/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz గణేష్‌ నిమజ్జనం అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు Raghu ram reddy
గణేష్‌ నిమజ్జనం అలర్ట్‌.. హైదరాబాద్‌లో రేపు, ఎల్లుండి ట్రాఫిక్ మళ్లింపు

భాగ్యనరగంలో వినాయక విగ్రహాల నిమజ్జనానికి సమయం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 17,18 తేదీల్లో హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయనున్నారు. నగరం నలుమూలల నుంచి హుస్సేన్‌సాగర్‌లో నిమజ్జనం కోసం విగ్రహాలు తరలి రానుండటంతో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి.

హైదరాబాద్‌ నగరంలో గణేశ్‌ నిమజ్జనం నేపథ్యంలో మంగళ, బుధవారాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. హైదరాబాద్‌, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున గణేష్‌ విగ్రహాలు హుస్సేన్‌ సాగర్‌ వైపు రానుండటంతో నగర వ్యాప్తంగా ట్రాఫిక్ ఆంక్షల్ని అమలు చేయనున్నారు. నగరంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించడానికి ప్రజలు సహకరించాలని సూచించారు. ప్రధాన మార్గాల్లో విగ్రహాల ఊరేగింపులు వెళ్లేందుకు వీలుగా సాధారణ ట్రాఫిక్‌ ను నియంత్రిస్తారు. శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 17, 18తేదీల్లో నగర వ్యాప్తంగా ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీస్ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు.

బాలాపూర్‌ నుంచి గుర్రం చెరువు ట్యాంక్‌పై కట్టమైసమ్మ ఆలయం వద్ద గణేష్‌ విగ్రహ ఊరేగింపు హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోకి ప్రవేశిస్తుందని, కేశవగిరి, చాంద్రాయణగుట్ట ఫ్లైఓవర్‌ (ఎడమ మలుపు), ఎంబీఎన్‌ఆర్‌ ఎక్స్‌ రోడ్, ఫలక్‌నుమా రైల్వే ఓవర్‌ బ్రిడ్జ్, ఆలియాబాద్, చార్మినార్, మదీనా, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్‌ ఎక్స్‌ రోడ్, బషీర్‌బాగ్, లిబర్టీ జంక్షన్, ఎన్టీఆర్‌ మార్గ్, పీవీఎన్‌ఆర్‌ మార్గ్‌ (నెక్లెస్‌ రోడ్డు)లో అంబేడ్కర్‌ విగ్రహం వైపు వెళ్లాలని సూచించారు.

సికింద్రాబాద్‌ నుంచి వచ్చే విగ్రహ ఊరేగింపులు సంగీత్‌ థియేటర్, ప్యాట్నీ, ప్యారడైజ్‌ జంక్షన్, ఎంజీ రోడ్డు, కర్బలా మైదాన్, ట్యాంక్‌బండ్‌ మీదుగా నెక్లెస్‌ రోడ్డుకు వెళ్తుంది.

చిలకలగూడ కూడలి నుంచి వచ్చే గణేష్‌ విగ్రహాలు గాంధీ ఆసుపత్రి, ఆర్టీసీ క్రాస్‌ రోడ్, నారాయణగూడ పైవంతెన, వై.జంక్షన్, హిమాయత్‌నగర్‌ నుంచి లిబర్టీ వైపు వెళ్తాయి.

ఉప్పల్‌ ప్రాంతం నుంచి వచ్చే ఊరేగింపులు రామంతాపూర్, శ్రీ రమణ జంక్షన్, ఛే నంబరు, తిలక్‌నగర్, ఓయూ ఎన్‌సీసీ గేట్, విద్యానగర్‌ జంక్షన్, ఫీవర్‌ ఆసుపత్రి, బర్కత్‌పుర కూడలి మీదుగా వెళ్తుంది. ఆ ఊరేగింపులు నారాయణగూడ వైఎంసీఏ కూడలికి చేరుకొని, ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు నుంచే వచ్చే ఊరేగింపుతో కలుస్తోంది.దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి వచ్చే విగ్రహాలు ఐఎస్‌ సదన్, సైదాబాద్, చంచల్‌గూడ ఉంచి వచ్చే ఊరేగింపుతో నల్గొండ ఎక్స్‌ రోడ్డులో కలుస్తోంది. అక్కడి నుంచి మూసారాంబాగ్‌ మీదుగా అంబర్‌పేట్‌ వైపు వెళ్తాయి.

తార్నాక వైపు వచ్చే విగ్రహాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం దూర విద్యాకేంద్రం రోడ్డు, అడిక్‌మెట్‌ వైపు వెళ్లి విద్యానగర్‌ మీదుగా ఫీవర్‌ ఆసుపత్రి వద్ద ఊరేగింపు చేరుతుంది.

టోలిచౌకి, రేతిబౌలి, మోహిదీపట్నం వైపు నుంచి వచ్చే గణేష్‌ నిమజ్జనం ఊరేగింపు మాసబ్‌ట్యాంక్, అయోధ్య జంక్షన్, నిరంకారి భవన్, ద్వారకా హోటల్‌ జంక్షన్, ఇక్బాల్‌ మినార్‌ మీదుగా ఎన్టీఆర్‌ మార్గ్‌కు చేరుకుంటుంది.ఎర్రగడ్డ నుంచి వచ్చే విగ్రహాలు ఎస్‌ఆర్‌ నగర్, అమీర్‌పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్‌ మీదుగా మోహిదీపట్నం నుంచి వచ్చే ఊరేగింపు నిరంకారి భవన్‌ వద్ద చేరి, ఎన్టీఆర్‌ మార్గ్‌ వరకు వెళ్తోంది.

టప్పాచబుత్ర, ఆసిఫ్‌నగర్‌ ప్రాంతాల నుంచి వచ్చే విగ్రహాలు సీతారాంబాగ్, బోయిగూడ కమాన్, వోల్గా హోటల్‌ ఎక్స్‌రోడ్, గోషామహల్, మాలకుంటజంక్షన్‌ మీదుగా వెళ్లి ఎంజేఎం వద్ద ప్రధాన ఊరేగింపులో కలుస్తాయి.

వినాయక చవితి విగ్రహాల నిమజ్జనం నేపథ్యంలో సాధారణ ప్రజలు రాకపోకలకు అంతరాయం కలగవచ్చని, ఊరేగింపు సాగే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని, ప్రజలు అందుకు అనుగుణంగా ప్రయాణ మార్గాన్ని నిర్దేశించుకోవాలని సూచించారు

అమరావతి రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నిధుల జమ..!!

ఏపీ ప్రభుత్వం అమరావతి రైతులకు బకాయిలు విడుదల చేసింది. అమరావతి నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును సీఆర్డీఏ నేరుగా వారి ఖాతాల్లోజమ చేయనుంది.ఇందు కోసం ప్రభుత్వం రూ 400 కోట్లను విడుదలకు ఆమోద ముద్ర వేసింది.అదే సమయంలో హైకోర్టు భవనం ప్రాంగణంలో అదనపు నిర్మాణాలకు సంబంధించి రూ.13.33 కోట్లను సీఆర్డీఏ విడుదల చేసింది.

అమరావతిలో కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. రైతులకు పెండింగ్‌లో ఉన్న వార్షిక కౌలును వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతిలో పెండింగ్ అంశాలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తోంది. భూసమీకరణ పెండింగ్ లో ఉన్న గ్రామాల్లో రైతులతో నేరుగా మంత్రి నారాయణ సంప్రదింపులు చేస్తున్నారు. వారిని భూములు ఇచ్చేందుకు ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. భూములు ఇస్తే కోరిన చోట ప్లాట్లు కేటాయిస్తామని హామీ ఇస్తున్నారు.

ఇక, అమరావతిలో నిర్మాణాల పైన అధ్యయనం చేసిన చెన్నై ఐఐటీ నిపుణుల బృందాలు ప్రాథమిక నివేదికను అందజేసినట్లు సమాచారం. ఒకటి, రెండు రోజుల్లో తుది నివేదికను అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నివేదికలో మరోవైపు అమరావతిలో హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల పునాదులకు ఎలాంటి ఇబ్బంది లేదని తేలింది. ఐదేళ్లుగా నీళ్లలో ఉంటూ, ఎండకు ఎండుతూ, వానకు తడుస్తున్న నివాస భవనాల టవర్ల పటిష్ఠతపై చెన్నై, హైదరాబాద్‌ ఐఐటీలకు చెందిన నిపుణులు క్లారిటీ ఇచ్చారు.

మరోవైపు శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాలకు ఆర్కిటెక్చరల్‌ డిజైన్లు, సేవలు అందజేసేందుకు సీఆర్డీఏ టెండర్లను ఆహ్వానించింది. వచ్చే నెల 4 మధ్యాహ్నం 2 గంటలలోపు బిడ్‌లు దాఖలు చేయాలని సూచించింది ప్రభుత్వం. వచ్చే నెల 4న సాయంత్రం టెక్నికల్‌ బిడ్‌లు ఓపెన్‌ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ రికార్డ్.. ఒకే రోజు 13వేలకుపైగా, చాలా అరుదుగా!

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రపంచ రికార్డును సాధించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహణను వరల్డ్ రికార్డ్స్ యూనియన్ గుర్తించింది. ఇందుకు సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని పవన్ కళ్యాణ్ నివాసంలో వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫీషియల్ రికార్డ్స్ మేనేజర్ టేలర్ డిప్యూటీ సీఎంకు అందజేశారు. ఆగస్టు 23వ తేదీన నిర్వహించిన గ్రామ సభలను నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరల్డ్ రికార్డును సాధించింది. ఆగస్టు 23న రికార్డు స్థాయిలో ఒకేరోజు 13,326 చోట్ల గ్రామ సభలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీన్ని వరల్డ్‌ రికార్డ్స్‌ యూనియన్‌ గుర్తించింది.. ఈమేరకు రికార్డు ధ్రువపత్రాన్ని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌కు అందజేశారు. దీనికి సంబంధించిన రికార్డ్ పత్రాన్ని, మెడల్‌ను పవన్ కళ్యాణ్‌కు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ అఫిషియల్ రికార్డ్స్ మేనేజర్ క్రిస్టఫర్ టేలర్ క్రాఫ్ట్ అందజేశారు. ఒకే రోజు ఈ స్థాయిలో ప్రజల భాగస్వామ్యంతో సభలు నిర్వహించడం అతి పెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తున్నట్లు వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ప్రతినిధి తెలిపారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా పవన్‌ బాధ్యతలు చేపట్టిన 100 రోజుల్లోనే ప్రపంచ రికార్డు నమోదు కావడం విశేషం.

రాష్ట్రవ్యాప్తంగా ‘స్వర్ణ గ్రామ పంచాయతీ’ పేరుతో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించింది. గ్రామాల అభివృద్ధికి నాలుగు ప్రధాన ప్రణాళికలతో ఒకేసారి ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో గ్రామసభలు నిర్వహించారు. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం వానపల్లిలో నిర్వహించే గ్రామసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు.. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లె గ్రామసభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ గ్రామ సభల్ని సర్పంచి అధ్యక్షతన నిర్వహిస్తున్నారు. ఆ ఊరిలో ప్రజలంతా పాల్గొని.. గ్రామీణాభివృద్ధికి ప్రభుత్వం నిర్దేశించిన నాలుగు అంశాలపై చర్చించి తీర్మానం చేశారు.

తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదు.. మంత్రి ఆనంకు భక్తుడి ఫిర్యాదు

తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు.

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలేశుడిని (Lord venkateshwara) పెద్ద సంఖ్యలో దర్శించుకుంటారు. ఆ శ్రీనివాసుడి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో భక్తులు వేచి ఉంటారు. ఇక వారాంతాలు, పండగల సమయాల్లో అయితే స్వామి దర్శనానికి గంటల సమయం పడుతుంది. క్యూలైన్లలో ఉండే భక్తుల అవసరాలను టీటీడీ తీరుస్తుంది. భోజనసదుపాయాలను అందిస్తుంది. తాజాగా తిరుమలలో ఏర్పాట్లపై ఓ భక్తుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఏకంగా ఏపీ మంత్రికే తిరుమలలో ఏర్పాట్లపై ఫిర్యాదు చేశాడు.

తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి (Minister Anam Ram Narayanareddy) భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు. వెంటనే స్పందించిన మంత్రి ఆనం.. భక్తుడ్ని సముదాయించే ప్రయత్నం చేశారు. అధికారులకు చెప్పి దర్శనం కల్పిస్తామని భక్తుడికి మంత్రి ఆనం హామీ ఇచ్చారు.

కాగా.. ఈరోజు ఉదయం తిరుమల వెంకటేశ్వరుడిని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దర్శించుకున్నారు. దర్శనాంనంతరం ఆలయం వెలుపల మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ప్రకృతి వైఫరిత్యం వల్ల రాష్ట్రంలోని ఓ ప్రాంతం అతలాకుతలమైందన్నారు. 10 రోజుల పాటు ఆహారం దొరక్క, నిలువున నీడలేక ప్రజలు ఇబ్బంది పడ్డారన్నారు. కష్ట కాలంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజలతోనే ఉండి వారి కష్టాలను తీర్చారన్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని ప్రస్తుతం అక్కడ పూర్వ పరిస్థితులను నెలకొల్పారని మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాలకు రెండు వందే మెట్రో - రూట్లు ఖరారు..!!

తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేభారత్ మెట్రో రైళ్లు రానున్నాయి. ఈ మేరకు రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం నడుస్తున్న ఇంటర్ సిటీ స్థానంలో వందేమెట్రో నడపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దేశంలో తొలి వందేమెట్రో సర్వీసు ప్రారంభం అవుతోంది. అహ్మదాబాద్ - భుజ్ మధ్య ప్రారంభిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వందేమెట్రో నడిపే రూట్లను అధికారికంగా ఖరారు చేసారు.

తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ కు ఆదరణ బాగుంది. దీంతో..కొత్తగా మరో రెండు వందేభారత్ రైళ్లను ప్రారంభిస్తున్నారు. విశాఖ - దుర్గ్ మధ్య వందేభారత్ నేడు అందుబాటులోకి రానుంది. ఈ నెల 19వ తేదీ నుంచి సికింద్రాబాద్ - నాగపూర్ మధ్య మరో వందేభారత్ సర్వీసు ప్రారంభం కానుంది. ఇక..నేటి నుంచి ప్రారంభం అవుతున్న వందేమెట్రో రైళ్లను తెలుగు రాష్ట్రాలకు కేటాయించాలని నిర్ణయించారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తొలి వందే మెట్రో రైలును తిరుపతితో అనుసంధానం చేయనున్నారు.

చెన్నై- తిరుపతి మధ్య తెలుగు రాష్ట్రాల్లో తొలి వందేమెట్రోగా పట్టాలెక్కనుంది. తదుపరి జాబితాలో వరంగల్ మీదుగా సికింద్రాబాద్ - విజయవాడ మధ్య కేటాయించాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఈ రూటులో నడుస్తున్న ఇంటర్ సిటీ స్థానంలో అదే సమయంలో ఈ రైలును అందుబాటులోకి తీసుకొస్తున్నారు.

దీంతో..తెలుగు రాష్ట్రాల్లో వందేభారత్ సేవలు మరింత పెరగనున్నాయి.100 నుంచి 350 కిలో మీటర్ల దూరం ఉండే రెండు ప్రధాన నగరాల మధ్య నడిచేలా ఈ రైళ్లను రూపొందించారు. వీటి గరిష్ఠ వేగం 110 కిలో మీటర్లుగా ఉంటుంది.

తెలంగాణ తల్లిని అవమానిస్తారా?.. ప్రభుత్వంపై కేటీఆర్‌ ఆగ్రహం

తెలంగాణ రాజకీయాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పెను దుమారం రేపుతోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగనుంది. అయితే రాజీవ్ విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

తెలంగాణ(Telangana) రాజకీయాల్లో దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పెను దుమారం రేపుతోంది. సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు (సోమవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరుగనుంది. అయితే రాజీవ్ విగ్రహావిష్కరణను బీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలని గతంలోనే నిర్ణయించామని.. ఇప్పుడెలా రాజీవ్ విగ్రహాన్ని పెడతారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

(BRS Working President KTR) తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. రాజీవ్ విగ్రహ ఆవిష్కరణపై ట్విట్టర్ వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.

తెలంగాణ తల్లిని అవమానిస్తారా 

తెలంగాణ ఆత్మతో ఆటలాడతారా 

తెలంగాణ అస్తిత్వాన్నే కాలరాస్తారా 

తెలంగాణ ఉద్యమస్ఫూర్తి ఊపిరి తీస్తారా

తెలంగాణ ఆత్మగౌరవాన్ని అవహేళన చేస్తారా 

తెలంగాణ మలిదశ పోరాట దిక్సూచిని దెబ్బతీస్తారా 

తెలంగాణ అమరజ్యోతి సాక్షిగా ఘోర అపచారం చేస్తారా 

తెలంగాణ స్వపరిపాలన సౌధం ముందు.….తుచ్ఛమైన.. స్వార్థ రాజకీయాలకు తెరతీస్తారా 

నాలుగు కోట్ల ప్రజల గుండెచప్పుడైన

తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాల్సిన చోట

రాహుల్ గాంధీ తండ్రివిగ్రహం పెడతారా.

తెలంగాణ కాంగ్రెస్ ను క్షమించదు

కాగా.. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమరవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది. ఈలోపు తెలంగాణ ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయించి చకచకా ఏర్పాట్లు చేసి విగ్రహావిష్కరణకు రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయాల్సిన చోట రాజీవ్ గాంధీ విగ్రహం ఎలా పెడతారంటూ బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. తమ మాట వినకుండా అక్కడ రాజీవ్ విగ్రహం పెడితే భవిష్యత్తులో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత దాని తొలగిస్తామని, గత పదేళ్లు అధికారంలో ఉన్నా రాజీవ్ ఆరోగ్య శ్రీ, రాజీవ్ గాంధీ విమానాశ్రయం పేర్లను తాము తొలగించలేదని, కానీ ఈసారి ఈ పేర్లను కూడా తొలగించి తెలంగాణకు చెందిన మహనీయుల పేర్లను పెడతామని గతంలోనే కేటీఆర్ స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

ఈరోజు రాష్ట్ర సచివాలయం ఎదుట ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. సాయంత్రం 3:45 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. ఇందులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెష్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దీపాదాస్ మున్షీ, డీసీసీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నేతలు పాల్గొంటారని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలిపారు.

విజయవాడలో గణేష్‌ లడ్డూ వేలంలో రికార్డ్ బ్రేక్.. బాలాపూర్‌కు పోటీ, ఎన్ని లక్షలో తెలుసా?

వినాయక చవితి వచ్చిందంటే చాలు అందరికి గుర్తొకొచ్చేది హైదరాబాద్.. అందులోనూ ఖైరతాబాద్ బడా గణేష్, బాలాపూర్ గణపతి లడ్డూ. ముఖ్యంగా బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాటకు మంచి క్రేజ్ ఉంది.. ప్రతి ఏటా అక్కడ రికార్డులు బ్రేక్ అవుతాయి. లడ్డూ వేలంపాట ఏకంగా రూ.లక్షల్లో ఉంటుంది.. అయితే కాలం మారింది.. బాలపూర్‌ను మించి కూడా గణపతి లడ్డూలు వేలంపాటలో రికార్డు ధర పలుకుతోంది. గతేడాది హైదరాబాద్‌లో బాలాపూర్‌ను మించి బండ్లగూడ రిచ్‌మండ్ విల్లాస్‌లో లడ్డూ ధర రూ.కోటి 26 లక్షలు పలికింది.. ఈ ఏడాది హైదరాబాద్‌ మాదాపూర్ మై హో భుజాలో వినాయుకుడి లడ్డూ.. రికార్డు స్థాయిలో రూ.29 లక్షలు పలికింది.

హైదరాబాద్, తెలంగాణలో మాత్రమే కాదు ఏపీలో కూడా గణపతి లడ్డూ వేలంపాటకు జనాల్లో క్రేజ్ పెరిగింది. ఈ ఏడాది రికార్డ్ స్థాయిలో బాలపూర్ లడ్డూ ధరతో పోటీపడుతూ.. భారీ ధర పలికింది. విజయవాడ రూరల్ మండలం నున్నలోని శ్రీసాయి బాలాజీ ఎన్‌క్లేవ్‌ అపార్టుమెంట్‌లో వినాయకుడ్ని ఏర్పాటు చేశారు.. విగ్రహం దగ్గర ఆదివారం నిర్వహించిన స్వామి వారి లడ్డూ ప్రసాదం వేలంలో.. విపోదా ఫిన్‌స్పైర్‌ సొల్యూషన్స్‌ కంపెనీ ఎండీలు సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి, నక్కా రామ్‌ బాలాజీలు రూ.26 లక్షలకు లడ్డూని సొంతం చేసుకున్నారు.

లడ్డూను వేలంపాటలో దక్కుించుకున్న ప్రదీప్‌రెడ్డి, రామ్ బాలాజీలను ఉత్సవ కమిటీ కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. గణపతి లడ్డూ ప్రసాదాన్ని వేలంపాటలో దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నారు సింగంరెడ్డి ప్రదీప్‌రెడ్డి. తాను రాబోయే రోజుల్లో అపార్టుమెంట్‌ అభివృద్ధి కార్యక్రమాలకు, వచ్చే ఏడాది చవితి వేడుకలు మరింత వైభవంగా నిర్వహించుకోవాలనే ఉద్దేశంతోనే రూ.26 లక్షల పెద్ద మొత్తానికి వినాయక లడ్డూ పాట పాడామని తెలిపారు. బాలాపూర్ లడ్డూకు పోటీగా ఈ లడ్డు ఏకంగా రూ.26 లక్షలు పలికింది.

మరోవైపు వినాయకుని విగ్రహాల నిమజ్జనం చేసే ప్రాంతాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మంగినపూడి బీచ్, పెడన, కాలేఖాన్‌పేట మంచినీళ్ల కాలువ, గూడూరు అడ్డరోడ్డు దగ్గర నిమజ్జనం చేసే ప్రాంతాలను జిల్లా ఎస్పీ గంగాధరరావు పరిశీలించారు. ఎలాంటి గొడవలకు, ప్రమాదాలకు ఆస్కారం లేకుండా పటిష్ఠ బందోబస్తు నిర్వహించాలన్నారు. నిమజ్జనాలు చేసే మంగినపూడి, తాళ్లపాలెం, సత్రవపాలెం, పెదపట్నం, ఘంటసాల మండలం శ్రీకాకుళం తదితర ప్రాంతాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులుజప్రమాదవశాత్తూ ఎవరూ నీళ్లలో మునిగిపోకుండా ఈతగాళ్లు, పడవలను సిద్ధంగా ఉంచారు. రద్దీ ప్రాంతాల్లో ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి మంగళవారం వరకు ఈ వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగనున్నాయి.

ప్రమాదం కలచివేసింది.. తీవ్ర విషాదం బాధించింది!

చిత్తూరు జిల్లా పరిధిలోని మొగిలి ఘాట్ రోడ్డులో పలమనేరు రోడ్డులో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొంది.. అత్యంత విషాదకరమైన ఈ ఘటనలో 8 మంది మరణించారు

మరో 30 మంది గాయపడ్డారు.. ప్రమాదం కారణంగా బస్సు ముందుభాగం చాలా వరకు లారీ కింది భాగంలోకి వెళ్ళిపోయి, ఆ భాగం మొత్తం నుజ్జయింది..

ఈ ప్రమాదం నన్ను తీవ్రంగా కలచివేసింది.. ఈ విషాదం బాధించింది.. మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి..

ఆర్టీసీ బస్సులను నడిపే డ్రైవర్లు అప్రమత్తత ముఖ్యం, పేద కుటుంబాల ఆశలన్నీ మీపై ఉంటాయని మర్చిపోవద్దు..!

హిందువులు ఆజాన్ మరియు నమాజ్ సమయంలో పూజలు చేయడం మానేయాలి... హిందువులకు వ్యతిరేకంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త ఆదేశం.

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని పడగొట్టిన తర్వాత హిందువుల పరిస్థితి మరింత దిగజారింది. బంగ్లాదేశ్‌లో షేక్ హసీనా ప్రభుత్వం నిష్క్రమించిన తర్వాత, మొదట హిందువులపై దాడి జరిగింది మరియు ఇప్పుడు వారు మతపరమైన స్థాయిలో కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మహ్మద్ యూనస్ ప్రభుత్వం హిందువులపై నిరంతరం చర్యలు తీసుకుంటోంది. ఇప్పుడు మరో కొత్త ఉత్తర్వులు వెలువడ్డాయి. అజాన్ మరియు నమాజ్ సమయంలో లౌడ్ స్పీకర్లను ప్లే చేయకూడదని స్థానిక పూజా కమిటీలను కోరినట్లు బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు తెలిపారు.

ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం నమాజ్ మరియు ఆజాన్ సమయంలో దుర్గా పూజ వేడుకలలో లౌడ్ స్పీకర్లను ప్లే చేయవద్దని హిందూ సమాజాన్ని కోరినట్లు మీడియా నివేదికలు తెలిపాయి. బంగ్లాదేశ్ హోం వ్యవహారాల సలహాదారు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) MD జహంగీర్ ఆలం చౌదరి మంగళవారం మాట్లాడుతూ పూజా కమిటీలు లౌడ్ స్పీకర్లను స్విచ్ ఆఫ్ చేయాలని మరియు అజాన్ మరియు నమాజ్ సమయంలో సంగీత వాయిద్యాలను వాయించవద్దని కోరినట్లు తెలిపారు. నిర్వాహకుల అభ్యర్థనకు అంగీకరించినట్లు ఆయన తెలిపారు.

చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బంగ్లాదేశ్‌లో ఈ సంవత్సరం మొత్తం 32 వేల 666 పూజా పండాలను ఏర్పాటు చేయనున్నట్లు, ఇది గత సంవత్సరం సంఖ్య 33 వేల 431 కంటే తక్కువ. బంగ్లాదేశ్ స్వాతంత్ర్య సమరయోధుల వారసులకు విద్య మరియు ఉద్యోగాలలో కోటాలకు వ్యతిరేకంగా విద్యార్థుల నిరసనలు మరియు మాజీ ప్రధాని షేక్ హసీనా బహిష్కరణ తర్వాత దేశంలోని మైనారిటీ హిందూ సమాజంపై తదుపరి దాడుల తర్వాత ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.

అప్పటి నుండి, బంగ్లాదేశ్‌లో మతపరమైన మైనారిటీలు, ముఖ్యంగా హిందువుల భద్రత గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. షా పోరాన్ దర్గాలో జరిగిన సంఘటనతో సహా మత స్థలాలపై ఇటీవల జరిగిన దాడుల గురించి అడిగినప్పుడు, షా పోరాన్ దర్గాపై దాడి గురించి నాకు ఏమీ తెలియదని లెఫ్టినెంట్ జనరల్ చౌదరి అన్నారు. అయితే, ఎలాంటి దాడి జరగకుండా భద్రత కల్పించడం నా బాధ్యత. ఈ మేరకు న్యాయాధికారులకు సూచనలు చేశారు.

విగ్రహాల నిర్మాణం జరిగినప్పటి నుంచి పూజల నిర్వాహకులకు భద్రత కల్పిస్తామని చౌదరి హామీ ఇచ్చారు. పూజా మండపాలలో 24 గంటల భద్రత ఎలా ఉండాలనే దానిపై చర్చించామని ఆయన మీడియాకు తెలిపారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, దుశ్చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలా ఉంటే, మహమ్మద్ యూనస్ పాలనలో కొన్ని చర్యలు భారతదేశంలో కనుబొమ్మలను పెంచాయి.

కొన్ని రోజుల క్రితం, యూనస్ యొక్క తాత్కాలిక ప్రభుత్వం భారతదేశానికి హిల్సా ఎగుమతిని నిషేధించింది, ఇది బంగ్లాదేశ్ ఇలిష్ (చేపను బెంగాలీలో పిలుస్తారు) మరియు దుర్గాపూజకు ముందు ధరలు పెరగడానికి దారితీసింది. పండుగల సీజన్‌లో భారతదేశానికి, ముఖ్యంగా పశ్చిమ బెంగాల్‌కు పద్మ ఇలిష్ యొక్క పెద్ద సరుకులను పంపే స్థిరమైన అభ్యాసం. ఇది అవామీ లీగ్ నాయకురాలు మరియు మాజీ ప్రధాని షేక్ హసీనా అనుసరించిన సద్భావన పద్ధతి.

జగన్‌తో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో!

వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో సెల్ఫీ దిగిన మహిళా కానిస్టేబుల్‌కు మెమో ఇవ్వనున్నట్టు జైలర్ రవిబాబు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలుంటాయని పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడిచేసిన కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైలులో ఉన్న మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను జగన్ మొన్న పరామర్శించారు. 

అనంతరం బయటకు వచ్చిన జగన్‌ను అదే జైలులో పనిచేస్తున్న అనంతపురానికి చెందిన మహిళా కానిస్టేబుల్ అయేషాబాను కుమార్తెతో కలిసి వచ్చి జగ‌న్‌తో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అయింది.

విధుల్లో ఉన్న సంగతిని మర్చిపోయి ఇలా సెల్ఫీలు దిగడం ఏంటన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో స్పందించిన జైలు అధికారులు ఆమెకు మెమో ఇవ్వనున్నట్టు తెలిపారు. ఆమె ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని జైలర్ రవిబాబు పేర్కొన్నారు.