Mane Praveen

Apr 23 2024, 15:47

TG: నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: CS శాంతి కుమారి

HYD: వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు.

సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సిజిఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. CGMలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు.

అదే విధంగా మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.

సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ.. మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేశామని, నీటి సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

SB NEWS TELANGANA

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 22 2024, 11:52

నేటి నుండి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు.

తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆల య పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు..

VijayaKumar

Apr 22 2024, 00:51

భువనగిరి లో ముఖ్యమంత్రి రోడ్ షో తో ప్రయాణికుల పాట్లు


 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి భువనగిరి లో నిర్వహించిన రోడ్ షో తో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్టీసీ బస్సులు భువనగిరి బస్ స్టేషన్ లోకి రాక పోవడంతో గంటల తరబడి ప్రయాణికులు, పసి పిల్లలతో భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆదివారం సెలవు దినం కావడం, పెళ్ళిళ్ళు ఉండడం తో ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి రోడ్ షో ప్రచారం కోసం ప్రజలను తరలించిన ప్రైవేటు వాహనాలు , కార్లు, ఇతర వాహనాలు భువనగిరి బస్ స్టేషన్లో నిలిపి, ప్రైవేటు పార్కింగ్ గా మార్చి వేసారు. దీంతో అటు నల్లగొండ నుండి వచ్చే వాహనాలు బైపాస్ వద్ద నిలిపివేయడం, నల్గొండ కు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆటోల ద్వారా బైపాస్ వరకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్, వరంగల్ వెళ్ళే ప్రయాణికులు కూడా గంటల తరబడి భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రోడ్ షో ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. జిల్లా పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆరోపించారు. కేవలం ఒక్క నల్గొండ రూట్ ఆర్టీసీ ప్రయాణికులకు కేటాయిస్తే సమస్య ఉండేది కాదని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రచార సభ ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా నిర్వహిస్తే బాగుండేదని ఆయన అన్నారు. అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:54

విధుల్లో నిర్లక్ష్యం ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌

హైదరాబాద్ మల్టీజోన్‌ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్‌ గురువారం సాయంత్రం సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్‌ సీపీ విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

మద్యం సేవించి పోలీస్‌స్టే షన్‌కు వచ్చి స్టేషన్‌ సిబ్బం దిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్‌ జిల్లా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

జగిత్యాల జిల్లా సారంగా పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారిం చిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేం దర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు...

VijayaKumar

Apr 18 2024, 17:57

మృతి చెందిన గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి ఆర్ వెంకట్ రెడ్డి యం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్


 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురై 6వ తరగతి చదువుచున్న విద్యార్ధి సీహెచ్ ప్రశాంత్(12) గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయని,    ఎం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామంలో ప్రశాంత్ తల్లిదండ్రులను, తాత, నానమ్మ, అమ్మమ్మ, మేనమామలను కలిసి ఓదార్చి, వారికి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురయ్యారని, ఐతే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భువనగిరి గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన తెలంగాణా రాష్ట్రం లో మొదటిదీ కాదు చివరిదీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ 

రాష్ట్రం లో సుమారు 982 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాలల్లో దాదాపు 5,58,923 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. కొన్ని గురుకులాల దుస్థితి, విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉన్నాయని , అట్టహాసంగా గురుకులాలు ఏర్పాటు చేయడం, ఉన్న వాటిని జూనియర్ కాలేజీలుగా అఫ్ గ్రేడ్ చేయడం చేసారు కానీ ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియను, మౌలిక వసతుల కల్పన ను గాలికి వదిలి వేసారని ఆయన ఆరోపించారు.

అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాలలో కొన్ని జిల్లాల్లో రెండు మూడు గురుకులాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని , వసతుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ నిర్ణయించిన ప్రమాణాలు పాటించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వారు కొందరైతే, కొంత మంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని ఆయన అన్నారు . విద్యార్థుల భోజన నాణ్యతా మీద కానీ, నాణ్యమైన విద్య అందించడంలో కానీ, తల్లిదండ్రులు బయటి వారికి ఎవ్వరికీ కూడా ఫిర్యాదు చేయవద్దని చేసిన వారికి టిసి లు ఇచ్చి పంపి వేస్తామని గురుకుల పాఠశాలల సిబ్బంది చే బెదరింపులు, అంతే కాకుండా ఈ విషయాలు అడిగిన పిల్లలను శారీకంగా హింసకు గురి చేసిన సంఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలి వేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 76% గురుకులాలు అర కొర వసతులతో అద్దె భవనాలలో నడుస్తున్నాయని ( బి. సి 119 కి 103, మైనారిటీ 204 కు 190 ,SC: 238 కు 136 అద్దె భవనాలలో). కే జీ బి వి లల్లో ఉన్న 1,00,536 ఆడ పిల్లలు మౌలిక సదుపాయాలు లేక చాల ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రోజుకు మూడు పూటలు భోజనానికి కలిపి మొత్తం 30 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 

నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించేందుకు బడ్జెట్ ను పెంచాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు వేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో అనుసరించాల్సిన ప్రమాణాలపై నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించాలని, అవి ఖచ్చితంగా అమలు అయ్యేలా తగిన పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని , ప్రత్యేక కమిషన్ ను వేసి గురుకుల పాఠశాలల తీరును పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, సామాజిక ఉద్యమ నాయకురాలు బుద్ధుల సునీత లు ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:00

మహానగరంలో పలుచోట్ల వర్షం

భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరా బాద్ వాసులకు బుధవారం రాత్రి ఉపశమనం కలిగింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపో యింది.

హైదరాబాద్ లోని పలుచోట్ల బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తరువాత పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, అమీర్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

కుత్బుల్లాపూర్ లోని సూరా రం, చింతల్, నిజాంపేట్, సుచిత్ర, దుండిగల్, షాపూర్ నగర్ పలు ప్రాంతాలలో ఉరుములు తో కూడిన వర్షం కురిసింది.గత కొన్ని రోజులుగా భానుడి భగ భగల నుంచి ఇబ్బంది పడుతున్న నగర వాసులకు వర్షం కురవడంతో ఉపశమనం లభించింది.

దీంతో నగరంలో ఉష్ణోగ్ర తలు భారీగా పడిపోయా యి. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు...

Mane Praveen

Apr 17 2024, 11:33

NLG: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవ్వాల ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ల హాజరు పట్టిక,ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషేంట్ల వివరాలను పరిశీలించారు.

హాస్పిటల్ లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా..లిఫ్ట్ రిపేర్ అయ్యిందని..రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని..బాలింతలు,పసిపాపలు ఉండే హాస్పిటల్ లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజుల సమయం పడితే పేషేంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

అలాగే హాస్పిటల్ ఆవరణంలో పేషేంట్లు,వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికి అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని,వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.భవన నిర్మాణం నెలరోజుల్లోనే పూర్తిచేసేలా యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.తాను రెండు రోజులకు ఒకసారి భవన నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తానని అధికారులకు తెలిపారు.భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను తాను ఇస్తానని చెప్పారు.హాస్పిటల్ మొత్తం కలియతిరిగిన మంత్రి..రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.

పలుచోట్ల పారిశుద్య నిర్వాహణ లోపాలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.

Venkatesh1

Apr 17 2024, 09:51

10000/- రూ.లు ఆర్థికసాయం చేసి ఔదార్యం చాటిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి ..

ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్ధి  కాలేజ్ ఫిజు నిమ్మితం ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి ఔదార్యం చాటినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు

ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆర్థికసమస్యలతో ఇబ్బందిపడుతున్న గోపాల్ గారి కుమారుడు కాలేజ్ ఫిజు నిమ్మితం ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు.* ఈ కార్యక్రమంలో భిమిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, సర్పంచ్ మల్లికార్జున,రామాంజినేయులు, మారుతి తదితరులు పాల్గొన్నారు

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:19

నేడు DC,GT, ఢీ: ఢిల్లీకి కీలకం

ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీల కంగా మారింది. వరుస ఓటములతో సతమతమ వుతున్న డిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని తపిస్తుంది.

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరు లో ఎలాగైనా జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది.

బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.లక్నో తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. గుజరాత్‌ను కూడా మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది.

అయితే స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో వార్నర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో పోటీలో తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది.

మరో ఓపెనర్ పృథ్వీషా ఫామ్‌లో ఉండడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతని పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వార్నర్‌తో కలిసి అతను శుభారంభం అందిస్తే జట్టు బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.

ఇక లక్నోపై యువ ఆటగా డు జాక్ ఫ్రెజర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడి లోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దీం తో ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి జట్టు అలాం టి ప్రదర్శనే ఆశిస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపిస్తున్నా అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తు న్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా రాణిం చేందుకు సిద్ధమయ్యాడు. పంత్ తన మార్క్ బ్యాటిం గ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి. ట్రిస్టన్ స్టబ్స్ కూడా నిలకడడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటు న్నాడు. పలు మ్యాచుల్లో జట్టును ఆదుకున్నాడు.

ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తు న్నాడు. షాయ్ హోప్ రూపంలో మరో హార్డ్ హిట్టర్ జట్టులో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాఛిన్నం చేసే సత్తా అతనికుంది. దీంతో హోప్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కుల్దీప్ యాదవ్, ఖలీల్, అక్షర్, ముకేశ్, ఇషాంత్ తదిత రులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు...

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:08

Bhadradri: శ్రీరాముని కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి

Bhadradri: శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శ్రీరామనవమి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రామాలయానికి విద్యుత్‌ దీపాలంకరణలు, చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు, బాపు రమణీయ చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి..

స్వాగత ద్వారాలు భక్తరామదాసు కీర్తనలతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోయింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు.

కల్యాణోత్సవంలో భాగంగా జరిగే... ఎదుర్కోలు కార్యక్రమం, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పోలీసుశాఖ 1800 మందికి పైగా సిబ్బందితొ బందోబస్తు ఏర్పాటు చేసింది.

శ్రీరామనవమి ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఐటీడీఏ పీవో, దేవస్ధానం ఈవో రమాదేవిలు పరిశీలించారు. వీవీఐపీ సెక్టార్‌లతో పాటు ఇతర సెక్టార్లలో చేపట్టాల్సిన మార్పుల గురించి స్ధానిక అధికారులకు సూచనలు చేశారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు 24 సెక్టార్లలో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.

Mane Praveen

Apr 23 2024, 15:47

TG: నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలి: CS శాంతి కుమారి

HYD: వచ్చే నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిషితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని అధికారులను కోరారు.

సోమవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మున్సిపల్, నీటిపారుదల, పంచాయితీ రాజ్ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని సమీక్షించారు.

సరఫరాలో అంతరాయం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు.

నగరంలో నీటి పరిస్థితిని ప్రస్తావిస్తూ సంబంధిత సిజిఎం ముందస్తు అనుమతితో మాత్రమే నిర్వహణ పనులు చేపట్టాలని, ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా ప్రత్యామ్నాయ తాగునీటి సరఫరా చేయాలని ఆదేశించారు. CGMలు ప్రతిరోజూ తమ పరిధిలోని మేనేజర్‌లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి నీటి సరఫరాను పర్యవేక్షించాలన్నారు.

అదే విధంగా మిషన్ భగీరథ, పబ్లిక్ హెల్త్ అధికారులు కూడా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు. నాగార్జునసాగర్ నుంచి నీటి పంపింగ్ ఇప్పటికే ప్రారంభమైందని, మే నెలాఖరు వరకు రాష్ట్రంలో తాగునీటి సరఫరాకు ఎలాంటి లోటు ఉండదని అధికారులు తెలిపారు. ఉద్దేశపూర్వకంగా కృత్రిమ కొరత సృష్టించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులకు సూచించారు.

సీడీఎంఏ దివ్య మాట్లాడుతూ.. మంచినీటి సరఫరా పరిస్థితిని ప్రతిరోజూ పర్యవేక్షిస్తున్నామని, లీకేజీలు ఏవైనా ఉంటే వెంటనే సరిచేస్తున్నామని, ప్రతి మున్సిపాలిటీలో హెల్ప్‌ లైన్‌ ను ఏర్పాటు చేశామని, నీటి సరఫరాలో చిన్న అంతరాయం ఏర్పడినా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని చెప్పారు.

SB NEWS TELANGANA

తప్పు చేస్తే దొరకక తప్పదు

Apr 22 2024, 11:52

నేటి నుండి కొండగట్టులో హనుమాన్ జయంతి వేడుకలు

తెలంగాణలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండ గట్టు ఆంజనేయ స్వామి ఆలయంలో నేటి నుండి మూడు రోజులపాటు జరగనున్న హనుమాన్ జయంతి వేడుకల ఏర్పా ట్లను ఆదివారం సాయంత్రం అడిషనల్ కలెక్టర్ దివాకర పరిశీ లించారు.

తాగునీటి వసతి ఏర్పాట్లు, కోనేరు, కళ్యాణకట్ట, ఆల య పరిసరాలను తదితర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట పలువురు అధికారులు ఉన్నారు..

VijayaKumar

Apr 22 2024, 00:51

భువనగిరి లో ముఖ్యమంత్రి రోడ్ షో తో ప్రయాణికుల పాట్లు


 పార్లమెంటు ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి భువనగిరి లో నిర్వహించిన రోడ్ షో తో ప్రజలు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఆర్టీసీ బస్సులు భువనగిరి బస్ స్టేషన్ లోకి రాక పోవడంతో గంటల తరబడి ప్రయాణికులు, పసి పిల్లలతో భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఆదివారం సెలవు దినం కావడం, పెళ్ళిళ్ళు ఉండడం తో ప్రయాణికుల గమ్యస్థానాలకు చేరడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ముఖ్యమంత్రి రోడ్ షో ప్రచారం కోసం ప్రజలను తరలించిన ప్రైవేటు వాహనాలు , కార్లు, ఇతర వాహనాలు భువనగిరి బస్ స్టేషన్లో నిలిపి, ప్రైవేటు పార్కింగ్ గా మార్చి వేసారు. దీంతో అటు నల్లగొండ నుండి వచ్చే వాహనాలు బైపాస్ వద్ద నిలిపివేయడం, నల్గొండ కు వెళ్ళాల్సిన ప్రయాణికులు ఆటోల ద్వారా బైపాస్ వరకు వెళ్ళడానికి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. హైదరాబాద్, వరంగల్ వెళ్ళే ప్రయాణికులు కూడా గంటల తరబడి భువనగిరి బస్ స్టేషన్ లో వేచి ఉండాల్సి వచ్చింది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి రోడ్ షో ప్రజలకు తీవ్ర అసౌకర్యాన్ని కలిగించింది. జిల్లా పోలీస్ అధికారులు, ఆర్టీసీ అధికారుల మధ్య సమన్వయం లేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రయాణికులు ఆరోపించారు. కేవలం ఒక్క నల్గొండ రూట్ ఆర్టీసీ ప్రయాణికులకు కేటాయిస్తే సమస్య ఉండేది కాదని వినియోగదారుల సంఘం జిల్లా అధ్యక్షులు కొడారి వెంకటేష్ అన్నారు. ముఖ్యమంత్రి ప్రచార సభ ఎవ్వరికీ ఇబ్బంది కలుగకుండా నిర్వహిస్తే బాగుండేదని ఆయన అన్నారు. అధికారుల సమన్వయ లోపంతోనే సమస్యలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అధికారులను ఆయన కోరారు.

నిజంనిప్పులాంటిది

Apr 19 2024, 07:54

విధుల్లో నిర్లక్ష్యం ఆరుగురు పోలీసు అధికారులపై సస్పెన్షన్‌

హైదరాబాద్ మల్టీజోన్‌ -1 పరిధిలో విధుల్లో అలసత్వం వహించిన ఆరుగురు పోలీసు అధికారులను ఐజీ ఏవీ రంగనాథ్‌ గురువారం సాయంత్రం సస్పెండ్‌ చేశారు.

సస్పెండ్‌ అయిన వారిలో ఇద్దరు ఇన్‌స్పెక్టర్లు, ఇద్దరు ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఉన్నారు. పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్ పరిధిలోని ప్రజా భవన్‌ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి కారణమైన

బోధన్‌ మాజీ ఎమ్మెల్యే షకీల్‌ కుమారుడు రాహిల్‌ను తప్పించేందుకే పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్‌తో సంప్రదింపులు జరిపినట్టుగా హైదరాబాద్‌ సీపీ విచారణలో తేలడంతో అప్పటి బోధన్‌ ఇన్‌స్పెక్టర్‌ ప్రేమ్‌ కుమార్‌ను సస్పెండ్‌ చేశారు.

మద్యం సేవించి పోలీస్‌స్టే షన్‌కు వచ్చి స్టేషన్‌ సిబ్బం దిని ఇబ్బందులకుగురి చేసిన నిజామాబాద్‌ జిల్లా సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేశ్‌ను సస్పెండ్‌ చేశారు.

జగిత్యాల జిల్లా సారంగా పూర్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన గంజాయి కేసులో అలసత్వంగా వ్యవహారిం చిన ఎస్సైలు మనోహర్ రావు, తిరుపతి, హెడ్ కానిస్టేబుల్ బి. రవీందర్ రెడ్డి, కానిస్టేబుల్ టి.నరేం దర్ లను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్- 1 ఐజీ రంగ నాథ్‌ ఉత్తర్వులు జారీ చేశారు...

VijayaKumar

Apr 18 2024, 17:57

మృతి చెందిన గురుకుల విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉండాలి ఆర్ వెంకట్ రెడ్డి యం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్


 యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ బాలుర గురుకుల పాఠశాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కు గురై 6వ తరగతి చదువుచున్న విద్యార్ధి సీహెచ్ ప్రశాంత్(12) గత ఆరు రోజులుగా చికిత్స పొందుతూ మృతిచెందడం అత్యంత బాధాకరమైన విషయని,    ఎం వి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ ఆర్. వెంకట్ రెడ్డి అన్నారు. గురువారం పోచంపల్లి మండలం జిబ్లక్ పల్లి గ్రామంలో ప్రశాంత్ తల్లిదండ్రులను, తాత, నానమ్మ, అమ్మమ్మ, మేనమామలను కలిసి ఓదార్చి, వారికి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న రాత్రి హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇప్పటివరకు 27 మంది విద్యార్థులు అస్వస్థ తకు గురయ్యారని, ఐతే గమనించాల్సిన విషయం ఏమిటంటే.. భువనగిరి గురుకుల పాఠశాలలో జరిగిన సంఘటన తెలంగాణా రాష్ట్రం లో మొదటిదీ కాదు చివరిదీ కాదని ఆయన అన్నారు. తెలంగాణ 

రాష్ట్రం లో సుమారు 982 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల గురుకుల పాఠశాలల్లో దాదాపు 5,58,923 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని ఆయన తెలిపారు. కొన్ని గురుకులాల దుస్థితి, విద్యార్థుల పరిస్థితి మరీ దయనీయమైన స్థితిలో ఉన్నాయని , అట్టహాసంగా గురుకులాలు ఏర్పాటు చేయడం, ఉన్న వాటిని జూనియర్ కాలేజీలుగా అఫ్ గ్రేడ్ చేయడం చేసారు కానీ ఉపాధ్యాయులను నియమించే ప్రక్రియను, మౌలిక వసతుల కల్పన ను గాలికి వదిలి వేసారని ఆయన ఆరోపించారు.

అత్యధిక శాతం గురుకులాలు ప్రైవేటు భవనాలలో కొన్ని జిల్లాల్లో రెండు మూడు గురుకులాలు ఒకే భవనంలో నిర్వహిస్తున్నారని , వసతుల విషయంలో కానీ భోజన విషయంలో కానీ నిర్ణయించిన ప్రమాణాలు పాటించకుండా రాష్ట్ర వ్యాప్తంగా వేల మంది విద్యార్థులు అస్వస్థకు గురైన వారు కొందరైతే, కొంత మంది ప్రాణాలు విడిచిన వారు ఉన్నారని ఆయన అన్నారు . విద్యార్థుల భోజన నాణ్యతా మీద కానీ, నాణ్యమైన విద్య అందించడంలో కానీ, తల్లిదండ్రులు బయటి వారికి ఎవ్వరికీ కూడా ఫిర్యాదు చేయవద్దని చేసిన వారికి టిసి లు ఇచ్చి పంపి వేస్తామని గురుకుల పాఠశాలల సిబ్బంది చే బెదరింపులు, అంతే కాకుండా ఈ విషయాలు అడిగిన పిల్లలను శారీకంగా హింసకు గురి చేసిన సంఘటనలు కూడా నిత్యం జరుగుతున్నాయని ఆయన అన్నారు. గురుకులాల్లో మౌలిక వసతుల కల్పనను గాలికి వదిలి వేసారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 76% గురుకులాలు అర కొర వసతులతో అద్దె భవనాలలో నడుస్తున్నాయని ( బి. సి 119 కి 103, మైనారిటీ 204 కు 190 ,SC: 238 కు 136 అద్దె భవనాలలో). కే జీ బి వి లల్లో ఉన్న 1,00,536 ఆడ పిల్లలు మౌలిక సదుపాయాలు లేక చాల ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన తెలిపారు. రోజుకు మూడు పూటలు భోజనానికి కలిపి మొత్తం 30 రూపాయలు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం 

నాణ్యమైన పోషక ఆహారాన్ని అందించేందుకు బడ్జెట్ ను పెంచాలని, మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు వేయాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ హాస్టళ్లలో అనుసరించాల్సిన ప్రమాణాలపై నిర్దిష్టమైన విధి విధానాలు రూపొందించాలని, అవి ఖచ్చితంగా అమలు అయ్యేలా తగిన పర్యవేక్షణా యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని , ప్రత్యేక కమిషన్ ను వేసి గురుకుల పాఠశాలల తీరును పర్యవేక్షించాలని, ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఆయన వెంట బాలల హక్కుల పరిరక్షణ వేదిక జిల్లా నాయకులు కొడారి వెంకటేష్, సామాజిక ఉద్యమ నాయకురాలు బుద్ధుల సునీత లు ఉన్నారు.

నిజంనిప్పులాంటిది

Apr 18 2024, 07:00

మహానగరంలో పలుచోట్ల వర్షం

భానుడి ప్రతాపానికి ఉక్కిరి బిక్కిరి అవుతున్న హైదరా బాద్ వాసులకు బుధవారం రాత్రి ఉపశమనం కలిగింది. నగరంలో ఒక్కసారిగా వాతావరణం మారిపో యింది.

హైదరాబాద్ లోని పలుచోట్ల బుధవారం సాయంత్రం వర్షం కురిసింది. రాత్రి 9 గంటల తరువాత పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడింది.

కేపీహెచ్‌బీ, జేఎన్టీయూ, అమీర్ పేట్, మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో సాయంత్రం మోస్తరు వర్షం కురిసింది.

కుత్బుల్లాపూర్ లోని సూరా రం, చింతల్, నిజాంపేట్, సుచిత్ర, దుండిగల్, షాపూర్ నగర్ పలు ప్రాంతాలలో ఉరుములు తో కూడిన వర్షం కురిసింది.గత కొన్ని రోజులుగా భానుడి భగ భగల నుంచి ఇబ్బంది పడుతున్న నగర వాసులకు వర్షం కురవడంతో ఉపశమనం లభించింది.

దీంతో నగరంలో ఉష్ణోగ్ర తలు భారీగా పడిపోయా యి. అకాల వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు...

Mane Praveen

Apr 17 2024, 11:33

NLG: ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి

నల్గొండ: పర్యటనలో ఉన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవ్వాల ఉదయం ఆకస్మికంగా నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు.రోగులకు అందుతున్న వైద్యసేవలు, ఆసుపత్రిలో ఉన్న సౌకర్యాల గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.డాక్టర్ల హాజరు పట్టిక,ట్రీట్మెంట్ తీసుకుంటున్న పేషేంట్ల వివరాలను పరిశీలించారు.

హాస్పిటల్ లో లిఫ్ట్ పనిచేయకపోవడంపై సిబ్బందిని మంత్రి ప్రశ్నించగా..లిఫ్ట్ రిపేర్ అయ్యిందని..రిపేర్ చేయడానికి 10 రోజుల సమయం పడుతుందన్న సిబ్బంది సమాధానంపై మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.ప్రసవం కోసం వచ్చే బాలింతలను ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలని..బాలింతలు,పసిపాపలు ఉండే హాస్పిటల్ లో లిఫ్ట్ రిపేర్ కు పది రోజుల సమయం పడితే పేషేంట్ల పరిస్థితి ఏంటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు..

అలాగే హాస్పిటల్ ఆవరణంలో పేషేంట్లు,వారి అటెండెంట్లు పడుతున్న ఇబ్బందులను చూసిన మంత్రి వెంటనే స్పందించి సకల సౌకర్యాలతో అందరికి అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని,వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో ఆదేశాలు జారీ చేశారు.భవన నిర్మాణం నెలరోజుల్లోనే పూర్తిచేసేలా యుద్ధప్రతిపాదికన చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు.తాను రెండు రోజులకు ఒకసారి భవన నిర్మాణ స్థితిగతులను పరిశీలిస్తానని అధికారులకు తెలిపారు.భవన నిర్మాణానికి కావాల్సిన అనుమతులను తాను ఇస్తానని చెప్పారు.హాస్పిటల్ మొత్తం కలియతిరిగిన మంత్రి..రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యసేవల గురించి తెలుసుకున్నారు.

పలుచోట్ల పారిశుద్య నిర్వాహణ లోపాలపై హాస్పిటల్ సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే మళ్లీ వస్తానని వచ్చే వరకు అన్ని సమస్యల్ని పరిష్కరించాలని అధికారులకు తేల్చిచెప్పారు.

Venkatesh1

Apr 17 2024, 09:51

10000/- రూ.లు ఆర్థికసాయం చేసి ఔదార్యం చాటిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి ..

ఆర్థిక ఇబ్బందులలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్ధి  కాలేజ్ ఫిజు నిమ్మితం ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసి ఔదార్యం చాటినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు

ఈ రోజు శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రం మండలం చెన్నంపల్లి గ్రామంలో ఆర్థికసమస్యలతో ఇబ్బందిపడుతున్న గోపాల్ గారి కుమారుడు కాలేజ్ ఫిజు నిమ్మితం ₹10000/- రూపాయలు ఆర్థికసాయం చేసినా టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి గారు.* ఈ కార్యక్రమంలో భిమిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు, సర్పంచ్ మల్లికార్జున,రామాంజినేయులు, మారుతి తదితరులు పాల్గొన్నారు

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:19

నేడు DC,GT, ఢీ: ఢిల్లీకి కీలకం

ఐపిఎల్‌లో భాగంగా బుధవారం గుజరాత్ టైటాన్స్‌తో జరిగే పోరు ఢిల్లీ క్యాపిటల్స్‌కు చాలా కీల కంగా మారింది. వరుస ఓటములతో సతమతమ వుతున్న డిల్లీ ఈ మ్యాచ్‌లో గెలిచి ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకోవాలని తపిస్తుంది.

లక్నో సూపర్‌జెయింట్స్‌తో జరిగిన కిందటి మ్యాచ్‌లో ఢిల్లీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో అదే సంప్రదాయాన్ని కొనసాగించాలని భావిస్తోంది. ఇక సొంత గడ్డపై జరుగుతున్న పోరు లో ఎలాగైనా జయకేతనం ఎగుర వేయాలనే లక్షంతో గుజరాత్ పోరుకు సిద్ధమైంది.

బ్యాటిగ్, బౌలింగ్ విభాగాల్లో గుజరాత్ సమతూకంగా కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా కనిపిస్తోంది.లక్నో తో జరిగిన కిందటి మ్యాచ్‌లో విజయం సాధించిన ఢిల్లీ ఈ పోరుకు సమరోత్సాహంతో సిద్ధమైంది. గుజరాత్‌ను కూడా మట్టికరిపించాలనే పట్టుదలతో ఉంది.

అయితే స్టార్ ఆటగాడు డేవిడ్ వార్నర్ వైఫల్యం జట్టును కలవరానికి గురి చేస్తోంది. ఈ సీజన్‌లో వార్నర్ ఆశించిన స్థాయిలో రాణించలేక పోతున్నాడు. ఒక మ్యాచ్‌లో రాణిస్తే మరో పోటీలో తేలిపోతున్నాడు. అతని వైఫల్యం జట్టుకు ప్రతికూలంగా మారింది.

మరో ఓపెనర్ పృథ్వీషా ఫామ్‌లో ఉండడం జట్టుకు కాస్త ఊరటనిచ్చే అంశంగా చెప్పాలి. ఈ మ్యాచ్‌లో కూడా అతని పై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. వార్నర్‌తో కలిసి అతను శుభారంభం అందిస్తే జట్టు బ్యాటింగ్ సమస్యలు చాలా వరకు తీరిపోతాయి.

ఇక లక్నోపై యువ ఆటగా డు జాక్ ఫ్రెజర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఒత్తిడి లోనూ మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. దీం తో ఈ మ్యాచ్‌లో కూడా అతని నుంచి జట్టు అలాం టి ప్రదర్శనే ఆశిస్తోంది. కెప్టెన్ రిషబ్ పంత్ జట్టును ముందుండి నడిపిస్తున్నా అద్భుత బ్యాటింగ్‌తో జట్టుకు అండగా నిలుస్తు న్నాడు.

ఈ మ్యాచ్‌లో కూడా రాణిం చేందుకు సిద్ధమయ్యాడు. పంత్ తన మార్క్ బ్యాటిం గ్‌తో చెలరేగితే ప్రత్యర్థి బౌలర్లకు ఇబ్బందులు ఖాయమనే చెప్పాలి. ట్రిస్టన్ స్టబ్స్ కూడా నిలకడడైన బ్యాటింగ్‌తో ఆకట్టుకుంటు న్నాడు. పలు మ్యాచుల్లో జట్టును ఆదుకున్నాడు.

ఈసారి కూడా అదే జోరును కొనసాగించాలని భావిస్తు న్నాడు. షాయ్ హోప్ రూపంలో మరో హార్డ్ హిట్టర్ జట్టులో ఉన్నాడు. ఎలాంటి బౌలింగ్‌నైనా చిన్నాఛిన్నం చేసే సత్తా అతనికుంది. దీంతో హోప్‌ను కూడా తక్కువ అంచనా వేసే పరిస్థితి లేదు. కుల్దీప్ యాదవ్, ఖలీల్, అక్షర్, ముకేశ్, ఇషాంత్ తదిత రులతో బౌలింగ్ కూడా పటిష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఢిల్లీని తక్కువ అంచన వేసే పరిస్థితి లేదు...

నిజంనిప్పులాంటిది

Apr 17 2024, 09:08

Bhadradri: శ్రీరాముని కల్యాణానికి సిద్ధమైన భద్రాద్రి

Bhadradri: శ్రీరామనవమిని పురస్కరించుకుని భద్రాద్రి సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. శ్రీరామనవమి పనులు శరవేగంగా పూర్తయ్యాయి. రామాలయానికి విద్యుత్‌ దీపాలంకరణలు, చలువ పందిళ్లు, చాందినీ వస్త్రాలంకరణలు, బాపు రమణీయ చిత్రాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి..

స్వాగత ద్వారాలు భక్తరామదాసు కీర్తనలతో భద్రాద్రి భక్తాద్రిగా మారిపోయింది. స్వామివారి కళ్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు ఇప్పటికే భద్రాద్రి చేరుకున్నారు.

కల్యాణోత్సవంలో భాగంగా జరిగే... ఎదుర్కోలు కార్యక్రమం, శ్రీరామనవమి, మహా పట్టాభిషేకాలను ఘనంగా నిర్వహించనున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా.. పోలీసుశాఖ 1800 మందికి పైగా సిబ్బందితొ బందోబస్తు ఏర్పాటు చేసింది.

శ్రీరామనవమి ఏర్పాట్లను దేవాదాయశాఖ కమిషనర్‌ హనుమంతరావు, భద్రాద్రి కలెక్టర్‌ ప్రియాంక, ఎస్పీ రోహిత్‌రాజ్‌, ఐటీడీఏ పీవో, దేవస్ధానం ఈవో రమాదేవిలు పరిశీలించారు. వీవీఐపీ సెక్టార్‌లతో పాటు ఇతర సెక్టార్లలో చేపట్టాల్సిన మార్పుల గురించి స్ధానిక అధికారులకు సూచనలు చేశారు.

భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉండటంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. భక్తులు కల్యాణ మహోత్సవాన్ని వీక్షించేందుకు 24 సెక్టార్లలో ఎల్‌ఈడీ టీవీలు ఏర్పాటు చేశారు ఆలయ అధికారులు.