/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ విధానాలను ప్రతిఘటిద్దాం :ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్ Vijay.S
కేంద్ర ప్రభుత్వ కార్పోరేట్ విధానాలను ప్రతిఘటిద్దాం :ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎం డి ఇమ్రాన్


   

కేంద్రలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో దేశంలో కార్మిక, రైతు, సమాన్య ప్రజలను విస్మరించి బడా పారిశ్రామిక వేత్తల ప్రయోజనం కోసం ఎర్ర తివాచీ వేసి పాలన కొనసాగిస్తుంది అని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ఆరోపించారు.

    గురువారం రోజున యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ముద్రించిన సమ్మెకు సంబందించిన గోడ పత్రికలను ఏఐటీయూసీ నాయకులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్బంగా ఇమ్రాన్ మాట్లాడుతూ ప్రైవేట్ కార్పరెట్ సంస్థల కోసం మోడీ ప్రభుత్వం 2.14 లక్షల కోట్ల బ్యాంకు అప్పులు మాఫీ చేసిందని, 2019నుండి 2022 వరకు 1 శాతం ఉన్న బడా వర్తకుల ఆదాయం 30 శాతం అభివృద్ధి అయంది కానీ కార్మికులకు ఎలాంటి ప్రయోజనం జరగలేదని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం స్కీమ్ వర్కరల కు కనీసవేతనం 26 వేలు ఇవ్వాలి అని, ఆటో డ్రైవర్లకు జీవనభృతి నెలకు పదివేలు ఇవ్వాలని, హమాలీ కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, మధ్యాహ్న భోజనం వంట కార్మికులకు నెలకు పదివేల వేతనం ఇవ్వాలని, పి. ఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాడ్యుటి, పెన్షన్, రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి అని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ల పరం చేస్తున్నదని వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వ రంగ సంస్థల్లో 100% వాటాలను అమ్ముతున్నదని అన్నారు. కార్మికులు మధ్యతరగతి ప్రజల్లో అత్యధికలు పాలసీధాలుగా ఉన్న ఎల్ఐసి వాటాలను అమ్మేందుకు దిగబడిందని అన్నారు, సి పి ఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎనిమిదవ పే కమిషన్ను నియమించకుండా జాప్యం చేస్తుందని అన్నారు.ఉపాధి హామీ పథకాన్ని పట్టణాలకు విస్తరించి ప్రతి వ్యక్తికి 200 రోజుల పని 600 రూపాయలు రోజువారి వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో సుమారు కోటు మంది పనిచేస్తున్న కేంద్ర స్కీములకు ప్రభుత్వ నిధుల్లో కోత పెట్టిందని కనీస వేతనాలు చెల్లించడం కేంద్ర ప్రభుత్వం బాధ్యత అని వీటిని అమలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం బాధ్యత రహితంగా వ్యవహరిస్తుందని అన్నారు.కాంట్రాక్టు/ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలను పర్మినెంట్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మోడీ పాలన లో జరిగిన కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలు వలన జరుతున్న నష్టం పై ఫిబ్రవరి 16 న దేశ వ్యప్తంగా సమ్మె లో అన్ని వర్గాల కార్మికులు, రైతులు సమ్మె లో పాల్గొని జయప్రదం చేశాల అందరూ కృషి చెయ్యాలి అని అన్నారు.

    ఈ కారిక్రమంలో ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి గనబోయిన వెంకటేష్, కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, నాయకులు ఎడ్ల నరేష్, జిన్న కృష్ణ, పాండు, రమేష్, ఉపేందర్,రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

వలిగొండలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు.... రక్తదానం చేసిన చిల్లర స్వామి యాదవ్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా ...కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ,గోపరాజుపల్లి యాదవ సంఘం అధ్యక్షులు చిల్లర స్వామి యాదవ్ రక్తదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ...కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రతి గ్రామంలో నిర్వహించాలని ,వారి సేవలు ఈ నియోజకవర్గంలో చాలా అవసరమని అన్నారు. ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని, వారు ఆయురారోగ్యాలతో, భగవంతుని ఆశీస్సులతో, చల్లగా ఉండాలని .. ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు నరేష్ రెడ్డి , గోపరాజుపల్లి గ్రామ శాఖ మాజీ అధ్యక్షులు పులగూర్ల లింగారెడ్డి ,యూత్ అధ్యక్షులు సంగిశెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈనెల 18న ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ లను జయప్రదం చేయండి: వేముల నాగరాజు ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు


వలిగొండ మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలోని ఉన్నత పాఠశాలలో ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ జయప్రదం కోరుతూ.. కరపత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు మాట్లాడుతూ ఈ నెల18వ తేదీన పదవ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టాలెంట్ టెస్ట్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు .అదే విధంగా అధ్యయనం పోరాటం నినాదాన్ని ముందుకు తీసుకుపోతూ విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకత శక్తిని వెన్ను తట్టి వెలికి తీసే విధంగా ప్రోత్సహిస్తు విద్యార్థుల సమస్యల పరిష్కారం కి అనునిత్యం ఉద్యమిస్తు ...విద్యార్థులు చదువుల్లో సైతం ముందుండాలని ఈ పోటీ ప్రపంచంలో విద్యార్థులు అగ్రభాగాన నిలబడాలని ఎస్ఎఫ్ఐ గుర్తుచేస్తూ.... త్వరలో జరగనున్న పబ్లిక్ పరీక్షలకు మిమ్మల్ని సిద్ధం చేసేందుకు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఎస్ఎఫ్ఐ జిల్లా స్థాయి టాలెంట్ టెస్టు పరీక్షలు నిర్వహిస్తున్నారు అని తెలిపారు. ఈ టాలెంట్ టెస్ట్ పరీక్షల్లో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు .ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ మండల ఉపాధ్యక్షులు వేముల జ్యోతిబాస్ ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయులు మిర్యల శ్రావణ్ కుమార్,జమీల,రూప ఉపాధ్యాయులు,విద్యార్థలు తదితరులు పాల్గొన్నారు

పాలకుల నూతన ఆర్థిక విధానాల వల్ల హక్కులకు భంగం: సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి


 

ఐక్యత ,పోరాటం, సామాజిక భాద్యత లతో టాప్రా పనిచేస్తుందని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలకుర్తి కృష్ణమూర్తి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెటర్నరీ భవన్ లో జరిగిన టాప్రా జనరల్ బాడీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ పెన్షన్ సౌకర్యం ఉండాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పెన్షన్ సౌకర్యం తొలగించుటకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో నరేంద్రమోడీ హటావో నినాదం బలపడుతుందని, దానిని అమలు చేసేందుకు మనమంతా కృషి చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం సర్వీసుల్లో ఉన్నవారు, పెన్షనర్లు కలిసి కట్టుగా ఉద్యమాలు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. మరో ముఖ్య అతిథిగా విచ్చేసిన సీనియర్ జర్నలిస్టు సామ మల్లారెడ్డి మాట్లాడుతూ పాలకులు అవలంభిస్తున్న నూతన ఆర్థిక విధానాల వల్ల రిటైర్డ్ పర్సన్స్ ల హక్కులకు భంగం కలుగుతుందని ఆయన అన్నారు. రూపాయి విలువ తగ్గించడంతో ప్రజలందరూ సంక్షోభం లో పడిపోయరని, స్వాతంత్రం వచ్చిన నాటికి, నేటికి పేదరికం పెరిగిపోయిందని ఆయన అన్నారు. కానీ బడా పారిశ్రామికవేత్తలైన ఆదాని, అంబానీల ఆస్తులు మాత్రం అనేక రెట్లు పెరిగాయని ఆయన అన్నారు. టాప్రా జిల్లా అధ్యక్షులు కడారు రమేష్ బాబు అద్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ ఎల్.అరుణ మాట్లాడుతూ అన్ని జిల్లా కేంద్రాల్లో మార్చి 8 న జరిగే "మహిళా దినోత్సవం" ను ఘనంగా జరుపాలని కోరారు. ఈ సమావేశంలో టాప్రా జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మ కంటి బాలరాజు గత ఏడాది నివేదికను సమర్పించారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, జిల్లా గౌరవాధ్యక్షులు అంజయ్య, ఉపాధ్యక్షులు మాటూరి బాలేశ్వర్, నాయకులు ఎస్కే లతీఫ్, శకుంతల, బుగ్గయ్య, మదిర మల్లేశం, పోలి శంకర్ రెడ్డి, జగన్, మొయినుద్దీన్, తదితరులు పాల్గొన్నారు. అనంతరం రాష్ట్ర కార్యాలయం నిర్మాణానికి జిల్లా కమిటీ పక్షాన ఆర్థిక సహాయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కి అందజేశారు.

వలిగొండ మండలంలోని పలు గ్రామాలలో గావ్ చలో... ఘర్ చలో కార్యక్రమం


గావ్ చలో గర్ చలో కార్యక్రమంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం లోని నాగారం, మాందాపురం, సంగెం గోకారాం, సుంకిషాల, నేమిలికాల్వ,గొల్నేపల్లి పలు గ్రామాల్లో ఇంటింటికి తిరిగి ఈ పదేండ్ల కాలంలో ప్రధానమంత్రి మోడీ గారు చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు మొదలైన వాటి గురించి ప్రజలకు తెలియజేయడానికి ఉపాధి హామీ కూలీల దగ్గరకు ,ప్రతి ఇంటి ఇంటికి తిరుగుతూ వచ్చే పార్లమెంటు ఎలక్షన్లో బిజెపి కమలం గుర్తుకు ఓటు వేసి మోడీ గారికి సపోర్ట్ చేయాల్సిందిగా కోరనైనది. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఇన్చార్జ్, భువనగిరి అసెంబ్లీ జాయింట్ కన్వీనర్ రాచకొండ కృష్ణ, ఏలే చంద్ర శేఖర్, కణతల అశోక్ రెడ్డి, బచ్చు శ్రీనివాస్,కందుల తానీషా, యాది రెడ్డి,మంద నర్సింహా,కందికట్ల లక్ష్మణ్ పోలు నాగయ్య బర్ల సత్తయ్య, మంగ జగన్,మందుల నాగరాజు, బైరు మల్లేశం,తదితరులు పాల్గొన్నారు.

రూ. 500 కు సిలిండర్... ఎంపిక ప్రక్రియ ఇదే : కౌన్సిలర్ పంగ రెక్క స్వామి


◽మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను కౌన్సిలర్ పంగ రెక్క స్వామి అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు గుర్తించనున్నారు.

◽ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికీ తీసుకెళ్లి రేషన్ కార్డు, ఎల్పీజీ కంపెనీ పేరు, కస్టమర్ నంబర్, పాస్బుక్ సంఖ్య, డెలివరీ రసీదును 8 వ వార్డ్ లో పరిశీలిస్తున్నాతు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తెలియజేసారు 

◽అర్హతలుంటే ఆ వివరాలను ప్రభుత్వం సూచించిన మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబితగోపల్ , ఆర్. పి ధనలక్ష్మి, సునీత, లక్ష్మి వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.

చిత్తాపురం గ్రామంలో రెండవ రోజు పారిశుద్ధ్య వారోత్సవాలు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో గురువారం రెండో రోజు పారిశుద్ధ్య వారోత్సవాలు  నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం పరిసరాలను శుభ్రం చేశారు . గ్రామపంచాయతీ కార్యదర్శి జలంధర్ రెడ్డి పారిశుద్ధ్య చర్యల పై ప్రజలకి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి కిరణ్మయి, ప్రధానోపాధ్యాయులు విజయానంద్ ,టీచర్ జ్యోతి , అంగన్వాడి టీచర్ మంజుల, ఆశా వర్కర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం


భువనగిరి మండలం చీమల కొండూరు పరిధిలో ఉన్న శ్రీ సాయి వృద్ధ ఆశ్రమంలో, వృద్ధులకు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని వారి సేవలు ఈ నియోజకవర్గంలో చాలా అవసరం అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, వారు పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని ,వారు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు జీలుగు కవిత సతీష్ పవన్, ఎల్లంల జంగయ్య, నానం కృష్ణ, తంగళ్ళపల్లి శ్రీనివాస్, మట్ట శంకర్ బాబు, తోటకూరి వెంకటేశ్ యాదవ్ నుచ్చు నాగయ్య ఎడ్ల శ్రీనివాస్ పిట్టల రజిత బింగి బిక్షపతి ఓరుగంటి ఆంజనేయులు చిన్నం శ్రీనివాస్ మంగ ప్రవీణ్ మచ్చ పాండు చుక్క స్వామి సాల్వే ఉపేందర్ దయ్యాల శ్రీశైలం పిట్టల వెంకటేశం గిరీష్ తదితరులు పాల్గొన్నారు

వలిగొండ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని నియోజకవర్గ మరియు వలిగొండ అభివృద్ధి ప్రదాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు వలిగొండ మండలం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని వైభవంగా నిర్వహించినారు.

 భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 100 మంది రక్తదానము ఇచ్చినారు. అన్నదాత ఏర్పాటు చేసిన కొండూరు భాస్కర్ కుటుంబ సభ్యులుప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారుఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ కార్యకర్తలు అధ్యక్షులు అనిల్ యువసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 సెలవుదినంగా ప్రకటించాలి; లంబాడి హక్కుల పోరాట సమితి


సచివాలయంలో లంబాడి హక్కుల పోర సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు బిర్లా ఐలన్న సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిదృష్టికి తీసుకెళ్లాలని లంబాడి ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క జయంతి ఫిబ్రవరి 15 సెలవుదినంగా ప్రకటించి, యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారా భవన్ నిర్మించుట గురించి సచివాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూక్యా సంతోష్ నాయక్, రాష్ట్ర నాయకులు దిరావత్ రవి నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, జిల్లా నాయకులు సముదర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు  లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ