/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz 48 గంటల్లో అతి భారీ వర్షాలు.. అధికారులకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు Yadagiri Goud
48 గంటల్లో అతి భారీ వర్షాలు.. అధికారులకు సీఎస్ శాంతి కుమారి కీలక ఆదేశాలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో రానున్న 48 గంటలలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.

ఈ క్రమంలోనే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను అప్ర మత్తం చేశారు. ఈ మేరకు ఆమె అధికార యంత్రా గానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమీషనర్లు, ఎస్పీలతో నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఈ 48 గంటల పాటు అత్యంత అప్రమత్తతతో ఉండాలని సీఎస్ ఆదేశించారు.

ఏ విధమైన ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టాలని తెలిపారు.ఇప్పటికే గోదావరి బేసిన్‌లో పలు ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు, కాలువలు పూర్తి స్థాయి నీటి మట్టంతో ప్రవహిస్తున్నాయి.

ఇక ఈ రెండు రోజుల్లో కురిసే అత్యంత భారీ వర్షాల వల్ల అవి మరింత ప్రమాద స్థాయిలో ప్రవహించే అవకాశముంది. నిండిన ప్రతీ చెరువు వద్ద, ప్రమాద స్థాయిలో ప్రవహిస్తున్న కాజ్- వే ల వద్ద ప్రత్యేక అధికారులతో పాటు పోలీస్ అధికారులను నియమించి తగు జాగ్రత్త చర్యలను చేపట్టాలని అధికారులకు సీఎస్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, ముంపునకు గురయ్యే ప్రాంతాలలో అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. గుర్తించిన పునరావాస కేంద్రాలలో అవసరమైన వస్తు సామాగ్రి ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.

వర్షాలకు దెబ్బతినే రాష్ట్ర, నేషనల్ హైవే రోడ్లకు వెంటనే మరమ్మతులు జరపాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.జలపాతాలు, ఇతర పర్యాటక ప్రాంతాలకు ప్రజలు రాకుండా నివారించాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఎన్‌డీఆర్ దళాలను సిద్ధంగా ఉంచామని, అవసరమైతే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించుకోవాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో చేపట్టిన జాగ్రత్త చర్యలపై ప్రజలను చైతన్యవంతం చేసేలా స్థానిక కేబుల్ టీవీలు, ఇతర ప్రసార మాధ్యమాల ద్వారా తెలపాలని కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారు....

సుప్రీం కోర్టులో తీర్పు వచ్చేవరకు "జలగం"ప్రమాణస్వీకారం వాయిదే

ఖమ్మం జిల్లా:జులై 26

బీఆర్ఎస్ నేత జలగం వెంకట్రావ్‌కు చుక్కెదురైంది. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీల్‌కి వెళ్లే వరకు తీర్పుపై స్టే ఇవ్వాలని కోరారు. అయితే ఈ పిటిషన్‌ను కోర్టు తీర్పును రిజర్వు పెట్టింది. అయితే, వనమా సుప్రీంకోర్టుకు వెళ్తుండటంతో జలగం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారానికి అడ్డంకిగా మారింది.

అయితే హైకోర్టు గురువారం తీర్పు వెలువరించే అవకాశం ఉండగా, వనమా సుప్రీంలో అప్పీల్ చేయనున్నారు.

దీంతో ఉన్నత న్యాయం స్థానం తీర్పు వెలువడే వరకు వెంకట్రావు ప్రమాణ స్వీకారం వాయిదా పడనుంది. సుప్రీంకోర్టు సైతం ఎలాంటి తీర్పును ఇస్తుందోనని రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది. వనమా, జలగం ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులే కావడం విశేషం.

వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేస్తూ జలగం వెంకట్రావును ఎమ్మెల్యేగా ప్రకటిస్తూ హైకోర్టు మంగళవారం తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కాపీని బుధవారం అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు, ఎన్నికల అధికారి వికాస్ రాజ్‌కు వెంకట్రావు అందచేశారు.కొత్తగూడెం ఎమ్మెల్యేగా తనను పరిగణించి ప్రమాణ స్వీకారం చేయించాలని కోరారు.

అనంతరం మీడియాతో మాడుతూ.. ఖమ్మం జిల్లాలో 2014లో బీఆర్ఎస్నుంచి తాను ఒక్కడినే గెలిచానని వెంకట్రావు స్పష్టం చేశారు. రాజకీయ కుతంత్రాల వలన 2018లో ఓడిపోయినప్పటికీ.. బీఆర్ఎస్పార్టీలోనే ఉన్నానని తెలిపారు. భవిష్యత్తులోనూ కేసీఆర్ నాయకత్వంలోనే కొనసాగుతానని వెల్లడించారు. రెగ్యులర్‌గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నానని, నేను ఏమి చేశానో నియోజకవర్గ ప్రజలకు తెలుసునని, ఏమీ చేస్తానో కూడా వారికి తెలుసు అని స్పష్టం చేశారు...

బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో హ్యాట్రిక్ ఖాయం : మంత్రి హరీశ్‌రావు

నల్గగొండ జిల్లా:జులై 26

మిర్యాలగూడ నియోజకవర్గంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి జగదీశ్‌ రెడ్డి తో కలిసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. నిరుద్యోగ సమస్య తెలంగాణ లో లేదని..కాంగ్రెస్ పార్టీలోనే పదవుల నిరుద్యోగం ఉందని మంత్రి హారీష్ రావు ఆరోపించారు.

సీఎం కేసీఆర్ పాలనలో యువతకు ఉపాధి, ఉద్యోగాలు లేవని జడ్చర్ల సభలో హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్ కౌంటర్ ఇచ్చారు.కాంగ్రెస్, బీజేపీ లు ప్రజలకు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయని.. అభివృద్ధి అనే ఆయుధంతో మేం వారికి సమాధానం చెబుతామన్నారు.

కాంగ్రెస్ పరిపాలన బాగోలేదనే ప్రజలు కేసీఆర్‌ను రెండు సార్లు సీఎం కుర్చీలో కూర్చోబెట్టారని రాష్ట్రంలో మూడోసారి ముమ్మాటికి బీఆర్ఎస్సే అధికారంలోకి వస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 నుంచి 50 స్థానాల్లో అభ్యర్థులే లేరని ఎద్దేవా చేశారు.

బీఆర్ఎస్ పాలనలో దేశంలోనే తెలంగాణ తొలి స్థానంలో నిలిచిందని వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభను కనబరిచినందుకే ఈ ఘనతను సాధించిందని ఆయన తెలిపారు. 50 ఏళ్లలో జరగని అభివృద్ధిని కేసీఆర్ చేసి చూపించారని అన్నారు. రాష్ట్రంలో ఎంతో అభివృద్ధి జరుగుతున్నా విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో 15 వేల బెడ్స్ ఉండేవని… వాటి సంఖ్యను 50 వేలకు పెంచామని హరీశ్ వెల్లడించారు.

గత ఐదేళ్లలో లక్ష 50 వేల ఉద్యోగాలను ఇచ్చామని చెప్పారు. ఈ విద్యా సంవత్సరంలో 9 మెడికల్ కాలేజీల ను ప్రారంభిస్తామని తెలిపారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధిస్తామని కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారని మునుగోడు ఎన్నికల్లో ఏం జరిగిందో గుర్తుకు తెచ్చుకోవాలని హరీశ్ అన్నారు.

నల్గొండ జిల్లా బీఆర్ఎస్ కు కంచుకోట అని. అన్ని స్థానాలను కైవసం చేసుకుంటామని చెప్పారు...

బీఆర్‌ఎస్‌‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా దొరల్ల తిరుగుతున్న దొంగలే-- వైయస్ షర్మిల

అధికార పార్టీపై వైఎస్సార్టీపీ అధినేత్ర వైఎస్ షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికల చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించిన షర్మిల... బీఆర్‌ఎస్‌‌లో ఉన్న ఎమ్మెల్యేలంతా మరో వనమాలే అంటూ ఎద్దేవా చేశారు.

అంతా ఎన్నికల కమిషన్‌ను తప్పు దోవ పట్టించిన వాళ్లే అని వ్యాఖ్యలు చేశారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలే అన్నారు.

ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత అని తెలిపారు. లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతమన్నారు.

అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి.. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్సార్ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు.

ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని వైఎస్ షర్మిల కోరారు...

హైదరాబాద్ లో హోంగార్డ్స్ ధర్నా :;అరెస్ట్

నగరంలోని ఇందిరాపార్క్‌ ధర్నాచౌక్‌ వద్ద హోంగార్డ్స్ బుధవారం ధర్నాకు దిగారు. తమను పర్మినెంట్ చేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీని వెంటనే అమలుచేయాలని హోంగార్డ్స్ డిమాండ్ చేస్తున్నారు.

కోర్టు ద్వారా వచ్చిన ఆర్డర్ ఆధారంగా హోంగార్డ్స్ ఉద్యోగాలను భర్తీ చేయాలని వారు ధర్నాకు దిగారు.

అలాగే రిటైర్మెంట్ అయిన హోంగార్ట్స్‌కు రూ.10 లక్షలు నగదుతో పాటు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కేటాయించాలని కోరారు.

అన్యాయంగా ఉద్యోగం నుంచి తొలగించిన హోంగార్డ్స్‌ను వెంటనే విధులకు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

కాగా.. ధర్నా చేస్తున్న హోంగార్డ్స్‌ను పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే హోంగార్డ్స్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు వివిధ పోలీస్‌స్టేషన్లకు వారిని తరలించారు....

Mancherial: ఎడ్లబండి, ఆటో, అంబులెన్స్‌.. గర్భిణి ఆస్పత్రి తరలింపునకు అష్టకష్టాలు

నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలించడానికి కుటుంబసభ్యులు, స్థానికులు అష్టకష్టాలు పడ్డారు. కోనంపేట పంచాయతీలోని పాటి గ్రామానికి చెందిన రెడ్డి మల్లక్క నాలుగు నెలల గర్భిణి..

మూడు రోజుల నుంచి తీవ్రమైన జ్వరం రావడంతో స్థానిక ఆర్ఎంపీ వద్ద చికిత్స తీసుకుంది.

అయినా ఆరోగ్యం కుదుట పడకపోవడంతోపాటు రక్త స్రావం కావడంతో ఆమెను బెల్లంపల్లిలోని ఆస్పత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు.

పాటి గ్రామం నుంచి కోనంపేట వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ఎడ్ల బండిలో పంచాయతీ కార్యాలయం వరకు అతి కష్టం మీద తీసుకెళ్లారు.

అక్కడి నుంచి ఆటోలో ఎర్ర వాగును దాటించారు. అప్పటికే 108 అంబులెన్స్ ఎర్ర వాగు అవతల వైపు బురదలో చిక్కుకుంది. దీంతో స్థానికుల సాయంతో బురద నుంచి అంబులెన్స్‌ను వెలికి తీశారు. అనంతరం ఆమెను బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు..

Lokesh: బాహుబలిలో కుంతల రాజ్యం.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం: లోకేశ్‌

ఒంగోలు: బాహుబలి సినిమాలో కుంతల రాజ్యం చూశాం.. జగనన్న పాలనలో గుంతల రాజ్యం చూస్తున్నామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఎద్దేవా చేశారు.

యువగళం పాదయాత్రలో భాగంగా ఒంగోలులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో లోకేశ్‌ మాట్లాడుతూ.. జగనన్న ఒక్క గుంత కూడా పూడ్చలేకపోతున్నారని విమర్శించారు.

''జగన్‌కు ప్రజాస్వామ్య బద్ధంగా పాలన చేయడం తెలీదు. ఆయనొక అద్భుతమైన కటింగ్‌, ఫిటింగ్‌ మాస్టర్‌. జగన్‌ దగ్గర రెండు బటన్లు ఉంటాయి.. బల్లపైన బ్లూ బటన్‌, బల్లకింద రెడ్‌ బటన్‌. భారత దేశంలో 100 సంక్షేమ పథకాలు కట్‌ చేసిన ఏకైక సీఎం జగన్‌. మహిళలకు జగన్‌ ఇచ్చిన ఏ హామీ నెరవేర్చలేదు.

మహిళల కన్నీరుతుడిచే బాధ్యత తెదేపా తీసుకుంటుంది. చంద్రబాబు హయాంలో గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.650 ఉంటే.. ఇప్పుడు రెట్టింపయ్యింది. తెదేపా ప్రభుత్వం రాగానే యువతకు 20లక్షల ఉద్యోగాలు ఇస్తాం..

రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ మూడో స్థానంలో ఉంది. కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే ఏపీ రెండో స్థానంలో ఉంది. నిధులు, విధులు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. బడుగు, బలహీన వర్గాలంటే సీఎం జగన్‌కు చిన్నచూపు. జగన్‌ పేదల పక్షపాతి కాదు. రైతులకు రుణమాఫీ చేసింది తెదేపానే. సంక్షేమాన్ని భారతదేశానికి పరిచయం చేసింది తెదేపా. పేదలకు సీఎం జగన్‌ చేసిందేమీ లేదు. పేదలకిచ్చిన 3లక్షల ఇళ్ల పట్టాలను వెనక్కి లాక్కున్నారు. నాలుగేళ్లలో జగన్‌ పూర్తి చేసిన ఇళ్లు 9,500 మాత్రమే. చంద్రబాబు హయాంలో 3లక్షల ఇళ్లు పూర్తి చేశాం. 3లక్షల ఇళ్లు కట్టాలంటే జగన్‌ వంద జన్మలు ఎత్తాలి'' అని లోకేశ్‌ అన్నారు..

Machilipatnam: ఇది చెరువు కాదు.. జగనన్న కాలనీ లేఅవుట్‌..

మచిలీపట్నం: రాజకీయ లబ్ధి కోసం జగన్‌ ప్రభుత్వం నివాస యోగ్యం కాని స్థలాల్లో పట్టాలు ఇచ్చి వారి ఉసురు పోసుకుంటోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు..

రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్‌గా పాలకులు చెబుతున్న కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కరగ్రహారం పరిధిలోని 360 ఎకరాల లేఅవుట్‌ రెండు రోజుల వర్షానికే చెరువును తలపిస్తోందన్నారు.

తెదేపా కార్పొరేటర్‌లతో కలిసి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బాబా ప్రసాద్‌ లేఅవుట్‌ను పరిశీలించారు.

అనంతరం తెదేపా నాయకులు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటోందన్నారు.

నగరంలో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ఇచ్చేందుకు మనసురాని ప్రభుత్వం.. పనికిరాని స్థలాల్లో పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టుకోకుంటే రద్దు చేస్తామనడం దుర్మార్గమన్నారు..

కరెంట్‌ కోతలపై నిరసన ఉద్రిక్తం.. ఆందోళనకారులపై పోలీసుల కాల్పులు..

పట్నా: బిహార్‌ (Bihar)లోని కటిహార్‌ జిల్లాలో కరెంట్‌ కోతలకు (power outage) వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళన (Protest) హింసాత్మకంగా మారింది. నిరసనకారులపై పోలీసులు జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోగా..

మరికొందరు గాయపడ్డారు.

కటిహార్‌లోని బార్సోయి ప్రాంతంలో కరెంట్‌ కోతలు, విద్యుత్ టారిఫ్‌ (Power Tariff)లను నిరసిస్తూ గ్రామస్థులు ఆందోళనకు దిగారు. స్థానిక విద్యుత్‌ కార్యాలయాన్ని ముట్టడించారు.

ఆఫీసుపైకి రాళ్లు విసిరి అక్కడి సామగ్రిని ధ్వంసం చేశారు. సమాచారమందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఆందోళనకారులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు..

ఉద్రిక్తతలను అదుపు చేసేందుకు పోలీసులు తొలుత లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. పోలీసులు, గ్రామస్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. జిల్లా మేజిస్ట్రేట్‌, ఎస్పీ ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు..

JOB Notification: తెలంగాణ వైద్యారోగ్యశాఖలో 1520 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌..

హైదరాబాద్‌: తెలంగాణలో మరో భారీ ఉద్యోగ నోటిఫికేషన్‌ (job notification in telangana) విడుదలైంది. కమిషనర్‌ ఆఫ్ హెల్త్‌ అండ్‌ ఫ్యామిలీ వెల్ఫేర్‌ విభాగంలో 1,520 మల్టీపర్పస్‌ హెల్త్‌ అసిస్టెంట్‌ పోస్టుల నియామకానికి బుధవారం సాయంత్రం నోటిఫికేషన్‌ వెలువడింది..

ఈ పోస్టులకు ఆగస్టు 25 ఉదయం 10.30గంటల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆహ్వానించనున్నారు. అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్‌ 19 సాయంత్రం 5గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్‌లో కొన్ని ముఖ్యాంశాలివే..

కౌన్సిల్‌ గుర్తింపు పొందిన సంస్థలో మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (మహిళ) ట్రైనింగ్‌ కోర్సు పాసై ఉండాలి. లేదంటే ఇంటర్‌ ఒకేషనల్‌ మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ (ఫిమేల్‌) ట్రైనింగ్‌ కోర్సును అభ్యసించి ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాది పాటు క్లినికల్‌ ట్రైనింగ్‌ చేసి ఉండాలి.

అభ్యర్థుల వయసు 2023 జులై 1 నాటికి 18 నుంచి 44ఏళ్లు మించరాదు. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, ఎన్‌సీసీ సర్టిఫికెట్‌ ఉన్నవారికి మూడేళ్లు చొప్పున వయో పరిమితి సడలింపు కల్పించారు.

హెల్త్‌ అసెస్టెంట్‌ పోస్టులకు ఎంపికైన వారికి వేతన స్కేలు నెలకు రూ.31,040- 92,050గా నిర్ణయించారు..

దరఖాస్తు రుసుం: ఆన్‌లైన్ దరఖాస్తు రుసుం రూ.500. దానికి అదనంగా ప్రాసెసింగ్‌ ఫీజు రూ.200ల చొప్పున చెల్లించాలి. ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఈడబ్ల్యూఎస్/దివ్యాంగులు, ఎక్స్‌ సర్వీస్‌మెన్‌లతో పాటు 18-44 ఏళ్లు కలిగిన నిరుద్యోగ కేటగిరీ అభ్యర్థులకు ప్రాసిసింగ్‌ ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఓఎంఆర్‌ లేదా కంప్యూటర్‌ బేస్డ్‌ రాత పరీక్ష ఉంటుంది. రాత పరీక్షకు సంబంధించిన వివరాలను తర్వాత వెల్లడించనున్నారు. పరీక్ష ఇంగ్లిష్‌లోనే ఉంటుంది. హైదరాబాద్‌, వరంగల్‌, ఖమ్మం, నిజామాబాద్‌లను ప్రాథమికంగా పరీక్ష కేంద్రాలుగా నిర్ణయించారు..