/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రణ చేయాలి: ఎర్ర నరేష్ Vijay.S
ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి, ప్రైవేట్ పాఠశాలల ఫీజులను నియంత్రణ చేయాలి: ఎర్ర నరేష్

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని ఎస్ ఎస్ యూ మండల నాయకులు స్వేరో సర్కిల్ వాలంటరీ ఎర్ర నరేష్ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండలంలోని శోభనాద్రిపురం గ్రామంలో ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని, ప్రయివేటు పాఠశాలలో ఫీజుల నియంత్రణ చేయాలని, దాని కోసం చట్టం తేవాలని అన్నారు. పాఠశాలలు ప్రారంభం అయిననందున విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులు ఉండాలని, మధ్యాహ్నం బోజన పథకం సరిగ్గా అమలు చేయాలని, విద్యార్థులకు సరిపడా తరగతి గదులు, తాగు నీరు, మూత్ర శాలలు, ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఎర్ర బిక్షపతి, ఎర్ర శివ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


భువనగిరి : సూరేపల్లి కి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి: చిరంజీవి ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్

భువనగిరి జిల్లా కేంద్రం నుంచి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ చిరంజీవి డిమాండ్ చేశారు. శుక్రవారం భువనగిరి బస్ స్టేషన్ కంట్రోలర్ లింగయ్య కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ భువనగిరి జిల్లా కేంద్రం నుండి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు , ప్రయాణికులు, విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. గత రెండు నెలల నుంచి సూరేపల్లి గ్రామానికి బస్సు రావడం లేదని, ఈనెల నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారని ఆయన అన్నారు. ప్రైవేట్ ఆటోలలో ఇతర వాహనాల ద్వారా విద్యార్థులు పాఠశాల, కళాశాలలకు వెళ్తున్నారని ఆయన తెలిపారు. అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంబం అనిల్ కుమార్ రెడ్డి, యాదగిరిగుట్ట డిపో మేనేజర్ శ్రీనివాస్ లకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు. వారు స్పందించి సూరేపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు చిరంజీవి తెలిపారు. వినతి పత్రం అందజేసిన వారిలో గ్రామానికి చెందిన వెంకట నరసింహారెడ్డి , మురళి, ప్రభాకర్, నవీన్ ,మహేందర్, విద్యార్థులు పాల్గొన్నారు.

భువనగిరి పట్టణంలో 8వ వార్డులో నీటి వసతి కల్పించిన కౌన్సిలర్ పంగరెక్క స్వామి

భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని నీలగిరి థియేటర్ నందగుట్ట దగ్గర 8వ వార్డు లో పనిచేయని బోరు ను వార్డు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి దగ్గరుండి కొత్త మోటార్ వేపించి ప్రజలకు నీరు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు నీటి ఎద్దటి లేకుండా ఉండకూడదని వేరే మోటార్ వేయించమని తెలియజేశారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది శంకరయ్య పాపయ్య కృష్ణ వార్డ్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
భువనగిరి: జూలై 1 నుంచి అమలయ్యే కొత్త క్రిమినల్ మేజర్ చట్టాలను రద్దు చేయాలని భువనగిరి బార్ అసోసియేషన్ ముందు నిరసన

ఆర్టికల్ 21 ద్వారా రాజ్యాంగం ఇచ్చిన హక్కులను నూతనంగా వచ్చే క్రిమినల్ మేజర్ చట్టాల ద్వారా హక్కులను కోల్పోతున్నామని జులై 1 నుండి అమలయే నూతన క్రిమినల్ మేజర్ చట్టాలను వెంటనే రద్దు చేయాలని భారశిక్ష అధ్యక్షులు బబ్బురి హరినాథ్ ఐలు జిల్లా అధ్యక్షులు మామిడి వెంకటరెడ్డిలు డిమాండ్ చేశారు భువనగిరి బార్ అసోసియేషన్ ముందు ప్లేకార్డులతో నిరసన వ్యక్తం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ కొత్త క్రిమినల్ మేజర్ చట్టాలు న్యాయ వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాలను చూపుతుందని వెంటనే అమలు చేయ తలపెట్టిన నూతన క్రిమినల్ మేజర్ చట్టాలను రద్దు చేయాలని వారు కోరారు అన్ని బార్ అసోసియేషన్లలో,జడ్జీలతో, ప్రజలతో, విస్తృతంగా చర్చ జరపాలని వారు అన్నారు అలాగే రేపు 29-06-24 రోజున బార్ అసోసియేషన్ హాల్లో జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జరుగుతున్నాయని ఈ శిక్షణ తరగతులకు న్యాయవాదులు అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా వారు కోరారు *ఈ కార్యక్రమంలో గజ్జల రవీందర్ రెడ్డి, గోదా వెంకటేశ్వర్లు, బొబ్బల కేశవరెడ్డి,బొల్లెపల్లి కుమార్ ఐలు జిల్లా సహాయ కార్యదర్శి బొమ్మ వెంకటేష్ సురకంటి జంగారెడ్డి జి లింగం సురేష్ చింతల రాజుతదితరులు పాల్గొన్నారు.

హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా మారగోని

హ్యూమన్ రైట్స్ యాంటీ కరప్షన్ అసోసియేషన్ యాదాద్రి భువనగిరి జిల్లా చైర్మన్ గా వలిగొండ పట్టణ కేంద్రానికి చెందిన మారగోని శ్రీనివాస్ గౌడ్ ను నియమిస్తూ హ్యూమన్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు,గుండారెడ్డి మల్లికార్జున రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకంతో తనకు బాధ్యతలు అప్పగించిన జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డికి, నియామకానికి సహకరించిన సౌత్ ఇండియా చైర్మన్ రావులపల్లి తిరుపతయ్య, తెలంగాణ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఇటికాల మాధవి, ఎండి. సమిమ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. మానవ హక్కులకు భంగం కలగకుండా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా పోరాడుతానని తెలిపారు.

వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర పై PD , యాక్ట్ ప్రయోగించిన రాచకొండ పోలీసులు

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ..తన వ్యక్తిగత అవసరాల కోసం స్థానిక కాంట్రాక్టర్ లను, ప్రభుత్వ ఉద్యోగులను , మహిళల ను టార్గెట్ చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ బెదిరింపులకు SC /ST కేసులు పెడితనని బెదిరింపులకు పాల్పడుతున్న వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేందర్ (43 ) అనే వ్యక్తి పై ప్రివెంటివ్ డిటెన్షన్ ( PD) యాక్ట్ ప్రయోగించిన రాచకొండ పోలీసులు.

స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వలిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో వేములకొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర (43) అనే వ్యక్తి తన వ్యక్తిగత అవసరాల కోసం కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారులను బెదిరింపులకు పాల్పడుతూ వారి వద్ద నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ SC /ST కేసులు పెడుతనాని బెదిరింపులకు పాల్పడుతూ , మహిళలను మానసికంగా, శారీరకంగా బెదిరిపింపులకు పాల్పడుతున్నడని స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారి పై కేసునమోదు చేసి అరెస్ట్ చేసి రిమాండ్ తరలించించిన పోలీసులు.

రాచకొండ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషి ఆదేశాల మేరకు నిందితునిపై PD నెంబర్ 6/PD -Cell / RCKD/2024 యాక్ట్ వలిగొండ మండలం వేముల కొండ గ్రామానికి చెందిన వేముల నరేంద్ర (43) అనే వ్యక్తి పై PD చట్టాన్ని ప్రయోగించిన రాచకొండ పోలీసులు... * *నిందితున్ని నల్గొండ సబ్ జైల్ నుండి చర్లపల్లి జైల్ కు తరలించిన రాచకొండ పోలీసులు పోలీసులు.
వలిగొండ: ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలి వేముల నాగరాజు SFI జిల్లా ఉపాధ్యక్షులు

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక మండల విద్యాధికారి కార్యాలయంలో ఎస్ఎఫ్ఐ వినతిపత్రం వినతిపత్రం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు నియంత్రణ చేయాలన్నారు ఒక పాఠశాలలో ఒక రేటుగా అంగట్లో సరుకుల ఏ స్కూలుకు తోసిన ఫీజు ఆ స్కూలు తీసుకోవడం జరుగుతోంది అన్నారు వెంటనే ప్రభుత్వం ఫీజు నియంత్రణ చేసి పేద మధ్య తరగతి తల్లిదండ్రులని ఆదుకోవాలని అన్నారు మరియు మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పేరెంట్స్ మీటింగ్లో ద్వారా ఫీజు నిర్ణయాలు చేయాలన్నారు పాఠశాల యజమాన్యం వాళ్ళు ఇష్టానుసారమైన ఫీజులు నిర్వహించడం తల్లిదండ్రులు కట్టడం కాకుండా పేరెంట్స్ మీటింగ్లో వారు కట్టే స్తోమత తగిన ఫీజులు నిర్ణయం చేయాలన్నారు అదేవిధంగా మండలంలోని అన్ని ప్రైవేట్ పాఠశాలలో వేలకు వేలుగా పుస్తకాల పేరుతో స్టేషనరీ వ్యాపారం నడిపిస్తున్నారన్నారు ప్రభుత్వ మాత్రం చోద్యం చూస్తున్నట్టు విహరిస్తామన్నారు అని వారు విమర్శించారు మండల విద్యాధికారి వెంటనే అన్ని పాఠశాలలు తనిఖీ నిర్వహించి పుస్తకాల అమ్ముతున్న పాఠశాలను సీజ్ చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పట్టణ అధ్యక్షులు మైసోల్ల నరేందర్ ఏసోఫ్ ఫర్దిన్ తదితరులు పాల్గొన్నారు.
ఆదర్శమూర్తి, అసాధారణ ప్రతిభాశాలి హెల్లెన్ కెల్లర్; ధరణికోట నరసింహ VHPS జిల్లా అధ్యక్షులు

చిన్న తనం నుంచే మూడు రకాల వైకల్యాలను జయించి, అసాధారణ ప్రతిభను కనబర్చిన హెల్లన్ కెల్లర్ జీవితం మనకు ఆదర్శం కావాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులధరణికోట నర్సింహ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్ స్టేషన్ ఆవరణలో జరిగిన "హెల్లన్ కెల్లర్" 144 వ జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్లన్ కెల్లర్ పుట్టుకతోనే చెవుడు,మూగ, అంధత్వం కల్గి ఉన్నా, అధైర్య పడకుండా ఆమె వికలాంగుల, మహిళల హక్కుల కోసం కృషి చేసారని ఆయన అన్నారు. హెల్లన్ కెల్లర్ రచయితగా, సంఘసంస్కర్త గా చేసిన సేవలు మరువలేనివని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ నాయకులు కొడారి వెంకటేష్, వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ఉపాధ్యక్షులు జాగిళ్ళపురం అయిలయ్య, నాయకులు వెంకటేశ్వర్లు , విద్యార్థులు పాల్గొన్నారు.

వలిగొండ: హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలి : సిపిఎం డిమాండ్

వలిగొండ తొర్రూర్ డబుల్ రోడ్డు వెడల్పులో భాగంగా అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటుచేసిన డివైడర్ కు ఎలాంటి హెచ్చరికల బోర్డులు,స్పీడ్ బ్రేకర్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వెంటనే హెచ్చరిక బోర్డులు స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మాట్లాడుతూ వలిగొండ నుండి తిరుమలగిరి వరకు నిర్మించిన డబల్ రోడ్డు నిర్మాణం లో భాగంగా వలిగొండ అంబేద్కర్ విగ్రహం నుండి పవిత్రాత్మ పాఠశాల వరకు ఏర్పాటు చేసిన డివైడర్ ముగింపులో ఎలాంటి హెచ్చరికల బోర్డు మరియు స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఇటీవల ఒక టాటా ఏసీ బండి డివైడర్ పైకి ఎక్కిన పరిస్థితి ఉందన్నారు పాఠశాల ఉండటంతో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి వెళ్తుంటారని స్పీడ్ గా వచ్చే వాహనాల వల్ల ప్రమాదం ఉందని వెంటనే రోడ్డు నిర్మించిన కాంట్రాక్టర్, మరియు ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి డివైడర్ ముగింపులో హెచ్చరిక బోర్డును మరియు పవిత్రాత్మ పాఠశాల ఆవరణలో స్పీడ్ బ్రేకర్స్ ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి వర్గ సభ్యులు తుర్కపల్లి సురేందర్, మెరుగు వెంకటేశం,మండల నాయకులు రాధారపు మల్లేశం, కొండూరు సత్తయ్య,రంగారెడ్డి, సలిగంజి మురళీ కృష్ణ,నర్సింహ,ముత్యాలు తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: రైలు కిందపడి బస్వాపురం గ్రామానికి చెందిన వ్యక్తి మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: రైలు కిందపడి వ్యక్తి మృతి చెందిన ఘటన ముత్తిరెడ్డిగూడెం గ్రామ సమీపంలో గురువారం చోటుచేసుకుంది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... భువనగిరి మండలం బస్వాపురం గ్రామానికి చెందిన ఉడుత పాండు మద్యానికి బానిస అయినందున, కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు .