/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్‌ Yadagiri Goud
బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారు.. స్వయంగా వెల్లడించనున్న కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అధికార పార్టీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటనకు ముహూర్తం ఖరారైంది.

ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం తెలంగాణ భవన్‌ నుంచి అభ్యర్థుల జాబితాను స్వయంగా ప్రకటించనున్నారు అధినేత కేసీఆర్‌..

అభ్యర్థుల ఎంపిక కసరత్తు దాదాపు పూర్తికాగా.. 95 శాతం అభ్యర్థుల స్థానాలు సిట్టింగులకే ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కేవలం సింగిల్ డిజిట్ లోనే అభ్యర్థుల మార్పు ఉండనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

ఆసిఫాబాద్, ఉప్పల్, జనగామ, స్టేషన్ ఘాన్ పూర్, అంబర్ పేట, వరంగల్ తూర్పు,

కొత్తగూడెం, ఖానాపూర్, పెద్దపల్లి, రామగుండం తదితర నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు అసంతృప్తుల బుజ్జగింపులు కూడా దాదాపుగా పూర్తి అయినట్లే తెలుస్తోంది..

యూఎస్‌ తెలుగు విద్యార్థుల ఉదంతంపై సీఎం జగన్ ఆరా

అమరావతి: అమెరికా నుంచి కొంత మంది తెలుగు విద్యార్ధులు వెనక్కి పంపిన ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆరా తీశారు.

విద్యార్థుల వివరాలు తెలుసుకుని త్వరితగతిన వారి సమస్యను పరిష్కరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు..

21 మంది భారతీయ విద్యార్థులను అమెరికా నుండి వెనక్కు పంపించిన ఘటన సంచలనం సృష్టించింది. వీరిలో తెలుగువారు కూడా ఉండటంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఈ ఉదంతంపై అరా తీశారు.

విద్యార్థుల పూర్తి వివరాలతో పాటు పూర్తి సమాచారాన్ని సేకరించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. ఈ అంశంపై దృష్టి సారించాలని చెబుతూనే అవసరమైతే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు కూడా జరపాలని సీఎంవో అధికారులకు సూచించారు.

ఎన్నోఆశలతో ఉన్నత విద్య నిమిత్తం అమెరికా చేరుకున్న తాము అన్ని డాక్యుమెంట్లను సమర్పించామన్నారు విద్యార్థులు.

ఇమ్మిగ్రేషన్ అధికారులు వారి పత్రాలను తనిఖీ చేసి, కొద్దిసేపు విచారించాక కారణం చెప్పకుండానే వారిని వెనక్కి పంపించేశారు. వారిలో అత్యధికులు అట్లాంటా, చికాగో, శాన్ ఫ్రాన్సిస్కో విమానాశ్రయాలలో దిగారు..

ప్రతిపక్షాలకు ట్రైలర్ కాదు ఫుల్ సినిమా చూపెట్టండి: మంత్రి కేటీఆర్

ఇది ట్రైలర్ మాత్రమే.. ఫుల్ మూవీ ముందుంది అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో సినిమా చూడడం కాదు.. ప్రతిపక్షాలకు సినిమా చూపెట్టండి అని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

నగరంలోని ముషీరాబాద్ నియోజకవర్గం ఇందిరాపార్క్ నుండి వీఎస్టీ వరకు రూ.450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవం శనివారం ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టీల్ బ్రిడ్జిను ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ పేరు మీద సచివాలయం నిర్మాణంతో పాటు ప్రపంచంలోని అత్యంత ఎత్తయినవి విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. 1978లో నాయిని నర్సింహారెడ్డి గెలిచారని అన్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో తన ముద్ర వేశారన్నారు. నాయిని నర్సింహారెడ్డి కేసీఅర్ వెంట పెద్దన్నలా ఉండి ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు.

నరసింహారెడ్డి ఆత్మ శాంతిస్తుందని కేటీఆర్ ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. ఎస్‌ఆర్‌డీపీలో ఇది 36వ ఫలితం అని అన్నారు. ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లో అందరం సినిమాలు చూసిన వాళ్ళమే.. సినిమాలు విడుదల అయినప్పుడు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యేది అని అన్నారు.

ఈ ప్రాంత వాసుల దశాబ్దాల కల సాకారం అయ్యిందని తెలిపారు. కార్మిక పక్షపాతిగా, తెలంగాణ తొలి హోంమంత్రిగా పనిచేసిన వ్యక్తి నాయిని నర్సింహారెడ్డి.. అందుకే ఈ స్టీల్ బ్రిడ్జికి ఆయన పేరు పెట్టాలని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు.ట్యాంక్ బండ్‌ను తీర్చి దిద్దాం, లోయర్, అప్పర్ ట్యాంక్ బండ్‌ను అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దుతామన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా అందరినీ సమానంగా చూసే వ్యక్తి సీఎం కేసీఆర్ అని కేటీఆర్ పేర్కొన్నారు.

విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలంటే కులాలకు, మతాలకు అతీతంగా ఉండాలన్నారు. గతంలో కర్ఫ్యూలు ఉండేవి, ఇప్పుడు అలాంటివి లేవన్నారు. పొరపాటు చేస్తే హైదరాబాద్ వందేళ్లు వెనక్కి పోతుందని ఆయన అన్నారు. కొంతమంది మతం పేరుతో చిచ్చుపెట్టేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. అటువంటి వారిని పట్టించుకోవద్దన్నారు. పనిచేసే, పనికొచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను హ్యాట్రిక్ సాధించేలా ఆశీర్వదించండి అని కోరారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఓపెన్ జీపులో స్టీల్ బ్రిడ్జ్‌పై కేటీఆర్ ప్రయాణించారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేశవరావు, హోం మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు ముఠాగోపాల్, మాగంటి గోపీనాథ్, బేతి సుభాష్ రెడ్డి, కాలేరు వెంకటేష్, ఎమ్మెల్సీ బేగ్, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్, జీహెచ్ఎంసీ నగర మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, హజ్ కమిటీ చైర్మన్ సలీం తదితరులు పాల్గొన్నారు...

బండి సంజయ్‌కు నాలుగు రాష్ట్రాల బాధ్యతలు: హై కమాండ్ బిగ్ ప్లాన్?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను బాధ్యతలను తొలగించిన అనంతరం ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శిగా హైకమాండ్ ప్రమోషన్ ఇచ్చింది. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బండిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని జాతీయ నాయకత్వం భావిస్తోంది.

ఆయనకు నాలుగు రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనుంది. ఆంధ్రప్రదేశ్‌తో పాటు మహారాష్ట్ర, ఒడిశా, గోవా బాధ్యతలు ఆయనకు అప్పజెప్పనున్నట్లు సమాచారం. ముంబై యూనిట్‌ను సైతం ఆయనకే అప్పగించనున్నట్లు టాక్. ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఇన్‌చార్జిగా ఆయన ఈ రాష్ట్రాల్లో పని చేయనున్నారు.

21న ఏపీలో మీటింగ్

ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఉంది. తెలంగాణలోలా ఏపీలో పార్టీకి మైలేజ్ వచ్చే అవకాశం ఉందని భావించి బండిని పంపించినట్లు తెలుస్తోంది.

ఈనెల 21వ తేదీన అక్కడి ముఖ్య నేతలతో భేటీ కానున్నారు. కార్యకర్తలతో ఇంటరాక్ట్ అవ్వనున్నారు. వారికి ఓటర్ మొబిలైజేషన్, కొత్త ఓటర్లను బీజేపీ వైపునకు ఆకర్షితులను చేయడంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణలో చేపట్టే రథయాత్రలో సైతం బండి ఇన్‌వాల్వ్ కానున్నారు.

బూత్‌ల వారీగా బీజేపీకి మద్దతు తెలిపే వారు ఎవరు? వారి ఓట్లు లిస్టులో ఉన్నాయా? అనే విషయాలను ఓటర్ ఎన్‌రోల్‌మెంట్ డ్రైవ్ ఇన్‌చార్జులు పరిశీలించనున్నారు. మహారాష్ట్రలో హిందుత్వ ఎజెండాను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలోనూ బండి పార్టీకి ప్లస్ అవుతారని భావిస్తున్నారు.

తెలంగాణకు రేఖా వర్మ రానున్నట్లు తెలుస్తోంది. ఆమె బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా, ఉత్తరాఖండ్ రాష్ట్ర కో ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు...

తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ రైల్లో లో అగ్ని ప్రమాదం

దేశంలో చోటు చేసుకుంటున్న వరుస రైలు ప్రమాదాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల జరిగిన ఒడిషా రైలు యాక్సిడెంట్, తెలంగాణలో ఫలక్ నామ ఎక్స్ ప్రెస్‌లో మంటలు చెలరేగిన ఘటనలను పూర్తిగా మరువక ముందే.. తాజాగా మరో రైలు ప్రమాదం చోటు చేసుకుంది.

శనివారం తెల్లవారుజూమున మహారాష్ట్రలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌లో అగ్ని ప్రమాదం జరిగింది. మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ ఎస్-2 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రయాణికుల నుండి సమాచారం అందుకున్న రైల్వే సిబ్బంది ట్రైన్‌ను నాగ్‌పూర్ సమీపంలో నిలిపివేశారు.

సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని బోగీలోని మంటలను అదుపు చేశారు.

పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు.. ట్రైన్ ఆగిన వెంటనే భయంతో పరుగులు తీశారు.

ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రయాణికులు ఊపీరి పీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది....

రేపు సూర్యాపేటకు రానున్నా సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్‌ ఈనెల 20న సూర్యాపేటకు రానున్నారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం, జిల్లా పోలీస్‌ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారు.

వీటి ప్రారంభోత్సవం అనంతరం సుమారు రెండు లక్షల మందితో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా జన సమీకరణకు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సూర్యాపేట నియోజకవర్గంలోని మండలాలు, పట్టణాల బాధ్యతలను అప్పగించారు.

సీఎం పర్యటన నేపథ్యంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిద్దిద్దారు. రహదారులపై ఎక్కడా గుంతలు లేకుండా మరమ్మతు చేశారు. సీఎం ప్రారంభించనున్న ప్రభుత్వ కార్యాలయాలకు నూతనంగా రోడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన విజయవంతానికి ఏర్పాట్లను మంత్రి జగదీష్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.

సూర్యాపేటలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకమైనది. వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్‌ సామర్ధ్యాన్ని పెంచేందుకు ఈ మార్కెట్‌ను నిర్మించారు. సుమారు రూ.30కోట్లతో 2.50లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మార్కెట్‌ను నిర్మించారు. ఆరుఎకరాల విస్తీర్ణంలో ఐదు బ్లాకుల్లో 200 దుకాణాలు నిర్మించారు.

ఈ మార్కెట్‌లో రోజుకు 9 నుంచి 10గంటల పాటు స్కైషేడ్‌తో పగటి వెలుగు ప్రసరించేలా ఏర్పాటుచేశారు. దేశంలోనే ఈ తరహా మార్కెట్‌ నిర్మాణం సూర్యాపేటలోనే ప్రథమం కావడం విశేషం. మార్కెట్‌లోని దుకాణాల్లో విద్యుత్‌ లైట్లు అవసరం లేకుండా పగటి వేళల్లో స్కైషేడ్‌ ద్వారా వెలుతురు ప్రసారం అవుతుంది. ఈ మార్కెట్‌లో పండ్లు, పూలు, మటన్‌, చికెన్‌, కూరగాయలు, చేపలతో పాటు ఇంకా పలు రకాల వస్తువులు ఒకే చోట లభించేలా నిర్మించారు.

రూ.65కోట్లతో సమీకృత కలెక్టరేట్‌ భవనం

జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సుమారు రూ.65కోట్లతో నిర్మించారు. 21ఎకరాల్లో 1.25లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కలెక్టరేట్‌ భవనాన్ని నిర్మించారు.

జిల్లాలోని 37 ప్రభుత్వ శాఖలన్నీ ఈ భవనంలోనే కొనసాగనున్నాయి. కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, మీటింగ్‌ హాల్‌తో పాటు ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకే చోట ఉండేలా నిర్మించారు. కార్యాలయాన్ని గ్రౌండ్‌ ఫ్లోర్‌తో పాటు మరో రెండు అంతస్తుల్లో నిర్మించారు. కలెక్టరేట్‌లో పచ్చదనానికి అధిక ప్రాధా న్యం ఇచ్చారు. ప్రాంగణంలో సుమారు 70రకాల మొక్కలు నాటారు. అంతేగాక హెలీప్యాడ్‌ను నిర్మించారు.

కలెక్టరేట్‌కు విద్యుత్‌కు బదులు సోలార్‌ ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేశా రు. సుమారు రూ.65లక్షలతో వంద కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్‌ ఎనర్జీ సిస్టమ్‌ను ఏర్పాటు చేసి విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. కలెక్టరేట్‌కు మిషన్‌ భగీరథ నీటిని అందించనున్నారు.

కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మిషన్‌ భగీరథ నీటినే వినియోగించనున్నారు. అందుకు కలెక్టరేట్‌ సముదాయం వద్ద 1.20లక్షల లీటర్ల సామర్ధ్యంతో ట్యాం కులు నిర్మించారు. ఈ ట్యాంకులకు ఖమ్మం రోడ్డులోని మిషన్‌ భగీరథ ట్యాంక్‌ నుంచి పైప్‌లైన్‌ ఏర్పాటుచేశారు...

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది

వీకెండ్ వచ్చేసింది. తిరుమలలో భక్తుల రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఈ క్రమంలోనే నేడు శనివారం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది.

శ్రీవారి టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 17 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

శుక్రవారం స్వామివారిని 61,904 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

ఇక నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3.42 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 31,205 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.....

Flight: గాల్లో ఉండగా ఇంజిన్ ఫెయిల్యూర్‌.. మంటలతో విమానం ల్యాండింగ్‌..!

డల్లాస్‌: విమానం(Plane) గగనతలంలో ఉండగా అత్యవసర పరిస్థితి ఎదురైంది. ఆకస్మికంగా ఇంజిన్‌లో మంటలు చెలరేగడంతో.. విమానాన్ని టేకాఫ్ చేసిన వెంటనే ల్యాండ్ చేయాల్సి వచ్చింది..

దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. దీనికి సంబంధించిన దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి.

సౌత్‌ వెస్ట్ ఎయిర్‌లైన్స్‌( Southwest Airlines)కు చెందిన బోయింగ్ విమానం టెక్సాస్‌లోని విలియం పి హాబీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయింది.

అది మెక్సికో(Mexico)లోని కాంకస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. కానీ టేకాఫ్‌ అయిన వెంటనే ఒక ఇంజిన్‌ నిప్పులు చిమ్మింది. దాంతో వెనకవైపు మంటలు చెలరేగాయి.

వెంటనే అప్రమత్తమైన సిబ్బంది 30 నిమిషాల వ్యవధిలో టేకాఫ్ అయిన చోటే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు( Plane makes emergency).

'మాకు ఏదో పేలిన శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఇంధనం వాసన వచ్చింది' అని ప్రయాణికుడు ఒకరు వెల్లడించారు. మెకానికల్‌ సమస్య రావడంతో ఈ పరిస్థితి తలెత్తిందని విమానయాన సంస్థ తెలిసింది. ప్రయాణికులందరినీ వేరే విమానంలో గమ్యస్థానాలకు పంపించామని తెలిపింది..

Nara Lokesh: పోసానిపై పరువు నష్టం కేసు.. కోర్టుకు హాజరైన నారా లోకేశ్‌

మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి కోర్టుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హాజరయ్యారు.

వైకాపా నేతలపై వేసిన పరువు నష్టం కేసులో తన వాంగ్మూలం ఇచ్చేందుకు ఆయన వచ్చారు..

తనపై తప్పుడు ఆరోపణలు చేసిన ఏపీ ఫిలిం డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్ పోసాని కృష్ణ మురళితో పాటు సింగలూరు శాంతిప్రసాద్‌పై లోకేశ్‌ పరువు నష్టం కేసు దాఖలు చేశారు.

తాడికొండ మండలం కంతేరులో 14 ఎకరాల పొలాన్ని లోకేశ్‌ కొనుగోలు చేశారని పోసాని కృష్ణమురళి ఆరోపించారు.

ఓ ఛానెల్ నిర్వహించిన చర్చలో సింగలూరు ప్రసాద్ కూడా ఆరోపణలు చేశారు.

ఈ కేసుల్లో వీరిద్దరికీ న్యాయస్థానం ద్వారా నోటీసులు పంపినా స్పందించలేదని లోకేశ్‌ తెలిపారు.

Manipur Violence: మణిపుర్‌లో మరోసారి రెచ్చిపోయిన ఆందోళనకారులు.. ముగ్గురి మృతి

ఇంఫాల్‌: తెగల మధ్య వైరం కారణంగా గత వందరోజులుగా హింసాత్మకంగా మారిన మణిపుర్‌ (Manipur)లో మరోసారి అల్లరిమూకలు రెచ్చిపోయాయి. ఉఖ్రుల్‌ (Ukhrul) జిల్లాలో శుక్రవారం ఉదయం సాయుధులైన దుండగులు కాల్పులకు తెగబడ్డారు..

ఉఖ్రుల్‌ జిల్లా పోలీసు అధికారి ఎన్‌. వాషుమ్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రానికి 47 కి.మీ దూరంలో కుకీ తెగవారు నివసించే తోవాయి కుకీ అనే గ్రామంపైకి ఉదయం 4:30 గంటల ప్రాంతంలో కొండపై నుంచి సాయుధ మూకలు విచక్షణా రహితంగా కాల్పులు జరిపాయి.

ఈ ఘటనలో ముగ్గురు గ్రామస్థులు మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన వారి కోసం రాష్ట్ర పోలీసులు, భారత సైన్యం సంయుక్తంగా సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టినట్లు ఎస్పీ వెల్లడించారు..

మణిపుర్‌లో శాంతి నెలకొల్పేందుకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి.

మరోవైపు కుకీ-జో తెగల నివాసిత ప్రాంతాలకు స్వయంప్రతిపత్తిని ప్రకటించాలని గిరిజన మహిళల వేదిక కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో చెలరేగిన హింస కారణంగా సుమారు 160 మంది ప్రాణాలు కోల్పోగా, మూడు వేల మంది వరకు గాయపడ్డారు. ఆందోళనలను కట్టడి చేసి, శాంతి నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం సుమారు 40 వేల కేంద్ర బలగాలను మోహరించింది..