నిజంనిప్పులాంటిది

1 hour and 20 min ago

నేడు తెలంగాణకు అమిత్ షా! సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ

అగ్ర‌నేత అమిత్‌షా ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. సిద్దిపేట‌లో నిర్వ‌ హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు.

ఢిల్లీ నుంచి ఉదయం బయ లుదేరి బేగంపేట విమానాశ్ర యానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికా ప్టర్‌లో సిద్దిపేటకు చేరు కుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు.

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్ద తుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది.

ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరు తారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది.

ఇక.. పార్టీ నేతలు, కార్యక ర్తల్లో జోష్‌ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం...

నిజంనిప్పులాంటిది

1 hour and 21 min ago

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాలను బుధవా రం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు.

ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్స రంలో 4,78,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,87,261 (60.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,41,682 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,65,190 (68.35 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,37, 041,మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,22,071 (51.50 శాతం) మంది పాసయ్యారు.

అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.85 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభా గంలో 4,30,413 మంది పరీక్షలు రాస్తే, 2,62,829 (61.06 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,17,716 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,331 (68.59 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,12 ,697 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,13, 498,(53.36 శాతం) మంది పాసయ్యారు.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో 48,310 మంది పరీక్ష రాస్తే, 24,432 (50.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధిం చారు. ఇందులో 23,966 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 15,859 (66.17 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.

24,344 మంది అబ్బాయి లు పరీక్షలు రాస్తే, 8,573 (35.21 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5,02,280 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,22,432 (64.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇందులో 2,47,358 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,79,412 (72.53 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,54,922 మంది అబ్బాయి లు పరీక్షలు రాయగా, 1,43,020 (56.10 శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బా యిల కంటే అమ్మా యిలు 16.43 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్స రం జనరల్‌ విభాగంలో 4,01,445 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,78,856 (69.46 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,05,381 మంది అమ్మా యిలు పరీక్షలు రాయగా, 1,55,500 (75.71 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఒకేష నల్‌ జనరల్‌ విభాగంలో 42,723 మంది పరీక్షలు రాస్తే, 27,287 (63.86 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు.

ఇందులో 21,853 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు కాగా, 17,327 (79.28 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 20,870 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 9,960 (47.72 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణా ధికారి (సీవోఈ) జయప్రద బాయి, జాయింట్‌ సెక్రెటరీ వై శ్రీనివాస్‌, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు...

నిజంనిప్పులాంటిది

1 hour and 22 min ago

ఉత్తర ప్రదేశ్ లొ ఎన్నికల వేళ విషాదం..బీజేపీ ఎంపీ కన్నుమూత

ఉత్తరప్రదేశ్ లొ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కన్నుమూ శారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆస్పత్రిలో ఈరోజు ఉదయం మర ణించారు.

గత కొంతకాలంగా రాజ్ వీర దిలేర్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో హథ్రాస్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు.

కాగా ఈసారి ఎన్నికల్లోనూ అదే స్థానానికి పోటీ చేస్తు న్నారు రాజ్ వీర్ దిలేర్. ఆయన మృతితో స్థానిక కార్యకర్తలు దిగ్భ్రాంతి గురయ్యారు.

దిలేర్ 2017లో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌ సభకు ఎన్నికయ్యారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేశారు. దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆది త్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రాజ్ వీర్ దిలేర్ అకాల మరణం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. బీజేపీకి, ఆయన కుటుంబానికి దిలేర్ మృతి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు.

నిజంనిప్పులాంటిది

1 hour and 23 min ago

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా ఆరుగురు చనిపో యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరు గురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

నిజంనిప్పులాంటిది

1 hour and 24 min ago

క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త

హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అయితే, మిగతా మార్గాల లో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటు లో ఉంటాయని చెప్పారు.

ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుం టుందని ఆయన పేర్కొ న్నారు.

ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్ల లో మాత్రమే ప్రయాణికు లను ప్రవేశానికి అనుమతి స్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.

మిగతా మార్గాల్లో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగు తాయన్నారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆర్సీబీ, సన్ రైజర్స్ కు మధ్య మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే...

నిజంనిప్పులాంటిది

1 hour and 25 min ago

ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను. నియ మిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమిం చింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది....

నిజంనిప్పులాంటిది

1 hour and 38 min ago

ఢిల్లీ తో పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఆఖ‌రి బంతికి అయిదు ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

కాగా, అంత‌కుముందు భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రెండో ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా 39,తో కలిసి సాయి సుద ర్శన్ 50,దూకుడుగా ఆడాడు.

అయితే 10వ ఓవర్‌లో నాలుగో బంతికి సాహా ఔటయినప్పటికీ.. సాయి సుదర్శన్‌ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (1) వెంటనే ఔటయ్యాడు..

ఇలా మొత్తం ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయిన గుజ‌ రాత్ విజ‌యం చేరువ‌లోకి వ‌చ్చి ఓట‌మిచెందింది...

VijayaKumar

1 hour and 54 min ago

ఇంటర్ ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల లో మండల ర్యాంకులు సాధించారు. 

ఎంపీసీ సెకండ్ ఇయర్ లో ప్రణీత 906 ,భవ్య 883, 

 బైపిసి సెకండియర్ లో దుర్గాప్రసాద్ 878 ,సురేఖ 829,  

సీఈసీ సెకండ్ ఇయర్ లో శివరంజని 737 

ప్రథమ సంవత్సరం బైపిసి లో గోరి నజ్రిన్ 395 ,శృతి 394, నజ్మా 326 ,ఇస్రాత్ బేబీ 304 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని కళాశాల ప్రిన్సిపల్ ,అధ్యాపక బృందం అభినందించారు.

VijayaKumar

2 hours and 46 min ago

బ్యాంకు నగదు కాజేసి ఆన్లైన్ బెట్టింగ్లులో పెట్టుబడి పెట్టిన క్యాషియర్ అరెస్ట్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంకులో నగదు కాజేసి పరారైన క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. క్యాషియర్ అనిల్ కుమార్ రూపాయలు 15 లక్షల 50 వేల రూపాయలు నగదులో కొరత ఏర్పడగా బ్యాంక్ మేనేజర్ జి మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 16న పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ రూ.37,63,000 ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

VijayaKumar

3 hours ago

వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల రాత్రి 8 గంటలకు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవం అనే కార్యక్రమం అకాడమిక్ క్యాలెండర్ లో భాగంగా నిర్వహించే కార్యక్రమం అని అన్నారు . వీటి వలన విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలుకి తీయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వర్, శ్రీనివాస్ ,స్వప్న ,కిష్టయ్య ,గీతారెడ్డి ,సంతోష ,విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

నిజంనిప్పులాంటిది

1 hour and 20 min ago

నేడు తెలంగాణకు అమిత్ షా! సిద్దిపేట లొ భారీ బహిరంగ సభ

అగ్ర‌నేత అమిత్‌షా ఇవాళ తెలంగాణ‌లో ప‌ర్య‌టించ‌ను న్నారు. సిద్దిపేట‌లో నిర్వ‌ హించే బ‌హిరంగ స‌భ‌లో ఆయ‌న పాల్గొంటారు.

ఢిల్లీ నుంచి ఉదయం బయ లుదేరి బేగంపేట విమానాశ్ర యానికి చేరుకుంటారు అక్కడి నుంచి హెలికా ప్టర్‌లో సిద్దిపేటకు చేరు కుంటారు. డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ విజయ సంకల్ప బహిరంగ సభలో పాల్గొంటారు.

మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావుకి మద్ద తుగా అమిత్ షా ఎన్నికల ప్రచారం చేయనున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సభ జరగనుంది.

ఆ తర్వాత 1.45 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని రెండున్నర గంటలపాటు అక్కడే ఉంటారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర నేతలతో సమావేశం నిర్వహించి ఎన్నికలపై దిశానిర్దేశం చేయనున్నారు.

సాయంత్రం 4.15 గంటలకు భువనేశ్వర్‌కు బయలుదేరు తారు. ఇక మరోవైపు రాష్ట్రంలో మే 13న పోలింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో మే 4, 6, 8 తేదీల్లో ప్రధాని మోడీ రాష్ట్ర పర్యటన దాదాపుగా ఖరారైంది.

ఇక.. పార్టీ నేతలు, కార్యక ర్తల్లో జోష్‌ నింపేలా ప్రధాని మోడీ పర్యటన ఉంటుందని సమాచారం...

నిజంనిప్పులాంటిది

1 hour and 21 min ago

ఇంటర్మీడియట్ ఫలితాల్లో అమ్మాయిల దే హవా

రాష్ట్రంలో ఇంటర్మీడియెట్‌ వార్షిక ఫలితాలను బుధవా రం హైదరాబాద్‌లోని ఇంటర్‌ బోర్డులో విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి శృతి ఓజా విడుదల చేశారు.

ఈ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్‌ ప్రథమ సంవత్స రంలో 4,78,723 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,87,261 (60.01 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,41,682 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,65,190 (68.35 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,37, 041,మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,22,071 (51.50 శాతం) మంది పాసయ్యారు.

అంటే అబ్బాయిల కంటే అమ్మాయిలు 16.85 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు.ఇంటర్‌ ప్రథమ సంవత్సరం జనరల్‌ విభా గంలో 4,30,413 మంది పరీక్షలు రాస్తే, 2,62,829 (61.06 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

ఇందులో 2,17,716 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,49,331 (68.59 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,12 ,697 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,13, 498,(53.36 శాతం) మంది పాసయ్యారు.

ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఒకేషనల్‌ విభాగంలో 48,310 మంది పరీక్ష రాస్తే, 24,432 (50.57 శాతం) మంది ఉత్తీర్ణత సాధిం చారు. ఇందులో 23,966 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 15,859 (66.17 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు.

24,344 మంది అబ్బాయి లు పరీక్షలు రాస్తే, 8,573 (35.21 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో 5,02,280 మంది పరీక్షలకు హాజరుకాగా, 3,22,432 (64.19 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఇందులో 2,47,358 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,79,412 (72.53 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 2,54,922 మంది అబ్బాయి లు పరీక్షలు రాయగా, 1,43,020 (56.10 శాతం) మంది పాసయ్యారు. ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బా యిల కంటే అమ్మా యిలు 16.43 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్స రం జనరల్‌ విభాగంలో 4,01,445 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,78,856 (69.46 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,05,381 మంది అమ్మా యిలు పరీక్షలు రాయగా, 1,55,500 (75.71 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఒకేష నల్‌ జనరల్‌ విభాగంలో 42,723 మంది పరీక్షలు రాస్తే, 27,287 (63.86 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు.

ఇందులో 21,853 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు కాగా, 17,327 (79.28 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 20,870 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 9,960 (47.72 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు.

ఈ కార్యక్రమంలో ఇంటర్‌ బోర్డు పరీక్షల నియంత్రణా ధికారి (సీవోఈ) జయప్రద బాయి, జాయింట్‌ సెక్రెటరీ వై శ్రీనివాస్‌, సీజీజీ డైరెక్టర్‌ జనరల్‌ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు...

నిజంనిప్పులాంటిది

1 hour and 22 min ago

ఉత్తర ప్రదేశ్ లొ ఎన్నికల వేళ విషాదం..బీజేపీ ఎంపీ కన్నుమూత

ఉత్తరప్రదేశ్ లొ ఎన్నికల వేళ బీజేపీ ఎంపీ కన్నుమూ శారు. ఉత్తరప్రదేశ్ హత్రాస్ బీజేపీ ఎంపీ రాజ్ వీర్ దిలేర్ అలీగఢ్ లోని ఆస్పత్రిలో ఈరోజు ఉదయం మర ణించారు.

గత కొంతకాలంగా రాజ్ వీర దిలేర్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో హథ్రాస్ నుంచి బీజేపీ ఎంపీగా గెలిచారు.

కాగా ఈసారి ఎన్నికల్లోనూ అదే స్థానానికి పోటీ చేస్తు న్నారు రాజ్ వీర్ దిలేర్. ఆయన మృతితో స్థానిక కార్యకర్తలు దిగ్భ్రాంతి గురయ్యారు.

దిలేర్ 2017లో ఇగ్లాస్ నుంచి ఉత్తరప్రదేశ్ శాసన సభకు ఎన్నికయ్యారు. తర్వాత లోక్‌ సభకు ఎన్నికయ్యారు. దీంతో, ఎమ్మెల్యే పదవికి రాజీనా మా చేశారు. దిలేర్ మృతికి యూపీ సీఎం యోగి ఆది త్యనాథ్ సంతాపాన్ని వ్యక్తం చేశారు.

రాజ్ వీర్ దిలేర్ అకాల మరణం చాలా బాధాకరం అని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. బీజేపీకి, ఆయన కుటుంబానికి దిలేర్ మృతి తీరని లోటని సానుభూతి వ్యక్తం చేశారు.

నిజంనిప్పులాంటిది

1 hour and 23 min ago

సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఆరుగురు మృతి

కోదాడ పట్టణ పరిధిలోని శ్రీరంగాపురం సమీపంలో జాతీయ రహదారిపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఆగిఉన్న లారీని వెనక నుంచి కారు ఢీకొట్టడంతో అందులో ఉన్న ఓ చిన్నారి తో సహా ఆరుగురు చనిపో యారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి.

ప్రమాద సమయంలో కారులో ఎనిమిది మంది ప్రయాణిస్తున్నారు. ఆరు గురు ఘటనాస్థంలోనే చనిపోయారు. గాయపడిన ఇద్దరిని కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

కారు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

నిజంనిప్పులాంటిది

1 hour and 24 min ago

క్రికెట్ అభిమానులకు మెట్రో యాజమాన్యం శుభవార్త

హైదరాబాద్ ప్రజలకు మెట్రో యాజమాన్యం శుభవార్త చెప్పింది. ఈరోజున ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ 2024 మ్యాచ్ ఉన్న నేపథ్యంలో ఆ మార్గంలో మెట్రో రైలు సమయాన్ని పొడిగిస్తున్నట్లు తెలిపింది.

అయితే, మిగతా మార్గాల లో మాత్రం సాధారణ మెట్రో వేళలు కొనసాగుతాయని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు. పొడిగించిన మెట్రో సేవలు అర్ధరాత్రి ఒంటి వరకు అందుబాటు లో ఉంటాయని చెప్పారు.

ఉప్పల్ మార్గంలో లాస్ట్ ట్రైన్ అర్థరాత్రి 12.15 గంటలకు బయల్దేరి ఒంటి గంట 10 నిమిషాలకు గమ్యస్థానాన్ని చేరుకుం టుందని ఆయన పేర్కొ న్నారు.

ఆ సమయంలో.. ఉప్పల్, స్టేడియం, ఎన్జీఆర్ఐ స్టేషన్ల లో మాత్రమే ప్రయాణికు లను ప్రవేశానికి అనుమతి స్తున్నట్లు ప్రకటించారు. ఉప్పల్ మార్గంలోని మిగతా స్టేషన్లలో ట్రైన్ దిగే వారికే అనుమతి ఉంటుందని.. ఎక్కడానికి వీలుండదని స్పష్టం చేశారు.

మిగతా మార్గాల్లో మాత్రం డైలీ నడిచే నిర్ణిత వేళలలో మాత్రమే హైదరాబాద్ మెట్రో సేవలు కొనసాగు తాయన్నారు. ఇవాళ హైదరాబాద్ వేదికగా ఆర్సీబీ, సన్ రైజర్స్ కు మధ్య మ్యాచ్ ఉన్న విషయం తెలిసిందే...

నిజంనిప్పులాంటిది

1 hour and 25 min ago

ఇంటెలిజెన్స్ డీజీగా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ..

ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్ ను. నియ మిస్తూ ఎన్నికల సంఘం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

విజయవాడ సీపీగా పీహెచ్ రామకృష్ణను నియమిం చింది. రేపు ఉదయం లోపు బాధ్యతలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొంది....

నిజంనిప్పులాంటిది

1 hour and 38 min ago

ఢిల్లీ తో పోరాడి ఓడిన గుజరాత్ టైటాన్స్

ఢిల్లీతో జ‌రిగిన మ్యాచ్‌లో గుజ‌రాత్ పోరాడినా ఫ‌లితం లేక‌పోయింది. ఆఖ‌రి బంతికి అయిదు ప‌రుగులు చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ ఉత్కంఠ పోరులో ఢిల్లీ నాలుగు ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది.

కాగా, అంత‌కుముందు భారీ లక్ష్య చేధనలో బరిలోకి దిగిన గుజరాత్‌ బ్యాటర్లు చెలరేగి ఆడారు. రెండో ఓవర్‌లో శుభ్‌మన్‌ గిల్‌ (6) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన వృద్ధిమాన్‌ సాహా 39,తో కలిసి సాయి సుద ర్శన్ 50,దూకుడుగా ఆడాడు.

అయితే 10వ ఓవర్‌లో నాలుగో బంతికి సాహా ఔటయినప్పటికీ.. సాయి సుదర్శన్‌ హాఫ్ సెంచరీతో మెరిశాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన అజ్మతుల్లా ఒమర్జాయ్‌ (1) వెంటనే ఔటయ్యాడు..

ఇలా మొత్తం ఎనిమిది వికెట్లు న‌ష్ట‌పోయిన గుజ‌ రాత్ విజ‌యం చేరువ‌లోకి వ‌చ్చి ఓట‌మిచెందింది...

VijayaKumar

1 hour and 54 min ago

ఇంటర్ ఫలితాలలో మండల ర్యాంకులు సాధించిన ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ప్రగతి జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ఫలితాల లో మండల ర్యాంకులు సాధించారు. 

ఎంపీసీ సెకండ్ ఇయర్ లో ప్రణీత 906 ,భవ్య 883, 

 బైపిసి సెకండియర్ లో దుర్గాప్రసాద్ 878 ,సురేఖ 829,  

సీఈసీ సెకండ్ ఇయర్ లో శివరంజని 737 

ప్రథమ సంవత్సరం బైపిసి లో గోరి నజ్రిన్ 395 ,శృతి 394, నజ్మా 326 ,ఇస్రాత్ బేబీ 304 మార్కులు సాధించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన వారిని కళాశాల ప్రిన్సిపల్ ,అధ్యాపక బృందం అభినందించారు.

VijayaKumar

2 hours and 46 min ago

బ్యాంకు నగదు కాజేసి ఆన్లైన్ బెట్టింగ్లులో పెట్టుబడి పెట్టిన క్యాషియర్ అరెస్ట్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని ఎస్ బి ఐ బ్యాంకులో నగదు కాజేసి పరారైన క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ని పోలీసులు అరెస్ట్ చేసి బుధవారం కోర్టు ముందు హాజరు పరిచారు. క్యాషియర్ అనిల్ కుమార్ రూపాయలు 15 లక్షల 50 వేల రూపాయలు నగదులో కొరత ఏర్పడగా బ్యాంక్ మేనేజర్ జి మౌనిక స్థానిక పోలీస్ స్టేషన్లో ఏప్రిల్ 16న పిటిషన్ దాఖలు చేశారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు క్యాషియర్ కాలేరు అనిల్ కుమార్ ఆన్లైన్ బెట్టింగులకు పాల్పడుతూ రూ.37,63,000 ఆన్లైన్ బెట్టింగ్ లో పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు.

VijayaKumar

3 hours ago

వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఘనంగా పాఠశాల వార్షికోత్సవం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని వర్కట్ పల్లి ప్రాథమికోన్నత పాఠశాల రాత్రి 8 గంటలకు పాఠశాల వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థులు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు పాల్గొన్నారు . ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు హనీఫ్ అహ్మద్ మాట్లాడుతూ పాఠశాల వార్షికోత్సవం అనే కార్యక్రమం అకాడమిక్ క్యాలెండర్ లో భాగంగా నిర్వహించే కార్యక్రమం అని అన్నారు . వీటి వలన విద్యార్థుల్లో దాగివున్న సృజనాత్మకతను వెలుకి తీయవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మహేశ్వర్, శ్రీనివాస్ ,స్వప్న ,కిష్టయ్య ,గీతారెడ్డి ,సంతోష ,విద్యార్థులు తల్లిదండ్రులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.