VijayaKumar

3 hours ago

భువనగిరి రోడ్ షో లో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేసీఆర్ బస్సు యాత్ర - 2 వ రోజు.

సూర్యాపేట నుంచి మధ్యాహ్నం బయలుదేరిన కేసీఆర్, వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్నారు.

మార్గమధ్యంలో పలు చోట్ల కార్యకర్తలు ప్రజలు అభిమానం తో దారిపొడవునా ఘన స్వాగతం పలికారు.

సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భువనగిరి రోడ్డు షోలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సాయంత్రం భువనగిరి లో నిర్వహించిన రోడ్డు షోలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం - ముఖ్యాంశాలు :

మొత్తం మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి.

పిచ్చిగా ఉన్మాదం తో కాకుండా ఏపార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీ మనకోసం పనిచేస్తదో ఆలోచించి ఓటేయాలి

బీజేపీ మేకిన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఒక్కటి అమలు చేస్తాలేదు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు

డాలరు విలువ 83 రూపాయలకు పెరిగింది

ఒకపార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతంది.. ఇంకో పార్టీ దేవుని మీద ఒట్లు .. ఇదీ నడుస్తాంది

మనం అద్భుతంగా యాదాద్రిని నిర్మించుకున్నం కానీ ఎన్నడూ ఓట్లకోసం వాడుకోలే

భోనగిరిలో బిజెపి కాంగ్రెస్ మిలకత్ అయినయి

అక్షింతలు తీర్థాలు మన పిలగాన్ల కడుపునింపుతదా .?

తలకాయ తెగిపడ్డా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన మోడీ కి

కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే

ఇవ్వాళ ఎంపీ గా పోటీ చేసేటాయిన అయ్యల ఎంత అడిగిన ఇయ్యాలే 

తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ

ఇప్పుడు యువత ఆలోచించాలి భవిష్యత్తు మీదే

మన శత్రువే కాంగ్రెస్ పార్టీ

నాడు ఎవ్వడు లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని పదేండ్లు నడిపినాం

తల్లికొడివలే అందరినీ కాపాడుకున్నాం

మొదటి సంవత్సరం లోనే చెడిపోయిన కరెంటును బాగుచేసుకున్నాం రైతుబంధు ఇచ్చుకున్నాం

బసవపురం రిజర్వాయర్ కట్టుకున్నం

ఐదేకురాలకు ఇస్తామంటే ఆరో ఏకురం వాడు ఎటుపోవాలి

పొలాలను ఎండబెట్టిండ్రు

బోర్లు ఎండినాయి పూడికలు తీసే క్రేన్లు మల్లోచ్చినాయి

ధాన్యం కొంటలేరు

రాత్రిపూట మోటర్ పెట్టి పాము కాట్లకు సచ్చే దుర్మార్గపు పాలన కాంగ్రెస్ ది

కేసీఆర్ పొంగనే కట్క బంజేసినట్టే నీళ్లు ఆగినాయి కరెంటు ఆగింది

దద్దమ్మనప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు

రైతులు చనిపోతే ఒక్క మంత్రి పోలె సీఎం పోలె

నా కండ్లముందాలనే పంట ఎండిపోతే ఎంజేయాల్నే నోరుమూసుకుని ఊకోవాల్నా కొట్లాడాల్నా.?

ఫీజు రీబర్సంట్ ఇస్తాళేరు

చేనేత కార్మికులను ఆదుకుంటాలేరు

నిరుద్యోగ బృతి లేదు బోగస్

ఐదొందలు బోనస్ అన్నరు ఇప్పుడు లేదు అంటున్రు

రెండు లక్షలు రుణ్మాఫీ అన్నారు ఇచ్చిండ్రా

తులం బంగారం తుస్సుమన్నది బోనస్ బోగస్ అయింది

గృహకు జ్యోతి విద్యుత్తు పరిస్థితి అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయింది 

స్కూటీ రాలేదు కానీ లూటీ అయితాది

తెలంగాణ కు కాంగ్రెస్ కు పంచాతి పడ్డది మీరు ఎవలిని కోరుకుంటారు పంచ్ గా…

కేసీఆర్ కేసీఆర్ ప్రజల స్పందన  

నన్ను తెలంగాణ కోసం పుట్టించిండ్రు దేవుడు

ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్… కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు

దేర్ హోగా మగర్ అందేర్ నహీ

మనది సెక్యులర్ పార్టీ

నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు.. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుతాం

బిఆర్ఎస్ కార్ గుర్తుమీద ఓటేసి క్యామ మల్లేష్ గారిని గెలిపించండి

ఆయన 24 గంటలు మీ సేవలో వుంటాడు తలలో నాలుక లాగా ఉంటాడు

* ఇదే ఉత్సాహం మే 13 దాకా చూయించి బీఆర్ ఎస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి.

నిజందాగదుక్షణంఆగదు

4 hours ago

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు

రేపు నామినేషన్ల పరిశీలన

ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

వచ్చే నెల 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్

ఏపీలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు

అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు

తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు

Mane Praveen

4 hours ago

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బాలు నాయక్

చందంపేట మండలం, బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ హన్మా నాయక్ కుమార్తె శోభారాణి-శరత్ కుమార్ వివాహ రిసెప్షన్ కు గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు జాలే నరసింహారెడ్డి, చందంపేట జడ్పిటిసి బుజ్జి లచ్చిరాం నాయక్, ఎంపీపీ పార్వతి చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు

SB NEWS

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

4 hours ago

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వాలని వినతి పత్రం

నల్లగొండ: తెలంగాణ గవర్నమెంట్ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం సూచన మేరకు ఈరోజు టీజి సిజిటిఏ నల్లగొండ జిల్లా యూనిట్ బాధ్యులు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ రిజిస్టార్ అల్వాల రవి ని కలిసి, యూజీసీ నిబంధనల ప్రకారం వేసవి సెలవులు ఆరు వారాలకు తగ్గకుండా ఇవ్వాలని, విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి జూన్ 23 వరకు వేసవి సెలవులను ప్రకటించాలని వినతి పత్రం ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో టి జి సి జి టి ఏ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ మునీర్, ఉపాధ్యక్షులు టి. భాస్కర్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. యాదగిరి రెడ్డి, సుదర్శన్ రెడ్డి,. తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

4 hours ago

నాగార్జునసాగర్ జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 505. 70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 124.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

అవుట్ ఫ్లో 6, 841 క్యూసెక్కులు నమోదు కాగా, ఇన్ ఫ్లో లేదు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

VijayaKumar

5 hours ago

సొంతగూటికి చేరుకున్న గోదా రాహుల్ గౌడ్


గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాయినింగ్ కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి మరియు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మరియు మన ఎమ్మెల్సీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మహేష్ కూమార్ గౌడ్ ఆధ్వర్యంలో యాదాద్రి బోవనగిరి జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఓబీసి విభాగం చైర్మన్ గోద రాహుల్ గౌడ్ మరియు వారి బృందం తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

జారగాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కాంగ్రెస్ పార్టీ పెద్దలు బలపరిచిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి గెలుపు కోసం పని చెస్తాను తెలపడం జరిగింది.

VijayaKumar

6 hours ago

భువనగిరి పార్లమెంట్ మైనార్టీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో సమావేశం


 భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్లో భువనగిరి పట్టణ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ రాశేద్ హుస్సేన్ అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల మైనార్టీ ఇన్చార్జిలు మరియు ముఖ్య మైనారిటీ నేతలతో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంటు మైనార్టీ ఇన్చార్జ్ జమల్ షరీఫ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇంచార్జ్ జమాల్ షరీఫ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి ఖిలా మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. దేశంలో కొనసాగుతున్న మోడీ నియంతృత్వ పాలనను ప్రాలదొలి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. బిజెపి ప్రభుత్వము మతాల మధ్య చిచ్చుపెట్టి దేశంలో కలిసిమెలిసి అన్నదమ్ముల లాగా ఉంటున్న అమాయక ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను దోసి అదానీ అంబానీలకు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం దుర్మార్గం అని దుయ్యబట్టారు. అంతేకాకుండా మళ్ళీ తిరిగి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రతి ఒక్కరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పై ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ తో గెలిపియాలని కోరారు.కోరారు. 2009 లో భువనగిరి పార్లమెంటు నూతనంగా ఏర్పడిన తర్వాత మొత్తం మూడుసార్లు ఎన్నికలు జరిగితే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ ఇన్చార్జ్ మహమ్మద్ రఫీ, భువనగిరి అసెంబ్లీ ఇంచార్జ్ సయ్యద్ రాషేద్ హుస్సేన్, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీ రఫీయొద్దీన్ గౌరీ, మున్సిపల్ కౌన్సిలర్ సలావుద్దీన్, మాజీ కోఆప్షన్ ఆబిద్ అలీ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అవెస్ చిష్టి,మైనార్టీ నాయకులు యూనుస్, మొహమ్మద్ అతహర్,షేక్ షబ్బీర్, అబ్దుల్ మన్నన్, అబ్బు చావుష్. తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

8 hours ago

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు


వలిగొండ మండల పరిధిలోని కెర్చిపల్లి గ్రామం నుండి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ శాఖ అధ్యక్షులు కందకట్ల సత్తిరెడ్డి,కళ్ళం అచ్చిరెడ్డి,వలమల్ల అమరేందర్,దయ్యాల కృష్ణ,దయ్యాల యాదయ్య,దయ్యాల ఐలయ్య,దొడ్డారపు పెంటయ్య,భర్మ గణేష్,భర్మ శ్రీ శైలం,శిలోజు వెంకటేష్ చారి,కళ్ళెం రామరెడ్డి,లోడె యాదయ్య,శ్యామల లక్ష్మయ్య,కందడి నర్సిరెడ్డి,దయ్యాల సత్యనారాయణ,కందడి రాంచంద్రారెడ్డి,గుండు సత్తిరెడ్డి,కందగట్ల లక్ష్మారెడ్డి,కందకట్ల వెంకట్, రెడ్డి కళ్ళెం సత్తిరెడ్డి 100 మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు ఎమ్మె వెంకటేష్,యూత్ అధ్యక్షులు లోడె శ్రీకాంత్,ఉపాధ్యక్షులు కోల వెంకటేష్,గునిగంటి బాలయ్య,శివకుమార్,శ్రీనివాస్ రెడ్డి,కిష్టారెడ్ది పాల్గోన్నారు.

VijayaKumar

8 hours ago

ఈనెల 28న వరంగల్ లో జరిగే సమూహ సభ పోస్టర్ ఆవిష్కరణ


                

లౌకిక విలువ‌లు- సాహిత్యం థీమ్‌తో వ‌రంగ‌ల్‌లో 2024 ఏప్రిల్ 28న నిర్వ‌హించ‌నున్న స‌మూహ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని భువ‌న‌గిరిలోని స‌మూహ మిత్రుల ఆధ్వ‌ర్యంలో పోస్ట‌ర్‌, క‌ర‌ప‌త్రం ఆవిష్క‌ర‌ణ కార్యక్రమం గురువారం భువనగిరి పట్టణంలోని ఎస్వీ హోటల్ లో నిర్వహించడం జరిగింది. ఆవిష్క‌ర‌ణ‌లో ప్ర‌జాసంఘాల నాయ‌కులు బ‌ట్టు రాంచంద్ర‌య్య క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రిస్తూ... దేశంలో ఫాసిస్టు ప్ర‌మాదం పెరిగిపోతున్న‌ద‌ని దానికి బాధ్యుడు మోదీ అని ఆయ‌న అన్నారు. ఈ సారి గెలిస్తే.. ఒకే దేశం- ఒకే ఎన్నిక ను అమ‌లు చేస్తామ‌ని ఇప్పుడే ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌క‌టిస్తూ.. దేశంలో కేంద్రీకృత అధ్య‌క్ష‌త‌ర‌హ పాల‌న ను తేద‌లుచుకున్న‌ట్లు బిజెపి నేత‌లు స్ప‌ష్టంగానే ప్ర‌క‌టిస్తున్నార‌ని అన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ ప‌రివార్, బిజెపి శ‌క్తులు దేశంలో మెజారిటీ వాదాన్ని అనుస‌స్తూ విభ‌జ‌న రాజ‌కీయాల‌ను చేస్తూన్నారని తెలిపారు. ఈ ప‌రిస్థితుల్లో కుల‌మ‌తాల ఆస‌రాతో ఓట్ల‌ను దండుకొని నియంతృత్వాన్ని నెల‌కొల్ప చూస్తున్న బిజెపిని ఓడించ‌టం లౌకిక ప్ర‌జాస్వామిక శ‌క్తుల ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని పిలుపునిచ్చారు. ఆ క్ర‌మం లో ఫాసిజాన్ని ఓడించ‌టం కోసం వ‌రంగల్ లో నిర్వ‌హిస్తున్న స‌మూహ స‌భ‌ను విజ‌యవంతం చేయ‌టానికి లౌకిక ప్ర‌జాస్వామిక వాదులు త‌ర‌లిరావాల‌ని కోరారు.సామాజిక కార్యకర్త కోడారి వెంక‌టేశ్ మాట్లాడుతూ దేశంలో మ‌తోన్మాద శ‌క్తులు విజృంభిస్తూ అన్నిర‌కాల స్వేచ్ఛా స్వంతంత్య్రాల‌ను హ‌రిస్తున్నాయ‌ని అన్నారు. అందుకోసం స్వేచ్ఛా ప్రియులంతా ఫాసిజాన్ని ఓడించ‌టానికి సంఘ‌టితం కావాల‌ని పిలుపునిచ్చారు. స‌మూహ జిల్లా బాధ్యులు శేక్.హ‌మీద్ పాశ మాట్లాడుతూ..దేశంలో నానాటికీ విజృంభిస్తున్న మ‌తోన్మాద శ‌క్తులు స‌మాజాన్ని విడ‌దీసి ఓట్లుదండుకోవాల‌ని చూస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఓట్ల కోసం బిజెపి ఆర్ ఎస్ ఎస్ శ‌క్తులు మ‌త ఉద్రిక్త‌త‌ల‌ను ఎగ‌దోస్తూ మెజారిటీ ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు కుట్ర‌లు, కుహ‌కాల‌కు పాల్ప డుతున్నాయ‌ని తెలిపారు. ఈ ప‌రిస్తితుల్లో మ‌తోన్మాద ఫాసిస్టు శ‌క్తుల‌ను ఓడించ‌ట‌మే క‌ర్త‌వ్యంగా ప్ర‌జాస్వామిక శ‌క్తుల‌న్నీ ఏకం కావాల్సి ఉంద‌ని అన్నారు. డీటీఎఫ్ నేత స‌త్త‌య్య మాట్లాడుతూ ప్ర‌జాస్వామిక హ‌క్కుల‌ను హ‌రించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తూ పాఠ్యాంశాల్లో శాస్త్రీయ భావ‌న‌ల‌కు స‌మాధి క‌డుతున్న బిజెపి శ‌క్తుల‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు, మేధావుల‌కు పిలుపునిచ్చారు.ఈ ఆవిష్కరన కార్యక్రమంలో టీపీఎఫ్ నాయ‌కులు కాశ‌పాక మ‌హేశ్, న్యాయ వాది జిట్టా భాస్క‌ర్ రెడ్డి, డీటీఎఫ్ నాయకులు స‌త్త‌య్య‌, ద‌య్యాల బాలన‌ర్స‌య్య‌, స‌మూహ బాధ్యులు శ్రీ‌నివాసా చార్యులు,సామ మ‌ల్లారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

      

VijayaKumar

9 hours ago

భువనగిరిలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు ఖాయం: భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పదాధికారులు మరియు ముఖ్య నాయకుల సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1 తారీకు నుండి 8 తారీకు వరకు జరిగే కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయాలని కోరారు మరియు మే 3 వ తేదీన చౌటుప్పల్ లో జరిగే బారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ గారు హాజరవుతారు ఈసభను విజయవంతం చేయాలని కోరారు ,అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ గెలుపు కూడా బూత్ ఓటర్ల పైన వుంటుంది కాబట్టి రానున్న భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బూత్ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ పైన వుందని అన్నారు, కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఓటును అభ్యార్ధించాలని అన్నారు,తెలంగాణ ఓటర్లు బిజెపి వైపు వున్నారు అని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి గౌడ్ సీనియర్ నాయకులు బందారపు రాములు మండల ఉపాధ్యక్షులు డోగ్పర్తి సంతోష్,గంగదారి దయాకర్, కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ ,మండల కార్యదర్శులు మందుల నాగరాజు , BJYM బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేగురి అమరేందర్, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు దంతూరి అరుణ్,బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, ,కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం బూత్ అద్యక్షులు బొంత భాస్కర్, భిక్షపతి , తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

3 hours ago

భువనగిరి రోడ్ షో లో పాల్గొన్న మాజీ సీఎం కేసీఆర్


యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో కేసీఆర్ బస్సు యాత్ర - 2 వ రోజు.

సూర్యాపేట నుంచి మధ్యాహ్నం బయలుదేరిన కేసీఆర్, వయా అర్వపల్లి, తిరుమలగిరి, జనగాం మీదుగా భువనగిరి చేరుకున్నారు.

మార్గమధ్యంలో పలు చోట్ల కార్యకర్తలు ప్రజలు అభిమానం తో దారిపొడవునా ఘన స్వాగతం పలికారు.

సాయంత్రం 7 గంటలకు ప్రారంభమైన భువనగిరి రోడ్డు షోలో స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సాయంత్రం భువనగిరి లో నిర్వహించిన రోడ్డు షోలో బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రసంగం - ముఖ్యాంశాలు :

మొత్తం మూడు పార్టీలు పోటీలో ఉన్నాయి.

పిచ్చిగా ఉన్మాదం తో కాకుండా ఏపార్టీకి ఓటు వేయాలో ఏ పార్టీ మనకోసం పనిచేస్తదో ఆలోచించి ఓటేయాలి

బీజేపీ మేకిన్ ఇండియా అంటూ పెద్ద పెద్ద నినాదాలు చేస్తూ ఒక్కటి అమలు చేస్తాలేదు.

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళల మీద దాడులు

డాలరు విలువ 83 రూపాయలకు పెరిగింది

ఒకపార్టీ దేవుని పేరు చెప్పి ఓట్లు అడుగుతంది.. ఇంకో పార్టీ దేవుని మీద ఒట్లు .. ఇదీ నడుస్తాంది

మనం అద్భుతంగా యాదాద్రిని నిర్మించుకున్నం కానీ ఎన్నడూ ఓట్లకోసం వాడుకోలే

భోనగిరిలో బిజెపి కాంగ్రెస్ మిలకత్ అయినయి

అక్షింతలు తీర్థాలు మన పిలగాన్ల కడుపునింపుతదా .?

తలకాయ తెగిపడ్డా కరెంటు మోటార్లకు మీటర్లు పెట్టనని చెప్పిన మోడీ కి

కేంద్రం ఒక్క నవోదయ పాఠశాల కూడా ఇయ్యలే

ఇవ్వాళ ఎంపీ గా పోటీ చేసేటాయిన అయ్యల ఎంత అడిగిన ఇయ్యాలే 

తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ

ఇప్పుడు యువత ఆలోచించాలి భవిష్యత్తు మీదే

మన శత్రువే కాంగ్రెస్ పార్టీ

నాడు ఎవ్వడు లేకున్నా తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుని పదేండ్లు నడిపినాం

తల్లికొడివలే అందరినీ కాపాడుకున్నాం

మొదటి సంవత్సరం లోనే చెడిపోయిన కరెంటును బాగుచేసుకున్నాం రైతుబంధు ఇచ్చుకున్నాం

బసవపురం రిజర్వాయర్ కట్టుకున్నం

ఐదేకురాలకు ఇస్తామంటే ఆరో ఏకురం వాడు ఎటుపోవాలి

పొలాలను ఎండబెట్టిండ్రు

బోర్లు ఎండినాయి పూడికలు తీసే క్రేన్లు మల్లోచ్చినాయి

ధాన్యం కొంటలేరు

రాత్రిపూట మోటర్ పెట్టి పాము కాట్లకు సచ్చే దుర్మార్గపు పాలన కాంగ్రెస్ ది

కేసీఆర్ పొంగనే కట్క బంజేసినట్టే నీళ్లు ఆగినాయి కరెంటు ఆగింది

దద్దమ్మనప్రభుత్వం కాకుంటే ఏందన్నట్టు

రైతులు చనిపోతే ఒక్క మంత్రి పోలె సీఎం పోలె

నా కండ్లముందాలనే పంట ఎండిపోతే ఎంజేయాల్నే నోరుమూసుకుని ఊకోవాల్నా కొట్లాడాల్నా.?

ఫీజు రీబర్సంట్ ఇస్తాళేరు

చేనేత కార్మికులను ఆదుకుంటాలేరు

నిరుద్యోగ బృతి లేదు బోగస్

ఐదొందలు బోనస్ అన్నరు ఇప్పుడు లేదు అంటున్రు

రెండు లక్షలు రుణ్మాఫీ అన్నారు ఇచ్చిండ్రా

తులం బంగారం తుస్సుమన్నది బోనస్ బోగస్ అయింది

గృహకు జ్యోతి విద్యుత్తు పరిస్థితి అన్న వస్త్రాలకు పోతే ఉన్న వస్త్రాలు పోయినట్టు అయింది 

స్కూటీ రాలేదు కానీ లూటీ అయితాది

తెలంగాణ కు కాంగ్రెస్ కు పంచాతి పడ్డది మీరు ఎవలిని కోరుకుంటారు పంచ్ గా…

కేసీఆర్ కేసీఆర్ ప్రజల స్పందన  

నన్ను తెలంగాణ కోసం పుట్టించిండ్రు దేవుడు

ప్రజల గుండె చీలిస్తే కనిపించేది కేసీఆర్… కేసీఆర్ గుండె చీలిస్తే కనపడితే కనిపించేది తెలంగాణ ప్రజలు

దేర్ హోగా మగర్ అందేర్ నహీ

మనది సెక్యులర్ పార్టీ

నా బిడ్డను తీసుకపోయి అరెస్ట్ చేసిండ్రు.. ప్రాణం పోయేదాకా న్యాయం కోసం కొట్లాడుతాం

బిఆర్ఎస్ కార్ గుర్తుమీద ఓటేసి క్యామ మల్లేష్ గారిని గెలిపించండి

ఆయన 24 గంటలు మీ సేవలో వుంటాడు తలలో నాలుక లాగా ఉంటాడు

* ఇదే ఉత్సాహం మే 13 దాకా చూయించి బీఆర్ ఎస్ ను భారీ మెజారిటీ తో గెలిపించాలి.

నిజందాగదుక్షణంఆగదు

4 hours ago

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు

తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

చివరి రోజు భారీగా దాఖలైన నామినేషన్లు

రేపు నామినేషన్ల పరిశీలన

ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు

వచ్చే నెల 13న పోలింగ్‌, జూన్‌ 4న కౌంటింగ్

ఏపీలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు

అసెంబ్లీ స్థానాలకు 3,300కు పైగా నామినేషన్లు దాఖలు

తెలంగాణలో ఎంపీ స్థానాలకు 600కు పైగా నామినేషన్లు

Mane Praveen

4 hours ago

నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే బాలు నాయక్

చందంపేట మండలం, బొల్లారం గ్రామానికి చెందిన నేనావత్ హన్మా నాయక్ కుమార్తె శోభారాణి-శరత్ కుమార్ వివాహ రిసెప్షన్ కు గురువారం నియోజకవర్గ ఎమ్మెల్యే బాలు నాయక్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు జాలే నరసింహారెడ్డి, చందంపేట జడ్పిటిసి బుజ్జి లచ్చిరాం నాయక్, ఎంపీపీ పార్వతి చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు

SB NEWS

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

4 hours ago

ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు వేసవి సెలవులు ఇవ్వాలని వినతి పత్రం

నల్లగొండ: తెలంగాణ గవర్నమెంట్ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం సూచన మేరకు ఈరోజు టీజి సిజిటిఏ నల్లగొండ జిల్లా యూనిట్ బాధ్యులు మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ రిజిస్టార్ అల్వాల రవి ని కలిసి, యూజీసీ నిబంధనల ప్రకారం వేసవి సెలవులు ఆరు వారాలకు తగ్గకుండా ఇవ్వాలని, విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలలకు మే 10 నుండి జూన్ 23 వరకు వేసవి సెలవులను ప్రకటించాలని వినతి పత్రం ఇచ్చారు. 

ఈ కార్యక్రమంలో టి జి సి జి టి ఏ నల్లగొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ సయ్యద్ మునీర్, ఉపాధ్యక్షులు టి. భాస్కర్ రెడ్డి, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కోఆర్డినేటర్ డాక్టర్ ఈ. యాదగిరి రెడ్డి, సుదర్శన్ రెడ్డి,. తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

Mane Praveen

4 hours ago

నాగార్జునసాగర్ జలాశయంలో తగ్గుతున్న నీటి నిల్వలు

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకు తగ్గుతున్నాయి. గురువారం ప్రాజెక్టు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకుగాను 505. 70 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.00 టీఎంసీలకు గాను 124.48 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

అవుట్ ఫ్లో 6, 841 క్యూసెక్కులు నమోదు కాగా, ఇన్ ఫ్లో లేదు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

VijayaKumar

5 hours ago

సొంతగూటికి చేరుకున్న గోదా రాహుల్ గౌడ్


గాంధీ భవన్ లో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జాయినింగ్ కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి మరియు కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం మరియు మన ఎమ్మెల్సీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మహేష్ కూమార్ గౌడ్ ఆధ్వర్యంలో యాదాద్రి బోవనగిరి జిల్లా మాజీ కాంగ్రెస్ పార్టీ ఓబీసి విభాగం చైర్మన్ గోద రాహుల్ గౌడ్ మరియు వారి బృందం తిరిగి కాంగ్రెస్ పార్టీ లో చేరడం జరిగింది.

జారగాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కాంగ్రెస్ పార్టీ పెద్దలు బలపరిచిన అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్న గారి గెలుపు కోసం పని చెస్తాను తెలపడం జరిగింది.

VijayaKumar

6 hours ago

భువనగిరి పార్లమెంట్ మైనార్టీ ఇన్చార్జ్ ఆధ్వర్యంలో సమావేశం


 భువనగిరి పట్టణంలోని న్యూ వివేరా హోటల్లో భువనగిరి పట్టణ మైనారిటీ అధ్యక్షుడు సయ్యద్ రాశేద్ హుస్సేన్ అధ్యక్షతన భువనగిరి పార్లమెంట్లోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల మైనార్టీ ఇన్చార్జిలు మరియు ముఖ్య మైనారిటీ నేతలతో సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా భువనగిరి పార్లమెంటు మైనార్టీ ఇన్చార్జ్ జమల్ షరీఫ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా పార్లమెంట్ ఇంచార్జ్ జమాల్ షరీఫ్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి ఖిలా మీద కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. దేశంలో కొనసాగుతున్న మోడీ నియంతృత్వ పాలనను ప్రాలదొలి సెక్యులర్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. బిజెపి ప్రభుత్వము మతాల మధ్య చిచ్చుపెట్టి దేశంలో కలిసిమెలిసి అన్నదమ్ముల లాగా ఉంటున్న అమాయక ప్రజలను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను దోసి అదానీ అంబానీలకు కట్టబెట్టడమే కాకుండా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అమ్మడం దుర్మార్గం అని దుయ్యబట్టారు. అంతేకాకుండా మళ్ళీ తిరిగి కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కావున ప్రతి ఒక్కరూ రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తు పై ఓటు వేసి భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యధిక మెజారిటీ తో గెలిపియాలని కోరారు.కోరారు. 2009 లో భువనగిరి పార్లమెంటు నూతనంగా ఏర్పడిన తర్వాత మొత్తం మూడుసార్లు ఎన్నికలు జరిగితే రెండు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు అసెంబ్లీ ఇన్చార్జ్ మహమ్మద్ రఫీ, భువనగిరి అసెంబ్లీ ఇంచార్జ్ సయ్యద్ రాషేద్ హుస్సేన్, రాష్ట్ర మైనార్టీ జనరల్ సెక్రెటరీ రఫీయొద్దీన్ గౌరీ, మున్సిపల్ కౌన్సిలర్ సలావుద్దీన్, మాజీ కోఆప్షన్ ఆబిద్ అలీ, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షులు అవెస్ చిష్టి,మైనార్టీ నాయకులు యూనుస్, మొహమ్మద్ అతహర్,షేక్ షబ్బీర్, అబ్దుల్ మన్నన్, అబ్బు చావుష్. తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

8 hours ago

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేరికలు


వలిగొండ మండల పరిధిలోని కెర్చిపల్లి గ్రామం నుండి భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన గ్రామ శాఖ అధ్యక్షులు కందకట్ల సత్తిరెడ్డి,కళ్ళం అచ్చిరెడ్డి,వలమల్ల అమరేందర్,దయ్యాల కృష్ణ,దయ్యాల యాదయ్య,దయ్యాల ఐలయ్య,దొడ్డారపు పెంటయ్య,భర్మ గణేష్,భర్మ శ్రీ శైలం,శిలోజు వెంకటేష్ చారి,కళ్ళెం రామరెడ్డి,లోడె యాదయ్య,శ్యామల లక్ష్మయ్య,కందడి నర్సిరెడ్డి,దయ్యాల సత్యనారాయణ,కందడి రాంచంద్రారెడ్డి,గుండు సత్తిరెడ్డి,కందగట్ల లక్ష్మారెడ్డి,కందకట్ల వెంకట్, రెడ్డి కళ్ళెం సత్తిరెడ్డి 100 మంది బీఆరెస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో వలిగొండ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పాశం సత్తిరెడ్డి,గ్రామ శాఖ అధ్యక్షులు ఎమ్మె వెంకటేష్,యూత్ అధ్యక్షులు లోడె శ్రీకాంత్,ఉపాధ్యక్షులు కోల వెంకటేష్,గునిగంటి బాలయ్య,శివకుమార్,శ్రీనివాస్ రెడ్డి,కిష్టారెడ్ది పాల్గోన్నారు.

VijayaKumar

8 hours ago

ఈనెల 28న వరంగల్ లో జరిగే సమూహ సభ పోస్టర్ ఆవిష్కరణ


                

లౌకిక విలువ‌లు- సాహిత్యం థీమ్‌తో వ‌రంగ‌ల్‌లో 2024 ఏప్రిల్ 28న నిర్వ‌హించ‌నున్న స‌మూహ స‌భ‌ను విజ‌య‌వంతం చేయాల‌ని భువ‌న‌గిరిలోని స‌మూహ మిత్రుల ఆధ్వ‌ర్యంలో పోస్ట‌ర్‌, క‌ర‌ప‌త్రం ఆవిష్క‌ర‌ణ కార్యక్రమం గురువారం భువనగిరి పట్టణంలోని ఎస్వీ హోటల్ లో నిర్వహించడం జరిగింది. ఆవిష్క‌ర‌ణ‌లో ప్ర‌జాసంఘాల నాయ‌కులు బ‌ట్టు రాంచంద్ర‌య్య క‌ర‌ప‌త్రాన్ని ఆవిష్క‌రిస్తూ... దేశంలో ఫాసిస్టు ప్ర‌మాదం పెరిగిపోతున్న‌ద‌ని దానికి బాధ్యుడు మోదీ అని ఆయ‌న అన్నారు. ఈ సారి గెలిస్తే.. ఒకే దేశం- ఒకే ఎన్నిక ను అమ‌లు చేస్తామ‌ని ఇప్పుడే ఎన్నిక‌ల‌కు ముందే ప్ర‌క‌టిస్తూ.. దేశంలో కేంద్రీకృత అధ్య‌క్ష‌త‌ర‌హ పాల‌న ను తేద‌లుచుకున్న‌ట్లు బిజెపి నేత‌లు స్ప‌ష్టంగానే ప్ర‌క‌టిస్తున్నార‌ని అన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ ప‌రివార్, బిజెపి శ‌క్తులు దేశంలో మెజారిటీ వాదాన్ని అనుస‌స్తూ విభ‌జ‌న రాజ‌కీయాల‌ను చేస్తూన్నారని తెలిపారు. ఈ ప‌రిస్థితుల్లో కుల‌మ‌తాల ఆస‌రాతో ఓట్ల‌ను దండుకొని నియంతృత్వాన్ని నెల‌కొల్ప చూస్తున్న బిజెపిని ఓడించ‌టం లౌకిక ప్ర‌జాస్వామిక శ‌క్తుల ముందున్న క‌ర్త‌వ్య‌మ‌ని పిలుపునిచ్చారు. ఆ క్ర‌మం లో ఫాసిజాన్ని ఓడించ‌టం కోసం వ‌రంగల్ లో నిర్వ‌హిస్తున్న స‌మూహ స‌భ‌ను విజ‌యవంతం చేయ‌టానికి లౌకిక ప్ర‌జాస్వామిక వాదులు త‌ర‌లిరావాల‌ని కోరారు.సామాజిక కార్యకర్త కోడారి వెంక‌టేశ్ మాట్లాడుతూ దేశంలో మ‌తోన్మాద శ‌క్తులు విజృంభిస్తూ అన్నిర‌కాల స్వేచ్ఛా స్వంతంత్య్రాల‌ను హ‌రిస్తున్నాయ‌ని అన్నారు. అందుకోసం స్వేచ్ఛా ప్రియులంతా ఫాసిజాన్ని ఓడించ‌టానికి సంఘ‌టితం కావాల‌ని పిలుపునిచ్చారు. స‌మూహ జిల్లా బాధ్యులు శేక్.హ‌మీద్ పాశ మాట్లాడుతూ..దేశంలో నానాటికీ విజృంభిస్తున్న మ‌తోన్మాద శ‌క్తులు స‌మాజాన్ని విడ‌దీసి ఓట్లుదండుకోవాల‌ని చూస్తున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఓట్ల కోసం బిజెపి ఆర్ ఎస్ ఎస్ శ‌క్తులు మ‌త ఉద్రిక్త‌త‌ల‌ను ఎగ‌దోస్తూ మెజారిటీ ఓట్ల‌ను త‌మ వైపు తిప్పుకొనేందుకు కుట్ర‌లు, కుహ‌కాల‌కు పాల్ప డుతున్నాయ‌ని తెలిపారు. ఈ ప‌రిస్తితుల్లో మ‌తోన్మాద ఫాసిస్టు శ‌క్తుల‌ను ఓడించ‌ట‌మే క‌ర్త‌వ్యంగా ప్ర‌జాస్వామిక శ‌క్తుల‌న్నీ ఏకం కావాల్సి ఉంద‌ని అన్నారు. డీటీఎఫ్ నేత స‌త్త‌య్య మాట్లాడుతూ ప్ర‌జాస్వామిక హ‌క్కుల‌ను హ‌రించే విధంగా వ్య‌వ‌హ‌రిస్తూ పాఠ్యాంశాల్లో శాస్త్రీయ భావ‌న‌ల‌కు స‌మాధి క‌డుతున్న బిజెపి శ‌క్తుల‌ను అడ్డుకోవాల‌ని ప్ర‌జ‌ల‌కు, మేధావుల‌కు పిలుపునిచ్చారు.ఈ ఆవిష్కరన కార్యక్రమంలో టీపీఎఫ్ నాయ‌కులు కాశ‌పాక మ‌హేశ్, న్యాయ వాది జిట్టా భాస్క‌ర్ రెడ్డి, డీటీఎఫ్ నాయకులు స‌త్త‌య్య‌, ద‌య్యాల బాలన‌ర్స‌య్య‌, స‌మూహ బాధ్యులు శ్రీ‌నివాసా చార్యులు,సామ మ‌ల్లారెడ్డి, త‌దిత‌రులు పాల్గొన్నారు. 

      

VijayaKumar

9 hours ago

భువనగిరిలో బిజెపి పార్లమెంట్ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గెలుపు ఖాయం: భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య


భారతీయ జనతా పార్టీ వలిగొండ మండల శాఖ ఆధ్వర్యంలో మండల అధ్యక్షుడు బోళ్ళ సుదర్శన్ గారి అధ్యక్షతన ఈరోజు మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండల పదాధికారులు మరియు ముఖ్య నాయకుల సమావేశంను నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భువనగిరి అసెంబ్లీ ప్రబారి మోతేపాక సాంబయ్య హాజరైనారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మే 1 తారీకు నుండి 8 తారీకు వరకు జరిగే కార్నర్ మీటింగ్ లను విజయవంతం చేయాలని కోరారు మరియు మే 3 వ తేదీన చౌటుప్పల్ లో జరిగే బారీ బహిరంగ సభకు ప్రధాని మోడీ గారు హాజరవుతారు ఈసభను విజయవంతం చేయాలని కోరారు ,అదేవిధంగా బూర నర్సయ్య గౌడ్ గెలుపు కూడా బూత్ ఓటర్ల పైన వుంటుంది కాబట్టి రానున్న భువనగిరి లోక్సభ ఎన్నికల్లో బూర నర్సయ్య గౌడ్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బూత్ అధ్యక్షులు, కో ఆర్డినేటర్ పైన వుందని అన్నారు, కార్యకర్తలు నాయకులు గ్రామాల్లో ఇంటి ఇంటికి తిరుగుతూ ఓటును అభ్యార్ధించాలని అన్నారు,తెలంగాణ ఓటర్లు బిజెపి వైపు వున్నారు అని ఈ సందర్భంగా వారు అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కొప్పుల యాది రెడ్డి,అసెంబ్లీ కో కన్వీనర్ రాచకొండ కృష్ణ,మండల ప్రధాన కార్యదర్శులు మారోజు అనిల్ కుమార్ ,లోడే లింగస్వామి గౌడ్ సీనియర్ నాయకులు బందారపు రాములు మండల ఉపాధ్యక్షులు డోగ్పర్తి సంతోష్,గంగదారి దయాకర్, కోశాధికారి అప్పిషెట్టి సంతోష్ ,మండల కార్యదర్శులు మందుల నాగరాజు , BJYM బీజేవైఎం జిల్లా కార్యదర్శి రేగురి అమరేందర్, BJYM అసెంబ్లీ కన్వీనర్ బుంగమట్ల మహేష్,BJYM జిల్లా కార్యవర్గ సభ్యులు దంతూరి అరుణ్,బీజేవైఎం మండల అధ్యక్షులు మందాడి రంజిత్ రెడ్డి, ,కిసాన్ మోర్చా అధ్యక్షులు కొత్త రామచంద్రం బూత్ అద్యక్షులు బొంత భాస్కర్, భిక్షపతి , తదితరులు పాల్గొన్నారు.