VijayaKumar

Aug 03 2024, 16:47

అమరుల స్ఫూర్తితో గీతా కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమిస్తాం; బోలగాని జయరాములు KGKS రాష్ట్ర ఉపాధ్యక్షులు

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కల్లుగీత కార్మిక ఉద్యమాలలో పనిచేస్తూ అమరులైన అమరులు బొమ్మగాని ధర్మ బిక్షం బైరు మల్లయ్య తొట్ల మల్సూర్ సూదగాని ఎట్టయ్య లాంటి ఎందరో అమరవీరులు కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వారిని స్మరిస్తూ వారు చూపిన మార్గంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో కల్లుగీత కార్మిక సంఘం కార్మికుల సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తామని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బోలగాని జయరాములు అన్నారు. తేదీ 03-08-2024 శనివారం రోజున వలిగొండ పట్టణంలోని శివశక్తి ఫంక్షన్ హాల్ కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన అమరుల యాది సభ పలుసం స్వామి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన జయరాములు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు ఐదు లక్షల కుటుంబాలు కల్లుగీత వృత్తిపై ఆధారపడి ఉన్నాయని కల్లుగీత కార్మికుల సమస్యలు పరిష్కారం కోసం ఏ ప్రభుత్వాలు కూడా సంపూర్ణ ప్రయత్నాలు చేస్తలేవు అని వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని వారికి హామీల వరకే పరిమితం అవుతున్నారని అభివృద్ధి కోసం సంక్షేమం కోసం అధిక నిధులు కేటాయించకపోవడం వృత్తి రక్షణకు ఆధునీకరణ చేయకపోవడంతో కల్లుగీత వృత్తిలో గీతా కార్మికులు క్రమంగా తగ్గుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలో కళ్ళు గీత కార్మికుల సంక్షేమం కోసం అనేక ఉద్యమాలు చేసి కళ్ళు గీత కార్మిక సంఘం నాయకులు కొన్ని హక్కులను సాధించారని వాటిని కాపాడుకుంటూ కల్లుగీత వృత్తి రక్షణ కోసం కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక నిధులు విడుదల చేయడం కోసం ఆధునికరించడం కోసం భవిష్యత్తులో గీతా కార్మికులు ఉద్యమించాల్సిన అవసరం ఉందని తెలిపారు అందుకు వృత్తి రక్షణ కోసం పనిచేసే అమరులైన అమరుల స్ఫూర్తితో సంఘం ముందుకు వెళుతుందని తెలిపారు కేజీ కేస్ జిల్లా అధ్యక్షులు రాగిరి కృష్ణయ్య మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా నందనం వద్ద ఉన్న నీర కేంద్రానికి నిధులు కేటాయించి వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ సందర్భంగా కల్లుగీత కార్మికుల ప్రయోజనాల కోసం నిరంతరం పనిచేస్తున్న కేజీ కేఎస్ రాష్ట్ర కమిటీ సభ్యులు మద్దెల రాజయ్య మండల అధ్యక్షులు పబ్బతి మల్లేశం మండల నాయకులు కొండూరు సత్తయ్య కొండూరు అంజయ్య పలుసం లింగం బంధారపు ధనంజయ గాజుల వెంకటేశం గంధ మల్ల గోపాల్ పలుసం చంద్రమౌళి శంకరయ్య లోడే మల్లేశం మద్దెల మారయ్య మండలంలోని వివిధ గ్రామాల అధ్యక్షులు కార్యదర్శులు పాల్గొన్నారు

VijayaKumar

Aug 03 2024, 16:44

ఎస్సీ వర్గీకరణ అమలుపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకులు డాక్టర్ ముప్పిడి రవి

ఎస్సీ వర్గీకరణపై తీర్పు వచ్చిన వెంటనే అసెంబ్లీ ప్రస్తావన* *- అమలుపై హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి* *- ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ యువజన నాయకుడు డాక్టర్ ముప్పిడి రవి* ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేశారు. తీర్పు వచ్చిన వెంటనే తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే స్పందించి కోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేస్తానని ఇచ్చిన హామీకి కోమటిరెడ్డి బ్రదర్స్,నకిరేకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే వేముల వీరేశం అనుచరుడు కాంగ్రెస్ పార్టీ యువజన నాయకులు డాక్టర్ ముప్పిడి రవి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ఎన్నో సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణపై పోరాటం చేస్తే నేటికీ తుది ఫలితం రావడం హర్షణీయం అని, వచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం అమలు విషయం కూడా పారదర్శకంగా జరిగే విధంగా చేయాలని ఒక ప్రకటనలో కోరారు.

VijayaKumar

Aug 03 2024, 09:08

వలిగొండ: నర్సయ్య గూడెం వద్ద కారు ఢీకొట్టడంతో వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా : కారు ఢీ కొట్టడంతో తో వ్యక్తి మృతి చెందిన ఘటన వలిగొండ మండల పరిధిలోని నరసయ్య గూడెం గ్రామ సమీపంలో చోటుచేసుకుంది .పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామానికి చెందిన వల్లపు నరసయ్య తన వ్యక్తిగత పనుల నిమిత్తం వలిగొండ కు వచ్చి తన టీవీఎస్ ఎక్సెల్ బండిపై తిరిగి వెళుతుండగా నరసయ్య గూడెం సమీపంలో రోడ్డు కల్వర్టు వద్ద కారు ఢీకొట్టడంతో తలకు తీవ్రమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని కూతురు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వలిగొండ ఎస్సై మహేందర్ తెలిపారు.

VijayaKumar

Aug 02 2024, 20:04

ప్రొద్దుటూరు అంగన్వాడి కేంద్రంలో తల్లిపాల వారోత్సవాలు, అక్షరాభ్యాసం

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని ప్రొద్దుటూరు గ్రామంలో అంగన్వాడి టీచర్ సునీత (హేమ) మాట్లాడుతూ ఈనెల ఒకటో తారీకు నుండి ఎనిమిదో తారీకు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తామని అంగన్వాడి కేంద్రంలో 0నుంచి ఆరు నెలల పిల్లలు .ఏడో నెల నుండి మూడు సంవత్సరాల లోపు .టి హెచ్ ఆర్. పిల్లలు మూడు నుండి ఆరు సంవత్సరాలు. ప్రీ స్కూల్ పిల్లలు బరువు తీయడం జరుగుతుందని. ప్రతినెల ఒకటో తేదీ అంగన్వాడి కేంద్రంలో బరువులు తీసి పిల్లల బరువుల గురించి వయసుకు తగ్గ బరువు పిల్లలు ఉండేటట్లుతల్లులకు అవగాహన కల్పించడం జరుగుతుందని. బిడ్డ పుట్టిన వెంటనే మర్రుపాలు బిడ్డకు పట్టిస్తే అందులో అనేక కొలెస్ట్రాల్ బలము ఆ పాలల్లో ఉంటుందని ముర్రుపాలు వలన బిడ్డకు అనేక శక్తులు సమకూర్స్తాయని ఆరోగ్యవంతమైన శక్తి లభిస్తుందని తల్లి నుండి ముందుగా వచ్చే పసుపు. రంగు పాలు .ముదురు రంగు పాలు. బిడ్డకు పట్టించే విధానం గురించి గ్రామంలోని తిరుగుతూ గృహప్రదర్శనాలు బాలింతల ఇంటికి వెళ్లి సవివరంగా వివరించడం ప్రతినెల జరుగుతుందని. అంగన్వాడి టీచర్ పత్రిక ప్రకటన ద్వారా తెలియజేసినారు.. ఈ కార్యక్రమంలో ఈరోజు 3+పిల్లలకు అక్షర అభ్యాసం నిర్వహించడం జరిగిందని మాట్లాడినారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ సునీత (హేమ) సెక్టార్ హుస్సేన్ సారు .ఏఎన్ఎం .ఆశ. ఎల్ ఎం హెచ్ పి. లు బాలింతలు తల్లులు మహేశ్వరి నికిత పాల్గొన్నారు.

VijayaKumar

Aug 01 2024, 19:47

చిత్తాపురం లో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో భువనగిరి సాధన సభ్యులు  కుంభం అనిల్ కుమార్ రెడ్డి సహకారంతో సీఎం రిలీఫ్  ఫండ్ చెక్కులను గ్రామ శాఖ అధ్యక్షులు పీసరి వెంకటరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. బాధితులు  చేగూరి అనిత మత్స్యగిరి 42,000, కందాటి భవాని ఎల్లారెడ్డి 24000, కల్లూరి విష్ణువర్ధన్14000 వేలు అందించడం జరిగింది .ఈ కార్యక్రమంలో చేగూరి మచ్చ గిరి, వలమాల బిక్షపతి, చేగూరు మహేష్, బడక సతీష్ ,మల్లయ్య కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు .

VijayaKumar

Aug 01 2024, 19:37

పోరాటయోధుడు కాచం కృష్ణమూర్తి ఆశయ మార్గంలో ముందుకు సాగుదాం : సిర్పంగి స్వామి సిపిఎం మండల కార్యదర్శి

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధులు కాచం కృష్ణమూర్తి గారి పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగడమే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి అన్నారు గురువారం రోజున మండల కేంద్రంలోని సిపిఎం కార్యాలయం వద్ద కాచం కృష్ణమూర్తి గారి 18వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాటి రాచరిక పాలనకు వ్యతిరేకంగా దొరలు, దోపిడీదారుల దౌర్జన్యాలను ఎదిరించి సాయుధులైన ప్రజలను సమరయోధులుగా మార్చేందుకు ప్రజల్లో నిత్యం చైతన్యాన్ని నింపి దొరలు,దోపిడీదారుల, రజాకారుల కోటలపై మెరుపు దాడులు నిర్వహించి ప్రజలకు వెట్టి చాకిరి,దోపిడీ పీడనల నుండి విముక్తి చేసిన గొప్ప పోరాట యోధుడు కాచం కృష్ణమూర్తి అన్నారు ఎన్ని నిర్బంధాలు ఎదురైన వెనక్కు తగ్గకుండా తను ఎంచుకున్న మార్గం ద్వారా ఎర్రజెండా నాయకత్వంలో ప్రజలను నడిపించిన మహోన్నతమైన నాయకుడని జీవితాంతం సాదాసీదాగా జీవించి ప్రజల కోసమే బ్రతికిన ఆ నాయకుని యొక్క స్ఫూర్తిని ఆదర్శాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా పనిచేయడమే ఆయనకు మనమిచ్చే ఘననివాళని అన్నారు ఆయన ఆశయ మార్గంలో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీర్క శ్రీశైలం రెడ్డి,మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు, నాయకులు కొండూరు సత్తయ్య,వేముల లక్ష్మయ్య, ఉండ్రాటి పాపయ్య,నరసింహ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 01 2024, 19:29

స్వయం ఉపాధి అవకాశాలకు ప్రాధాన్యత ఇవ్వాలి: జిఎస్ రామానంద ప్రిన్సిపల్ ప్రభుత్వ ఐటిఐ భువనగిరి

విద్యార్థులు, చదువు పూర్తయిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు, స్వయం ఉపాధి అవకాశాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని భువనగిరి పారిశ్రామిక శిక్షణా కేంద్రం ప్రిన్సిపాల్ జి. ఎస్ రామానంద అన్నారు. గురువారం భువనగిరి ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా కేంద్రం లో కేంద్ర ప్రభుత్వ "సంకల్ప్ ప్రాజెక్టు" లో భాగంగా 15-05-2024 నుండి 31-05-2024 వరకు శిక్షణ పొందిన విద్యార్థులకు *సర్టిఫికెట్ల ప్రదానోత్సవ* కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు "ఎంటర్ ప్రెన్యూర్ షిప్ అండ్ డెవలప్మెంట్" శిక్షణా తరగతుల్లో నేర్చుకున్న పరిజ్ఞానం, భవిష్యత్తులో ఉపయోగపడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో సంకల్ప్ ప్రాజెక్టు స్టేట్ కన్సల్టెంట్ నజీర్ సిద్దిఖీ, యాదాద్రి భువనగిరి జిల్లా బాలల సంరక్షణ సమితి సభ్యులు ఎర్ర శివరాజ్, బాలల హక్కుల పరిరక్షణ వేదిక జాతీయ కమిటీ ఉపాధ్యక్షులు బొక్క రాంబాయి, జిల్లా అధ్యక్షులు ఆవుల వినోద్ కుమార్, డిప్యూటీ ట్రైనింగ్ ఆఫీసర్ బాబూరావు, తులసీరావు, అసిస్టెంట్ ట్రైనింగ్ ఆఫీసర్ ప్రవీణ్ కుమార్, గురువయ్య, పరమేష్, రీసోర్స్ పర్సన్ కొడారి వెంకటేష్, చైల్డ్ లైన్ జిల్లా కో- ఆర్డినేటర్ మాటూరి దశరథ, విద్యార్థులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 01 2024, 19:23

వలిగొండ: ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు పై హర్షం

వలిగొండ  పట్టణ కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుబ్బ రామకృష్ణ మండల అధ్యక్షులు పల్లెర్ల రామచందర్ వారు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రక తీర్పునివ్వడం శుభపరిణామమని,ఈ తీర్పును స్వాగతిస్తున్నామని వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడి ఎస్సీల్లో ఉన్న ఉప కులాలకు,ముఖ్యంగా మాదిగలకు సమానంగా రిజర్వేషన్ అందుతుందని పేర్కొన్నారు.‌30ఏండ్ల నుండి వర్గీకరణ పోరాటం చేసిన మంద కృష్ణ మాదిగకు మిగతా మాదిగ ఉద్యమకారులందరికీ దాసరి అభినందనలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ నాయకులు స్వీట్లు పంచుతూ పటాకులు కాలుస్తూ సంతోషాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు దుబ్బ దానయ్య ,సలిగంజి బిక్షపతి, జానకి రాములు, పోలేపాక బిక్షపతి ,సందెల శ్రీనివాస్ ,మండల ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు.

VijayaKumar

Aug 01 2024, 19:08

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలదే: AIYF

నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పాలకులదేనని, కాంగ్రెస్ ప్రభుత్వం సత్వరమే జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని *ఏ ఐ వై ఎఫ్ జిల్లా అద్యక్ష ప్రధాన కార్యదర్శి ఎల్లంకి మహేష్ ,పేరబొయిన మహేందర్* డిమాండ్ చేశారు.ఆత్మకూర్ మండల కమిటి సమావేశంలో వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారానే ఉపాధి అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు పెద్దపీట వేయాలని వారు డిమాండ్ చేశారు. నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకుని పోటీ పరీక్షలు రాసే కొత్త అభ్యర్థులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. 2023 విద్య సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నారని. వాస్తవానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం చేసినదని, పోటీ పరీక్షల నిర్వహణలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా లక్షలాదిమంది యువత భవిష్యత్ అంధకారంలోకి నెట్టివేయబడిందని వారు గుర్తు చేశారు. టీజీపీఎస్సీ లో జరిగిన పరీక్ష ప్రశ్న పత్రాల లీకేజీ ల కారణంగా నిరుద్యోగులలో అసహనం వ్యక్తం అయిందని, దీని కారణంగానే లక్షలాది మంది నిరుద్యోగులు గత ప్రభుత్వాన్ని జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించి ఇంటికి సాగనంపారని వారు అన్నారు. మరల ఎన్నో ఆకాంక్షలతో తెచ్చుకున్న ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ తో నైనా తమ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకుంటున్న యువత ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ను విడుదల చేయాలని అన్నారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీగా ఉన్న పోస్టులను గుర్తించాలని, పరీక్షలు నిర్వహించాలని, ఫలితాల విడుదల, నియామకాలు వంటివి పారదర్శకంగా చేపట్టాలని ఇవ్వన్నీ జరగాలంటే ఉద్యోగ కాలమానిని విడుదల చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏ ఐ వై ఎఫ్ ఆత్మకూర్ మండల అద్యక్ష కార్యదర్శులు బత్తిని నరేష్,ఎండి నయీమ్,బాషబొయిన మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

Jul 31 2024, 17:55

టీజేయు ఆధ్వర్యంలో నారిశక్తి అవార్డు గ్రహీత జర్నలిస్ట్ చంద్రకళ రెడ్డి కి ఘన సన్మానం

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని ఎస్ వి హోటల్ లో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా ఆధ్వర్యంలో నారీ శక్తి అవార్డు గ్రహీత ,కంది శశిధర్ ఫౌండేషన్ చైర్మన్,టీ జే యూ మహిళా విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి కంది చంద్రకళ వెంకట్ రాంరెడ్డి ఆత్మీయ సన్మాన సభ అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఈ సందర్భంగా టీ జే యూ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ షానూర్ బాబా మాట్లాడుతూ కంది చంద్రకళ రెడ్డికి నారీ శక్తి అవార్డు రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు . కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ గా , టీ జే యూ జిల్లా మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా వారు చేస్తున్న సేవలు అమోఘం అని కొనియాడారు . వారికి టీ జే యూ యాదాద్రి జిల్లా తరుపున శుభాకాంక్షలు తెలిపారు . నారీ శక్తి అవార్డుకి ఎంపిక కావడం అంత మాములు విషయం కాదు అని నాంచారి పేట గ్రామ ప్రజలు చేసుకున్న అదృష్టం అని అన్నారు . అక్కా అని పిలిస్తే నేను వున్నా అని భరోసా ఇస్తూ ఎంతో మందికి కంది శశిధర్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందజేశారు.