/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి తరలిరండి: యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం Vijay.S
కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి తరలిరండి: యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం


 తెలంగాణ రాష్ట్ర కురుమల ఆత్మగౌరవ భవన ప్రారంభోత్సవానికి కురుమలు అధిక సంఖ్యలో తరలి రావాలని యాదాద్రి భువనగిరి జిల్లా కురుమ సంఘం జిల్లా అధ్యక్షులు గవ్వల నర్సింహులు, రాష్ట్ర కార్యదర్శి డోకె బాలకృష్ణ, జిల్లా కార్యదర్శి కాదూరి అచ్చయ్య, జెడ్పీటీసీ సుబ్బురు బీరు మల్లయ్య పిలుపునిచ్చారు. సోమవారం వారు మీడియాతో మాట్లాడారు . ఫిబ్రవరి 18 న మధ్యాహ్నం రెండు గంటలకు కోకాపేట సెజ్ లో కురుమల ఆత్మగౌరవ భవనం (దొడ్డి కొమురయ్య భవన్) ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధిరామయ్య, హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర రవాణా , బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య, ఎమ్మెల్సీ యెగ్గె మల్లేశం లు హాజరవుతారని వారన్నారు. సుమారు ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన భవనాన్ని కురుమ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కురుమలు, షెఫర్డ్స్, కురుమ కుల పెద్దలు అధిక సంఖ్యలో హాజరై, ప్రారంభోత్సవ కార్యక్రమం ను విజయవంతం చేయాలని వారు కోరారు.

సూర్యాపేట గురుకులంలో బాలిక మృతి కి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి :మేడి ప్రియదర్శిని


సూర్యాపేట రూరల్ మండలం ఇమాంపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని దగ్గుపాటి వైష్ణవి హాస్టల్ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని,హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేయాలని బి ఎస్ పి నకిరేకల్ నియోజకవర్గ ఇంచార్జి మేడి ప్రియదర్శి ఒక ప్రకటనలో ప్రబుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం నాడు కళాశాల ప్రాంగణంలో జరిగిన ఫెర్ వెల్ పార్టీలో ఉత్సాహంగా పాల్గొన్న వైష్ణవి ,పార్టీ విశేషాలను వీడియో కాల్ ద్వారా తల్లితో సంతోషంగా చెప్పింది.ఏం జరిగిందో ఏమో కానీ రాత్రి 9:30 ప్రాంతంలో విద్యార్థులంతా బయట కూర్చుని కూల్ డ్రింక్ తాగుతున్న సమయంలో రూముకు వెళ్ళిన వైష్ణవి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. వైష్ణవి ఆరోగ్యం బాగాలేదని ప్రభుత్వ ఆసుపత్రికి రావాలని కాలేజ్ సిబ్బంది సమాచారం ఇవ్వడంతో సూర్యాపేట పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో నివాసం ఉండే వైష్ణవి తల్లిదండ్రులు వచ్చేలోపే కళాశాల సిబ్బంది వెళ్లిపోయారని, తమ కూతురు మరణం పై అనుమానాలు ఉన్నాయని ,తమ కూతురుని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని వైష్ణవి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇటీవల కాలంలో సంక్షేమ హాస్టల్లో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి స్థానికంగా హాస్టల్ వార్డెన్లు ఉండకపోవడం నిర్వహణ లోపం వలన ఈ ఘటన జరుగుతున్నట్లు తెలుస్తున్నదని తెలియజేశారు.

కేంద్రంలో మరో మారు బిజెపి సర్కార్: ఏలే చంద్రశేఖర్ బిజెపి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు


భారతీయ జనతా పార్టీ కేంద్ర, రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈ రోజు వలిగొండ మండల కేంద్రంలో గావ్ చలో ఘర్ చలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలే చంద్రశేఖర్ గారు పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలను గ్రామంలో ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ ,కేంద్ర పథకాల గురించి వివరించడం జరిగింది, రాబోయే పార్లమెంట్ ఏలెక్షన్లలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీనీ మరొకసారి ఆశీర్వదించాలని వారిని కోరడం జరిగింది అని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ భువనగిరి పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి గౌడ్, జిల్లా ఉపాధ్యక్షులు దంతూరి సతయ్య గౌడ్,శీలోజు శ్రీరాములు ,రాచకొండ కృష్ణ, బంధారపు రాములు ,బచ్చు శ్రీనివాస్ ,మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్ ,మండల ఉపాధ్యక్షులు దయ్యాల వెంకటేష్ ,BJYM మండల అధ్యక్షులు రేగురి అమరేందర్, BJYM మండల ప్రధాన కార్యదర్శి బుంగమట్ల మహేష్, ఏర్రబోలు జంగయ్య,పిట్టల రాజు ,మందుల నాగరాజు తదితరులు పాల్గొనడం జరిగింది.

నల్లగొండ సభ విజయవంతం చేయాలని.. వలిగొండలో బీఆర్ఎస్ పార్టీ సన్నహాక సమావేశం


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో మార్కెట్ ప్రాంగణంలో మండల టిఆర్ఎస్ తరఫున సన్నాహక సమావేశనికి మార్కెట్ కమిటీ చైర్మన్ పైల్ల రాజా వర్ధన్ రెడ్డి. మండల టిఆర్ఎస్ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి.

ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించినారు. ముఖ్య అతిథులుగా భువనగిరి నియోజకవర్గం ఇన్చార్జి చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకి రవిశంకర్. కరీంనగర్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామకృష్ణ హాజరై వారు మాట్లాడుతూ రేపు జరగబోయే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కెసిఆర్ 

కృష్ణానది జలాల తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం ఈ భారీ బహిరంగ సభకు హాజరై ప్రజల పక్షాన పోరాటం కోసం వస్తున్న ఈ సభను విజయవంతం చేయాలని ప్రతి గ్రామం నుండి ప్రతి మండలం నుండి భారీగా కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్ శివశాంత్ రెడ్డి పడమటి మమతారెడ్డి ఐటిపాముల రవీందర్ డేగల పాండు యాదవ్ కీసర్ల సత్తిరెడ్డి సురగంటి వెంకటరెడ్డి మరియు మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సేవాలాల్ మహారాజ్ జయంతి వాల్ పోస్టర్ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య


యాదాద్రి భువనగిరి జిల్లా లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సద్గురు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా ... ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య తన నివాసంలో ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు మాట్లాడుతూ... సేవాలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు, ఆప్షనల్ హాలిడే కాకుండా, అధికారికంగా హాలిడే ఇవ్వాలని కోరారు, అలాగే యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారా భవన్ మరియు సేవాలాల్ మహారాజ్ మందిరాన్ని నిర్మించాలని, కమిటీ తరఫున ప్రభుత్వ విప్ బీర్ల ఐలన్న కి విన్నపించడం జరిగింది, వారు తప్పకుండా నిర్మిస్తామని హామీ ఇవ్వడం జరిగింది .ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి *జిల్లా అధ్యక్షులు భూక్య సంతోష్ నాయక్, రాష్ట్రఉపాధ్యక్షులు రాంజీనాయక్, రాష్ట్ర నాయకులు రవి నాయక్, శ్రీహరి నాయక్,జిల్లా నాయకులు రమేష్ నాయక్, కిషన్, దేవేందర్ నాయక్,వెంకటేష్,క్రాంతి నాయక్,శ్రీను నాయక్,అరుణ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సిపిఐ - ఏఐటియుసి పోరాటాల ఫలితమే కొండపైకి ఆటోల అనుమతి: ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండి ఇమ్రాన్


 గత రెండు సంవత్సరాలుగా సిపిఐ - ఏఐటీయూసీ పోరాటాల ఫలితమే యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలకు అనుమతి లభించిందని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి తెలిపారు.

    ఆదివారం రోజున యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను అనుమతించడం పై ఏఐటీయూసీ ఆటో యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ హర్షo వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇమ్రాన్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా యాదగిరిగుట్ట కొండపైకి నడిచే 300 ఆటో కార్మికుల కుటుంబాలు వీధిన పడ్డాయని అనేక సందర్భాల్లో చేసిన పోరాటాల్లో స్థానిక సిపిఐ, ఏఐటీయూసీ నాయకులు మరియు ఏఐటీయూసీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొనడం జరిగింది. ఆటో కార్మికుల సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టి వారిని కొండపైకి తీసుకు వెళ్లడానికి పూర్తిగా సహకారం అందించిన ప్రభుత్వ విప్ స్థానిక ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య గారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి ఇమ్రాన్ కృతజ్ఞతలు తెలిపారు.

   ఏప్పటికైనా పోరాటం విజయం సాధిస్తుందని కార్మికులు తమ హక్కుల కోసం నిరంతరం ఉద్యమాలు నిర్వహించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.

   ఈ ఉద్యమానికి సహకరించిన సిపిఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు  గారికి, సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి గారికి, సిపిఐ జిల్లా కార్యదర్శి గోద శ్రీరాములు గారికి, ఏఐటీయూసీ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.ఎస్ బోస్, ఆటో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి బి వెంకటేశం గారికి ధన్యవాదాలు తెలిపారు.

    ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు గనబోయిన వెంకటేష్, ప్రధాన కార్యదర్శి సామల భాస్కర్, ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు తదితరులు హర్షo వ్యక్తం చేశారు.

అబాకస్ మాథ్స్ టాలెంట్ టెస్ట్ లో శ్రీ సాయి ప్రశాంతి విద్యార్థుల హవా..


 ఇంటర్ డిస్ట్రిక్ట్ అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో భువనగిరి శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ విద్యార్థులు సీనియర్ విభాగంలో మొదటి బహుమతిని, జూనియర్ విభాగంలో ద్వితీయ బహుమతులు కైవసం చేసుకున్నారు. ఆదివారం జనగాం జిల్లా కేంద్రంలోని సాన్ మరియా హైస్కూల్ లో ఇంటర్ డిస్ట్రిక్ట్ ( యాదాద్రి భువనగిరి, జనగాం, సూర్యాపేట) అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు జరిగిన అబాకస్ మ్యాథ్స్ టాలెంట్ టెస్ట్ లో సీనియర్ విభాగంలో శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ఐదవ తరగతి కి చెందిన కొత్తపల్లి సాయి విఘ్నేష్ మొదటి బహుమతిని, జూనియర్ విభాగంలో అశుతోష్ ద్వితీయ బహుమతిని సాధించారు. ఈ సందర్భంగా బహుమతులు సాధించిన విద్యార్థులను, అబాకస్ మ్యాథ్స్ టీచర్ కొడారి కళ్యాణి లను శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ప్రిన్సిపాల్ తోటకూరి యాదయ్య అభినందించారు. ఈకార్యక్రమంలో విశ్వం ఎడ్యుటెక్ సొల్యూషన్స్ బాధ్యులు ప్రమోద్, ప్రశాంత్, వాసవి, శ్రీ సాయి ప్రశాంతి విద్యా నికేతన్ ఉపాద్యాయులు ప్రమీల, మౌనిక , విద్యార్థులు పాల్గొన్నారు.

యాదాద్రి కొండపైకి ఆటోల కు అనుమతి


యాదాద్రి కొండపైకి ఆటోలు చేరుకున్నాయి. ప్రభుత్వం విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావు ఆదివారం జెండా ఊపి ఆటోలను కొండపైకి అనుమతించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొండపైకి ఆటోలని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. దాదాపు 300 ఆటో కార్మికులు జీవన ఉపాధి కోల్పోయారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే కొండపైకి ఆటోల ను అనుమతిస్తామని హామీ ఇచ్చింది. దీంతో ప్రభుత్వం ఆటో కార్మికులను కొండపైకి అనుమతి ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో ఆటో కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతు కే జేండగే డిసిపి రాజేష్ చంద్ర ,అదనపు కలెక్టర్ వీరారెడ్డి ,ఆలయ చైర్మన్ బి నరసింహమూర్తి, అధికారులు ,ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర బడ్జెట్ లో విద్యార్థులకు తీవ్ర అన్యాయం: పల్ల గొర్ల మోదీ రాందేవ్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు


 వలిగొండ : బడ్జెట్లో విద్యారంగానికి నిధులు కేటాయించకుండా అన్యాయం చేశారని గాంధీ చౌరస్తా వద్ద నిరసన తెలుపుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో విద్యారంగాన్ని తీవ్ర అన్యాయం చేసిందన్నారు బీసీ విద్యార్థి సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటన్ బడ్జెట్లో విద్యా రంగానికి కేవలం 7.8 అంటే 21389 నిధులు కేటాయించడం అన్యాయం గతంతో పోలిస్తే 1.3 నిధులు మాత్రమే ఎక్కువ కేటాయించారు రాజ్యాంగం లోని కోటరీ కమిషన్ విద్యారంగానికి రాష్ట్ర బడ్జెట్లో 20% నిధులు కేటాయించాలంటే కేవలం 7.8 శాతం నిధులు కేటాయించడం అన్యాయం ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల ఊసే లేదు బడ్జెట్లో సంక్షేమ హాస్టళ్లకు మెస్చార్జీలు ఇస్తామన్న ఆలోచన లేదు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి నిధులు కేటాయించలేదు మండలానికి ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పి కేవలం 500 కోట్లతో 570 మండలాలలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఎలా నిర్మిస్తారు 900 గురుకుల పాఠశాలకు 1500 కోట్లతో ఎలా నిర్మిస్తారు యూనివర్సిటీలను 2000 కోట్లతో అభివృద్ధి చేస్తామని చెప్పి 500 కోట్లు ఇవ్వడం దుర్మార్గం కొత్త యూనివర్సిటీల మాటే లేదు విద్యను వ్యాపారం చేయొద్దని భారత రాజ్యాంగంలో ఉన్న గత ప్రభుత్వం ప్రవేట్ సంస్థలకు దోచిపెట్టింది ఈ ప్రభుత్వం అలా చేయకుండా విద్యార్థి సమస్యలను పరిష్కరించాలి బడ్జెట్లో విద్యారంగానికి కనీసం 15 నుండి 20% నిధులు కేటాయించాలి పేద విద్యార్థులు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని అన్నారు ఈ *సమావేశంలో గొలుసుల మధు,మల్లయ్య, విద్యారత్నం, క్రాంతి కుమార్, వెంకటేశ్వర్లు, శ్రీహరి, లింగస్వామి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

ఆర్థిక సహాయం అందజేసిన వాకిటి అనంతరెడ్డి డిసిసి ఉపాధ్యక్షులు


వలిగొండ మండల పరిధిలోని వేములకొండ గ్రామానికి చెందిన వడ్రబోయిన గౌతమ్ ఆర్థిక ఇబ్బందులతో శుక్రవారం రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలోఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.అతని సొంత గ్రామము వేములకొండచిన్నప్పుడు తండ్రిని కోల్పోయి తర్వాత అమ్మమ్మ ఊరు అయినా ఆరూరు గ్రామంలో పిట్టల యాదమ్మ దగ్గర జీవనోపాధి కోసం కూలి పని చేసుకుంటూ జీవనంకొనసాగించేవారు.ఆర్థిక ఇబ్బందులతో ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.ఈ విషయం తెలుసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వాకిటి అనంతరెడ్డి వడ్రబోయిన గౌతం కుటుంబ సభ్యులకు 4,000/ వేల రూపాయలు ఆర్థిక సహాయంఅందజేశారు.ఈ కార్యక్రమంలో పిట్టల సుధాకర్, బుర్ర శ్రీకర్ ,శివ, గ్రామ శాఖ అధ్యక్షులు వేల్పుల వెంకటేశం పాల్గొన్నారు.