మాడ వీధుల్లో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.

కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ఆగస్టు 29, 30వ తేదీల్లో పవిత్రోత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. వైదిక సంప్రదాయం ప్రకారం జాతాశౌచం, మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం. అయినా యాత్రీకుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక ఇటువంటి దోషాలు జరుగుతుంటాయి. ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ పవిత్రోత్సవాలలో ఆలయ శుద్ధి, పుణ్యాహవచనం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఇందులో భాగంగా ఆగస్టు 29వ తేదీన ఉదయం ఆచార్య రుత్విక్‌వరణం, సాయంత్రం మృత్సంగ్రహణం, సేనాధిపతి తిరువీధి ఉత్సవం, పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆగస్టు 30వ తేదీన ఉదయం మూలవర్లకు తిరుమంజనం, పవిత్రాల సమర్పణ నిర్వహిస్తారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు వీధి ఉత్సవం నిర్వహిస్తారు.తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ కృష్ణ స్వామివారి ఆలయంలో గోకులాష్టమి సందర్భంగా బుధవారం సాయంత్రం వేడుకగా ఉట్లోత్సవం జరిగింది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు శ్రీక ష్ణస్వామివారికి అభిషేకం నిర్వహించారు. సాయంత్రం 5 గంటలకు శ్రీకృష్ణ స్వామివారి వారికి ఊంజల్‌సేవ నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకు శ్రీకృష్ణస్వామివారి ఊరేగింపు సందర్భంగా ఉట్లోత్సవం, ఆస్థానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో రమేష్, సూపరింటెండెంట్‌ శేషగిరి, టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ గణేష్, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 19:42

నాపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్సీకి లేదు.. కోర్టులో ఖేడ్కర్ వాదన

యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్‌సీకి లేదన్నారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని హైకోర్టుకు విన్నవించారు.

యూనియన్ పబ్లిక్ సర్వీ్స్ కమిషన్ (UPSC)పై డిస్మిస్డ్ ఐఏఏస్ అధికారి పూజా ఖేడ్కర్ మరోసారి విరుచుకుపడ్డారు. తనపై చర్య తీసుకునే అధికారం యూపీఎస్‌సీకి లేదన్నారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాల సమర్పణ వ్యవహారంలో యూపీఎస్‌సీ ఇటీవల ఆమె అభ్యర్థిత్వంపై అనర్హత వేటు వేసింది. భవిష్యత్తులో సర్వీస్ ఎగ్జామ్స్ రాయకుండా డిబార్ చేసింది. క్రిమినల్ కేసు సైతం నమోదు చేసింది. ప్రస్తుతం ఆమె కేసు ఢిల్లీ హైకోర్టు విచారణలో ఉంది. యూపీఎస్‌సీ చేసిన వాదనను కోర్టు విచారణలో పూజ తోసిపుచ్చారు. తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేసే అధికారం యూపీఎస్‌సీకి లేదని తెలిపారు. తాను ఎలాంటి ఫోర్జరీ చేయలేదని, తప్పుడు సమాచారం ఇవ్వలేదని కోర్టుకు విన్నవించారు.

కాగా, మాజీ ఐఏఎస్ ప్రొబేషర్ పూజా ఖేడ్కర్‌ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను యూపీఎస్‌సీ వ్యతిరేకించింది. కమిషన్‌కు, పబ్లిక్‌కు వ్యతిరేకంగా ఆమె ఫ్రాడ్ చేశారని పేర్కొంది. ఇతరుల సహాయం లేకుండా ఇలాంటి అవకతవకలు జరిగి ఉండవని, ఈ ఫ్రాడ్ ఎంత లోతుగా జరిగిందని తెలుసుకోవాలంటే కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని పేర్కొంది. ఆ కారణంగా ముందస్తు బెయిల్‌ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోర్టును కోరింది. ఢిల్లీ పోలీసులు సైతం పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ అభ్యర్థనను తోసిపుచ్చాలని కోర్టును కోరారు. కేసులో మరింత లోతైన దర్యాప్తునకు ముందస్తు బెయిలు అవరోధమవుతుందని వాదించారు.

పూజా ఖేడ్కర్ అభ్యర్థిత్వాన్ని జూలై 31న యూపీఎస్‌సీ రద్దు చేయగా, ఐపీసీ, ఇన్‌పర్ఫేషన్ టెక్నాలజీ యాక్ట్, రైట్ ఆఫ్ పర్సన్స్ విత్ డిసేబిలిటీ యాక్ట్ కింద ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలపై సమాధానం ఇచ్చేంత వరకూ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలని హైకోర్టును ఖేడ్కర్ కోరారు. దాంతో ఆగస్టు 29 వరకూ ఖేడ్కర్‌కు హైకోర్టు అరెస్టు నుంచి ముందస్తు రక్షణ కల్పించింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 19:38

సీనియర్‌ ఐఏఎస్‌కు సుప్రీంకోర్టు షోకాజ్‌ నోటీసులు..!

మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ మిశ్రా, జస్టిస్‌ కేజీ విశ్వనాథ్‌ ధర్మాసనం ధిక్కార వ్యాఖ్యలు చేసినందుకు.. ఎందుకు ధిక్కార చర్యలు చేపట్టకూడదని ప్రశ్నించింది.

మహారాష్ట్ర అటవీ, రెవెన్యూశాఖ అదనపు ముఖ్య కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌కు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ప్రశాంత్‌ మిశ్రా, జస్టిస్‌ కేజీ విశ్వనాథ్‌ ధర్మాసనం ధిక్కార వ్యాఖ్యలు చేసినందుకు.. ఎందుకు ధిక్కార చర్యలు చేపట్టకూడదని ప్రశ్నించింది. సీనియర్ ఐఏఎస్‌ అధికారి ఆయిన ఆయనను సెప్టెంబర్‌ 9న వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకావాలని బెంచ్‌ ఆదేశించింది.

పరిహారం చెల్లింపునకు సంబంధించిన కేసులో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రాష్ట్రం ఎగవేత వ్యూహాన్ని అవలంభిస్తోందని.. అదే సమయంలో పరిహారం తిరిగి లెక్కించే నిర్దిష్ట ప్రయోజనం విషయంల సమయం కోరినప్పుడు పూర్తి చేయాలని బెంచ్‌ పేర్కొంది.

పరిహారం విషయంలో ప్రభుత్వం సీరియస్‌గా లేదని అఫిడవిట్‌ ద్వారా తెలుస్తోందని పేర్కొంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 15:12

దేశ ఆర్థిక వ్యవస్థపై ఎస్బీఐ అంచనా

దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్‌లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది.

దేశీయ మొదటి త్రైమాసికంలో(2024-25(ఏప్రిల్ - జూన్‌లో)) భారత దేశ ఆర్థిక వృద్ధి రేటు తగ్గుతుందని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) నివేదిక తెలిపింది. తొలి త్రైమాసికంలో దేశ ఆర్థిక వ్యవస్థ(GDP) వృద్ధిని అంచనా వేసింది. ఆర్‌బీఐ తన తాజా ద్రవ్య విధాన సమావేశంలో 2024-25 ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధిని 7.1 శాతంగా ఉండొచ్చని అభిప్రాయపడింది. కాగా.. మొదటి త్రైమాసిక జీడీపీ డేటా ఈ శుక్రవారం విడుదల కానుంది.

ఎస్‌బీఐ రీసెర్చ్‌ గ్రూప్‌ చీఫ్‌ ఎకనామిక్‌ అడ్వైజర్‌ సౌమ్య కాంతి ఘోష్‌ తాజా ఎకోవ్రాప్‌ నివేదిక ప్రకారం... ఎన్నికల కారణంగా ప్రభుత్వ వ్యయం, లాభాల మార్జిన్లు తగ్గడం, పెరుగుతున్న ప్రపంచ సరకు రవాణా, సెమీకండక్టర్‌ కొరత, కంటైనర్‌ ఖర్చులు సహా అనేక ఒత్తిళ్లు, సవాళ్లు ఉండటంతో ఆర్థిక వృద్ధి మందగిస్తోందని తెలిపింది. జులైలో అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) 2024 భారత వృద్ధి 7 శాతం కంటే తక్కువగా 6.7 - 6.8 శాతానికి పెంచింది.

భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, కీలక ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం గురించి ఆందోళనలు సహా ప్రపంచ ఆర్థిక అనిశ్చితులను కూడా నివేదిక హైలైట్ చేసింది. అయితే జులై ఆరంభం నుంచి నైరుతి రుతుపవనాలు పుంజుకోవడంతో దేశానికి సానుకూల వృద్ధి ఉంటుందని తెలిపింది. వ్యవసాయ రంగానికి ప్రయోజనం చేకూరుతుందని స్పష్టం చేసింది.

కులు, సేవల మొత్తం విలువను స్థూల జాతీయోత్పత్తి అంటారు. ప్రభుత్వం, ప్రజలు నిర్ణయాలు తీసుకోవటానికి పరిగణనలోకి తీసుకునే కీలకమైన అంశాల్లో జీడీపీ కూడా ఒకటి. జీడీపీ వృద్ధి చెందుతోందంటే ఆర్థిక కార్యకలాపాల విషయంలో దేశం బాగా పనిచేస్తోందని.

ప్రభుత్వ విధానాలు క్షేత్ర స్థాయిలో ఫలిస్తున్నాయని, అవి సరైన దిశలో పయనిస్తున్నాయని. జీడీపీ మందగించటం, తిరోగమనంలోకి వెళ్తోందంటే.. ఆర్థికవ్యవస్థ పునరుత్తేజం చెందటానికి తోడ్పడేలా ప్రభుత్వం తన విధానాలను మెరుగుపరచుకోవాల్సి ఉంటుందని దాని అర్థం.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 14:42

జన్వాడ.. ఓవైసీ.. మల్లారెడ్డిలకు రిలీఫ్.. హైడ్రా కమిషనర్ తాజా క్లారిటీ!

హాట్ టాపిక్ గా మారిన హైడ్రా ఏం చేస్తుంది? ఎవరిని టార్గెట్ చేస్తోంది. ఎవరి ఆస్తులపైకి బుల్డోజర్ ను పంపుతుంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఈ నేపథ్యంలో ఎవరికి తోచిన విశ్లేషణను వారు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి వేళ.. అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మూడు ఆస్తులిప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. అందులో ఒకటి మాజీ మంత్రి కేటీఆర్ ఆధీనంలో ఉన్న జన్వాడ ఫామ్ హౌస్.. ఓవైసీలకు చెందిన విద్యాసంస్థ.. మల్లారెడ్డి వర్సిటీకి చెందిన భూముల విషయంలో హైడ్రా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది చర్చగా మారింది.

ఇందుకుతగ్గట్లే.. మంగళవారం హైడ్రా.. ఇరిగేషన్.. రెవెన్యూ అధికారులు ఆయా చోట్ల పర్యటించటంతో వాతావరణం వేడెక్కింది. ఏ క్షణంలో అయినా హైడ్రా బుల్డోజర్ రంగంలోకి దిగటం ఖాయమని.. ఏ తెల్లవారుజామునో కూల్చివేతలు షురూ కానున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే.. ఇదేమీ ఉండదన్న విషయంపై హైడ్రా కమిషనర్ క్లారిటీ ఇవ్వటం గమనార్హం. రాజకీయ చదరంగంలో హైడ్రా పావుగా మారదలుచుకోలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పష్టం చేస్తున్నారు.

ఓవైసీ.. మల్లారెడ్డి అన్నది తాము చూడటం లేదని.. విద్యార్థుల ఫ్యూచర్ గురించి ఆలోచిస్తామన్న ఆయన.. చెరువులను ఆక్రమించి కళాశాల భవనాలు కట్టడం వాళ్ల పొరపాటు అయి ఉండొచ్చని.. ఎఫ్ టీఎల్ అన్నది ముఖ్యమే అయినప్పటికీ దాని కంటే విద్యార్థుల ఫ్యూచర్ మరింత ముఖ్యమని ఆయన స్పష్టం చేశారు.

ఓవైసీ.. మల్లారెడ్డి లాంటి వ్యక్తుల విద్యాసంస్థలకు టైం ఇస్తామని.. పార్టీలకు అతీతంగా చర్యలు ఉంటాయన్న ఆయన.. ధర్మసత్రమైనా ఎఫ్ టీఎల్ పరిధిలో ఉంటే కూల్చేస్తామన్నారు. ఈ సందర్భంగా మరో కీలక వ్యాఖ్య చేశారు. హైడ్రా నోటీసు ఇవ్వదని.. కూల్చటమే చేస్తుందన్నారు. నగరంలోని పలు చెరువులు.. పార్కుల ఆక్రమణలపై పలువురు బీజేపీ కార్పొరేటర్లు హైడ్రా కమిషనర్ ను కలిసి కంప్లైంట్ ఇచ్చిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉంటే.. జన్వాడలోని కేటీఆర్ ఆధీనంలోని ఫామ్ హౌస్ మీద చర్యల మాటేమిటి? అన్నది ప్రశ్నగా మారింది.

దీనిపైనా క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా జన్వాడ ఫామ్ హౌస్ ను ఇరిగేషన్ శాఖ అధికారులు పర్యటించటం.. అక్కడి వాస్తవ పరిస్థితుల్ని మదింపు చేసిన దరిమిలా.. చర్యల బుల్డోజర్ వెళ్లే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి కారణం.. ఫామ్ హౌస్ కాంపౌండ్ గేటు మినహా.. ఫామ్ హౌస్ ఎఫ్ టీఎల్ పరిధిలో లేకపోవటం.. ట్రిపుల్ వన్ జీవో పరిధిలోకి రావటమే కారణంగా చెబుతున్నారు. ప్రస్తుతం ఎఫ్ టీఎల్ ను ఆక్రమించుకున్న కట్టడాలు.. నిర్మాణాల మీదనే బుల్డోజర్ పంపాలని భావిస్తున్నారు. ట్రిఫుల్ వన్ జీవో పరిధిలోని నిర్మాణాల మీద హైడ్రా ఫోకస్ చేయట్లేదు. ఒకవేళ.. జన్వాడ ఫామ్ హౌస్ మీద చర్యల కత్తి ఝుళిపించినా.. మహా అయితే ప్రహరీగోడ తప్పించి.. ముందుకు వెళ్లే అవకాశం లేదంటున్నారు. మొత్తంగా జన్వాడ ఫామ్ హౌస్.. ఓవైసీ.. మల్లారెడ్డిల విద్యాసంస్థలు బుల్డోజర్ కూల్చివేతల నుంచి సేఫ్ అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 14:36

సాక్షిపై ప‌రువున‌ష్టం కేసులో క్రాస్ ఎగ్జామిన్‌కు హాజరుకానున్న లోకేష్

సాక్షిపై ప‌రువున‌ష్టం కేసులో ఐటీ, మానవ వనరుల శాఖా మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌‌ క్రాస్ ఎగ్జామినేష‌న్‌‌కు హాజరుకానున్నారు. ఈ నెల 29న విశాఖ 12వ అదనపు జిల్లా కోర్టుకి లోకేష్ హాజ‌రు కానున్నారు. ‘చిన‌బాబు చిరుతిండి..25 ల‌క్షలండి’ పేరుతో సాక్షిలో అస‌త్య క‌థ‌నంపై లోకేష్ న్యాయ‌ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సాక్షిపై వేసిన ప‌రువున‌ష్టం కేసులో విశాఖ 12వ అదనపు జిల్లా న్యాయస్థానంలో 29న జ‌ర‌గ‌నున్న క్రాస్ ఎగ్జామినేష‌న్‌కి మంత్రి నారా లోకేష్ హాజ‌రు కానున్నారు. ‘చినబాబు చిరుతిండి.. 25 లక్షలండి’ అనే టైటిల్‌తో 2019లో సాక్షిప‌త్రిక‌లో అస‌త్యాలు, క‌ల్పితాల‌తో ఓ స్టోరీ ప్రచురితమైంది. దీనిని అవాస్తవాల‌తో ఉద్దేశ‌పూర్వకంగా త‌న‌ను డ్యామేజ్ చేయాల‌ని ఈ స్టోరీ వేశార‌ని నారా లోకేష్ అప్పట్లో పేర్కొన్నారు.

అయితే దీనిపై సాక్షి ఎటువంటి వివ‌ర‌ణ వేయ‌క‌పోవ‌డం, నోటీసుల‌కు స్పందించ‌క‌పోవ‌డంతో నారా లోకేష్ పరువునష్టం దావా వేశారు. తన పరువుకు భంగం కలిగించేందుకు అసత్యాలతో కథనం వేశారని ఆ పిటిషన్‌లో ఆయన పేర్కొన్నారు. తాను విశాఖ‌లో ఉన్నాన‌ని ప్రచురించిన తేదీల్లో.. తానసలు విశాఖలోనే లేనని లోకేష్ తెలిపారు. ప్రభుత్వం ఆహ్వానం మీద వచ్చే అతిథులకు చేసిన అతిథి మర్యాదల కోసం చేసిన ఖ‌ర్చుని త‌న‌కు అంట‌గ‌డుతూ త‌న ప్రతిష్టని మంట‌గ‌లిపేందుకు ప్రయ‌త్నించార‌ని లోకేష్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. మంత్రిగా తాను అనేక సార్లు విశాఖపట్నం వెళ్లినా ఎయిర్ పోర్ట్ లో ఎటువంటి ప్రోటోకాల్ సౌకర్యాలు తాను స్వీకరించలేదని స్పష్టం చేశారు. వివిధ కార‌ణాల‌తో చాలా రోజులుగా వాయిదాలు ప‌డిన ఈ కేసు మంత్రి నారా లోకేష్ క్రాస్ ఎగ్జామినేష‌న్‌తో మ‌ళ్లీ మొద‌లైంది.

వాస్తవానికి వీవీఐపీలు, వీఐపీలు ప్రయాణ సమయాల్లో విమానాశ్రయానికి వచ్చినప్పుడు ఫ్లయిట్‌ టేకాఫ్‌కు సమయముంటే వీఐపీ లాంజ్‌లో కాసేపు సేద తీరతారు. ఇది సర్వసాధారణం. 2014 నుంచి 19 వరకూ చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో నారా లోకేష్ సైతం విశాఖ ఎయిర్‌పోర్టుకు వచ్చి టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఏకంగా పాతిక లక్షల రూపాయలు టీ, కాఫీ, స్నాక్స్‌ కోసం ఖర్చు చేశారని ఒక నిరాధార కథనాన్ని సాక్షి ప్రచురించింది. దీనిపై అప్పట్లోనే నారా లోకేష్ మండిపడ్డారు.

నీతి లేని కథనాలను సాక్షి ప్రచురిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సాక్షి స్పందించాలేదు. దీంతో సాక్షిపై ఏకంగా రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఈనెల 29వతేదీన సాక్షి పత్రికపై దాఖలుచేసిన పరువునష్టం దావా కేసులో వాయిదాకు నారా లోకేష్ హాజరుకానున్నారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 14:25

అమరావతిలో కేంద్రం తాజా ప్రతిపాదన - కొత్త రూపు..!!

ఏపీ రాజధాని అమరావతి పరిధిలో కొత్త ప్రతిపాదనలు సిద్దం అవుతున్నాయి. ఇప్పటికే అమరావతికి సంబంధించి డిసెంబర్ లో పనులు ప్రారంభం అవుతాయని మంత్రి నారాయణ ప్రకటించారు. అమరావతి కోసం రూ 15 వేల కోట్ల రుణం పైన కేంద్రం హామీ ఇచ్చింది. ప్రపంచ బ్యాంకు టీం పరిశీలన చేసింది. ఇదే సమయంలో రాజధాని పరిధిలోని గుంటూరు - విజయవాడలను జంట నగరాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు సిద్దం చేస్తున్నాయి.

అమరావతి పరిధిలో కొత్త రూపు తెచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా విజయవాడ - గుంటూరు నగరాలకు నగరాలకు కేంద్రం ఇప్పటికే రూ.2 వేల కోట్లు మంజూరు చేసింది. హైదరాబాద్‌కు ధీటుగా జంట నగరాల అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. గుంటూరు సమీపంలోని కొన్ని గ్రామాలు, మండలాలను కలిసి గ్రేటర్‌ గుంటూరు అవతరించనుంది. అధికారులు ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేసారు. దీని పైన కసరత్తు మొదలైంది.

తాజా ప్రతిపాదనల మేరకు గుంటూరు కార్పొరేషన్‌లో ఎనిమిది మండలాల పరిధిలోని 39 గ్రామాలు విలీనం అవ్వనున్నాయి. గుంటూరు రూరల్‌ మండలం పూర్తిగా కనుమరుగవనున్నది. ఆయా పంచాయతీల్లో స్థానిక ప్రజాప్రతినిధుల పదవీకాలం పూర్తి అయిన తర్వాత వాటిని నగరపాలక సంస్థలో కలపనున్నారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల, డోకిపర్రు, ఫిరంగిపురం మండలంలోని అమీనాబాద్‌, చేబ్రోలు మండలంలోని నారాకోడూరు, గొడవర్రు, గుండవరం. ప్రత్తిపాడు మండలంలోని చిన్న కొండ్రుపాడు, యనమదల, ఈదులపాలెం కార్పోరేషన్ లో కలవనున్నాయి.

అదే విధంగా తాడికొండ, వట్టిచెరుకూరు, పెదకాకాని, గంటూరు రూరల్ మండలాల్లోని గ్రామాలు గ్రేటర్ గుంటూరు కార్పోరేషన్ పరిధిలోకి తీసుకొచ్చేలా ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారు. అయితే, అమరావతి ప్రణాళికలు అమల్లో భాగంగా ఈ రెండు నగరాలను అభివృద్ధి చేయటం ద్వారా రాజధాని ప్రాంతం రూపు రేఖలు భవిష్యత్ లో మారుతాయని అంచనా వేస్తున్నారు. తాజా ప్రతిపాదనల పైన రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయి డీపీఆర్ తో కేంద్రంతో సంప్రదింపులు చేయనుంది. దీంతో..సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఈ జంట నగరాల అభివృద్ధి పై త్వరలోనే కీలక నిర్ణయం జరిగే అవకాశం కనిపిస్తోంది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 14:24

సీఎం ఇలాకలో టీచర్లు లేక స్కూల్‌ బంద్‌.. ఎందుకింత నిర్లక్ష్యమని నిలదీసిన హరీశ్‌రావు

సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకలో ఉపాధ్యాయులు లేక ఓ పాఠశాల మూతపడింది. కొడంగల్‌ మండలం అప్పాయిలపల్లి అనుబంధ గ్రామమైన ఆశమ్మకుంట తండాలో గత 15 రోజులుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల మూతపడింది. ఈ పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉండగా అతను ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు.

సీఎం రేవంత్‌ రెడ్డి ఇలాకలో ఉపాధ్యాయులు లేక ఓ పాఠశాల మూతపడింది. కొడంగల్‌ మండలం అప్పాయిలపల్లి అనుబంధ గ్రామమైన ఆశమ్మకుంట తండాలో గత 15 రోజులుగా ఉపాధ్యాయులు లేకపోవడంతో పాఠశాల మూతపడింది. ఈ పాఠశాలలో గతంలో ఒక ఉపాధ్యాయుడు ఉండగా అతను ట్రాన్స్‌ఫర్‌ అయ్యాడు. అతని స్థానంలో ఇంకొక ఉపాధ్యాయుడిని నియమించారు. కానీ అతను పెళ్లి ఉందని నెల రోజులు సెలవు పెట్టి వెళ్లిపోయాడు. దీంతో 15 రోజులుగా ఆ పాఠశాల మూతపడింది.

తప్పు చేస్తే దొరకక తప్పదు

Aug 28 2024, 12:40

తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు నేడు భూమిపూజ..

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు

తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11గంటలకు నిర్వహించే భూమిపూజా కార్యక్రమానికి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తోపాటు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పెద్దఎత్తున హాజరుకానున్నారు. ఇటీవల విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్‌లో సీఎం స్థలాన్ని పరిశీలించారు. అనంతరం ఓ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతంలో విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. డిసెంబర్ 9, 2024న తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు.

అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వం సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని నిర్ణయించింది. అయితే ఆ స్థానంలో ఇటీవల ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటుకు సిద్ధమైంది. ఆ మేరకు అక్కడ విగ్రహాన్ని సైతం ఏర్పాటు చేసింది. అయితే రాజీవ్ గాంధీ విగ్రహ ఏర్పాటుకు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ముఖ్యంగా బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకించింది. తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయాలనుకున్న ప్రదేశంలో ఎలా పెడతారంటూ మండిపడింది.

రాజీవ్ గాంధీకి అసలు తెలంగాణతో ఉన్న సంబంధం ఏంటని, ఆయన విగ్రహం పెట్టాలని అవసరం ఏంటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. రాజీవ్ గాంధీ ఏర్పాటుపై ప్రజాసంఘాలు, మేధావులు, కవులు, కళాకారులు సైతం అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విగ్రహ ప్రారంభోత్సవాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాయిదా వేసింది. ప్రస్తుతం సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటుకు రంగం సిద్ధం చేసింది.