/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz చిత్తాపురం గ్రామంలో రెండవ రోజు పారిశుద్ధ్య వారోత్సవాలు Vijay.S
చిత్తాపురం గ్రామంలో రెండవ రోజు పారిశుద్ధ్య వారోత్సవాలు


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా వలిగొండ మండల పరిధిలోని చిత్తాపురం గ్రామంలో గురువారం రెండో రోజు పారిశుద్ధ్య వారోత్సవాలు  నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మురికి కాలువలను శుభ్రం చేసి, బ్లీచింగ్ పౌడర్ చల్లారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రం పరిసరాలను శుభ్రం చేశారు . గ్రామపంచాయతీ కార్యదర్శి జలంధర్ రెడ్డి పారిశుద్ధ్య చర్యల పై ప్రజలకి అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రత్యేక అధికారి కిరణ్మయి, ప్రధానోపాధ్యాయులు విజయానంద్ ,టీచర్ జ్యోతి , అంగన్వాడి టీచర్ మంజుల, ఆశా వర్కర్ కవిత, తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం


భువనగిరి మండలం చీమల కొండూరు పరిధిలో ఉన్న శ్రీ సాయి వృద్ధ ఆశ్రమంలో, వృద్ధులకు భువనగిరి శాసనసభ్యులు శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భువనగిరి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చిక్కుల వెంకటేశం అదేవిధంగా మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలను ప్రతి గ్రామంలో నిర్వహించాలని వారి సేవలు ఈ నియోజకవర్గంలో చాలా అవసరం అని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని, వారు పేద ప్రజలకు ఎప్పుడూ అండగా ఉంటారని ,వారు ఆయురారోగ్యాలతో భగవంతుని ఆశీస్సులతో చల్లగా ఉండాలని, ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు సర్పంచులు జీలుగు కవిత సతీష్ పవన్, ఎల్లంల జంగయ్య, నానం కృష్ణ, తంగళ్ళపల్లి శ్రీనివాస్, మట్ట శంకర్ బాబు, తోటకూరి వెంకటేశ్ యాదవ్ నుచ్చు నాగయ్య ఎడ్ల శ్రీనివాస్ పిట్టల రజిత బింగి బిక్షపతి ఓరుగంటి ఆంజనేయులు చిన్నం శ్రీనివాస్ మంగ ప్రవీణ్ మచ్చ పాండు చుక్క స్వామి సాల్వే ఉపేందర్ దయ్యాల శ్రీశైలం పిట్టల వెంకటేశం గిరీష్ తదితరులు పాల్గొన్నారు

వలిగొండ లో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని నియోజకవర్గ మరియు వలిగొండ అభివృద్ధి ప్రదాత కుంభం అనిల్ కుమార్ రెడ్డి 63వ జన్మదిన వేడుకలు వలిగొండ మండలం కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని వైభవంగా నిర్వహించినారు.

 భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి దాదాపు 100 మంది రక్తదానము ఇచ్చినారు. అన్నదాత ఏర్పాటు చేసిన కొండూరు భాస్కర్ కుటుంబ సభ్యులుప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారుఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ శాఖ కార్యకర్తలు అధ్యక్షులు అనిల్ యువసేన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 సెలవుదినంగా ప్రకటించాలి; లంబాడి హక్కుల పోరాట సమితి


సచివాలయంలో లంబాడి హక్కుల పోర సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆలేరు శాసనసభ్యులు గౌరవనీయులు ప్రభుత్వ విప్పు బిర్లా ఐలన్న సహకారంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డిదృష్టికి తీసుకెళ్లాలని లంబాడి ఆరాధ్య దైవం సద్గురు సంత్ శ్రీ శ్రీ సేవాలాల్ మహారాజు యొక్క జయంతి ఫిబ్రవరి 15 సెలవుదినంగా ప్రకటించి, యాదాద్రి పుణ్యక్షేత్రంలో బంజారా భవన్ నిర్మించుట గురించి సచివాలయంలో వినతిపత్రం అందించడం జరిగింది, ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు భూక్యా సంతోష్ నాయక్, రాష్ట్ర నాయకులు దిరావత్ రవి నాయక్, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ శేఖర్ నాయక్, జిల్లా నాయకులు సముదర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు  లంబాడి హక్కుల పోరాట సమితి యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ

భువనగిరి: విద్యార్థినుల మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలి: MRPS


యాదాద్రి భువనగిరి జిల్లాలో మొన్న సాంఘిక సంక్షేమ హాస్టల్లో జరిగిన సంఘటనపై ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత్ జండగే సార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ...

బాధిత కుటుంబనికి జిల్లా కలెక్టర్ ప్రత్యేక నిధి ద్వారా 10 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించాలి.

-రెండు కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి.

-సంక్షేమ హాస్టల్ ల్లా అభివృద్ధికి కలెక్టర్ స్థాయి అధికారి తో కూడిన కమిటీ వెయ్యాలి. హాస్టల్ వార్డెన్ హాస్టల్ లో ఉండి రోజువారీగా తనికి చేసి విద్యార్థులకు భద్రత కల్పించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో MRPS జిల్లా అధ్యక్షులు దుబ్బ రామకృష్ణ మాదిగ ,

MSP జిల్లా అధ్యక్షులు నల్ల చంద్రస్వామి మాదిగ, 

MRPS రాష్ట్ర సహాయ కార్యదర్శి ఇటుకల దేవేందర్ మాదిగ ,పొద్దుటూర్ గ్రామ మాజీ సర్పంచ్ దుబ్బ లింగం మాదిగ ,సోలిపేట్ మాజీ MPTC మందాల రామస్వామి మాదిగ ,MSP జిల్లా ఉపాధ్యక్షుడు కోళ్ల జహంగీర్ మాదిగ ,

MRPS జిల్లా కార్యదర్శి కుశంగాల కుమార్ మాదిగ లు తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్ తో బాధపడుతున్న మిత్రునికి ఆర్థిక సహాయం అందజేత


గొంతు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న మిత్రుడు ఆవేదనను అర్థం చేసుకున్న 10 వ తరగతి 2002-2003 బ్యాచ్ కు చెందిన మిత్రులు మేము సైతం అతనికి అండగా ఉంటాము అని నిరూపించారు. అతని వైద్య ఖర్చుల నిమిత్తం 50,000 రూపాయలు అందించి మానవత్వం చాటుకున్నారు. ఆనందంలో కాదు ఆపదలో కూడా తోడు ఉంటాము అని నిరూపించారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ గౌస్ బాబా, ద్యనబోయిన స్వామి, మిర్యాల శ్రీనివాస్, బోల్లు వలిబాష, గొలనుకొండ నరేష్, కూర వలయ్య, రామకృష్ణ, కాలనీ వాసులు బత్తిని బాలశెట్టి, బల్గూరు నరేష్ రెడ్డి, వనం నరేష్ లు పాల్గొన్నారు.

నల్గొండ జిల్లా కేంద్రంలో ఈనెల 10, 11 వ తేదీల్లో జరుగు ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ జయప్రదం చేయండి : SFI గర్ల్స్ వలిగొండ మండల కమిటి


భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ వలిగొండ గర్ల్స్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక జూనియర్ కళాశాలలో ఎస్ఎఫ్ఐ మండల నాయకురాలు ఆకుల అక్షిత మాట్లాడుతూ .. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈనెల 10,11వ తేదీల్లో జరుగు, ఎస్ఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర గర్ల్స్ కన్వెన్షన్ జయప్రదం చేయాలన్నారు. అదే విధంగా దేశవ్యాప్తంగా అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులు అరికట్టాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆడపిల్లలకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలన్నారు .ఈ కన్వెన్షన్ లో అమ్మాయిల పై నిత్యం జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ..ఆడపిల్లల రక్షణకై ..కన్వెన్షన్ నివేదిక రూపొందించుకొని ,భవిష్యత్తు పోరాటాలకు ప్రణాళిక తయారు చేస్తారన్నారు. ఈ కన్వెన్షన్ కి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు పాల్గొననున్నారు, అని వారు తెలిపారు .ఈ కార్యక్రమంలో ఇంజమురి ఉమ, కేశాబాయిన మేఘన, పిల్లలమర్రి వినిత, ఎండి ఫెజియ,మొరపక పావని తదితరులు పాల్గొన్నారు.

నమిలే సాయి తేజ జయంతి సందర్భంగా ,అనాధాశ్రమంలో అన్నదానం


యాదగిరిగుట్ట మండలం చిన్నకందుకూరు కు చెందిన నమిలె సాయితేజ జయంతి సందర్భంగా ..వంగపల్లి లోని "అమ్మఒడి అనాదాశ్రమం"లో బుధవారం అన్నదానం చేశారు. ఈ సందర్భంగా చిన్నకందుకూరు మాజీ సర్పంచ్ నమిలె పాండు మాట్లాడుతూ... చిన్న వయసులోనే కుటుంబ సభ్యులను, స్నేహితులను విడిచి వెళ్ళిన సాయితేజ జ్ఞాపకాలు మా వెంటే ఉంటాయని ఆయన అన్నారు. నమిలె సాయితేజ జయంతి,వర్థంతులను అనాదాశ్రమం లో జరుపుకుంటామని ఆయన తెలిపారు. "అమ్మఒడి అనాదాశ్రమానికి" మా వంతు సహాయ సహకారం అందిస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్, సాయితేజ కుటుంబ సభ్యులు అఖిల, శ్రావణి,అనాధ ఆశ్రమ నిర్వాహకులు చింతకింది దివ్య, సాయితేజ మిత్రులు నమిలె అభిషేక్, శ్రీకాంత్, సాయికుమార్, రాజేష్ మనోహర్, మధు, బలరాం, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

విద్యార్థినుల ఆత్మహత్యలపై స్పందించిన భువనగిరి డిసిపి రాజేష్ చంద్ర


భువనగిరి పట్టణంలోని ఎస్సీ హాస్టల్ ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్యలపై బుధవారం రాజేష్ చంద్ర స్పందించారు. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదు మేరకు విచారణ కొనసాగుతుందన్నారు. విద్యార్థినీల ఆత్మహత్యలపై సోషల్ మీడియాలో వస్తున్న ఎలాంటి కథనాలను నమ్మొద్దని చెప్పారు. తోటి విద్యార్థినీల వాంగ్మూలం తీసుకున్నామన్నారు. ఆత్మహత్యకు పాల్పడ్డ విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కౌన్సిలింగ్ చేస్తున్నామన్నారు.

ప్రజా పోరాటాలను బలపరచండి: సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ

 ప్రజా పోరాటాలను బలపర్చాలని సిపిఎం నిర్వహిస్తున్న ఉద్యమాలకు విరాళాలు ఇవ్వాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం రోజున బీబీనగర్ మండలం కేంద్రంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఇంటింటి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ప్రజా పోరాటాలను బలపరచాలని, ఉద్యమాలకు విరాళాలు ఇవ్వాలని కోరుతూ మండల నాయకత్వంతో కలిసి " కరపత్రం " విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా నర్సింహ్మ పాల్గొని మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా నెలకొన్న అనేక ప్రజా సమస్యలను అధ్యయన చేసి వాటి ఆధారంగా ఆందోళన, పోరాట కార్యక్రమాలు రూపొందించడానికి ఇంటింటి సిపిఎం కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ప్రజలు, కార్మికులు, రైతులు, కూలీలు, మేధావులు, కర్షకులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు అన్ని విధాలా ఆదరించాలని అన్నారు. దశాబ్దాలు కడుస్తున్న ప్రభుత్వాలు మారుతున్న నేటికీ జిల్లాలో ఉన్న మౌలిక సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ఆయన అన్నారు. హామీలు ఇవ్వడం పదేపదే ప్రజల్ని మోసగించడం పాలకులకు అలవాటుగా మారిందని అన్నారు. గత పది సంవత్సరాలు బిఆర్ఎస్ పాలన వైఫల్యాలు, వాగ్దానాల అమలులో వెనుకబాటుతనం మూలంగా ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారని నూతన పాలకుల పనితీరును కూడా ప్రజలు గమనిస్తున్నారని ఇచ్చిన ప్రతి వాగ్దానాలను ఆచరణలో పెట్టేందుకు ప్రభుత్వం పూనుకొని సంక్షేమ పథకాలను గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా సమస్యలను పరిశీలిస్తే అసంపూర్తి పనులే చాలా మిగిలి ఉన్నాయని బీబీనగర్ ఎయిమ్స్, బస్వాపురం ప్రాజెక్టు, బునాది గాని కాలువ, పిలాయిపల్లి కాల్వ, ధర్మారెడ్డి కాల్వలు, నక్కలగండి ఎత్తిపోతల పనులు నేటికీ పూర్తి కాలేదని ఆవేదన వెలిబుచ్చారు.ఇప్పటికైనా వెంటనే పూర్తి చేయాలని, నిర్మాణం పూర్తి అయిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలను అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలోని బిజెపి సర్కారు పాలన గాడి తప్పిందని ప్రజాస్వామ్యాన్ని, లౌకిక విలువలను, పెడరల్ స్ఫూర్తికి విగాథం కలిగిస్తూ ఏకపక్ష విధానంతో నియంతృత్వం వైపు కొనసాగుతుందని చెప్పారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలికి వదిలి ప్రజలపై మోయలేని భారాలు మోపుతూ కార్మిక, కర్షక హక్కులను కాలరాస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తున్నదని విమర్శించారు. రాబోవు పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి మతోన్మాద రాజకీయ ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా తగిన బుద్ధి చెప్పాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి గాడి శ్రీనివాసు, మండల కార్యదర్శివర్గ సభ్యులు కందాడి దేవేందర్ రెడ్డి, సందెల రాజేష్, టం టం వెంకటేశం నాయకులు బండారు శ్రీరాములు, మంద కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.