/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1642444571545789.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1642444571545789.png StreetBuzz పార్లమెంట్‌లో మణిపుర్‌ కల్లోలం: నిమిషాలకే వాయిదా పడిన లోక్‌సభ Yadagiri Goud
పార్లమెంట్‌లో మణిపుర్‌ కల్లోలం: నిమిషాలకే వాయిదా పడిన లోక్‌సభ

దిల్లీ: ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌(Monsoon Session of Parliament) కార్యకలాపాలకు మణిపుర్ అల్లర్ల అంశం తీవ్ర అంతరాయం కలిగిస్తోంది. దానిపై ప్రధాని ప్రకటన చేయాలని ఎంపీలు పట్టుపట్టడంతో ఉభయ సభల్లో తీవ్ర గందరగోళ వాతావరణం నెలకొంది..

ఈ పరిస్థితుల మధ్య మంగళవారం లోక్‌సభ(Lok Sabha) ప్రారంభమైన వెంటనే వాయిదా పడింది. 11 గంటలకు ప్రారంభమైన సభను స్పీకర్ ఓం బిర్లా నిమిషాల వ్యవధిలోనే వాయిదా వేశారు.

మళ్లీ మధ్యాహ్నం రెండు గంటలకు దిగువసభ కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. మణిపుర్ అంశం, ఆప్‌ ఎంపీ సంజయ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటుతో రాజ్యసభ కార్యకలాపాలు సజావుగా సాగలేదు.

దాంతో ఛైర్మన్ జగదీప్‌ ధనఖడ్ ఎగువ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదావేశారు. ఇదిలా ఉంటే..

ప్రధాని ప్రకటన చేయాలంటూ పట్టుపడుతున్న విపక్ష ఎంపీలు దానిపై వెనక్కి తగ్గుతాయని ప్రభుత్వం భావించడం లేదు. దాంతో ప్రభుత్వం ఇక బిల్లుల్ని ప్రవేశపెట్టడంపై దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. మరోపక్క విపక్ష పార్టీలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..

జులై 29న "షా " హైదరాబాద్ పర్యటన?

తెలంగాణ నేతలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వరుసగా పిలిపించుకొని మాట్లాడుతున్నారు.

కార్యక్రమంలో,సోమవారం రాత్రి గం. 9.00 సమయంలో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అమిత్ షా నివాసానికి వెళ్లి కలిశారు.

అంతకంటే ముందు మధ్యాహ్నం పార్లమెంటులోని హోంమంత్రి ఛాంబర్లో బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కలిశారు.

వరుసగా ఇద్దరు ముఖ్యనేతలతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ నెల 29న అమిత్ షా హైదరాబాద్ పర్యటించనున్నారు.

ఈలోగా తెలంగాణ ముఖ్య నేతలను పిలిపించి ఏ అంశాలు చర్చించారన్నది ఆసక్తికరంగా మారింది...

మీరు ఎవ్వరు? మీరేమైనా మినిస్టరా❓️

తెలంగాణలో బీభత్సంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజానీకం ఇళ్లలో నుంచి బయటకు రావాలంటేనే భయపడుతోంది. ఇక పిల్లలను స్కూళ్లకు పంపించాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వర్షానికి చిన్నారులను ఎలా? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఈ క్రమంలోనే ఓ చిన్నారి తల్లి ట్విటర్ వేదికగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని స్కూళ్లకు సెలవులను ప్రకటించాలని కోరింది. మంత్రి స్పందించలేదు కానీ ఆమె కుమారుడు స్పందించాడు. తానే మంత్రిని అన్న రేంజ్‌లో వెటకారంగా రిప్లై ఇచ్చాడు. అంతే.. మంత్రి కుమారుడి రిప్లై చూసిన ఆ తల్లితో పాటు నెటిజన్లకు పట్టరాని కోపం వచ్చింది. అసలు రిప్లై ఇవ్వడానికి మీరెవరు? మీరేమైనా మినిస్టరా? అని నిలదీశారు.

వర్షం వస్తోంది కాబట్టి.. విద్యార్థులు స్కూళ్లకు వెళ్లాక సెలవు ప్రకటిస్తే ప్రయోజనం ఉండదని, ముందుగా స్పందించాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఓ విద్యార్థి తల్లి ట్విటర్ వేదికగా కోరారు. దీనికి మంత్రి కుమారుడు కార్తీక్ రెడ్డి రిప్లై ఇస్తూ.. ‘మీ వెటకారం అర్థమయ్యింది. ప్రభుత్వం ఏమీ ట్విటర్‌లో నడవదని గ్రహించండి. ఇటీవల మంత్రి సెలవులపై 8.15కి ట్వీట్ చేశారు. కానీ ఆ శాఖ ముందుగానే నిర్ణయం తీసుకుంది. ట్విటర్లో ట్రోలింగ్ చేయడం సులభం. కామన్ సెన్స్ ఉపయోగించండి’ అని పేర్కొన్నారు.

కార్తీక్ రెడ్డి రిప్లై చూసిన సదరు విద్యార్థి తల్లి.. ‘మీరు చూపించిన శ్రద్ధకు అభినందనలు కార్తీక్.. కానీ అది విద్యాశాఖమంత్రికి నేను చేసిన విన్నపం. మీరు సమాధానం ఇచ్చారంటే ఒకవేళ కొంపదీసి మీరు విద్యాశాఖామంత్రా?’ అన్నట్టుగా కామెంట్ పెట్టారు.

అంతేకాదు.. కార్తీక్ రెడ్డి తానేదో మంత్రిలా ఫీలైపోతున్నారని.. తాను పిల్లలపై ఉన్న కన్సర్న్‌తో మంత్రిని అడిగిన చిన్న ప్రశ్నకు వెటకారంగా సమాధానమిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. మొత్తానికి కార్తీక్ రెడ్డికి దిమ్మతిరిగే రిప్లై వచ్చింది. అంతే దెబ్బకు దిగి వచ్చారు. కేవలం తాను ట్రోల్స్‌కి మాత్రమే సమాధానం ఇచ్చానని.. పిల్లలపై కస్నర్న్ చూపే తల్లిదండ్రులకు కాదన్నారు. మీరు ట్రోలరా? లేదంటే కన్సర్స్ ఉన్న తల్లా అనేది మీరే డిసైడ్ చేసుకోవాలని సమాధానం ఇచ్చారు. నెటిజన్లు సైతం కార్తీక్ రెడ్డి ట్వీట్‌పై పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు...

అదనపు కలెక్టర్ల బదిలీ

హైదరాబాద్:జులై 25

రాష్ట్రంలో పనిచేస్తున్న తొమ్మిది మంది అదనపు కలెక్టర్లను బదిలీ చేస్తూ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో

ఆదిలాబాద్ అడిషనల్ కలెక్టర్ గా రాజేశం, మంచిర్యాల అదనపు కలెక్టర్ గా మోతిలాల్, నాగర్ కర్నూల్ అదనపు కలెక్టర్గా సీతారామారావు, నిర్మల్ అదనపు కలెక్టర్గా కిషోర్ కుమార్,

ఖమ్మం అదనపు కలెక్టర్గా నటరాజ్, ఆసిఫాబాద్ అదనపు కలెక్టర్ గా వేణు, యు ఎల్ సి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హైదరాబాద్ గా వేణు మాధవరావు, సంగారెడ్డి జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారిగా దేవుజా,

టీఎస్ పిఎస్ సి అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గా ప్రేమ్ రాజును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు...

టమాటా రైతు కు అభినందన

హైదరాబాద్:జులై 25

టమాట పండించి కోటీశ్వరుడైన కౌడిపల్లి రైతు మహిపాల్ రెడ్డి దంపతులని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్ రెడ్డితో సోమవారం సాయంత్రం సెక్రటేరియట్‌లో ముఖ్య మంత్రిని మహిపాల్ రెడ్డి దంపతులు కలిశారు.

ఇప్పటికే రెండు కోట్ల రూపాయల విలువైన టమాట పంటను అమ్ముకోగా ,మరో కోటి రూపాయల విలువైన పంట కోతకు సిద్ధంగా ఉందని సీఎంకు వివరించారు. వాణిజ్య పంటల సాగు విషయంలో తెలంగాణ రైతులు వినూత్నంగా ఆలోచిస్తే పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని మహిపాల్ రెడ్డికి కేసీఆర్ సూచించారు.

మెదక్‌ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్‌నగర్‌కు చెందిన మహిపాల్‌రెడ్డి అనే రైతు టమాట పండించి కోటీశ్వరుడయ్యారు. తనకున్న పొలంతోపాటు ఇతరుల భూమిని కౌలుకు తీసుకుని మహిపాల్‌రెడ్డి కూరగాయలు సాగు చేస్తుంటారు.

ఈసారి ఎనిమిది ఎకరాల్లో టమాట పంట వేశారు. అయితే, పంట చేతికొచ్చే సమయానికి టమాటాకు మునుపెన్నడూ లేని ధర పలుకుతుండటంతో మహిపాల్‌ రెడ్డిని లక్ష్మీదేవి కరుణించింది. ఇప్పటిదాకా ఎనిమిది వేల బాక్సుల ఒక్కో బాక్సు 25 కిలోలు టమాటాలు విక్రయించగా మహిపాల్‌రెడ్డికి రూ.కోటీ 84 లక్షలు వచ్చాయి.

ఇంకా రూ.కోటి విలువ చేసే టమాట ఆయన వద్ద ఉంది. అయితే, వచ్చిన ఆదాయంలో రూ.50లక్షల వరకు పెట్టుబడి ఖర్చులకు వెళ్తుందని మహిపాల్‌ రెడ్డి తెలిపారు. ఈ నెల 5న హైదరాబాద్‌లోని బోయినపల్లి మార్కెట్‌కు మహిపాల్‌రెడ్డి 550 టమాట బాక్సులు తీసుకెళ్లగా ఒక్కో బాక్సు రూ.2,300 నుంచి రూ.2,500 చొప్పున పలికింది. దీంతో ఒక్కరోజే మహిపాల్‌రెడ్డికి రూ.13.75లక్షలు వచ్చాయి...

మరో మూడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు..

హైదరాబాద్:జులై 25

తెలంగాణలోని పలు జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతా వరణ శాఖ వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్‌అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్‌లో రానున్న 3 రోజులపాటు అంటే జూలై 25-27 వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురు స్తాయని తెలిపింది. ఈ మూడు రోజుల పాటు వాతావరణ శాఖ మోడల్ ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది.

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని భారత వాతావరణ తెలిపింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరో ఐదురోజుల పాటు వర్షాలు కురవనున్నాయి. అయితే.. తెలంగాణ వ్యాప్తంగా ఈ నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో పాటు 40-50 కిలోమీటర్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని అధి కారులు తెలిపారు. ముఖ్యంగా..తెలంగాణలో మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో ఈరోజు మంగళవారం నాడు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.

అలాగే.. మిగిలిన జిల్లాల్లోనూ మూడ్రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ నాలుగు రోజులు రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అయితే హైదరాబాద్‌లో ఇప్పటికే వర్షం మొదలవ్వడంతో రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

ఎక్కడిక్కడ ట్రాఫిక్ జామ్ కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు.. హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను డైవర్ట్ కూడా చేయడం జరిగింది. భారీగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తుండటంతో నగరవాసులు భీతిల్లిపోతున్నారు. మరో మూడు గంటలపాటు ఇలాగే వర్షం కురుస్తుందని.. అత్యవసరమైతే తప్ప ఎవరు బయటకు రావద్దంటూ జీహెచ్ఎంసీ అలెర్ట్ చేసింది.

ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో బుధవారం నుంచి గురువారం ఉదయం వరకూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కొత్తగూడెం, వరంగల్‌, హన్మకొండ, జనగాం, కామారెడ్డి, కరీంనగర్‌, పెద్దపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, భూపాలపల్లి, ములుగు, సిద్దిపేట, భువనగిరి, రంగాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ప్రకటించింది....

AP Rainfall Updates: ఏపీలో ఐదురోజులపాటు భారీ వర్షాలు..రేపు.. ఎల్లుండి ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు..

విశాఖపట్నం: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ నెల 26వ తేదీన వాయిగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నాయి..

ఈ నేపథ్యంలో అప్రమత్తం చేస్తోంది వాతావరణ శాఖ.

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా మరో ఐదురోజులపాటు భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సైతం ధృవీకరించింది.

భారత వాతావరణ శాఖ అంచనా ప్రకారం పశ్చిమ మధ్య & ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉత్తరాంధ్ర -దక్షిణ ఒడిశా మీదుగా ఆవర్తనం కొనసాగుతుందని దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు ఏర్పడందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ వెల్లడించారు..

బుధవారం నాటికి అదే ప్రాంతంలో వాయుగుండంగా బలపడనున్నట్లు తెలిపారు. ఆతర్వాత ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల మీదుగా పశ్చిమ-వాయువ్య దిశగా నెమ్మదిగా కదిలే అవకాశం ఉందని వెల్లడించారు. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడనున్నాయని వెల్లడించారాయన. బుధవారం అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు, గురువారం భారీవర్షాలు పడే అవకాశం ఉందన్నారు. మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడనున్నట్లు వివరించారు.

బుధవారం.. కృష్ణా,ఎన్టీఆర్,గుంటూరు,పల్నాడు,బాపట్ల,ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో కొన్నిచోట్ల మాత్రం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన అన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

తిరుపతి :జులై 25

తిరుమలలో భక్తుల రద్దీ

నేడు మంగళవారం సాధారణగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం భక్తులు15 కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

నిన్న సోమవారం శ్రీవారిని 73,796 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 5 కోట్ల రూపాయలు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది.

స్వామివారికి 28,840 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు....

పిల్లలూ! స్కూల్ టైమింగ్ మారింది

తెలంగాణ ప్రభుత్వం ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణలోని స్కూళ్ల టైమింగ్‌లో మార్పులు చేస్తూ సోమవారం రాత్రి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇకపై.. ప్రాథమిక పాఠశాలలు అనగా 1వ తరగతి నుంచి 5 వరకు (1st Class To 5th Class) ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:15 గంట వరకూ స్కూళ్లు ఉంటాయి. అప్పర్ ప్రైమరీ (ప్రాథమికోన్నత పాఠశాలలు) అనగా 6వ తరగతి నుంచి 10 వరకు (6 to 10th Class) స్కూళ్లు 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 వరకు పనిచేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అదే విధంగా అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోని ప్రైమరీ స్కూళ్లు కూడా ఇదే సమయాన్ని పాటించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో తెలిపింది.

తక్షణమే అమలు..!

కాగా.. జంట నగరాలైన హైదరాబాద్, సికింద్రాబాద్‌ తో పాటు తెలంగాణ వ్యాప్తంగా అన్ని స్కూళ్లలో ఈ టైమింగ్స్ పాటించాలని కేసీఆర్ సర్కార్ ఆదేశించింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను తెలంగాణలోని అన్ని జిల్లాల డీఈవోలు, ఆర్‌జేడీఎస్‌ఈలకు విద్యాశాఖ సోమవారం రాత్రే పంపించింది.

మరోవైపు.. డీఈవోలు, ఆర్‌జేడీఎస్ఈల పరిధిలోని ఎంఈవోలు, హెడ్‌మాస్టర్లు, పాఠశాలల యాజమాన్యాలకు సమయాల్లో మార్పులకు సంబంధించిన సూచనలు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాలల సమయాల్లో చేసిన మార్పులు తక్షణమే అమల్లోకి వస్తాయని విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంటే.. మంగళవారం నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి రానున్నాయన్న మాట.

ఇదివరకు ఇలా..!

అయితే ఇప్పటి వరకూ తెలంగాణలోని స్కూళ్లు 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ నడిచేవి. తాజాగా మారిన టైమింగ్స్ ప్రకారం ప్రైమరి స్కూళ్లకు ఉదయం అరగంట ఆలస్యంగా స్కూళ్లు మొదలై సాయంత్రం పావు గంట ఆలస్యంగానే ముగియనున్నాయి. ఇక అప్పర్ ప్రైమరీ స్కూళ్లలోనూ ఉదయం అరగంట ఆలస్యంగా ప్రారంభమై.. సాయంత్రం 45 నిమిషాలు ఆలస్యంగా పాఠశాలలు ముగియనున్నాయి. కాగా.. రాష్ట్రంలోని పాఠశాలల సమయాల్లో మార్పులు, చేర్పులు చేయాలని గత కొంతకాలంగా పాఠశాల విద్యాశాఖ ఆలోచనలు చేస్తున్న విషయం తెలిసిందే....

Polavaram: పోలవరం తొలిదశ మిగిలిన పనులకు అదనంగా రూ.12,911 కోట్లు!

దిల్లీ: పోలవరం నిర్మాణంపై పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం వివరాలు వెల్లడించింది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు..

''పోలవరం తొలి దశలో 41.15 మీటర్ల నిర్మాణం పూర్తికి ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది. ఇందుకోసం రూ.17,144 కోట్లు ఖర్చువుతుందని చెప్పింది. 2024 జూన్‌ నాటికి ప్రాజెక్టు నిర్మించాలని తొలుత నిర్ణయించాం.

2020, 2022లో వరదల వల్ల నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి'' అని కేంద్ర మంత్రి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అయితే, ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందనేది మాత్రం పేర్కొనకపోవడం గమనార్హం..

మరోవైపు, పోలవరం తొలిదశ నిర్మాణానికి మిగిలిన పనుల కోసం అదనంగా రూ.12,911 కోట్ల నిధుల విడుదలకు కేంద్రం ఆమోదం తెలిపింది. వైకాపా పార్లమెంటరీ నేత అడిగిన ప్రశ్నకు.. రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

నిధుల విడుదలకు అభ్యంతరం లేదని ఆర్థికశాఖ తెలిపినట్లు వివరించింది. ఈ మేరకు పోలవరం నిధులపై గత నిర్ణయాన్ని సవరిస్తూ మంత్రివర్గం తాజా ప్రతిపాదనలు చేసినట్లు చెప్పారు. అయితే, ఈ తాజా ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం ఆమోదించాల్సి ఉందన్నారు..