/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/_noavatar_user.gif/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/_noavatar_user.gif StreetBuzz తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: మంత్రి హరీష్ రావు Raghu ram reddy
తెలంగాణ ప్రభుత్వ ఆసుపత్రులలో కార్పొరేట్ వైద్యం అందిస్తున్నాం: మంత్రి హరీష్ రావు

ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా కార్పొరేట్ తరహా వైద్యాన్ని ఉచితంగా అందిస్తున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు అన్నారు.

ఎంఎన్‌జీ ఆసుపత్రి లో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టంతో పాటు లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్‌ను హరీశ్ రావు ఈరోజు ప్రారంభించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. MNJ ఆసుపత్రిలో అధునాతన రోబోటిక్ సర్జికల్ సిస్టం రూ.32 కోట్లు,లాప్రోస్కోపిక్ ఎక్విప్మెంట్ రూ.50 లక్షలు ప్రారంభం చేసుకోవడం సంతోషంగా ఉందని మంత్రి అన్నారు.

పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల ధర్నా

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై సోమవారం పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు.ప్లకార్డులు చేతబట్టి, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు.

ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ కు చేరుకుని ఎంపీలతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎంపీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు.

ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాత్ముడి విగ్రహం ముందు పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తున్నారో దేశం మొత్తానికీ తెలియజెప్పేందుకే ఈ ధర్నా చేపట్టామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నట్లు ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.

ఈనెలలోనే తెదేపా-జనసేన సమన్వయ కమిటీ సమావేశం!

అమరావతి: పొత్తు బంధాన్ని ముందుకు తీసుకెళ్లేలా తెదేపా-జనసేన వేగంగా అడుగులు వేస్తున్నాయి. ఈనెలలోనే ఇరుపార్టీలు సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించనున్నాయి..

కమిటీ సభ్యుల నియామకంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే కసరత్తు ప్రారంభించి సీనియర్ నేతలతో చర్చించారు. జనసేన సమన్వయ బాధ్యతలు నాదెండ్ల మనోహర్‌కు అప్పగించారు. తెలంగాణ నుంచీ ఓ సభ్యుడిని నియమించే యోచనలో జనసేన ఉంది. 

త్వరలోనే తెదేపా తరఫున సభ్యుల నియామకం జరగనుంది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ పర్యటన దిల్లీలో కొనసాగుతోంది. ఆయన వచ్చిన తర్వాత రేపు చంద్రబాబుతో జరిగే ములాఖత్‌లో చర్చించిన అనంతరం తెదేపా సమన్వయ కమిటీ సభ్యులను ఆ పార్టీ ప్రకటించనుంది. రెండు పార్టీల సమన్వయ కమిటీ ప్రకటన పూర్తయ్యాక ఈనెలలోనే తొలి సమావేశం జరిగే అవకాశముంది..

ప్రిన్సిపాల్ వేధింపులు మహిళ అటెండర్ ఆత్మహత్యయత్నం

మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల హాస్టల్‌లో ప్రిన్సిపాల్ వేధింపులు తాళలేక అటెండర్ స్వరూప విష గుళికలు మింగి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించింది.

ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకోగా విషయాన్ని బయటకు రానీయకుండా ప్రిన్సిపాల్ జాగ్రత్త పడినట్లు తెలుస్తోంది.

ఓవర్ డ్యూటీలు వేయడం, వ్యక్తిగత పనులు చేయించుకోవడం, అనారోగ్యంతో ఉన్నా సెలవు కావాలంటే ఇవ్వకుండా ఒత్తిడికి గురి చేయడం, ఇలాంటి వేధింపులతో సదరు మహిళ అటెండర్ ఆత్మహత్య చేసుకునేందుకు విష గుళికలు మింగినట్లు సమాచారం.

ఈ విషయాన్ని బయటకు తెలియకుండా ప్రిన్సిపాల్ సిబ్బందిని బెదిరించినట్లు తెలిసింది. బాధితురాలు కుటుంబ సభ్యులకు విషయం తెలియడంతో ఆమెను తోర్రూర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఈ విషయంపై కేసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు బాధిత కుటుంబ సభ్యులు సిద్ధమవుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

పాలమూరు ఎత్తిపోతల మహో జ్వల పథకాన్ని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్


తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పాలమూరు:రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నీటి ఎత్తిపోతలను సీఎం కేసీఆర్‌ శనివారం ప్రారంభించనున్నారు.

ఎదురెక్కి రానున్న కృష్ణమ్మకు జలహారతి పట్టనున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

పాలమూరు మహోజ్వల ఘట్టానికి నార్లాపూర్‌ వేదిక కానున్నది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో నిర్మించిన పాలమూరు ఎత్తిపోతలను ప్రారంభించేందుకు శనివారం సీఎం కేసీఆర్‌ కొల్లాపూర్‌ మండలంలోని నార్లాపూర్‌కు చేరుకొంటారు.

మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, ఎమ్మెల్యేలతో కలిసి పూజలు చేయనున్నారు. అనంతరం లిఫ్ట్‌లోని కంట్రోల్‌ రూమ్‌లోకి ప్రవేశించి, మహాబాహుబలి మోటర్లను ఆన్‌ చేస్తారు. అక్కడే సర్జ్‌పూల్‌, పంప్‌హౌస్‌ను పరిశీలించి, అక్కడి నుంచి నార్లాపూర్‌ రిజర్వాయర్‌ వద్దకు చేరుకొంటారు. రిజర్వాయర్‌ వద్ద డెలివరీ సిస్టర్న్స్‌ నుంచి వచ్చే కృష్ణా జలాలకు పూజలు చేసి, పుష్పాభిషేకం చేస్తారు.

అనంతరం ఎత్తిపోతల పథకంలో భాగస్వాములైన ఇరిగేషన్‌ ఉన్నతాధికారులను అభినందించనున్నారు. అనంతరం ఉన్నతాధి కారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి, మిగిలిన మూడు రిజర్వాయర్లకు నీటిని తరలించే ప్రక్రియను అడిగి తెలుసుకొంటారు. అనంతరం కొల్లాపూర్‌ సభా వేధిక వద్దకు చేరుకుంటారు.

  

ప్రాజెక్టులో కీలకమైన మొదటి పంప్‌హౌస్‌, అంజనగిరి రిజర్వాయర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మోటర్ల బిగింపు కొనసాగుతుండగా.. ఇప్పటికే రెండు మోటర్లు నీటి ఎత్తిపోతలకు సిద్ధంగా ఉన్నాయి. ఇటీవలే మొదటి పంపు డ్రైరన్‌ను నిర్వహించగా విజయవంతమైంది. అందులో భాగంగా నేడు జలాల ఎత్తిపోతలు చేపట్టనున్నారు.

సీఎం కేసీఆర్‌ నార్లాపూర్‌ పంప్‌హౌస్‌ వద్ద 145 మెగావాట్ల సామర్థ్యమున్న మోటర్లను ఆన్‌ చేసి, జలాల ఎత్తిపోతలను ప్రారంభించనున్నారు. అనంతరం అంజనగిరి రిజర్వాయర్‌లోకి చేరిన కృష్ణమ్మ జలాలకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. జలహారతి పట్టనున్నారు. అనంతరం కొల్లాపూర్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని, ప్రసంగించనున్నారు....

నాగం ఫౌండేషన్ సౌజన్యంతో గణపతి విగ్రహాలను పంపిణీ చేసిన ఫౌండేషన్ చైర్మన్ బిజెపి నాయకులు డా" నాగం వర్షిత్ రెడ్డి గారు

హిందూ బంధువులు ఎంతో ప్రతిష్టాత్మకంగా భక్తిశ్రద్ధలతో జరుపుకునే గణపతి నవరాత్రులకు గాను ఈరోజు సుమారు 400 విగ్రహాలను పంపిణీ చేసిన నాగం ఫౌండేషన్ చైర్మన్ బీజేపీ నాయకులు నాగం వర్షిత్ రెడ్డి గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 8 ఫీట్ల నుండి 16 ఫీట్ల వరకు గణపతి విగ్రహాలు అందుబాటులో ఉన్నందున నల్లగొండ నియోజక వర్గమే కాకుండా చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలలో నుండి దేవరకొండ నకిరేకల్ మునుగోడు మిర్యాలగూడ నాగార్జున సాగర్ నుండి కూడా యువత పెద్ద ఎత్తున తరలివచ్చి గణపతి విగ్రహాలను తీసుకెళ్లడం జరుగుతుంది గణపతి విగ్రహాలను ప్రతిష్టించబోయే వారంతా తీసుకుని వెళ్లి ఎలాంటి ఆటంకాలు కలగకుండా నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని సుఖసంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా వారు కోరారు

హిందూ బంధువులందరికి ముందస్తు గణపతి నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో తీరందాసు కనకయ్య గారు బోగరి అనిల్ కుమార్ గారు పల్లె ప్రకాష్ గారు ఫకీరు మోహన్ రెడ్డి గారు కౌన్సిలర్ కంకణాల నాగిరెడ్డి గారు పల్ రెడ్డి నరేందర్ రెడ్డి గారు గడ్డం మహేష్ గారు పిన్నింటి నరేందర్ రెడ్డి గారు పెరిక మునికుమార్ గారు ముత్యాల శంకర్ రెడ్డి గారు గంట గంప మధుగారు గుండ్లపల్లి శాంతి స్వరూప్ గారు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్న యువత

సంగారెడ్డి జిల్లా లో చిరుత సంచారం


సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని ఎర్దనూర్ గ్రామ శివారులో చిరుత తిరుగుతున్నట్టు స్థానికులు గుర్తించారు

బుధవారం సాయంత్రం స్థానిక దేవుని గుట్ట పరిసర ప్రాంతాల్లో చిరుత సంచరిస్తుండగా స్థానికులు గమనించారు. వెంటనే భయంతో అక్కడ్నుంచి పరుగులు తీశారు. చిరుత సంచారాన్ని స్థానిక యువకులు తమ ఫోన్‌లలో చిత్రీకరించారు.

గ్రామ శివారులో చిరుత సంచరిస్తుందనే విషయం తెలుసుకున్న అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. వెంటనే స్థానిక అటవీశాఖ అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

కొండగట్టు అంజన్న సేవలో :ఎమ్మెల్సీ కవిత

కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో నిజామాబాద్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బుధవారం సాయంత్రం జగిత్యాల జిల్లా కొండగట్టు లోని ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చిన కవితకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించారు. అనంతరం మహిళలకు కలిసి సహస్రదీపాలంకరణలో పాల్గొన్నారు....

నల్లగొండ పట్టణం 45 వ వార్డ్డు కు చెందిన బిజెపి కార్యకర్త తండ్రి మృతికి సంతాపం తెలియచేసి ఆర్థిక సహాయం అందించిన: డా"నాగం వర్శిత్ రెడ్డి గారు

నల్లగొండ పట్టణం 45 వార్డు బిజేపి కార్యకర్త గడగోజు శ్రీను గారి తండ్రి గారు పరమపదించారని తెలుసుకొని వెళ్లి వారి పార్ధీవ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి ఆర్థిక సహాయం అందచేసి వారి కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటానని బరోసా కల్పించిన బిజెపి నాయకులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారు.... 

నల్లగొండ కాంగ్రెస్ పార్టీకి షాక్... మాజీ శాసనసభ్యుని ముఖ్య అనుచరులు బిఅరేఎస్ పార్టీలో చేరిక


 నల్లగొండ బిఆర్ఎస్ పార్టీ శాసనసభ అభ్యర్థిగా... ముఖ్యమంత్రి కెసిఆర్ కంచర్ల భూపాల్ రెడ్డి గారిని ప్రకటించిన నాటి నుండి.... ప్రతిరోజు వివిధ గ్రామాల నుండి, పట్టణం లోని వివిధ వార్డుల నుండి,.. వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు నాయకులు... బిఆరెస్ పార్టీలో భారీ సంఖ్యలో...చేరికలు అప్రతిహతంగా కొనసాగుతున్నవి.. పట్టణంలోని వివిధ వార్డులు కనగల్ మండలం నుండి వివిధ గ్రామాల నుండి భారీ సంఖ్యలో నేడు వీటి కాలనీలోని ఎమ్మెల్యే క్యాoప్ కార్యాలయంలో పార్టీలో చేరిన వారి ఉద్దేశించి .. కంచర్ల మాట్లాడుతూ.. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నల్లగొండ దత్తత తీసుకున్న కేసిఆర్.. వందల కోట్ల రూపాయలు వెచ్చించి, నల్లగొండ నియోజక వర్గాన్ని నల్లగొండ పట్టణాన్ని సర్వాంగ సుందరంగా, తీర్చుతున్నారని కెసిఆర్ పాల నలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని... అందుకే ప్రజలు స్వచ్ఛందంగా టిఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారన్నారు.. వాడినందర్నీ కంటికి రెప్పలా చూసుకుంటామని పాత కొత్త వారు కలిసి బిఆర్ఎస్ పార్టీ విజయానికి కృషి చేయాల్సిందిగా కోరారు...