/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz హుజూర్‌నగర్‌లో 5 కొత్త గ్రామ పంచాయతీల ఎంపిక Yadagiri Goud
హుజూర్‌నగర్‌లో 5 కొత్త గ్రామ పంచాయతీల ఎంపిక

సూర్యాపేట జిల్లా:ఆగస్టు 07

హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొత్తగా ఐదు గ్రామపంచాయతీలను ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

హుజూర్ నగర్ నియోజకవర్గంలోని గరిడేపల్లి మండలంలోని గానుగ బండ గ్రామపంచాయతీ నుండి కొండాయి గూడెం,

నేరేడుచర్ల మండలం నుంచి పత్తేపురం గ్రామపంచాయతీలో కొనసాగిన జానల దిన్న , కల్లూరు గ్రామపంచాయతీలో కొనసాగిన లాల్ లక్ష్మీపురం మేళ్లచెరువు మండలంలోని కప్పల కుంట గ్రామపంచాయతీలో కొనసాగిన దుబ్బ తండా ,

అలాగే హేమ్ల తండా గ్రామపంచాయతీలో కొనసాగిన జగ్గు తండాలో ఇక నుండి గ్రామపంచాయతీలుగా కొనసాగనున్నాయి.

ఈ గ్రామ పంచాయతీలో ఏర్పాటు కృషి చేసిన హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కి సహకరించిన ప్రజా ప్రతినిధులకు అధికారులకు ప్రజల కృతజ్ఞతలు తెలుపుకున్నారు....

గద్దర్ అంత్యక్రియల విషయంలో చెలరేగిన వివాదం

హైదరాబాద్:ఆగస్టు 07

ప్రజా యుద్ధ నౌక గద్దర్ నిన్న అస్తమించిన విషయం తెలిసిందే. అయితే ఆయన అంత్యక్రియలను అధికారికంగా నిర్వహిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం దీనిపై వివాదం చెలరేగుతోంది.

గద్దర్ అంత్యక్రియలను ప్రభుత్వం అధికారిక లాంచనాలతో చేయాలనుకోవడం పోలీసు అమరవీరులను అగౌరవ పరచడమేనంటూ యాంటి టెర్రరిజం ఫోరం (ATF) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. గద్దర్‌కు ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం నక్సలైట్ మావోయిజం వ్యతిరేక పోరాటంలో అమరులైన పోలీసుల, పౌరుల త్యాగాలను అవమానించడమేనని ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ పేర్కొన్నారు.

గద్దర్ తన విప్లవ పాటల ద్వారా వేలాది మంది యువకులను నక్సలైట్ ఉద్యమం వైపు మళ్ళించిన వ్యక్తి అని తెలిపారు . ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగాగా తుపాకీ పట్టిన నక్సల్స్ ఉద్యమం వేలాది మంది పోలీసులను బలితీసుకుందన్నారు. నక్సలిజం సాధారణ పౌరులతో పాటు జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలితీసుకుందని శశిధర్ వెల్లడించారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయిధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా తయారు చేసిన గద్దర్ లాంటి ఒక వ్యక్తికి నేడు తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా అంత్యక్రియలు చేయాలని నిర్ణయించడం తీవ్రంగా ఖండించదగిన చర్య అని పేర్కొన్నారు.

ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో.. శాంతి భధ్రతల పరిరక్షణలో తమ ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలను.. ప్రజల త్యాగాలను అవమానించడమే అవుతుందన్నారు...

త్వరలోనే పీఆర్సీ.. ఆలోగా ఐఆర్‌పై నిర్ణయం

హైదరాబాద్ :ఆగస్టు 07

అతి త్వరలోనే వేతన సవరణ కమిషన్‌ PRCను ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ శాసనసభలో ప్రకటించారు.

ఆలోపు మధ్యంతర భృతి (ఐఆర్‌)పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వనరులు సమకూరగానే దేశం ఆశ్చర్యపోయేలా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పే స్కేలు ఇస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు దేశంలోనే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారని గుర్తుచేశారు. ఉద్యోగస్తులంతా తమ పిల్లలేనని ఆయన వ్యాఖ్యానించారు. ఆదివారం శాసనసభలో ‘తెలంగాణ సాధన- సాధించిన ప్రగతి’పై జరిగిన లఘుచర్చలో ఆయన మాట్లాడారు.

సింగరేణి ఉద్యోగుల కు దసరా కానుకగా రూ.1000 కోట్ల బోనస్‌ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఆసరా పింఛన్లను కూడా అవసరాన్ని బట్టి పెంచుతామని వెల్లడించారు. కాంగ్రెస్‌ ఇటీవల ఖమ్మం సభలో పెన్షన్లు రూ.4 వేలు ఇస్తామందని, వారు 4 వేలు ఇస్తే మేం రూ.5 వేలు అనలేమా? అని వ్యాఖ్యానించారు.

ఎన్నికల మేనిఫెస్టో లో గంపెడు అస్త్రాలున్నాయని, సమయం వచ్చినప్పుడు బయటకు తీస్తామని చెప్పారు. అవసరమైతే పెన్షన్లు పెంచుతామని, తాము చేయగలిందే చెబుతామని అన్నారు. కాళేశ్వరం పై కాంగ్రెస్‌ అడ్డగోలుగా మాట్లాడుతోందని కేసీఆర్‌ మండిపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం తెచ్చి, భుజాన వేసుకొని అభివృద్ధి చేసినందుకే నాకు పిండ ప్రదానం చేస్తున్నారా? వచ్చే ఎన్నికల్లో ఎవరికి పిండం పెట్టాలో ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రజలే తగిన తీర్పు చెబుతారు’ అంటూ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడ్డారు. కాళేశ్వరం లేకపోతే తుంగతుర్తికి నీళ్లు వచ్చేవా అని ప్రశ్నించారు. హుజూరాబాద్‌ నుంచి కోదాడ దాకా నీళ్లు పారుతున్నాయంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు చలవేనన్నారు. రైతుల బతుకు విలువ కాంగ్రె్‌సకు తెలియదని.. కాళేశ్వరం వల్లే గోదావరి సజీవంగా మారిందని చెప్పారు.

250 కిలోమీటర్ల పొడవున్న గోదావరిలో 9 ఏళ్ల క్రితం వరకు దుమ్ము రేగితే నేడు 100 టీఎంసీల నీళ్లు నిల్వ ఉన్నాయన్నారు. కాళేశ్వరంపై ఓ వెకిలి, పిచ్చి పేపరు వాడు రాస్తాడని, నిలువెల్లా విషం చిమ్ముతున్నారని మీడియాపై తన అక్కసు వెళ్లగక్కారు.

కాళేశ్వరం దండగ అని మన రాష్ట్రం కాని వాడు చెబుతాడని పరోక్షంగా జేపీనుద్దేశించి వ్యాఖ్యానించారు. దక్షిణ తెలంగాణను కాపాడేది కూడా కాళేశ్వరమేనన్నారు. ఎస్పారెస్పీని నీల్గబెట్టింది బంగారు కాంగ్రెస్సేనని.. ప్రస్తుతం ఎస్పారెస్పీకీ కాళేశ్వరం నీళ్లతో పునరుజ్జీవం తెచ్చామని చెప్పారు. కాంగ్రెస్‌, టీడీపీ హయాంలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ప్రాంతంలో 68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండితే ప్రస్తుతం 3 కోట్ల టన్నుల దిగుబడులు వస్తున్నాయన్నారు. కాంగ్రెస్‌ వస్తే రైతుబంద్‌కు రాంరాం, కరెంట్‌ గోల్‌మాల్‌, దళితబంధు బంద్‌ అవుతుందని చెప్పారు. పస్తుతం భూ రికార్డులను మార్చడం సీఎం చేత కూడా కాదని చెప్పారు...

మద్యం మత్తులో యువతిని వివస్త్రను చేసిన యువకుడు..

జవహర్‌నగర్‌: మద్యం మత్తులో ఓ దుర్మార్గుడు మానవత్వం మరిచి ప్రవర్తించాడు. ఓ యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతోపాటు ఆమెను నడిరోడ్డుపై వివస్త్రను చేశాడు..

చుట్టుపక్కల ఉన్నవారు ఈ దుశ్చర్యను అడ్డుకోవాల్సింది పోయి ఫొటోలు, వీడియోలు తీస్తూ చిత్రం చూశారు. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధి బాలాజీనగర్‌లో ఈ దారుణం జరిగింది. జవహర్‌నగర్‌కు చెందిన పెద్దమారయ్య(30) కూలీ. మద్యానికి బానిసయ్యాడు.

ఆదివారం రాత్రి 8.30కు తల్లితో కలిసి బాలాజీనగర్‌ బస్టాండ్‌ నుంచి ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో స్థానిక యువతి (28) దుకాణం నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఆమెను చూసిన మారయ్య ఆమెపై చెయ్యివేసి అసభ్యంగా ప్రవర్తించాడు. కోప్పడిన యువతి దూరంగా నెట్టేసింది..

దీంతో విచక్షణ కోల్పోయిన మారయ్య.. ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా బలవంతంగా ఆమె దుస్తులను చించి లాగేశాడు. పక్కన ఉన్న మారయ్య తల్లి కనీసం అడ్డుకోలేదు.

అటు నుంచి బైక్‌పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకిలా చేస్తున్నావంటూ ప్రశ్నించడంతో ఆమెపైనా దాడికి ప్రయత్నించాడు. దాదాపు 15 నిముషాల పాటు ఆ యువతి నగ్నంగా రోడ్డుపైనే రోదిస్తూ కూర్చున్నా చుట్టుపక్కలవారు స్పందించ లేదు. అతను వెళ్లాక కొందరు వచ్చి ఆమెను కవర్లతో కప్పేసి జవహర్‌నగర్‌ పోలీసులకు సమాచారమిచ్చారు..

మలహార్ మండలంలో ఇద్దరమ్మాయిలు ఎస్సైగా ఎంపిక

భూపాలపల్లి జిల్లా:ఆగస్టు 07

సివిల్ ఎస్సై ఫలితాల్లో తాడిచర్ల మల్హర్ మండలంలోని, ఆన్ సాన్ పల్లి గ్రామానికి చెందిన బానోత్ గీత, చిన్నతూoడ్ల గ్రామానికి చెందిన నారా రుచిత్ర, అనే ఇద్దరు అమ్మాయిలు

ఆదివారం వెలువడిన ఫలితాల్లో ఎస్సైగా ఎంపికయ్యారు. వ్యవసాయ కుటుంబం నుంచి ఈ ఇద్దరు అమ్మాయిలు ఆణిముత్యాలుగా నిలిచారు.

బానోత్ గీత తల్లిదండ్రులు సమ్మయ్య లలిత వ్యవసాయ కుటుంబం, నారా సుచిత్ర తల్లిదండ్రులు రామయ్య వీఆర్ఏ గా చేస్తూ భార్య లక్ష్మి

వ్యవసాయ పనులకు వెళ్తూ అమ్మాయిలను పై చదువులు చదివించి ఎస్సై ఉద్యోగంలో ఎంపికయ్య విధంగా ప్రోత్సహించారు.

ఇద్దరమ్మాయిలు ఎస్సైలుగా ఎంపిక కావడం తల్లిదండ్రుల కన్న కలలను సాకారం చేశారు.దీంతో వారి తల్లిదండ్రులు ఆనందంలో మునిగితేలుతూ బిడ్డలను హత్తుకున్నారు లక్ష్యాన్ని నెరవేర్చారని అభినందించారు...

Road Accident: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీసీ కెమెరాల్లో రికార్డు

ఆదిలాబాద్‌: ఆదిలాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మావల-గుడిహత్నూర్‌ మండలాల మధ్య 44వ జాతీయ రహదారిపై లారీ బోల్తా పడింది.

రాజస్థాన్‌ నుంచి హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ వాఘపూర్‌ క్రాస్‌ రోడ్డు సమీపంలో ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది..

ఈ ఘటనలో లారీలోని డ్రైవర్స్‌తో సహా ద్విచక్రవాహనదారుడికి గాయాలయ్యాయి.

క్షతగాత్రులను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద దృశ్యం సీసీ కెమెరాల్లో రికార్డు అయింది.

రోడ్డుపై లారీ బోల్తా పడడంతో రవాణాకు కాసేపు అంతరాయం ఏర్పడింది. దీంతో క్రేన్‌ సాయంతో లారీని పక్కకు తొలగించారు..

సీఎం జగన్, చంద్రబాబు ఒకే చోట - ప్రతిష్ఠాత్మకం, ఉత్కంఠ..!!

ఏపీలో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. వైసీపీ వర్సస్ టీడీపీ రాజకీయం ఉత్కంఠగా మారుతోంది. ఈ సమయంలో సీఎం జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు ఇద్దరూ ఒకే నియోజకవర్గంలో పర్యటనకు ఒకే రోజున రానున్నారు..

ఇద్దరూ ఒకే ప్రాంతంలో బస చేయనున్నారు. దీంతో..ఇప్పుడు ఈ ఇద్దరి నేతల పర్యటనల పైన రాజకీయంగా ఆసక్తి పెరుగుతోంది. ఇందుకు రాజమహేంద్రవరం వేదిక కానుంది..

పోలవరంలో ఇద్దరు నేతలు:సీఎం జగన్, చంద్రబాబు ఇద్దరూ ఈ రోజు (సోమవారం) పోలవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. రాజమహేంద్ర వరంలో బస చేయనున్నారు.

'సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి' పేరిట కొద్ది రోజులుగా ప్రాజెక్టులను సందర్శిస్తున్న ఆయన ఆదివారం రాత్రికి ఏలూరు చేరుకున్నారు. ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం పరిధిలో ఉన్న కూనవరం మండలం(అల్లూరి సీతారామరాజు జిల్లా)లో సీఎం.. చింతలపూడి, పట్టిసీమ మీదుగా పోలవరం వెళ్లి ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించనున్నారు.

సోమవారం ఉదయం పది గంటలకు చింతలపూడి చేరుకుని పరిశీలిస్తారు. మధ్యాహ్నం 12.30కు పోలవరం మండలం పట్టిసీమకు చేరుకుని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తారు. అనంతరం ఎత్తిపోతలను పరిశీలిస్తారు. అక్కడి నుంచి పోలవరం వెళ్లి ప్రాజెక్టును, పనుల తీరును పరిశీలిస్తారు..

తిరుమల లో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుపతి :ఆగస్టు 07

తిరుమలలో భక్తుల రద్దీ నేడు సోమవారం కూడా కొనసాగుతోంది.

నేడు టోకెన్ రహిత శ్రీవారి సర్వదర్శనం కోసం భక్తులు 25 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

స్వామివారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది.

ఆదివారం శ్రీవారిని దర్శించుకున్న 83,856 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 28,403 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

తెలంగాణ SI ఫలితాలు విడుదల

తెలంగాణ రాష్ట్రంలో 17,516 పోలీసు ఉద్యోగాల భర్తీ ప్రక్రియను తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీస్‌ నియామక మండలి టీఎస్‌ఎల్పీఆర్బీ ముమ్మరం చేసింది.

ఈ నేపథ్యంలోనే ఆదివారం ఎస్సై, ఏఎస్ఐ పోస్టుల అభ్యర్థుల చివరి లిస్ట్ ఫలితాలు విడుదల అయ్యాయి.

మొత్తం 587 ఎస్సై పోస్టులకు గాను 434 మంది పురుషులు, 153 మంది మహిళలను టీఎస్ఎల్పీఆర్బీ ఎంపిక చేసినట్లు ప్రకటించింది.

కాగా, ఈ ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను రేపు ఉదయం నుంచి వెబ్ సైట్‌లో ఉంచుతామని వెల్లడించింది.

మరోవైపు సెప్టెంబర్‌లో కానిస్టేబుల్‌ అభ్యర్థుల తుది ఫలితాలు వెల్లడించే అవకాశం ఉన్నట్టు సమాచారం....

ఆర్టీసి బిల్లుకు రైట్ రైట్...!

తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనానికి సంబంధించిన బిల్లు విషయంలో సందిగ్ధత తొలగింది. ఆర్టీసీ విలీనం బిల్లు డ్రాప్టుకు గవర్నర్ తమిళిసై ఆమోదముద్ర వేశారు. శానససభలో బిల్లు ప్రవేశపెట్టేందుకు గవర్నర్ కన్సెంట్ ఇచ్చారు. గవర్నర్ ఆమోదంతో బిల్లుకు ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి. ఇవాళ మధ్యాహ్నం రవాణా శాఖ కార్యదర్శి, ఆర్టీసీ అధికారులతో రాజ్‌భవన్‌లో అర్ధగంటకు పైగా జరిగిన చర్చల అనంతరం గవర్నర్ సానుకూలంగా స్పందించారు.

డ్రాఫ్టు బిల్లులోని అంశాలను పరిశీలించిన తర్వాత తలెత్తిన సందేహాలకు అధికారులు ఇచ్చిన వివరణతో ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రోజుల ఉత్కంఠకు తెర దించుతూ బిల్లుకు ఆమోదం తెలిపారు.ఆర్టీసీ కార్మికులకు తాను వ్యతిరేకం కాదని.. వారి సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానని గవర్నర్ మరోసారి స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి రెండుసార్లు వివరణ వెళ్లినా.. ఆమె సంతృప్తి చెందకపోవడంతో రవాణా కార్యదర్శి సహా ఆర్టీసీ ఉన్నతాధికారులు ఇవాళ క్లారిఫికేషన్‌ ఇవ్వగా.. ఆమె సంతృప్తి చెందారు. ఆ తర్వాత రవాణాశాఖ అధికారులు అసెంబ్లీకి చేరుకున్నారు. గవర్నర్‌తో చర్చించిన విషయాలను సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించనున్నట్లు సమాచారం.

గవర్నర్ తమిళ సై ప్రభుత్వానికి చురకలు ..

ఆర్టీసీకి ఉన్న ఆస్తులు, భూములు, ఇతర ప్రాపర్టీస్ ఆ సంస్థతోనే ఉండాలి. ఈ మేరకు ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన అండర్‌టేకింగ్ ఇవ్వాలి.

ఆర్టీసీ బస్సుల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వమే స్వీకరించాలి. అవసరమైతే ఔట్ సోర్సింగ్ సంస్థకు బాధ్యత అప్పజెప్పి సంస్థ (ఆర్టీసీ)పై ఆర్థిక భారం లేకుండా చూడాలి.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఆర్టీసీ ఆస్తుల పంపిణీ విభజన చట్టం ప్రకారం పూర్తికావాలి.

సమైక్య రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ ఉనికిలో ఉన్నప్పటి నుంచి చెల్లించాల్సిన బకాయిలను క్లియర్ చేయాలి.

ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ఇతర డిపార్టుమెంట్లలోకి డిప్యూటేషన్‌పై వెళ్తే వారి వేతనం, గ్రేడ్, పే స్కేల్, పదోన్నతులకు ఇబ్బంది లేకుండా చూడాలి.ఆర్టీసీ సిబ్బంది ప్రభుత్వంలో విలీనమైన తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల తరహాలోనే పే స్కేల్, సర్వీస్ రూల్స్, నియమ నిబందనలు, బదిలీలు, వేతనాల చెల్లింపు, పదోన్నతులు, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్, పింఛన్, పీఎఫ్, గ్రాట్యుటీ తదితరాలు అమలుకావాలి.

ఆర్టీసీ కార్మికులు స్ట్రెస్, స్ట్రెయిన్ లాంటి ఒత్తిడులతో బాధపడుతూ ఉద్యోగానికి ‘అన్‌ ఫిట్’గా మారితే మెడికల్ గ్రౌండ్స్‌కు అనుగుణంగా వారి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం కింద ఉద్యోగం అందాలి.

ఆర్టీసీ సంస్థలో సిబ్బందిపై క్రమశిక్షణా చర్యలు తీవ్రంగా ఉంటాయి. ఇకపైన ప్రభుత్వంలో విలీనమవుతున్నందున మానవతా దృక్పథంలో ఉండేలా సర్వీస్ రూల్స్ నిబంధనల్లో మార్పులు తెచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అమలు చేయాలి.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను కూడా ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారికి సమానంగా ఉండేలా చూడాలి. వారికి ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం అందాలి.

రెగ్యులర్ లేదా నాన్-పర్మినెంట్ ఉద్యోగులు సర్వీసులో ఉన్నంతకాలం ప్రస్తుతం ఆర్టీసీలో వైద్యపరంగా అందుకుంటున్న సౌకర్యాలన్నీ ఇకపైన కూడా కొనసాగాలి. ఇన్సూరెన్స్ బెనిఫిట్స్ కూడా కంటిన్యూ కావాలి.గవర్నర్ ఆమోదంతో ఇవాళే బిల్లును అసెంబ్లీ ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బిల్లును రూపొందించాలని అధికారులను ఆదేశించారు. స్వల్పకాలిక చర్చ అనంతరం బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.