/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz Kejriwal: దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా: కేజ్రీవాల్‌ Yadagiri Goud
Kejriwal: దేశం కోసం ప్రాణాలైనా ఇస్తా: కేజ్రీవాల్‌

దిల్లీ: కొత్త మద్యం విధానంలో తాము ఎలాంటి తప్పు చేయలేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ (Kejriwal) అన్నారు. దీంట్లో దాచిపెట్టడానికి ఏమీ లేదని..

సీబీఐ ముందు నిజాయతీగా అన్నీ వాస్తవాలే చెబుతానని తెలిపారు. మద్యం విధాన కుంభకోణంలో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆదివారం తమ ఎదుట హాజరుకావాలని శుక్రవారం సీబీఐ (CBI) ఆయనకు సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఈరోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. బయలుదేరడానికి ముందు మీడియాతో మాట్లాడుతూ భాజపాపై నిప్పులు చెరిగారు. అంతకుముందు విడుదల చేసిన ఓ వీడియో సందేశంలోనూ కేంద్రంలోని అధికార పార్టీపై విమర్శలు గుప్పించారు.

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాన్ని ఉద్దేశించి.. వారు చాలా శక్తిమంతమైనవారని.. ఎవరినైనా జైలుకు పంపగలరని కేజ్రీవాల్‌ (Kejriwal) ఆరోపించారు. తనను అరెస్టు చేయాలని భాజపా నేతలు బలంగా డిమాండ్‌ చేస్తున్నారన్నారు. బహుశా సీబీఐ (CBI)ని ఆ పార్టీ అలా ఆదేశించి ఉంటుందని వ్యాఖ్యానించారు. పార్టీ అలా ఆదేశిస్తే సీబీఐ తనను ఎందుకు అరెస్టు చేయకుండా ఉంటుందని అన్నారు. భాజపా నేతలకు అధికారం వల్ల వచ్చిన అహంకారం పెరిగిపోయిందని దుయ్యబట్టారు. వారికి అనుకూలంగా లేని మీడియా, న్యాయమూర్తులు.. ఇలా ఎవరిపైనైనా బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారి మాట వినకపోతే జైల్లో పెడతామని బెదిరిస్తున్నారన్నారు..

Fire Accident: హైదరాబాద్‌లో ఘోరం.. చిన్నారి సహా దంపతుల సజీవ దహనం..

హైదరాబాద్‌: నగరంలోని కుషాయిగూడలో ఘోరం జరిగింది. అగ్నిప్రమాదంలో ముగ్గురు సజీవ దహనమయ్యారు. టింబర్‌ డిపోలో వేకువజామున 3 గంటలకు అగ్నిప్రమాదం జరగడంతో మంటలు పక్కనే ఉన్న భవనానికి వ్యాపించాయి.

దీంతో అందులో నివాసముంటున్న దంపతులు సహా వారి చిన్నకుమారుడు మృతిచెందారు.

మృతులను యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తికి చెందిన నరేశ్‌ (35), సుమ(28), జోషిత్‌(5)గా గుర్తించారు. మరో చిన్నారి ఆచూకీ తెలియలేదు. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు..

అన్ని సర్కార్‌ బడుల్లో రాగి జావ

•వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు

హైదరాబాద్‌: అన్ని ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు రాగి జావ అందజేయనున్నారు. వచ్చే విద్యా సంవత్సరం 1-10 తరగతుల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ భాగస్వామ్యంతో అమలు చేయనున్నారు. దాదాపు 22 లక్షల మంది పిల్లలు ప్రయోజనం పొందనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు రాగి జావ అని ఒకసారి, పల్లీ పట్టి అని మరోసారి, మొలకలు, బెల్లం అని ఇంకోసారి 2018-19 నుంచి ప్రతిపాదనలు పంపడం...

కేంద్ర విద్యాశాఖ 60% వ్యయాన్ని భరిస్తామని హామీ ఇవ్వడం...చివరకది అమలు కాకపోవడం షరా మామూలుగా మారింది. పిల్లల్లో రక్తహీనత నివారణకు వాటిని అందించాలనుకున్నా విద్యాశాఖ అధికారుల చొరవ లేని కారణంగా ఏటా అటకెక్కుతోంది. దీనిపై విమర్శలు వస్తుండటంతో ఈసారి దాన్ని పట్టాలెక్కించాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా బడుల్లో అందించాలంటే రూ.35 కోట్లు వ్యయం అవుతుందని అంచనావేశారు. అందులో సగం ట్రస్ట్‌, మిగిలిన సగాన్ని ప్రభుత్వం భరిస్తుందని అధికారులు తెలిపారు.

ట్రస్ట్‌ అమలు తీరును చూసి...

అన్నపూర్ణ ట్రస్ట్‌ 2022-23 విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన కొన్ని పాఠశాలల్లో 6.50 లక్షల మందికి జాగి జావను ఉచితంగా అందించింది. ట్రస్ట్‌ ప్రతినిధులు రాగి మాల్ట్‌ పొడిని ఎంఈవో కార్యాలయాలకు పంపిస్తారు. దాన్ని విద్యాశాఖ అధికారులు అక్కడి నుంచి పాఠశాలలకు సరఫరా చేస్తారు. పొడిలోనే బెల్లం కూడా కలిపి ఉంటుంది. దాన్ని వేడి నీళ్లలో వేస్తే చాలు. నీటిని వేడి చేయడం, రాగి మాల్ట్‌ పొడిని మిక్స్‌ చేయడం...దాన్ని విద్యార్థులకు అందించే బాధ్యత మధ్యాహ్న భోజనపథకం కార్మికులు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల మధ్యలో దాన్ని అందిస్తున్నారు. కనీసం సగం మంది ఉదయం అల్పాహారం తీసుకోకుండానే బడికి వస్తున్నారు. మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏమీ తినకుండా ఉంటున్నారు. ఆ లోపాన్ని కూడా రాగి జావ భర్తీ చేస్తుందని భావిస్తున్నారు. వచ్చే ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో అన్నపూర్ణ ట్రస్ట్‌ ద్వారానే అమలుకు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో పకడ్బందీగా ఓటర్ల జాబితా

•జూన్‌ 1కల్లా ఈవీఎంల తొలి విడత తనిఖీ చేయాలి

•సన్నద్ధతపై కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ పనులకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహకాలు ప్రారంభించింది. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ ఏడాది డిసెంబరులోగా ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో ప్రాథమిక దశ స్థితిగతులను, సన్నద్ధతను తెలుసుకునేందుకు ముగ్గురు అధికారుల బృందాన్ని హైదరాబాద్‌ పంపింది.

ఈ బృందం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించింది. ఎన్నికల క్రతువులో భాగస్వాములయ్యే ఉన్నతాధికారుల నుంచి క్షేత్రస్థాయి అధికారుల వరకు దశల వారీగా శిక్షణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్‌ డిప్యూటీ కమిషనర్‌ నితీష్‌వ్యాస్‌ స్పష్టం చేశారు. ‘తొలిదశలో రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రెండు రోజుల వర్క్‌షాప్‌ నిర్వహించాలి. ఆ తర్వాత అన్ని స్థాయుల అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇవ్వాలి. ఈఆర్పీనెట్‌ 2.0 పనితీరునూ సమీక్షించాలి. ఓటర్ల జాబితాను పకడ్బందీగా నిర్వహించాలి. చేర్పులు, తొలగింపులపై ప్రత్యేక దృష్టి సారించాలి.

ఓటు ప్రాధాన్యంపై ప్రజలను మరింత చైతన్యవంతులను చేయాలి. అధిక శాతం మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకోవాలి. ఈవీఎంల తొలిదశ తనిఖీ ప్రక్రియను జూన్‌ ఒకటో తేదీ నాటికి పూర్తి చేయాలి’ అని ఆయన సూచించారు. తనిఖీ ప్రక్రియను పూర్తి చేసిన తరవాత ఈవీఎంలను ఆయా జిల్లాలకు తరలిస్తామని ఎన్నికల సంఘం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌ అధికారుల బృందానికి వివరించారు. సమావేశంలో కేంద్ర ఎన్నికల సంఘం ముఖ్య కార్యదర్శి అవినాష్‌ కుమార్‌, అండర్‌ సెక్రటరీ సంజయ్‌కుమార్‌, తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు రవికిరణ్‌, సత్యవాణి తదితరులు పాల్గొన్నారు.

మాఫియా అతిక్, అష్రఫ్‌లను కాల్చిచంపారు

లక్నో: అతీక్ అహ్మద్ మరియు అతని సోదరుడు అర్షద్ కాల్చి చంపబడ్డారు. ప్రయాగ్‌రాజ్‌లో వైద్యం కోసం వెళుతుండగా ఇద్దరిపై కాల్పులు జరిగాయి. కాల్పులు జరిపిన నిందితుడు లొంగిపోయాడు.

దాడి చేసిన వారి మెడలో ఐడి కార్డ్ కూడా ఉందని, ఈ కారణంగా ముగ్గురూ మీడియా వ్యక్తులుగా నటిస్తూ బహిరంగంగా వచ్చారని భయపడుతున్నారు. అష్రఫ్, అతిక్‌లను కాల్చిచంపిన అనంతరం దాడి చేసిన వ్యక్తులు చేతులు పైకెత్తి అక్కడికక్కడే లొంగిపోయారు.

అతిక్ అహ్మద్, అష్రఫ్‌లు మీడియాకు స్టేట్‌మెంట్లు ఇస్తుండగా ముందు నుంచి తలపై కాల్పులు జరిగాయి. హంతకులు మీడియా ప్రతినిధులతో నిలబడి జర్నలిస్టుల వేషంలో వచ్చారు. ఒక హంతకుడు పట్టుబడ్డాడు.

వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సీబీఐ

కడప : వైఎస్ వివేకా హత్యకేసు విచారణలో సీబీఐ అధికారులు దూకుడు పెంచారు. విచారణలో భాగంగా ఈ రోజు ఆదివారం తెల్లవారుజామున అధికారులు రెండు వాహనాల్లో పులివెందులలోని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు..

అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డిని విచారించిన అధికారులు.. ఆయనను అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి వాహనంలో హైదరాబాద్‌కు తీసుకురానున్నారు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు భారీగా అవినాష్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. మొన్న ఉదయకుమార్ రెడ్డి, నేడు భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేశారు.

ఇక సీబీఐ అధికారులు వరుస అరెస్టుల పర్వం కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో పులివెందులలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు వివేకా హత్యకేసులో ఎంపీ అవినాష్‌రెడ్డిని ఇప్పటికే సీబీఐ అధికారులు 4సార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న అవినాష్‌రెడ్డి ఇంటికి సీబీఐ బృందం వెళ్లింది..

TS News: సీఎం కేసీఆర్‌కు షబ్బీర్ అలీ సవాల్

కామారెడ్డి: అంబేద్కర్ విగ్రహం నిర్మించడం కాదు, దమ్ముంటే దళితున్ని ముఖ్యమంత్రి చేయ్యాలని సీఎం కేసీఆర్‌ (CM KCR)కు కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) సవాల్ విసిరారు.TSPSC పేపర్ల లీకేజీ వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైఫల్యం - నిరుద్యోగుల గోస - అఖిలపక్ష పార్టీల భరోసా పేరిట కామారెడ్డిలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఈ సమావేశంలో షబ్బీర్ అలీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణలో తుపాకుల రాజ్యం మళ్లీ వస్తుందన్నారు. కేసీఆర్ పాలనలో మళ్లీ నక్సలిజం పుట్టుకొస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మళ్లీ తుపాకులు పట్టుకొని నక్సల్స్ సమాజంలో తిరుగుతారని వ్యాఖ్యానించారు. పేపర్ల లీకేజీ వల్ల 30 లక్షల మంది విద్యార్థులు రోడ్డున పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 9 సంవత్సరాలలో ఉద్యోగాలు లేవని, కేసీఆర్‌కు చెందిన 40 మందికి మాత్రమే ఉద్యోగాలు వచ్చాయన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం తెలంగాణలో అమలు కావడం లేదని.. ఇక్కడ కల్వకుంట్ల రాజ్యాంగం నడుస్తుందన్నారు. తెలంగాణ సమాజాన్ని లిక్కర్ రాజ్యంగా మార్చేశాడని మండిపడ్డారు..

ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?: పేర్ని నాని

తాడేపల్లి: ఎల్లో మీడియాపై మాజీ మంత్రి పేర్ని నాని ఫైరయ్యారు. ఏదో విధంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు..

కాగా, పేర్ని నాని శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఈనాడు, ఆంధ్రజ్యోతి బరితెగించి వార్తలు రాస్తున్నాయి. కక్షపూరితంగా సీఎం జగన్‌ను అపఖ్యాతిపాలు చేయాలని చూస్తున్నారు. సీఎం జగన్‌పై దాడి ఘటనలో తప్పుడు వార్తలు రాస్తున్నారు. హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ, పోలీసులు కూడా ఒప్పుకున్నారు. సీఎం జగన్‌పై హత్యాయత్నం చేసింది మా పార్టీ వ్యక్తే అని హడావిడిగా దాడి జరిగిన గంట వ్యవధిలోనే అప్పట్లో డీజీపీ చెప్పేశారు. దాడి జరిగిన తర్వాత కనీసం పరామర్శించకుండా విమర్శలు చేశారు. దాడి ఘటనపై ఇష్టానుసారం తప్పుడు వార్తలు రాస్తున్నారు. ఎన్టీఆర్‌పై దాడి జరిగితేనే ఈనాడుకు పెద్దవార్త. సీఎం జగన్‌ కావాలని చేయించుకుంటున్నారంటూ తప్పుడు రాతలు రాస్తున్నారు..

చంద్రబాబుపై దాడి జరిగినప్పుడు మహానేత వైఎస్‌ఆర్‌ ఖండించారు. పటిష్ట భద్రత ఉన్న ఎయిర్‌పోర్టులోపలికి కత్తి ఎలా వచ్చింది?. హత్యాయత్నం వెనుక ఎవరు ఉన్నారనే దానిపై వెల్లడించాలని అప్పట్లో వైఎస్‌ జగన్‌ పిటిషన్‌ వేశారు. ఘటనపై విచారణ జరపాలని కోరడం తప్పా?. విశాఖ పోలీసులను ఎవరు ప్రభావితం చేశారు?. ఎయిర్‌పోర్టు అధికారులను ఎవరు ప్రభావితం చేశారు?. నిందితుడి గురించి విచారించకుండానే స్టేట్‌మెంట్లు ఇచ్చారు అని తెలిపారు..

Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్‌కు ఉపశమనం!

ముంబయి: మహారాష్ట్ర (Maharashtra)లో నమోదైన ఓ పరువునష్టం కేసు (Defamation Case)లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ (Rahul Gandhi)కి ఉపశమనం లభించింది.

విచారణ క్రమంలో ప్రత్యక్ష హాజరు నుంచి కోర్టు ఆయనకు శాశ్వత మినహాయింపు ఇచ్చింది. తన న్యాయవాది ద్వారా రాహుల్‌ ఈ మేరకు దాఖలు చేసిన

దరఖాస్తును పరిశీలించిన భివండీ ఫస్ట్‌క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ లక్ష్మీకాంత్ సీ వాడికర్‌.. శాశ్వత మినహాయింపునకు రాహుల్‌ అర్హుడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే జూన్‌ 3న ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను నమోదు చేస్తామని తెలిపారు.

Viveka Murder Case: వివేకా హత్య కేసు.. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ యత్నించాడు : సీబీఐ

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆధారాలు చెరిపివేసేందుకు కడప ఎంపీ అవినాష్‌ రెడ్డి అనుచరుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డి ప్రయత్నించాడని సీబీఐ వెల్లడించింది..

ఉదయ్‌ రిమాండ్‌ రిపోర్టులో పలు కీలక అంశాలను సీబీఐ పొందుపరిచింది.

''వివేకా గుండెపోటుతో చనిపోయినట్లు చిత్రీకరణకు యత్నించారు. ఆధారాలు చెరిపివేసేందుకు ఉదయ్‌ ప్రయత్నించాడు. హత్య జరిగిన రోజు ఉదయం 4 గంటలకు ఉదయ్‌ తన ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. ఆ రోజంతా ఎంపీ అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, శివశంకర్‌రెడ్డి ఉన్నారు. హత్య జరిగిందని తెలిసిన వెంటనే ఆధారాల చెరిపివేతకు వారిద్దరూ అవినాష్‌ ఇంట్లోనే ఎదురుచూశారు.

అవినాష్‌కు శివప్రకాశ్‌రెడ్డి ఫోన్‌ చేసి వివేకా చనిపోయినట్లు సమాచారమిచ్చాడు. హత్య జరిగిన స్థలంలో అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర్‌ రెడ్డితో కలిసి ఉదయ్‌ ఆధారాలు చెరిపివేశారనేందుకు సాక్ష్యాలున్నాయి. ఆ రోజు అవినాష్‌ ఇంట్లోనే ఉదయ్‌, భాస్కర్‌రెడ్డి,శివశంకర్‌రెడ్డి ఉన్నట్లు గూగుల్‌ టేక్‌అవుట్‌ ద్వారా గుర్తించాం. వారు అవినాష్ ఇంటి నుంచి వివేకా ఇంటికి వెళ్లినట్లు గుర్తించాం. విచారణకు ఉదయ్‌ సహకరించడం లేదు. పారిపోతాడనే ఉద్దేశంతోనే ముందస్తుగా అరెస్టు చేశాం. కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది '' అని సీబీఐ పేర్కొంది.