/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ పై దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి Vijay.S
భువనగిరి జిల్లా పరిషత్ చైర్మన్ పై దాడి ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై డీజీపీకి బీఆర్ఎస్ నేతల వినతి


యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి పై దాడి ఘటనలో , పక్షపాత ధోరణితో , దురుసుగా.. వ్యవహరించిన పోలీసు అధికారుల తీరుపై.. మంగళవారం హైదరాబాదులో తెలంగాణ డిజిపి కి బిఆర్ఎస్ నేతలు వినతిపత్రం అందజేశారు. దాడి ఘటనలో పోలీసు అధికారులు వ్యవహరించిన తీరుపై , చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ...నల్గొండ జిల్లా పరిషత్ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి ,సూర్యాపేట జిల్లా పరిషత్ చైర్మన్ గుజ్జా దీపిక, రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, శాసనమండలి సభ్యులు... ఎల్ రమణ ,మాజీ శాసనసభ్యులు.. భాస్కరరావు, శానం పూడి సైది రెడ్డి , పైళ్ళ శేఖర్ రెడ్డి, కోరు కంటి చందర్ ,మాజీ కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి ,సిహెచ్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

భువనగిరి: హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు


యాదాద్రి భువనగిరి జిల్లా లోని మోటకొండూరు మండలం దిలావర్‌పూర్ గ్రామంలో జరిగిన సామూహిక హత్య కేసులో భువనగిరి కోర్టు సంచలన తీర్పు..

2018 ఆగస్టు 13వ తేదీ... ఆరేళ్ళ క్రితం దిలావర్‌పూర్ లో జరిగిన హత్య కేసులో 14 మందికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చిన భువనగిరి జిల్లా కోర్టు..

మంత్రాల నెపంతో దిలావర్‌పూర్ కు చెందిన సీస యాదగిరిని కొట్టి చంపిన గ్రామస్తులు..

ఇద్దరు మహిళలతో పాటు మరో పన్నెండు మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించిన జిల్లా నాయస్థానం..

సీస యాదగిరి మంత్రాలు చేస్తున్నాడని ఆరోపిస్తూ అతనిపై కర్రలతో దాడి చేసి కొట్టి చంపిన 15 మంది గ్రామస్తులు..

అందులో 

A 14 నిందితుడు చనిపోయాడు

మిగతా 14 మందికి జీవిత ఖైదు

*సీస యాదగిరి కొడుకు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, సాక్ష్యాధారాలను కోర్టు ముందుంచిన పోలీసులు...ఈ కేసు దర్యాప్తు విషయంలో అప్పటి మోటకొండూరు ఎస్సై గండికోట మధు, సిఐ ఆంజనేయులు కీలకంగా వ్యవహరించారు.

మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని,యాదగిరిగుట్టడిపో మేనేజర్ కి వినతి పత్రం అందజేసిన అరూరు గ్రామస్తులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని మత్స్యగిరి గుట్టకు బస్సు సౌకర్యం కల్పించాలని..యాదగిరిగుట్ట డిపో మేనేజర్ కి, అరూరు గ్రామస్తులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...

మత్స్యగిరిగుట్ట దేవస్థానం దినదిన అభివృద్ధి చెందుతూ ,అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు కానీ ,ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక భక్తులు ముఖ్యంగా మహిళలు రావడానికి చాలా ఇబ్బందికరంగా ఉన్నది .దూర ప్రాంతాల నుంచి హైదరాబాదు ,నల్లగొండ ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు బస్సులు లేక భువనగిరి వలిగొండలో నిలిచి పోతున్నారు.

యాదగిరిగుట్ట నుండి మచ్చ గిరి గుట్ట వరకు ఒక సెటిల్ బస్సు నడపాలని ,మేనేజర్ గారిని కోరడం జరిగింది .సానుకూలంగా స్పందించిన డిపో మేనేజర్ అతి త్వరలో బస్సు సౌకర్యం కల్పించే ప్రయత్నం చేస్తామని అన్నారు.

వినతి పత్రం అందజేసిన వారిలో బండారు నరసింహారెడ్డి కిసాన్ సెల్ మండల అధ్యక్షులు, లింగయ్య యాదవ్ మాజీ మచ్చ గిరి గుట్ట ధర్మకర్త,

ఆవుల సత్యనారాయణ వార్డు మెంబర్, జనుగల మల్లేష్ హై స్కూల్ చైర్మన్, ఆవుల అంజయ్య ప్రైమరీ స్కూల్ చైర్మన్,

పిట్టల సుధాకర్, కీర్తిశేషులు తుమ్మల నరసయ్య సేవా సమితి ప్రధాన కార్యదర్శి సీనియర్ నాయకులు కసర బోయిన నరసింహ తదితరులు పాల్గొన్నార

వలిగొండ ఎస్సై ని మర్యాదపూర్వకంగా కలిసిన మండల యూత్ కాంగ్రెస్ నాయకులు


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా ,పదవీ బాధ్యతలు స్వీకరించిన మహేందర్ లాల్ ని మర్యాదపూర్వకంగా కలిసి, శాలువాతో సన్మానించిన ,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బత్తిని నగేష్, పట్టణ యూత్ అధ్యక్షులు పుసుకూరి లింగస్వామి, ఎన్ ఎస్ యు ఐ మండల అధ్యక్షుడు శ్యామల సాయికుమార్ ,యూత్ నాయకులు గొలుసుల దుర్గాప్రసాద్, వినేష్, కల్కూరి మధు, మైసొల్ల వేణు, పిట్టల శేఖర్ ,మత్స్యగిరి ,మైసోల్ల వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

గాయత్రి హైస్కూల్ లో రోడ్డు భద్రత వారోత్సవాలు, విద్యార్థులకు అవగాహన కల్పించిన డిటిఓ రవీందర్


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పట్టణంలో గాయత్రి హైస్కూల్ నందు జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాలు నిర్వహించారు . పవిత్రాత్మ, గాయత్రి పాఠశాలల విద్యార్థులకు అవగాహన సదస్సు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాదాద్రి భువనగిరి జిల్లా రవాణా శాఖ అధికారి జి రవీందర్ హాజరై ,మాట్లాడుతూ... మైనర్లు బైక్ నడపడం నేరం, ఒకవేళ ఆక్సిడెంట్ జరిగిన మీతో పాటు మీ తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసి వస్తుందని అన్నారు .ముఖ్యంగా ఆడపిల్లల తల్లిదండ్రులు కారులో గాని, బైకుల మీద గాని, బయలుదేరినప్పుడు హెల్మెట్ ,సీటు బెల్టు, పెట్టుకొమని కూతురు చెప్తే దాన్ని తప్పకుండా వింటారు, కావున ఈ విషయాన్ని తప్పకుండా.. గుర్తు చేయాలని అన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోఫోన్ వాడరాదు .ఈ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయాలని విద్యార్థులతో అన్నారు .ఈ కార్యక్రమంలో యాజమాన్యం, ఉపాధ్యాయులు ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సర్పంచుల సేవలు గుర్తిండిపోతాయి: ఎంపిటిసి సామ రామ్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం: ఐదేళ్ల పదవీ కాలంలో గ్రామాల అభివృద్ధికి సర్పంచులు చేసిన కృషి మరువ లేనిదని ఎంపిటిసి సామ రాంరెడ్డి అన్నారు. వారి పనితీరు చాలా బేషుగ్గా ఉందని కొనియాడారు. ఎంపిటిసి పరిధిలోని వేములకొండ, ముద్దాపురం,వెంకటాపురం, గుర్నాథ్ పల్లి,నాలుగు గ్రామ పంచాయతీల సర్పంచులను, వార్డు మెంబర్లను, ఈరోజుతో .. సర్పంచుల ముగిస్తున్నందున, మంగళవారం వేములకొండ గ్రామపంచాయతీ ఆవరణలో పూలమాల, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా... రాంరెడ్డి మాట్లాడుతూ సర్పంచులు గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేశారని కొనియాడారు.

 ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచులు బోడ లక్ష్మమ్మ బాలయ్య,ఉప్పల్ రెడ్డి, కొత్త నరసింహ, జువ్వ మంజుల సత్తయ్య, ఆయా గ్రామపంచాయతీ ల వార్డ్ మెంబర్లు ,గ్రామ నాయకులు పులిపలుపుల రాములు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

నిదాన్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం


యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం నిదాన్ పల్లి గ్రామంలో 15.00 లక్షల వ్యయంతో ,నిర్మించనున్న సి.సి రోడ్డు నిర్మాణ పనులకు, 10.00 లక్షల వ్యయంతో ,నిర్మించిన గ్రామ పంచాయతీ భవనం ..అదనపు గదులను సోమవారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు . అనంతరం గ్రామ పంచాయతీ పాలకవర్గం ని సన్మానించినారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి గొల్నేపల్లి లో నివాళులర్పించిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి


యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని గొల్నేపల్లి గ్రామంలో ఆదివారం రోజు రాత్రి మిర్యాల గూడెం రోడ్డు ప్రమాదంలో, గొల్నేపల్లి గ్రామానికి చెందిన ఒకే కుటుంబం లో, ముగ్గురు మృతి చెందారు. మృతి చెందిన పార్థివ దేహాలకు, పూల మాలలు వేసి నివాళులు అర్పించిన స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఒకే కుటుంబంలో మృతి చెందిన వారికి తక్షణమే 50వేల రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. వారి కుటుంబాన్ని ఆదుకుంటానని హామీ ఇచ్చారు. మృతి చెందిన వారు బొమ్మ మచ్చేందర్, అతని కుమారుడు నియాన్ష్ ప్రమాదం జరిగిన సమయంలో చనిపోయారు. అతని భార్య మాధవి చికిత్స పొందుతూ.. మరణించారు. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు. అదేవిధంగా గొల్నేపల్లి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఎమ్మెల్యే వెంట సీనియర్ నాయకులు బెలిదె నాగేశ్వర్ గంగాపురం దైవాధీనం గౌడ్ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

బీబీనగర్ మండలం గూడూరులో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సభలో ఉద్రిక్తత

యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని గూడూరు గ్రామంలో, నూతన గ్రామపంచాయతీ భవనాన్ని రోడ్లు ,భవనాలు మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ... కేసీఆర్ కాలి గోటికి కూడా రేవంత్ రెడ్డి సరిపోడని, నీచంగా కేటీఆర్ మాట్లాడడం తగదని అన్నారు. కష్టపడి జడ్పిటిసి, ఎమ్మెల్సీ, ఎంపీ, సీఎంగా ఎదిగిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి కూడా తండ్రి మాధవరెడ్డి ద్వారానే జడ్పీ చైర్మన్ పదవి పొందాడని... అనడంతో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు .దీంతో సభలో గందరగోళం ఏర్పడింది.

గ్రామ స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గణతంత్ర పురస్కారం అవార్డు - 2024 అందుకున్న లింగరాజు పల్లి సర్పంచ్ బొడ్డుపల్లి ఉమా కృష్ణ


గ్రామ స్వరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గ్రామ స్వరాజ్ ఫౌండేషన్ చైర్మన్ పీవీఎస్ వర్మ ,తెలంగాణ పంచాయతీ పరిషత్ రాష్ట్ర కన్వీనర్ ఎంఏ జలీల్, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిటీ చైర్పర్సన్ వి ఝాన్సీ, చేతుల మీదుగా యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం లింగరాజు పల్లి గ్రామ సర్పంచ్ బొడ్డుపల్లి ఉమా కృష్ణ సోమవారం, హైదరాబాదులో ,గణతంత్ర పురస్కార్ అవార్డు - 2024ను అందుకున్నారు. ఈ సందర్భంగా ..గ్రామ సర్పంచ్ ఉమా కృష్ణ మాట్లాడుతూ.. గ్రామానికి చేసినటువంటి అభివృద్ధిని వివరించారు. వీరిని గ్రామ స్వరాజ్ సభ్యులు, తదితరులు అభినందించారు.