/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్‌, భారాస.. Yadagiri Goud
No Confidence Motion: ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం.. నోటీసులిచ్చిన కాంగ్రెస్‌, భారాస..

దిల్లీ: మణిపుర్‌ అంశం (Manipur)పై పార్లమెంటులో ప్రధాని మోదీ (PM Modi) ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టిన విపక్ష కూటమి 'ఇండియా (India)'..

కేంద్ర ప్రభుత్వంపై 'అవిశ్వాస తీర్మాన (No Confidence Motion)' అస్త్రం ప్రయోగించేందుకు సిద్ధమైంది. లోక్‌సభ (Lok sabha)లో కాంగ్రెస్‌ (Congress) డిప్యూటీ నేత గౌరవ్‌ గొగొయ్‌.. ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు స్పీకర్‌కు నోటీసులిచ్చినట్లు కాంగ్రెస్‌ నేత మాణికం ఠాగూర్‌ వెల్లడించారు. అటు భారాస ఎంపీ నామా నాగేశ్వర రావు కూడా నోటీసు ఇచ్చారు.

కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం (No Confidence Motion) ప్రవేశపెడితే.. ప్రధాని మోదీ మాట్లాడటంతో పాటు తమకూ పలు అంశాలను లేవనెత్తడానికి అవకాశం లభిస్తుందని విపక్ష కూటమి యోచిస్తోంది. ఇప్పటికే తీర్మాన ముసాయిదాను కూడా సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం స్పీకర్‌ కార్యాలయానికి కాంగ్రెస్‌, భారాస నోటీసులిచ్చింది..

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీయే (NDA) కూటమికి 330 మంది సభ్యుల మద్దతుంది. 'ఇండియా'కు 140 మంది సభ్యులున్నారు. మరో 60 మందికిపైగా ఏ కూటమిలోనూ లేరు.

దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోవడం దాదాపు ఖాయమే అయినప్పటికీ.. కేవలం మణిపుర్‌ అంశంలో చర్చల కోసం ప్రతిపక్షాలు ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. గతంలో 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది..

Vijayawada: ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై జారిపడిన కొండరాళ్లు

ఇంద్రకీలాద్రి: విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో ఇంద్రకీలాద్రిపై కొండరాళ్లు బుధవారం జారి ఘాట్‌ రోడ్‌ మీద పడ్డాయి.

దీంతో అప్రమత్తమైన దేవస్థానం అధికారులు ఆ మార్గంలో టోల్‌గేట్‌ను మూసివేశారు..

భక్తులను మల్లికార్జున మహామండపం మెట్ల మార్గం వైపు మళ్లించారు.

ఇంజనీరింగ్‌ అధికారులు, సిబ్బంది ఘాట్ రోడ్డులో పడిపోయిన రాళ్లను యుద్ధప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఎవరికీ గాయాలు కాకపోవటంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు..

త్వరలో హైదరాబాద్ లో మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్స‌వం

నాంపల్లి చాపల్‌ రోడ్డులో పాత ప్రెస్‌ అకాడమీ స్థానంలో నిర్మించిన మీడియా అకాడమీ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధ మైందని మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. మంగళవారం సాయంత్రం భవన నిర్మాణ పనులను పర్య వేక్షించిన సమాచార శాఖ ప్రత్యేక కమిషనర్‌, అశోక్‌ రెడ్డి ఇంజనీర్లకు పలు సూచనలు చేశారు. త్వరలో మీడియా అకాడమీ భవనం ముఖ్యమంత్రి చేతులమీదుగా ప్రారంభించుకుంటామని తెలిపారు.

వేయి గజాల స్థలంలో నాలుగు అంతస్తుల్లో 29548 చదరపు అడుగుల్లో కార్పొరేట్‌ భవనంలా నిర్మించారన్నారు. భవనం ప్రారంభోత్సవానికి విచ్చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్‌ కోరినట్లు తెలిపారు.

ముఖ్యమంత్రి కెసిఆర్‌ పాత అకాడమీ భవనంలో ఫిబ్రవరి 2015లో జరిగిన అకాడమీ మొదటి సర్వసభ్య సమావేశంలో కొత్త భవనం నిర్మించాలని సూచించారని గుర్తు చేశారు. ఈ క్రమంలో 2017లో భవన నిర్మాణానికి 15 కోట్లు విడుదల చేశారని, ముఖ్య మంత్రి కేసీఆర్‌ కర్త, కర్మ, క్రియగా ఈ భవనం రూపు దిద్దుకుందన్నారు.

భవనంలో జర్నలిస్టుల కోసం నాలుగు తరగతి గదులు, కార్యాలయ సిబ్బంది కోసం ఒక అంతస్తు. రెండంతస్తుల్లో కలిపి 250 మంది కూర్చునే సామర్థం గల ఆడిటోరియం, గ్రంథాలయం, చైర్మన్‌, తది తరులకు ప్రత్యేక గదులు నిర్మించారని వివరించారు. తరగతి గదుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ల ప్రత్యేక గదిని కూడా నిర్మించారన్నారు.

భవనం పనులన్నీ తుదిదశ కు వచ్చినందున, మిగిలిన అరకొర పనులు పూర్తిచేసి మెరుగులు దిద్దాలని ఆర్‌ అండ్‌ బి అధికారులను కోరారు. కేసీఆర్‌ ప్రత్యేక శ్రద్ధ వల్ల, జర్నలిస్టుల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి వల్ల ఇది సాధ్యమైందన్నారు......

ఇవాళ తిరుమల లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది

తిరుపతి :జులై 26

తిరుమలలో నేడు బుధవారం భక్తుల రద్దీ సాధారణగా ఉంది. నేడు శ్రీ వారి దర్శనానికి వెళ్లే వారికి స్వామి వారి దర్శనానికి చాలా తక్కువ సమయం పడుతోంది.

టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు 6 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

నేడు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. మంగళవారం 73,137 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.06 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 27,490 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు...

తెలంగాణలో "దూకుడు" పెంచిన బీజేపీ

ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలంగాణ బీజేపీ దూకుడు పెంచింది. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలన తీరుపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేసేందుకు బీజేపీ రంగం సిద్ధం చేసింది.

ఇందులో భాగంగా నాంపల్లి బీజేపీ కార్యాలయంలో పోల్ వార్ రూం ఏర్పాటు చేసింది. పోల్ వార్ రూం ఇంచార్జ్‌గా బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాంను నియమిస్తూ బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకుంది.

అలాగు ప్రజలకు దగ్గరయ్యేందుకు మీడియా స్టార్టజీ టీంను ఏర్పాటు చేసింది. మీడియా స్టార్టజీ టీం ఇంచార్జ్‌గా జాతీయ నేత శ్వేతను నియమించగా.. ఎంపీ ధర్మపురి అర్వింద్, యోగానందకు సోషల్ మీడియా బాధ్యతలు అప్పగించారు.

అలాగే పార్టీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి, చింతలకు సమన్వయ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల‌ కోసం ప్రత్యేకంగా 22 కమిటీలను ఏర్పాటు చేశారు.

ప్రతి రోజూ బీజేపీ కార్యాలయంలో ఒక జాతీయ కార్యవర్గ సభ్యుడి ప్రెస్ మీట్ ఉండేలా కార్యచరణ రూపొందించారు. కేంద్రమంత్రి అమిత్‌ షా నేరుగా తెలంగాణ వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి......

Chandrayaan 3: చివరి భూకక్ష్య పెంపు విజయవంతం.. ఇక జాబిల్లే తరువాయి..

బెంగళూరు: జాబిల్లిపై పరిశోధనలకుగానూ ప్రయోగించిన 'చంద్రయాన్‌-3 (Chandrayaan-3)' వ్యోమనౌక తన లక్ష్యం దిశగా మరో అడుగు ముందుకేసింది.

ఇప్పటివరకు నాలుగో కక్ష్యలో భూమిచుట్టూ తిరిగిన ఈ వ్యౌమనౌకకు సంబంధించిన అయిదో కక్ష్య పెంపు (Orbit Raising Manoeuvre)ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మంగళవారం విజయవంతంగా నిర్వహించింది.

బెంగళూరులోని 'ఇస్రో టెలీమెట్రీ, ట్రాకింగ్‌ అండ్‌ కమాండ్‌ నెట్‌వర్క్‌ (ISTRAC)' నుంచి ఈ విన్యాసాన్ని చేపట్టింది. దీంతో చంద్రయాన్‌ ఇప్పుడు 127609 కి.మీ x 236 కి.మీ దూరంలోని కక్ష్యలోకి చేరుకునే అవకాశం ఉందని ఇస్రో తెలిపింది.

ఇదిలా ఉండగా.. భూమి చుట్టూ చక్కర్లు కొట్టే విషయంలో చంద్రయాన్‌-3కి సంబంధించి ఇది చివరి కక్ష్య. దీని తర్వాత వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశిస్తుంది. ఈ విన్యాసాన్ని (TransLunar Injection) ఆగస్టు 1న చేపట్టనున్నట్లు ఇస్రో తెలిపింది.

జులై 14న ఈ వ్యోమనౌకను ఎల్‌వీఎం3-ఎం4 రాకెట్‌ ద్వారా విజయవంతంగా భూకక్ష్యలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. మరుసటిరోజు తొలిసారిగా దీని కక్ష్యను పెంచారు. ఇప్పటివరకు దశలవారీగా అయిదుసార్లు పెంచి.. చంద్రయాన్‌-3ని జాబిల్లికి చేరువచేస్తున్నారు. అయిదో భూకక్ష్య పూర్తయిన అనంతరం ఈ వ్యోమనౌక చంద్రుడి కక్ష్యలోకి వెళ్తుంది. అంతా సజావుగా సాగితే ఆగస్టు 23న సాయంత్రం చంద్రుడిపై ల్యాండర్‌ అడుగుపెడుతుంది..

వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలి-- మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్ర వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం రెడ్ అలెర్ట్ ప్రకటించిన తరుణంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో నమోదవుతున్న వర్షపాతం, వరదలు, లోతట్టు ప్రాంతాల జలమయం, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, అత్యవసర పరిస్థితుల్లో, రెస్క్యూ టీమ్స్, టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు తదితర అంశాలపై ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో గల ఆరు జిల్లాల కలెక్టర్లతో, ఉన్నతాధికారులతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా జిల్లాల పరిస్థితిని, తీసుకున్న ముందు జాగ్రత్తచర్యలను కలెక్టర్లు మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గల జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ఉందని ప్రజలకి ఏ సమస్య ఉన్నా అధికారులకు తెలియ చేయాలని, ఏ సమయంలో ఏ సమస్య వచ్చినా వెంటనే అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టరేట్లలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

లోతట్టు ప్రాంతాల్లో, శిథి లావస్థలో ఉన్న ఇళ్లలో వున్న ప్రజలను వెంటనే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి చేర్చాలని, అలాగే పునరావాస కేంద్రాల్లో వారికి భోజన సదుపాయం కల్పించాలని అధికారులను ఆదేశించారు.

ఇదే సందర్భంలో తాను కూడా సహాయక చర్యలలో పాల్గొంటున్నానని, ప్రజా ప్రతినిధులు, యువత కూడా అధికారులకు సహకరించాలని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు...

ప్రిలిమ్స్ ఫలితాలు సోమవారం వరకు ప్రకటించొద్దు: హైకోర్టు

ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలను వచ్చే సోమవారం వరకు ప్రకటించవద్దని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలంటూ కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని టీఎస్పీఎస్సీ అధికారులకు సూచించింది.

కాగా, వాదనలు వినిపించేందుకు సోమవారం వరకు గడువు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ తరపు న్యాయవాది కోరారు.

దీనికి సమ్మతించిన హైకోర్టు సోమవారం వరకు ఫలితాలు విడుదల చేయవద్దని ఆదేశాలు ఇచ్చింది....

చినుకు పడితే చిత్తడే.. నరకాన్ని తలపిస్తున్న హైదరాబాద్ ట్రాఫిక్

చినుకు పడితే చిత్తడే అన్న తీరుగా భాగ్యనగర రోడ్లు తయారయ్యాయి. కొద్దిసేపటి వర్షానికే నగర రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోవడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. నగరంలో ట్రాఫిక్ నరకాన్ని తలపిస్తోందని వాహనదారులు వాపోతున్నారు.

ఈరోజు మంగళవారం ఉదయం నగరంలో భారీగా వర్షం కురిసింది. దీంతో ఉదయమే ఆఫీసు, స్కూళ్లకు వెళ్లే వాహనాలతో ఎక్కడికక్కడ జామ్ అయిపోయింది. 10 నిమిషాల ప్రయాణానికే వాహనదారులు గంటల తరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది. షేక్ పేట్ - రాయదుర్గం మార్గంలో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఉప్పల్ నుంచి తార్నాక వెళ్లే మార్గంలోనూ పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. అటు సికింద్రాబాద్ నుంచి బేగంపేట్ రోడ్‌లో హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.

అలాగే దిల్‌సుఖ్‌నగర్ నుంచి మలక్‌పేట్, చాదర్ఘాట్ వైపు ట్రాఫిక్ నిలిచిపోగా.. ఇటు కూకట్‌పల్లి, మియాపూర్, పటాన్‌చెర్‌ ట్రాఫిక్ జామ్ అయ్యింది. హైటెక్ సిటీలోనూ వాహనాలు ఎక్కడివి అక్కడే రోడ్లపై ఉండిపోయాయి. ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు.

మరోవైపు రాష్ట్రంలో మూడు రోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్రానికి రెడ్ అలెర్ట్ జారీ చేసింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారుల హెచ్చరికలు జారీ చేశారు...

MMTS Trains: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి

MMTS Trains: హైదరాబాద్‌లో పెను ప్రమాదం తప్పింది. మలక్‌పేట్ రైల్వే స్టేషన్ సమీపంలో రెండు ఎంఎంటీఎస్ రైళ్లు ఒకే ట్రాక్‌పైకి వచ్చాయి. అయితే రెండు రైళ్లలోని లోక్ పైలట్లు ముందే గమనించి ట్రైన్లను నిలిపివేశారు.

దీంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి రావడంతో ప్రయాణికులు కాసేపు టెన్షన్ పడ్డారు. లోక్ పైలట్లు అప్రమత్తమై చాకచక్యంగా వ్యవహరించడం, ట్రైన్లను నిలిపివేయడంతో ప్రయాణికులందరూ ఊపిరిపీల్చుకున్నారు.

అదే రెండు రైళ్లు ఢీకొని ఉంటే పెద్ద ప్రమాదం జరిగేదని అంటున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకుని దక్షిణ మధ్య రైల్వే అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.

ఒక రైలును మరో ట్రాక్‌పైకి మళ్లించారు. దీంతో రెండు రైళ్లు వేరే వేరే ట్రాక్‌ల పైనుంచి పెళ్లాయి. ఈ ఘటనతో రెండు ఎంఎంటీఎస్ ట్రైన్లు అరగంటపాటు ఆగిపోయాయి.

అయితే ఈ ఘటనపై సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు విచారణ చేపడుతున్నారు. రెండు రైళ్లు ఒకే ట్రాక్‌పైకి ఎలా వచ్చాయనేది ఆరా తీస్తున్నారు. రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగానే ఇలా జరిగిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో లోపం ఎక్కడ జరిగిందనేది తెలుసుకునే ప్రయత్నం అధికారులు చేస్తున్నారు.